రమ గారు, “సాహిత్యం ఒక్కటే ఉంటుంది. అది చదివినప్పుడు మనసుకి సుఖాన్నివ్వాలి అంతే!! మంచి సాహిత్యానికి అదే గుర్తు,” అన్నారు. అది చదివిన వెంటనే నేనీ మధ్యనే చదివిన Geroge Steiner పుస్తకంలోని ఓ వ్యాసం, “To Civilize Our Gentlemen,” గుర్తొచ్చింది. ఆ వ్యాసం ముగింపు:
“When he was twenty, Kafka wrote in a letter: ‘If the book we are reading does not wake us, as with a fist hammering on our skull, why then do we read it? So that it shall make us happy? Good God, we would also be happy if we had no books, and such books as make us happy we could, if need be, write ourselves. But what we must have are those books which come upon us like ill-fortune, and distress us deeply, like the death of one we love better than ourselves, like suicide. A book must be an ice-axe to break the sea frozen inside us.’
Students of English literature, of any literature, must ask those who teach them, as they must ask themselves, whether they know, and not in their minds alone, what Kafka meant.”
“A book must be an ice-axe to break the sea frozen inside us,” – మరవరాని మాట.
ప్రశంసించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కాని నేను పెద్దగా చేసిందేం లేదు. జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్, నవోదయ రామమోహనరావు, వెల్చేరు – తెర వెనుక ఉండి శ్రమ చేసిన వారు వీళ్ళు.
మూడు నాలుగేళ్ళ క్రితం, నేను కొత్తగా తెలుగు సాహితీ ప్రపంచంలో తలదూర్చి, రచ్చబండలో, తెలిసీ తెలియని సాహితీ జ్ఞానంతో హేమాహేమీలతో తగాదాలు పడేవాణ్ణి. అప్పుడే వేలూరి గారి ఓ ఈమాట వ్యాసం పై గొడవపడ్డాను. ఆ సందర్భంలో ఆయన ఓ పొడవుపాటి జవాబు రాస్తూ, మధ్యలో ఇలా అన్నారు:
“My second assertion, or call it a plea, that we badly need word meanings, paraphrases, and commentaries of their works to better appreciate them, and not to lose them!”
నా ప్రమేయానికి కారణం అదన్న మాట. చాలా సమయం పట్టినా, కార్యరూపం దాల్చినందుకు సంతోషం. అప్పట్లో, అంటే ఆస్తులన్నీ హరించుకుపోక ముందు, ఆయన ఇంకాస్త ఎక్కువ విరాళం అడగనందుకు చాలా విచారపడుతున్నాను.
బాబ్జీలు గారి మంచీ చెడుల మాట చదివి, ఇది రావిశాస్త్రి మాటల్లా ఉందే అనిపించింది. వెతికితే, రావిశాస్త్రి మీద కె. కె. రంగనాథాచార్యులు రాసిన పుస్తకంలో రచయితల కర్తవ్యం గురించి రావిశాస్త్రి అభిప్రాయం కనిపించింది: “అందుచేత రచయిత అయిన ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను.” [1]
చిత్రంగా, జనవరి 9న విజయవాడ లో పుస్తక ప్రదర్శనావరణలో విశ్వగుణాదర్శాన్ని విడుదల చేసిన సభలో ప్రసంగించిన వారిలో ముఖ్యులు KKR. సభలకి దూరంగా ఉండే తాను, ఈ పుస్తకం గురించి ప్రసంగించమంటే ఎంతో ఉత్సాహంతో వచ్చానని చెప్పి గ్రంథ ప్రాముఖ్యతని వివరించారు. ఆ ప్రసంగాన్ని ప్రచురిస్తే బావుంటుంది.
KKR, VNR లు సరే, నా అభిప్రాయం ఏమిటి అంటే, నేనీ పుస్తకాన్నింకా పూర్తిగా చదవలేదు. పైపైన తిరగేసినంతలో హానికరమైనదిగా కనిపించలేదు. దాని ప్రచురణకి సాయం చెయ్యడంలో తప్పుందనుకోను.
చదివింతర్వాత వెల్చేరు గారి పరిచయంపై నా అభిప్రాయం చెప్తాను. రవికిరణ్ గారూ, ఆయన పేరు వెల్చేరు; వేల్చూరి కాదు. మనకి యేల్చూరి సుబ్రహ్మణ్యం అని ఓ కవి ఉన్నారనుకుంటా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “భారతీయ సాహితీ నిర్మాతలు: రాచకొండ విశ్వనాథశాస్త్రి,” కె. కె. రంగనాథాచార్యులు. సాహిత్య అకాడమీ, 2000. పేజి 87.
ఈమాట లాంటి వెబ్ పత్రికకి సంపాదకులయి ఉండీ మీరు, అయ్యో! గుర్తుగా పేజీ మడతపెట్టుకోవడంలో ఉన్న ఆనందం ఈ ఎలెక్ట్రానిక్ పుస్తకాలతో లేదుగదా, అని వాపోవడం వింతగా ఉంది.
