నేను ముందుగానే మనవి చేసుకున్నాను; మంచిమంచి సలహాలు కోకొల్లలుగా వస్తాయని. అయితే, ఈ మంచిమంచి సలహాలన్నీ ఆచరణసాధ్యాలా అన్నదే నా అనుమానం.
విధ్యార్థులకు పనికి వచ్చే నిఘంటువు పునర్ముద్రించడం వద్దని ఎవరు అనగలరు? లేదా, విధ్యార్థులకి పనికి వచ్చే మరొక నిఘంటువు తయారుచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటే నేను కాదంటానా?
ఆ మాటకొస్తే ఉన్న నిఘంటులన్నీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం”గా అందుబాటులోకి తేవడం మంచిది కాదని ఎవరు అనగలరు? ఇవన్నీ మంచి సలహాలే!
పోతే, నేను సూర్యరాయాంధ్ర నిఘంటువు, బ్రౌణ్యం (మొదటిముద్రణ ప్రతి) లను ప్రత్యేకించి ప్రస్తావించడాని ముఖ్యకారణం: ఈ రెండు నిఘంటువుల కాపీరైట్ సాహిత్య అకాడమీ వారికి ఉండేది. ఇప్పుడు సాహిత్య అకాడమీ లేదుగా! ఆ కాపీరైట్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి చేతిలో ఉన్నది. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? ప్రభుత్వం వారు కావాలనుకుంటే, ఈ రెండు నిఘంటువులనీ వెంటనే పునర్ముద్రించి అందుబాటులోకి తేవచ్చు. అంతకన్నా మంచిపని. ఈ రెండు నిఘంటువులనీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవచ్చు. ఆతరువాత, తీరిగ్గా ఈ నిఘంటువులను సంశోధించి, పరిష్కరించడానికి పూనుకోవచ్చు. ఆపేరుమీదైనా ఇంకా బ్రతికిఉన్న కొద్దిమంది పెద్ద పండితులకీ(?) కాస్త భుక్తి దొరుకుతుంది.
ఒకవేళ, ప్రభుత్వం వారు అల్లాంటి మంచి పనులు చెయ్యడం మాకు అలవాటు లేదు అని ఒప్పుకుంటే, అప్పుడు లాభాపేక్షలేని ఏ “సాంస్కృతిక” సంస్థో (ఆటా, తానాలవంటివి అని నాభావం!) ఈ పనికి పూనుకోవచ్చు. కాపీరైట్లు పేరుతో ప్రభుత్వం వారు అడ్డం రామని హామీ ఇస్తే చాలు, శుభం! ప్రభుత్వం వారు “అమ్మ పెట్టాపెట్టదు; అడుక్కో తినానివ్వదు,” అన్న స్థితిలో ఉంటే, అది చాలా విచారకరమైన విషయం.
ఇతర నిఘంటువులకి కాపీరైట్ ఎవరితో ఉన్నదో కనుక్కొని, వారికి తగు పారితోషికం ఇచ్చి ( ఇప్పించి) అచ్చు వెయ్యడమో, లేకపోతే ఇంటర్నెట్లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవడమో చేస్తే, (ఈ పని ఎవరు చేస్తారు అన్నది ప్రశ్న!) అంతకన్నా కావలసినది ఏమున్నది?
అయితే, ఈ కాపీరైట్ వ్యవహారాలు పరిష్కరించడంలో అడ్డంకులు చాలా ఉన్నాయని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను.