ఎర్ర గుర్తు పెట్టుకున్న మీ సొంత పుస్తకాలన్నీ మీ ఇంట్లో ఉంటే, మీరు డెట్రాయిట్ వెళ్ళి సాహితీ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా అవసరమైతే ఎలా?
“Consider a future device for individual use, which is a sort of mechanized private file and library. It needs a name, and, to coin one at random, “memex” will do. A memex is a device in which an individual stores all his books, records, and communications, and which is mechanized so that it may be consulted with exceeding speed and flexibility. It is an enlarged intimate supplement to his memory.”
అని The Atlantic పత్రికలో Vannevar Bush ఓ ప్రఖ్యాత వ్యాసం, “As We May Think,” లో రాశాడు. రాసి కూడా అరవై ఏళ్ళకి పైనే అయింది. అది ఒక desk లా ఉంటుందనుకున్నాడు. అంతకన్నా సౌకర్యంగా, సంచీలో పుస్తకంలా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటే ఆనందించాల్సిన విషయమే కదా.
మీ సంపాదకీయం చదివే, NYRB లో Darnton వ్యాసమూ దానిపై జరిగిన చర్చా చదివాను. నాకర్థమైనంతవరకు గూగుల్ చేస్తున్నది మంచి పనేననిపిస్తుంది. మీరు మీ nostalgia ని కాస్త పక్కనబెట్టి, తెలుగు ప్రజలు, ప్రచురణ కర్తలు, రచయితలు, వారి వారసులు – వీళ్ళలో ఎవరికి నష్టమో ఇంకాస్త లోతుగా కాకపోయినా స్పష్టంగా వివరిస్తే బావుండేది.
థాంక్స్. నువ్వన్న మాటలు , “When I read about the people like Hilbert who pushed the limits of human knowledge, life seems noble for a brief period,” చదివితే నాకు రెండు గుర్తొచ్చాయి. మొదటిది నీకు తెలిసిందే; రెండోది బహుశా తెలియనిది – రాసింది తెలిసిన వాడే అయినా.
Weinberg తన పుస్తకాన్ని [1] ముగిస్తూ అంటాడు: “The more the universe seems comprehensible, the more it also seems pointless. But if there is no solace in the fruits of our research, there is at least some consolation in the research itself. Men and women are not content to comfort themselves with tales of gods and giants, or to confine their thoughts to the daily affairs of life; they also build telescopes and satellites and accelerators, and sit at their desks for endless hours working out the meaning of the data they gather. The effort to understand the universe is one of the very few things that lifts human life a little above the level of farce, and gives it some of the grace of tragedy.”
రెండోది సంతానం కవిత [2]: స్వర్ణలత
కొందరు ధనార్జనలో అహర్నిశలు శ్రమిస్తారు
మరికొందరు జ్ఞానమునే ఆశ్రయించి బతుకుతారు
జిజ్ఞాసువుల లోకంలో శాంతిభావమే విరిసెను
అజ్ఞాతములో ఉన్నా, వారి జన్మ ధన్యము
ఎ. వి. సంతానం, REC Warangal లో BTech చేశాడు (1976-81). నా క్లాస్ మేట్, స్నేహితుడు. 1987 నాటికి తిరుపతిలో ఉండేవాడు. ఎవరికైనా జాడ తెలిస్తే నాకు కబురు చెయ్యమని కోరిక.
ఈవ్యాసం చాలా ఆలస్యంగా పంపి వెంటనే ఇండియా వెళ్ళాను. నేను అందుబాటులో లేకపోయినా, సరిదిద్ది మెరుగు పెట్టినందుకు సంపాదకులకు కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “The First Three Minutes: A Modern View of the Origin of the Universe,” by Steven Weinberg. Basic Books, 1993.
రమ భరద్వాజ్ గారి ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదివా.. ఆవిడ ఎవరిమీదో అనవసరమైన అక్కసు వెళ్ళగక్కడం ఎందుకో నాకు అర్థం కాలేదు.. శ్రీశ్రీ ప్రతిభ మీద గౌరవం ఎవరికిలేదూ అంట?.. తనని అనుసరించే యువతరానికి పాతసాహిత్యం మీద వెగటు కలిగించింది శ్రీశ్రీ అనడం అన్యాయం మాత్రమే కాదు; పచ్చి అబద్ధం. అట్లాగే “ఆధునికతకీ, సాహిత్యానికీ మధ్య అనివార్యంగా ఒక లంకె పెట్టిన మొదటి తరం నారాయణరావు గారి కాలానిదే కద?” అన్నారు.. ఒకవేళ అదేనిజమైతే, అందుకు నారాయణరావుగారి బాధ్యత ఎంతవరకూ ఉన్నది? పాపం ఆ కాలంలో పుట్టడం ఆయన తప్పా?
రమాప్రభ గారికి శ్రీశ్రీ పూర్వాపరాలు, నారాయణరావుగారి పుట్టుపూర్వోత్తరాలు బాగా తెలుసు కాబోలు. . ఆ తరం గురించి నాకయితే అంతగా తెలియదు. మాటవరసకి, ఇదంతా శ్రీశ్రీ నారాయణరావుల తప్పే అని ఒప్పుకుందాం.. కాదు కాదు.. ఆకాలం తప్పే అని ఒప్పుకుందాం.. మాటవరసకేననుకోండి.. ఏ పుట్టలో ఏపామున్నదో ఎవరికి తెలుసు? పోనీ, నారాయణరావుగారు ఇప్పటికైనా మేలుకున్నారు… ఆలస్యంగానే అనుకుందాం, మాటవరసకి.. సంతోషం.. మరి ఆకాలంలో పుట్టని రమ గారి లాంటి వారు ఇప్పుడు ఏమిటి చేద్దామని అనుకుంటున్నారు? తలుపులు వేసుకొని, కిటికీలు మూసుకొని “నాలుగుగోడల ” మధ్యా కూచొని తెలుగు సమాజాన్ని ఆడిపోసుకుంటున్నారా?.. అసలింతకీ, ఈ వగపెందులకు?
మల్లంపల్లి శరభయ్య గారికి తెనుగులు ఏమీచెయ్యలేదని ఇప్పుడు వగవడం గతజలసేతుబంధనమే కదూ?? తంగిరాల సుబ్బారావుగారు ఆయన చేత కర్ణామృతం వ్యాఖ్యానం రాయించుకొని ఆ మహానుభావుడికి ఎర్ర ఏగానీకూడా ఇవ్వలేదా ఏమిటి చెప్మా?.. ఈ విషయాలన్నీ రమా భరద్వాజగారికి తెలియవనుకోవడం కష్టమే.. ఇప్పటికైనా ఈ చింతలవగపు మాని… మాటలలో కాదు… చేతలతో.. యుద్ధోన్ముఖంగా నడవడం మొదలుపెడితే.. ఇంకాబ్రతికిఉన్న కొద్దిమందిపండితులచేతా చాలా పనులు చేయించుకోవచ్చునేమో?.. అయినా, అక్కడెక్కడో ఐదరాభారతంలో కూచొని ఆడిపోసుకుంటే చివరకుమిగిలేది వగపేకదూ!.
సాహితీపరంగా ఏదయినా కాస్త మంచి జరిగితే, దానికి నాంది ప్రవాసాంధ్రులే వెయ్యగలరని తానా వారు.. హనుమంతరావు గారి సహాయంతో వేసిన పుస్తకం.. అక్షరాలా రుజువు పరుస్తుంది..
ముందుగా ఇలాటి పుస్తకాన్ని ప్రచురించిన తానా ప్రచురణల విభాగం వారికి, దానికి భూరి విరాళాన్ని అందించిన హనుమంతరావుగారికి జోహార్లు.
ప్రాచీన సాహిత్యం నిరాదరణకు గురికావడానికి ఒక కారణం దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అనడంలో సందేహం లేదు. అయితే, ప్రాచీన సాహిత్యం మీద అభిమానం, అందులో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు దాన్ని వైజ్ఞానికంగా పరిశోధించకపోవడం కూడా అంతే కారణమని నా అభిప్రాయం. సాంప్రదాయిక సాహిత్యం మీద చర్వితచర్వణమైన పరిశోధక గ్రంథాలు కాకుండా వైజ్ఞానిక విశ్లేషణతో కూడిన పరిశోధక గ్రంథాలు ఎంతవరకూ వచ్చాయి. మన పండితులలో ఎంతమంది పరిశోధకులున్నారు? అటువంటి పరిశోధన జరగనప్పుడు ఆ గ్రంథాల విలువ ఈ కాలంవాళ్ళకి ఎలా తెలుస్తుంది? పండితులు పరిశోధకులు కారు, పరిశోధకులకి తగిన పాండిత్యం లేదు అనే స్థితి ఏర్పడింది.
ఏదైనా గతంగతః కనీసం ఇప్పుడైనా ఉన్న కొద్దిమందినీ వినియోగించుకొని, పండితులు పరిశోధకులు కలిసి ప్రాచీన సాహిత్యంపై వేల్చేరువారు సూచించినట్టు మరింత శాస్త్రీయ అధ్యయనం జరిపితే బావుంటుంది.
మీరు, “ఒకటీ, రెండు పదాల కామెంట్లు (అద్భుతం, బాగుంది, నాకు నచ్చింది, వగైరా) ఇకముందు నుంచీ ప్రచురించబడవు. … వీటివల్ల రచయితకైనా, తోటి పాఠకులకైనా ఏ ప్రయోజనమూ లేదని మా అభిప్రాయం,” అన్నారు.
కొత్తగా రాసేవాళ్ళు తమ రచనలన మీద ఎలాంటి స్పందనా లేకపోతే అసలెవరైనా చదివారా అని మధనపడి నిరుత్సాహపడవచ్చు. “నాకు నచ్చింది” అని ఒక్కరన్నా అంటే అది కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. చెయ్యి తిరిగిన రచయితలకి ఇలాంటి వాటి అవసరం లేకపోవచ్చు కాని మిగిలినవాళ్ళలో కొందరికైనా వాటివలన కాస్త ప్రయోజనం ఉంది.
మీ పద్ధతి మార్చుకోమని కోరడం లేదు; రచయితలందరూ వీటికి అతీతులు కాదని చెప్పడానికే.