నేను ప్రస్తావించిన “శబ్దార్ధ దీపిక” చాలా మంచి నిఘంటువు. సీతారామాచార్యుల వారి “శబ్ద రత్నాకరం” కన్నా పదాల్ని వివరంగా పేర్కొన్న
నిఘంటువు. ముసునూరి వేంకటశాస్త్రి గారి మూడవ ముద్రణని 1957 లో సికింద్రాబాద్ నించి దాచేపల్లి నరసయ్య& బ్రదర్స్ వారు
ప్రచురించారు. ఆనాటి ప్రముఖ పండితులు ఈ నిఘంటువు ప్రాశస్త్యం వివరించి
పేర్కొన్నారు. బ హుజనపల్లి వారి నిఘంటువుని మ ద్రాసు మిషనరీ సంస్థలు
ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. అదే ముసునూరి వేంకటశాస్త్రి గారి “శబ్దార్ధ దీపిక” ఉపయోగం అధికమైనప్పటికినీ..దాని పున: ప్రచురణ జరగనందువలన అది ఎక్కువ గా అందుబాటులోకి రాలేదు గనక ఇవాళ దాన్ని గురించి శ్రధ్ధ
పెట్టటం మంచిది. ఏ గ్రంధాలయంలోనైనా. ఈ నిఘంటువు ప్రతి .ఒక్క కాపీ దొరికినా
కనీసం..నెట్ లో పెట్టైనా..దీన్ని నలుగురి ప్రయోజనానికీ వీలుగా మళ్ళీ అందుబాటు
లోకి తేవాల్సిన అవసరంవుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు కన్నా..బ్రౌణ్యం
కన్నా..శబ్దరత్నాకరం కన్నా కూడా..ముసునూరి వారి “శబ్దార్ధదీపిక “ఉపయోగం
ఎక్కువ .గనకనే దీని గురించి మరొకసారి చెబుతున్నాను. నిఘంటువుల గురించి
తెలిసిన వాళ్ళు దీనిని సంపాదించి పరిశీలించ గలరు.
రమ.
తెలుగు నిఘంటువుల విషయంలో ‘ఈ మాట’ వారి ఆవేదనలో ఎంతో అర్థం ఉంది. తెలుగు భాషకు ప్రాచీనభాషాహోదా వచ్చి ఒక సంవత్సరం పూర్తి కావచ్చిన ఈ సందర్భంలో ప్రస్తావించడం సందర్భోచితం కూడా. ఏ భాషాభివృద్ధికైనా నిఘంటువుల అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో సంప్రదాయ నిఘంటువులతో పాటు కొన్ని ప్రత్యేక నిఘంటువులను సిద్ధం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకుగాను ప్రత్యేకంగా పండితసభలను ఏర్పాటు చెయ్యాలి.
ఇక మీరన్నట్లు ఇది చాలా సమయాన్ని తీసుకునే ప్రయత్నం. అయినా వాటిని వేగంగా పూర్తి చెయ్యడానికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలు విషయాలను పంచుకోవాలి. అక్కడ ప్రతీ ఆచార్యుడి పర్యవేక్షణలో విద్యార్థిగణాలను ఏర్పాటు చేసి, ప్రాజెక్ట్ వర్క్ గా ఇచ్చి సేకరణలు చేయించాలి. వాటిని ఆ ఆచార్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. వారికి కెటాయించిన విషయంలో ఎవరికి వారు వేగంగా పని పూర్తి చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటర్ నెట్ ద్వారా సమాచార వినిమయం చేసుకోవాలి.దీనివల్ల విద్యార్థులకూ చక్కని శిక్షణ కలుగుతుంది. పనిలో వేగం పెరుగుతుంది. ఇటువంటి వాటివల్ల ఎన్నో రకాలైన నిఘంటువులను సిద్ధం చెయ్యడానికి అవకాశం ఉంది.
ఇక ఆన్ లైన్ లో నిఘంటువులు దొరికితే ఎంత బాగుండూ? అనేది మంచి ఆశనే. ఒక్క నిఘంటువులే కాదు తెలుగులోని ప్రతి పుస్తకం ఆన్ లైన్ లో లభించాలనేది నా కోరిక. అలా లభించడం తెలుగువాడికి ఎంత అదృష్టం?
ప్రస్తుతం ఆన్ లైన్ లో ఎక్కడో ఒకదగ్గర లభిస్తున్న శబ్దరత్నాకరం వంటి కొన్ని నిఘంటువులను తెలుగుపరిశోధన వెబ్ సైట్ సేకరించి ఒకేచోట అందుబాటులోకి తెచ్చింది.
మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు 🙂 కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
విధేయుడు – మోహన
ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు 🙁
బాబా గారు!