నాకు గానీ ..హనుమంతరావు గారికి గానీ శ్రీనివాస్ గారి వ్యాఖ్య మీద అపార్ధం కలిగితే..అందుకు శ్రీనివాస్ గారి వాక్యాలే కారణం. అయినా ఆయన వివరంగా రాస్తానని అన్నారు గనక ఈ సారి నాలాంటి పాఠకులకి మరింత స్పష్టత కలుగుతుందని ఎదురుచూస్తాను. శ్రీనివాస్ గారు నా పేరుని quote in quote లో పెట్టరని ఆశిస్తాను.
రమ.
వ్యాస పరిధి దాటినందుకు సంపాదకులు దీనిని తిరస్కరిస్తే నాకభ్యంతరం లేదు. పరుచూరి వ్యాఖ్య నిగూఢంగా ఉండటానేమో అర్థం కాలేదు.
ఓరల్ హిస్టరీ అంటే Studs Terkel చేసినట్లు రికార్డు చేసిందే కదా. అలా రికార్డు చేసిన మన సాహితీ చరిత్ర మామూలు పాఠకులకి అందుబాటులో లేదా? పెద్దమనుషులెవరినో పోయి అడిగితే గాని తెలిసే అవకాశం లేదా?
కొకు కి చలమంటే వ్యక్తిగతంగా ఇష్టమా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. చలం రచనలని కొకు పరామర్శించకపోయినా పెద్దగా నష్టం లేదు – అనేకులు ఆపని చేశారు కనుక. ప్రచురించని దేవులపల్లి (అశ్లీల?) రచనల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వీటికీ బంగారమ్మ రచనలని ప్రస్తావించకపోవడానికీ సారూప్యత కనబడదు.
ఆమె కవిత్వాన్ని గురించి ఇప్పటికీ మాట్లాడకపోవడానికి కారణం ఆవిడ కవిత్వం కాదు, ఆవిడ వ్యక్తిగత జీవితం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకావిడ జీవితం గురించి ఏమీ తెలియకపోయినా అది చాలా అన్యాయంగా తోస్తుంది. అలాంటి జీవితమే గడిపిన మగవాళ్ళ రచనలకి కూడా అదే గతి పట్టిందా?
నాది బాధ మాత్రమే ! అభిశంసన కాదు. మీకు నా ఆరోపణ సవ్యం గానే అర్ధమయింది. thank you. మీ భార్యగారికి వచ్చిన సందేహం ఇన్నేళ్ళలోనూ ఈ తెలుగు సాహిత్యలోకంలో ఒక్క విమర్శకుడికీ రానేలేదే? మరి ఇది ఆలోచించ వలసిన విషయం కాదా? ఒకనాటికి స్త్రీలీ ప్రశ్నలేయగలరని పురుషసాహిత్యలోకం ఊహించలేదు. మీ వివరణ లోనే శ్రీశ్రీ చూపించిన నిర్లక్ష్యం గురించి ఉంది.ఆనాటి వారికే కాదు..ఇవాళ్టికీ చాలా మందికి స్త్రీల గురించి చెప్పాలంటే ఎందుకో మరి మనసు రాదుస్మండీ !! అందునా మంచి సంగతులు చెప్పడానికి అసలే రాదు. కావాలంటే తెలుగు విమర్శ ని ఒకసారి పరికించి చూడండి మీరే! సరి అయిన దృష్టి కోణం తో..స్త్రీల రచనలని ఇంకా బేరీజు వేయగల స్థితి ఈనాటికీ ఇంకా లేదు. సాహిత్య పరంగా చాలా నష్టం ఇది.
మోహనరావు గారూ…ప్రస్తావన చేయడం …విశ్లేషణ చేయడం రెండూవేర్వేరు. రెండో దాని పరంగా మీ వ్యాసం బలమైంది కాదని మీకే తెలియగలదు మరోసారి చదువుకుని చూడండి. మీరు”ముగురమ్మల్ని గురించి ప్రస్తావనే చేసారు…వారి కవితా విశ్లేషణ కాదు. విమర్శ పరిధి వేరు. దాని దిశ వేరు. తెలుగులో సృజనాత్మక సాహత్యం వృధ్ధి పొందింది..కానీ విమర్శ ఏదీ?
నేను మాట్లాడుతున్న అంశం ఇదీ! ఎవరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి…అదీ ముఖ్యం.
కథ దేని గురించి? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/16/2009 8:28 pm
రమ గారు, “సాహిత్యం ఒక్కటే ఉంటుంది. అది చదివినప్పుడు మనసుకి సుఖాన్నివ్వాలి అంతే!! మంచి సాహిత్యానికి అదే గుర్తు,” అన్నారు. అది చదివిన వెంటనే నేనీ మధ్యనే చదివిన Geroge Steiner పుస్తకంలోని ఓ వ్యాసం, “To Civilize Our Gentlemen,” గుర్తొచ్చింది. ఆ వ్యాసం ముగింపు:
“When he was twenty, Kafka wrote in a letter: ‘If the book we are reading does not wake us, as with a fist hammering on our skull, why then do we read it? So that it shall make us happy? Good God, we would also be happy if we had no books, and such books as make us happy we could, if need be, write ourselves. But what we must have are those books which come upon us like ill-fortune, and distress us deeply, like the death of one we love better than ourselves, like suicide. A book must be an ice-axe to break the sea frozen inside us.’
Students of English literature, of any literature, must ask those who teach them, as they must ask themselves, whether they know, and not in their minds alone, what Kafka meant.”
“A book must be an ice-axe to break the sea frozen inside us,” – మరవరాని మాట.
కొడవళ్ళ హనుమంతరావు
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/15/2009 4:48 pm
ప్రశంసించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కాని నేను పెద్దగా చేసిందేం లేదు. జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్, నవోదయ రామమోహనరావు, వెల్చేరు – తెర వెనుక ఉండి శ్రమ చేసిన వారు వీళ్ళు.
మూడు నాలుగేళ్ళ క్రితం, నేను కొత్తగా తెలుగు సాహితీ ప్రపంచంలో తలదూర్చి, రచ్చబండలో, తెలిసీ తెలియని సాహితీ జ్ఞానంతో హేమాహేమీలతో తగాదాలు పడేవాణ్ణి. అప్పుడే వేలూరి గారి ఓ ఈమాట వ్యాసం పై గొడవపడ్డాను. ఆ సందర్భంలో ఆయన ఓ పొడవుపాటి జవాబు రాస్తూ, మధ్యలో ఇలా అన్నారు:
“My second assertion, or call it a plea, that we badly need word meanings, paraphrases, and commentaries of their works to better appreciate them, and not to lose them!”
నా ప్రమేయానికి కారణం అదన్న మాట. చాలా సమయం పట్టినా, కార్యరూపం దాల్చినందుకు సంతోషం. అప్పట్లో, అంటే ఆస్తులన్నీ హరించుకుపోక ముందు, ఆయన ఇంకాస్త ఎక్కువ విరాళం అడగనందుకు చాలా విచారపడుతున్నాను.
బాబ్జీలు గారి మంచీ చెడుల మాట చదివి, ఇది రావిశాస్త్రి మాటల్లా ఉందే అనిపించింది. వెతికితే, రావిశాస్త్రి మీద కె. కె. రంగనాథాచార్యులు రాసిన పుస్తకంలో రచయితల కర్తవ్యం గురించి రావిశాస్త్రి అభిప్రాయం కనిపించింది: “అందుచేత రచయిత అయిన ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను.” [1]
చిత్రంగా, జనవరి 9న విజయవాడ లో పుస్తక ప్రదర్శనావరణలో విశ్వగుణాదర్శాన్ని విడుదల చేసిన సభలో ప్రసంగించిన వారిలో ముఖ్యులు KKR. సభలకి దూరంగా ఉండే తాను, ఈ పుస్తకం గురించి ప్రసంగించమంటే ఎంతో ఉత్సాహంతో వచ్చానని చెప్పి గ్రంథ ప్రాముఖ్యతని వివరించారు. ఆ ప్రసంగాన్ని ప్రచురిస్తే బావుంటుంది.
KKR, VNR లు సరే, నా అభిప్రాయం ఏమిటి అంటే, నేనీ పుస్తకాన్నింకా పూర్తిగా చదవలేదు. పైపైన తిరగేసినంతలో హానికరమైనదిగా కనిపించలేదు. దాని ప్రచురణకి సాయం చెయ్యడంలో తప్పుందనుకోను.
చదివింతర్వాత వెల్చేరు గారి పరిచయంపై నా అభిప్రాయం చెప్తాను. రవికిరణ్ గారూ, ఆయన పేరు వెల్చేరు; వేల్చూరి కాదు. మనకి యేల్చూరి సుబ్రహ్మణ్యం అని ఓ కవి ఉన్నారనుకుంటా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “భారతీయ సాహితీ నిర్మాతలు: రాచకొండ విశ్వనాథశాస్త్రి,” కె. కె. రంగనాథాచార్యులు. సాహిత్య అకాడమీ, 2000. పేజి 87.
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/08/2009 10:55 am
వేలూరి గారికి,
ఈమాట లాంటి వెబ్ పత్రికకి సంపాదకులయి ఉండీ మీరు, అయ్యో! గుర్తుగా పేజీ మడతపెట్టుకోవడంలో ఉన్న ఆనందం ఈ ఎలెక్ట్రానిక్ పుస్తకాలతో లేదుగదా, అని వాపోవడం వింతగా ఉంది.
ఎర్ర గుర్తు పెట్టుకున్న మీ సొంత పుస్తకాలన్నీ మీ ఇంట్లో ఉంటే, మీరు డెట్రాయిట్ వెళ్ళి సాహితీ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా అవసరమైతే ఎలా?
“Consider a future device for individual use, which is a sort of mechanized private file and library. It needs a name, and, to coin one at random, “memex” will do. A memex is a device in which an individual stores all his books, records, and communications, and which is mechanized so that it may be consulted with exceeding speed and flexibility. It is an enlarged intimate supplement to his memory.”