అద్భుతమైన కవితను పరిచయం చేశారు. ఆ తడబాటు కూడా కవి తన శైలిలో చూపినట్లుంది. అనుభూతితో నిండిపోయింది.
”ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.”
* * * *
“రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.”
”అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
* * * *
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము”
నా హృదయాన్నేదో ఆవహించినట్లుందీ కవిత చదువుతుంటే!
బాబాగారూ! మీది మంచి టేస్ట్!
అభినందనలు.
మీ
దార్ల
1957 లో ముసునూరి వేంకటశాస్త్రి గారు ఒక 80000 పదాలతో..”శబ్దార్ధ దీపిక” ని రూపొందించారు. ఉన్న వాటిల్లో చాలా ఉపయోగకరమైన..చాలా కృషి తో కూడిన నిఘంటువు ఇది. ఇలాంటి నిఘంటువు గురించి తెలిసిన వారు కూడా తక్కువ అనుకుంటాను. ఈ నిఘంటువు గనక అచ్చులో లభ్యమైతే ఎంత మందికో ఉపయోగంగా ఉంటుంది.దీన్ని ముద్రించగల్గితే తెనుగు వారికి చాలా మేలు చేసిన వారౌతారు.1430 పేజీలకు పైబడి ఉన్న పుస్తకం ఇది.
ఈమాట పాత సంచికల్లో జాషువా గారి కవిత్వంపై (ఫిరదౌసి) చక్కని విశ్లేషణ ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి, “20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తులు” లో ఒకరిగా గుర్తించబడిన శ్రీ జాషువా గురించి నాలుగు మాటలు ఇక్కడ చెప్పుకోవటం అవసరం. శ్రీ తిరుమల రామచంద్ర గారు, శ్రీ నీలంరాజు మురళీధర్ గార్లు (అందమైన చాయాచిత్రాలు తీసిన వారు) కలసి, ఆంధ్రప్రభ కోరిక మేర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేసి, వ్యాసాల రూపంలో అందంగా ఫొటోలతో సహా 1960 దశాబ్దంలో ప్రచురించారు. అదే “మరపురాని మనీషి – 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు”. ఈ వ్యాస సంపుటికి తరవాత “అజో-విభో” ఫౌండేషన్ వారు పుస్తక రూపాన్నిచ్చారు. అందులోవి ఈ నాలుగు మాటలు శ్రీ గుర్రం జాషువాపై ఉన్నాయి.
గుర్రంవారు ఒక మారు వార్ధాకు గాంధీజీ దర్శనం కోసం వెళ్ళారు. అక్కడున్న ఒక జర్మన్ పండితునికి ఒక రాజకీయ నాయకుడు వారిని “దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ పొయట్” అని పరిచయం చేసారట. ఆ విదేశీ పండితుడు ఆశ్చర్యపడి ఆ నాయకుని వైపు చూశాడట. కవితకు కులమతాలు అంటగట్టటం ఎలాంటి సభ్యతో అర్ధం కావటంలేదంటారు గుర్రంవారు. “విశ్వమానవ సౌభ్రాత్రం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి, ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా కవిత్వాలంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికే ప్రయత్నించాను. గహనసంచారం లేని కవిత్వం నా లక్ష్యం” అని స్పష్టపరిచారు గుర్రంవారు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Veluri Venkateswara rao అభిప్రాయం:
09/02/2009 6:14 pm
మిత్రులందరికీ నమస్కారం.
నేను ముందుగానే మనవి చేసుకున్నాను; మంచిమంచి సలహాలు కోకొల్లలుగా వస్తాయని. అయితే, ఈ మంచిమంచి సలహాలన్నీ ఆచరణసాధ్యాలా అన్నదే నా అనుమానం.
విధ్యార్థులకు పనికి వచ్చే నిఘంటువు పునర్ముద్రించడం వద్దని ఎవరు అనగలరు? లేదా, విధ్యార్థులకి పనికి వచ్చే మరొక నిఘంటువు తయారుచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటే నేను కాదంటానా?
ఆ మాటకొస్తే ఉన్న నిఘంటులన్నీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం”గా అందుబాటులోకి తేవడం మంచిది కాదని ఎవరు అనగలరు? ఇవన్నీ మంచి సలహాలే!