అని The Atlantic పత్రికలో Vannevar Bush ఓ ప్రఖ్యాత వ్యాసం, “As We May Think,” లో రాశాడు. రాసి కూడా అరవై ఏళ్ళకి పైనే అయింది. అది ఒక desk లా ఉంటుందనుకున్నాడు. అంతకన్నా సౌకర్యంగా, సంచీలో పుస్తకంలా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటే ఆనందించాల్సిన విషయమే కదా.
మీ సంపాదకీయం చదివే, NYRB లో Darnton వ్యాసమూ దానిపై జరిగిన చర్చా చదివాను. నాకర్థమైనంతవరకు గూగుల్ చేస్తున్నది మంచి పనేననిపిస్తుంది. మీరు మీ nostalgia ని కాస్త పక్కనబెట్టి, తెలుగు ప్రజలు, ప్రచురణ కర్తలు, రచయితలు, వారి వారసులు – వీళ్ళలో ఎవరికి నష్టమో ఇంకాస్త లోతుగా కాకపోయినా స్పష్టంగా వివరిస్తే బావుండేది.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/05/2009 9:58 pm
“మానవతా మంటపాన శోభించెడు స్వర్ణలతలు!”
రామారావ్,
థాంక్స్. నువ్వన్న మాటలు , “When I read about the people like Hilbert who pushed the limits of human knowledge, life seems noble for a brief period,” చదివితే నాకు రెండు గుర్తొచ్చాయి. మొదటిది నీకు తెలిసిందే; రెండోది బహుశా తెలియనిది – రాసింది తెలిసిన వాడే అయినా.
Weinberg తన పుస్తకాన్ని [1] ముగిస్తూ అంటాడు: “The more the universe seems comprehensible, the more it also seems pointless. But if there is no solace in the fruits of our research, there is at least some consolation in the research itself. Men and women are not content to comfort themselves with tales of gods and giants, or to confine their thoughts to the daily affairs of life; they also build telescopes and satellites and accelerators, and sit at their desks for endless hours working out the meaning of the data they gather. The effort to understand the universe is one of the very few things that lifts human life a little above the level of farce, and gives it some of the grace of tragedy.”
రెండోది సంతానం కవిత [2]:
స్వర్ణలత
కొందరు ధనార్జనలో అహర్నిశలు శ్రమిస్తారు
మరికొందరు జ్ఞానమునే ఆశ్రయించి బతుకుతారు
జిజ్ఞాసువుల లోకంలో శాంతిభావమే విరిసెను
అజ్ఞాతములో ఉన్నా, వారి జన్మ ధన్యము
అనవరతము జాగృతిలో స్వధర్మమును నెరవేర్చుచు
చల్లదనము ప్రసరించెడు జ్ఞానులు వెన్నెల నెలవులు
జ్ఞానులైన వారెప్పుడు లోకహితము కాంక్షింతురు
మేనిలోని తాపాలను దైవఘటనగా ఎంతురు
తనవలెనే ఇతరులనుచు తలపోసెడు జ్ఞానమతులు
మానవతా మంటపాన శోభించెడు స్వర్ణలతలు!”
ఎ. వి. సంతానం, REC Warangal లో BTech చేశాడు (1976-81). నా క్లాస్ మేట్, స్నేహితుడు. 1987 నాటికి తిరుపతిలో ఉండేవాడు. ఎవరికైనా జాడ తెలిస్తే నాకు కబురు చెయ్యమని కోరిక.
ఈవ్యాసం చాలా ఆలస్యంగా పంపి వెంటనే ఇండియా వెళ్ళాను. నేను అందుబాటులో లేకపోయినా, సరిదిద్ది మెరుగు పెట్టినందుకు సంపాదకులకు కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “The First Three Minutes: A Modern View of the Origin of the Universe,” by Steven Weinberg. Basic Books, 1993.
[2] “వెన్నెల రాణి,” ఎ. వి. సంతానం, 1987.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి uma kaundinya అభిప్రాయం:
03/02/2009 8:57 pm
రమ భరద్వాజ్ గారి ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదివా.. ఆవిడ ఎవరిమీదో అనవసరమైన అక్కసు వెళ్ళగక్కడం ఎందుకో నాకు అర్థం కాలేదు.. శ్రీశ్రీ ప్రతిభ మీద గౌరవం ఎవరికిలేదూ అంట?.. తనని అనుసరించే యువతరానికి పాతసాహిత్యం మీద వెగటు కలిగించింది శ్రీశ్రీ అనడం అన్యాయం మాత్రమే కాదు; పచ్చి అబద్ధం. అట్లాగే “ఆధునికతకీ, సాహిత్యానికీ మధ్య అనివార్యంగా ఒక లంకె పెట్టిన మొదటి తరం నారాయణరావు గారి కాలానిదే కద?” అన్నారు.. ఒకవేళ అదేనిజమైతే, అందుకు నారాయణరావుగారి బాధ్యత ఎంతవరకూ ఉన్నది? పాపం ఆ కాలంలో పుట్టడం ఆయన తప్పా?