పోతే, నేను సూర్యరాయాంధ్ర నిఘంటువు, బ్రౌణ్యం (మొదటిముద్రణ ప్రతి) లను ప్రత్యేకించి ప్రస్తావించడాని ముఖ్యకారణం: ఈ రెండు నిఘంటువుల కాపీరైట్ సాహిత్య అకాడమీ వారికి ఉండేది. ఇప్పుడు సాహిత్య అకాడమీ లేదుగా! ఆ కాపీరైట్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి చేతిలో ఉన్నది. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? ప్రభుత్వం వారు కావాలనుకుంటే, ఈ రెండు నిఘంటువులనీ వెంటనే పునర్ముద్రించి అందుబాటులోకి తేవచ్చు. అంతకన్నా మంచిపని. ఈ రెండు నిఘంటువులనీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవచ్చు. ఆతరువాత, తీరిగ్గా ఈ నిఘంటువులను సంశోధించి, పరిష్కరించడానికి పూనుకోవచ్చు. ఆపేరుమీదైనా ఇంకా బ్రతికిఉన్న కొద్దిమంది పెద్ద పండితులకీ(?) కాస్త భుక్తి దొరుకుతుంది.
ఒకవేళ, ప్రభుత్వం వారు అల్లాంటి మంచి పనులు చెయ్యడం మాకు అలవాటు లేదు అని ఒప్పుకుంటే, అప్పుడు లాభాపేక్షలేని ఏ “సాంస్కృతిక” సంస్థో (ఆటా, తానాలవంటివి అని నాభావం!) ఈ పనికి పూనుకోవచ్చు. కాపీరైట్లు పేరుతో ప్రభుత్వం వారు అడ్డం రామని హామీ ఇస్తే చాలు, శుభం! ప్రభుత్వం వారు “అమ్మ పెట్టాపెట్టదు; అడుక్కో తినానివ్వదు,” అన్న స్థితిలో ఉంటే, అది చాలా విచారకరమైన విషయం.
ఇతర నిఘంటువులకి కాపీరైట్ ఎవరితో ఉన్నదో కనుక్కొని, వారికి తగు పారితోషికం ఇచ్చి ( ఇప్పించి) అచ్చు వెయ్యడమో, లేకపోతే ఇంటర్నెట్లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవడమో చేస్తే, (ఈ పని ఎవరు చేస్తారు అన్నది ప్రశ్న!) అంతకన్నా కావలసినది ఏమున్నది?
అయితే, ఈ కాపీరైట్ వ్యవహారాలు పరిష్కరించడంలో అడ్డంకులు చాలా ఉన్నాయని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను.
విధేయుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి rama bharadwaj అభిప్రాయం:
09/02/2009 2:10 pm
నేను ప్రస్తావించిన “శబ్దార్ధ దీపిక” చాలా మంచి నిఘంటువు. సీతారామాచార్యుల వారి “శబ్ద రత్నాకరం” కన్నా పదాల్ని వివరంగా పేర్కొన్న
నిఘంటువు. ముసునూరి వేంకటశాస్త్రి గారి మూడవ ముద్రణని 1957 లో సికింద్రాబాద్ నించి దాచేపల్లి నరసయ్య& బ్రదర్స్ వారు
ప్రచురించారు. ఆనాటి ప్రముఖ పండితులు ఈ నిఘంటువు ప్రాశస్త్యం వివరించి
పేర్కొన్నారు. బ హుజనపల్లి వారి నిఘంటువుని మ ద్రాసు మిషనరీ సంస్థలు
ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. అదే ముసునూరి వేంకటశాస్త్రి గారి “శబ్దార్ధ దీపిక” ఉపయోగం అధికమైనప్పటికినీ..దాని పున: ప్రచురణ జరగనందువలన అది ఎక్కువ గా అందుబాటులోకి రాలేదు గనక ఇవాళ దాన్ని గురించి శ్రధ్ధ
పెట్టటం మంచిది. ఏ గ్రంధాలయంలోనైనా. ఈ నిఘంటువు ప్రతి .ఒక్క కాపీ దొరికినా
కనీసం..నెట్ లో పెట్టైనా..దీన్ని నలుగురి ప్రయోజనానికీ వీలుగా మళ్ళీ అందుబాటు
లోకి తేవాల్సిన అవసరంవుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు కన్నా..బ్రౌణ్యం
కన్నా..శబ్దరత్నాకరం కన్నా కూడా..ముసునూరి వారి “శబ్దార్ధదీపిక “ఉపయోగం
ఎక్కువ .గనకనే దీని గురించి మరొకసారి చెబుతున్నాను. నిఘంటువుల గురించి
తెలిసిన వాళ్ళు దీనిని సంపాదించి పరిశీలించ గలరు.
రమ.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Dr.R.P.Sharma అభిప్రాయం:
09/02/2009 12:41 pm
తెలుగు నిఘంటువుల విషయంలో ‘ఈ మాట’ వారి ఆవేదనలో ఎంతో అర్థం ఉంది. తెలుగు భాషకు ప్రాచీనభాషాహోదా వచ్చి ఒక సంవత్సరం పూర్తి కావచ్చిన ఈ సందర్భంలో ప్రస్తావించడం సందర్భోచితం కూడా. ఏ భాషాభివృద్ధికైనా నిఘంటువుల అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో సంప్రదాయ నిఘంటువులతో పాటు కొన్ని ప్రత్యేక నిఘంటువులను సిద్ధం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకుగాను ప్రత్యేకంగా పండితసభలను ఏర్పాటు చెయ్యాలి.
ఇక మీరన్నట్లు ఇది చాలా సమయాన్ని తీసుకునే ప్రయత్నం. అయినా వాటిని వేగంగా పూర్తి చెయ్యడానికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలు విషయాలను పంచుకోవాలి. అక్కడ ప్రతీ ఆచార్యుడి పర్యవేక్షణలో విద్యార్థిగణాలను ఏర్పాటు చేసి, ప్రాజెక్ట్ వర్క్ గా ఇచ్చి సేకరణలు చేయించాలి. వాటిని ఆ ఆచార్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. వారికి కెటాయించిన విషయంలో ఎవరికి వారు వేగంగా పని పూర్తి చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటర్ నెట్ ద్వారా సమాచార వినిమయం చేసుకోవాలి.దీనివల్ల విద్యార్థులకూ చక్కని శిక్షణ కలుగుతుంది. పనిలో వేగం పెరుగుతుంది. ఇటువంటి వాటివల్ల ఎన్నో రకాలైన నిఘంటువులను సిద్ధం చెయ్యడానికి అవకాశం ఉంది.
ఇక ఆన్ లైన్ లో నిఘంటువులు దొరికితే ఎంత బాగుండూ? అనేది మంచి ఆశనే. ఒక్క నిఘంటువులే కాదు తెలుగులోని ప్రతి పుస్తకం ఆన్ లైన్ లో లభించాలనేది నా కోరిక. అలా లభించడం తెలుగువాడికి ఎంత అదృష్టం?
ప్రస్తుతం ఆన్ లైన్ లో ఎక్కడో ఒకదగ్గర లభిస్తున్న శబ్దరత్నాకరం వంటి కొన్ని నిఘంటువులను తెలుగుపరిశోధన వెబ్ సైట్ సేకరించి ఒకేచోట అందుబాటులోకి తెచ్చింది.
జమ్మిబంగారం చెట్టు గురించి అపూర్వ అభిప్రాయం:
09/02/2009 9:13 am
విభీషణుడు రహస్యాన్ని చెప్పిన సందర్భం ఏమైనా
దెలీలా ..రహస్యం తెలుకోవడానికి ఏ పరిస్థితుల్లో నియమింపబడినా
అత్యంత రహస్యాన్ని బయటుకు లాగడం కీలకం
ప్రతీకలు చాలా బాగున్నాయి
అభినందనలు
మరోపువ్వు గురించి రాజశేఖరుని విజయ్ శర్మ అభిప్రాయం:
09/02/2009 7:47 am
చాలా బాగా రాశారు.