రమాప్రభ గారికి శ్రీశ్రీ పూర్వాపరాలు, నారాయణరావుగారి పుట్టుపూర్వోత్తరాలు బాగా తెలుసు కాబోలు. . ఆ తరం గురించి నాకయితే అంతగా తెలియదు. మాటవరసకి, ఇదంతా శ్రీశ్రీ నారాయణరావుల తప్పే అని ఒప్పుకుందాం.. కాదు కాదు.. ఆకాలం తప్పే అని ఒప్పుకుందాం.. మాటవరసకేననుకోండి.. ఏ పుట్టలో ఏపామున్నదో ఎవరికి తెలుసు? పోనీ, నారాయణరావుగారు ఇప్పటికైనా మేలుకున్నారు… ఆలస్యంగానే అనుకుందాం, మాటవరసకి.. సంతోషం.. మరి ఆకాలంలో పుట్టని రమ గారి లాంటి వారు ఇప్పుడు ఏమిటి చేద్దామని అనుకుంటున్నారు? తలుపులు వేసుకొని, కిటికీలు మూసుకొని “నాలుగుగోడల ” మధ్యా కూచొని తెలుగు సమాజాన్ని ఆడిపోసుకుంటున్నారా?.. అసలింతకీ, ఈ వగపెందులకు?
మల్లంపల్లి శరభయ్య గారికి తెనుగులు ఏమీచెయ్యలేదని ఇప్పుడు వగవడం గతజలసేతుబంధనమే కదూ?? తంగిరాల సుబ్బారావుగారు ఆయన చేత కర్ణామృతం వ్యాఖ్యానం రాయించుకొని ఆ మహానుభావుడికి ఎర్ర ఏగానీకూడా ఇవ్వలేదా ఏమిటి చెప్మా?.. ఈ విషయాలన్నీ రమా భరద్వాజగారికి తెలియవనుకోవడం కష్టమే.. ఇప్పటికైనా ఈ చింతలవగపు మాని… మాటలలో కాదు… చేతలతో.. యుద్ధోన్ముఖంగా నడవడం మొదలుపెడితే.. ఇంకాబ్రతికిఉన్న కొద్దిమందిపండితులచేతా చాలా పనులు చేయించుకోవచ్చునేమో?.. అయినా, అక్కడెక్కడో ఐదరాభారతంలో కూచొని ఆడిపోసుకుంటే చివరకుమిగిలేది వగపేకదూ!.
సాహితీపరంగా ఏదయినా కాస్త మంచి జరిగితే, దానికి నాంది ప్రవాసాంధ్రులే వెయ్యగలరని తానా వారు.. హనుమంతరావు గారి సహాయంతో వేసిన పుస్తకం.. అక్షరాలా రుజువు పరుస్తుంది..
ఉమ
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Kameswara Rao అభిప్రాయం:
03/02/2009 10:36 am
ముందుగా ఇలాటి పుస్తకాన్ని ప్రచురించిన తానా ప్రచురణల విభాగం వారికి, దానికి భూరి విరాళాన్ని అందించిన హనుమంతరావుగారికి జోహార్లు.
ప్రాచీన సాహిత్యం నిరాదరణకు గురికావడానికి ఒక కారణం దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అనడంలో సందేహం లేదు. అయితే, ప్రాచీన సాహిత్యం మీద అభిమానం, అందులో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు దాన్ని వైజ్ఞానికంగా పరిశోధించకపోవడం కూడా అంతే కారణమని నా అభిప్రాయం. సాంప్రదాయిక సాహిత్యం మీద చర్వితచర్వణమైన పరిశోధక గ్రంథాలు కాకుండా వైజ్ఞానిక విశ్లేషణతో కూడిన పరిశోధక గ్రంథాలు ఎంతవరకూ వచ్చాయి. మన పండితులలో ఎంతమంది పరిశోధకులున్నారు? అటువంటి పరిశోధన జరగనప్పుడు ఆ గ్రంథాల విలువ ఈ కాలంవాళ్ళకి ఎలా తెలుస్తుంది? పండితులు పరిశోధకులు కారు, పరిశోధకులకి తగిన పాండిత్యం లేదు అనే స్థితి ఏర్పడింది.
ఏదైనా గతంగతః కనీసం ఇప్పుడైనా ఉన్న కొద్దిమందినీ వినియోగించుకొని, పండితులు పరిశోధకులు కలిసి ప్రాచీన సాహిత్యంపై వేల్చేరువారు సూచించినట్టు మరింత శాస్త్రీయ అధ్యయనం జరిపితే బావుంటుంది.
ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
02/03/2009 9:20 pm
సంపాదకులకి,
మీరు, “ఒకటీ, రెండు పదాల కామెంట్లు (అద్భుతం, బాగుంది, నాకు నచ్చింది, వగైరా) ఇకముందు నుంచీ ప్రచురించబడవు. … వీటివల్ల రచయితకైనా, తోటి పాఠకులకైనా ఏ ప్రయోజనమూ లేదని మా అభిప్రాయం,” అన్నారు.