” ఆత్మకొక పుష్పంగా ” అని కాకుండా
ఆత్మ నొక పుష్పంగా అంటే బాగుండేదేమో.
తెలుగు నిఘంటువు గురించి… గురించి mOhana అభిప్రాయం:
09/02/2009 5:29 am
మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు 🙂 కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
విధేయుడు – మోహన
తెలుగు నిఘంటువు గురించి… గురించి Sowmya అభిప్రాయం:
09/01/2009 11:30 pm
ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు 🙁
ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి Dr.Darla అభిప్రాయం:
09/01/2009 10:19 pm
బాబా గారు!
అద్భుతమైన కవితను పరిచయం చేశారు. ఆ తడబాటు కూడా కవి తన శైలిలో చూపినట్లుంది. అనుభూతితో నిండిపోయింది.
”ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.”
* * * *
“రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.”
”అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
* * * *
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము”
నా హృదయాన్నేదో ఆవహించినట్లుందీ కవిత చదువుతుంటే!
బాబాగారూ! మీది మంచి టేస్ట్!
అభినందనలు.
మీ
దార్ల
తెలుగు నిఘంటువు గురించి… గురించి rama bharadwaj అభిప్రాయం:
09/01/2009 2:57 pm
1957 లో ముసునూరి వేంకటశాస్త్రి గారు ఒక 80000 పదాలతో..”శబ్దార్ధ దీపిక” ని రూపొందించారు. ఉన్న వాటిల్లో చాలా ఉపయోగకరమైన..చాలా కృషి తో కూడిన నిఘంటువు ఇది. ఇలాంటి నిఘంటువు గురించి తెలిసిన వారు కూడా తక్కువ అనుకుంటాను. ఈ నిఘంటువు గనక అచ్చులో లభ్యమైతే ఎంత మందికో ఉపయోగంగా ఉంటుంది.దీన్ని ముద్రించగల్గితే తెనుగు వారికి చాలా మేలు చేసిన వారౌతారు.1430 పేజీలకు పైబడి ఉన్న పుస్తకం ఇది.
రమ.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/01/2009 10:13 am
ఈమాట పాత సంచికల్లో జాషువా గారి కవిత్వంపై (ఫిరదౌసి) చక్కని విశ్లేషణ ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి, “20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తులు” లో ఒకరిగా గుర్తించబడిన శ్రీ జాషువా గురించి నాలుగు మాటలు ఇక్కడ చెప్పుకోవటం అవసరం. శ్రీ తిరుమల రామచంద్ర గారు, శ్రీ నీలంరాజు మురళీధర్ గార్లు (అందమైన చాయాచిత్రాలు తీసిన వారు) కలసి, ఆంధ్రప్రభ కోరిక మేర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేసి, వ్యాసాల రూపంలో అందంగా ఫొటోలతో సహా 1960 దశాబ్దంలో ప్రచురించారు. అదే “మరపురాని మనీషి – 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు”. ఈ వ్యాస సంపుటికి తరవాత “అజో-విభో” ఫౌండేషన్ వారు పుస్తక రూపాన్నిచ్చారు. అందులోవి ఈ నాలుగు మాటలు శ్రీ గుర్రం జాషువాపై ఉన్నాయి.
గుర్రంవారు ఒక మారు వార్ధాకు గాంధీజీ దర్శనం కోసం వెళ్ళారు. అక్కడున్న ఒక జర్మన్ పండితునికి ఒక రాజకీయ నాయకుడు వారిని “దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ పొయట్” అని పరిచయం చేసారట. ఆ విదేశీ పండితుడు ఆశ్చర్యపడి ఆ నాయకుని వైపు చూశాడట. కవితకు కులమతాలు అంటగట్టటం ఎలాంటి సభ్యతో అర్ధం కావటంలేదంటారు గుర్రంవారు. “విశ్వమానవ సౌభ్రాత్రం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి, ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా కవిత్వాలంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికే ప్రయత్నించాను. గహనసంచారం లేని కవిత్వం నా లక్ష్యం” అని స్పష్టపరిచారు గుర్రంవారు.
విష్ణుభొట్ల లక్ష్మన్న