కొత్తగా రాసేవాళ్ళు తమ రచనలన మీద ఎలాంటి స్పందనా లేకపోతే అసలెవరైనా చదివారా అని మధనపడి నిరుత్సాహపడవచ్చు. “నాకు నచ్చింది” అని ఒక్కరన్నా అంటే అది కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. చెయ్యి తిరిగిన రచయితలకి ఇలాంటి వాటి అవసరం లేకపోవచ్చు కాని మిగిలినవాళ్ళలో కొందరికైనా వాటివలన కాస్త ప్రయోజనం ఉంది.
మీ పద్ధతి మార్చుకోమని కోరడం లేదు; రచయితలందరూ వీటికి అతీతులు కాదని చెప్పడానికే.
కొడవళ్ళ హనుమంతరావు
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj అభిప్రాయం:
01/29/2009 6:06 am
నాకు గానీ ..హనుమంతరావు గారికి గానీ శ్రీనివాస్ గారి వ్యాఖ్య మీద అపార్ధం కలిగితే..అందుకు శ్రీనివాస్ గారి వాక్యాలే కారణం. అయినా ఆయన వివరంగా రాస్తానని అన్నారు గనక ఈ సారి నాలాంటి పాఠకులకి మరింత స్పష్టత కలుగుతుందని ఎదురుచూస్తాను. శ్రీనివాస్ గారు నా పేరుని quote in quote లో పెట్టరని ఆశిస్తాను.
రమ.
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 10:24 pm
వ్యాస పరిధి దాటినందుకు సంపాదకులు దీనిని తిరస్కరిస్తే నాకభ్యంతరం లేదు. పరుచూరి వ్యాఖ్య నిగూఢంగా ఉండటానేమో అర్థం కాలేదు.
ఓరల్ హిస్టరీ అంటే Studs Terkel చేసినట్లు రికార్డు చేసిందే కదా. అలా రికార్డు చేసిన మన సాహితీ చరిత్ర మామూలు పాఠకులకి అందుబాటులో లేదా? పెద్దమనుషులెవరినో పోయి అడిగితే గాని తెలిసే అవకాశం లేదా?
కొకు కి చలమంటే వ్యక్తిగతంగా ఇష్టమా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. చలం రచనలని కొకు పరామర్శించకపోయినా పెద్దగా నష్టం లేదు – అనేకులు ఆపని చేశారు కనుక. ప్రచురించని దేవులపల్లి (అశ్లీల?) రచనల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వీటికీ బంగారమ్మ రచనలని ప్రస్తావించకపోవడానికీ సారూప్యత కనబడదు.
ఆమె కవిత్వాన్ని గురించి ఇప్పటికీ మాట్లాడకపోవడానికి కారణం ఆవిడ కవిత్వం కాదు, ఆవిడ వ్యక్తిగత జీవితం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకావిడ జీవితం గురించి ఏమీ తెలియకపోయినా అది చాలా అన్యాయంగా తోస్తుంది. అలాంటి జీవితమే గడిపిన మగవాళ్ళ రచనలకి కూడా అదే గతి పట్టిందా?
కొడవళ్ళ హనుమంతరావు
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj అభిప్రాయం:
01/27/2009 10:55 am
హనుమంతరావు గారూ!
నాది బాధ మాత్రమే ! అభిశంసన కాదు. మీకు నా ఆరోపణ సవ్యం గానే అర్ధమయింది. thank you. మీ భార్యగారికి వచ్చిన సందేహం ఇన్నేళ్ళలోనూ ఈ తెలుగు సాహిత్యలోకంలో ఒక్క విమర్శకుడికీ రానేలేదే? మరి ఇది ఆలోచించ వలసిన విషయం కాదా? ఒకనాటికి స్త్రీలీ ప్రశ్నలేయగలరని పురుషసాహిత్యలోకం ఊహించలేదు. మీ వివరణ లోనే శ్రీశ్రీ చూపించిన నిర్లక్ష్యం గురించి ఉంది.ఆనాటి వారికే కాదు..ఇవాళ్టికీ చాలా మందికి స్త్రీల గురించి చెప్పాలంటే ఎందుకో మరి మనసు రాదుస్మండీ !! అందునా మంచి సంగతులు చెప్పడానికి అసలే రాదు. కావాలంటే తెలుగు విమర్శ ని ఒకసారి పరికించి చూడండి మీరే! సరి అయిన దృష్టి కోణం తో..స్త్రీల రచనలని ఇంకా బేరీజు వేయగల స్థితి ఈనాటికీ ఇంకా లేదు. సాహిత్య పరంగా చాలా నష్టం ఇది.
మోహనరావు గారూ…ప్రస్తావన చేయడం …విశ్లేషణ చేయడం రెండూవేర్వేరు. రెండో దాని పరంగా మీ వ్యాసం బలమైంది కాదని మీకే తెలియగలదు మరోసారి చదువుకుని చూడండి. మీరు”ముగురమ్మల్ని గురించి ప్రస్తావనే చేసారు…వారి కవితా విశ్లేషణ కాదు. విమర్శ పరిధి వేరు. దాని దిశ వేరు. తెలుగులో సృజనాత్మక సాహత్యం వృధ్ధి పొందింది..కానీ విమర్శ ఏదీ?
నేను మాట్లాడుతున్న అంశం ఇదీ! ఎవరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి…అదీ ముఖ్యం.
రమ.