శబ్దరత్నాకరం నిఘంటువు కూర్పు గురించీ..బ హుజనపల్లి సీతారామాచార్యుల వారి పేర అది చెలామణీ అవటం గురించీ ఆదిగా గల సమ స్త దుమారాలూ..నాకు తెలుసు. కానీ ప్రస్తుత విషయం అది కాదు గన్క
వాటి ప్రస్తావన నేను తేలేదు.
కాపీరైటు అన్న ది పరిష్కరించలేని సమ స్య గానే ఉంటే వాటి కాల పరిమితి
దాటేదాకా ఎదురుచూస్తూ ఉంటే..ఈ లోగా వాటి ప్రయోజనం కొండెక్కాల్సిందే!!
నిఘంటువుల ప్రచురణ డబ్బుల్తో కూడిన వ్యవహారం గాన..దాన్ని గురించి ఎంత బాధ్యత కలిగినా..ఎంత ఆసక్తి కలిగినా వ్యక్తులెవరూ వ్యవహరించగలిగే విషయాలు కావు. ఏ సంస్థలైనా సరే చేస్తే అవే చేయాలి మరి.ఇవన్నీ మీరన్న ట్టు కష్టపడితేనే గానీ అందుబాటు లోకి రావు.అయితే ఆ కష్టం ఎవరు పడతారూ?? అన్న ది సైతం అంతే ముఖ్యమైన విషయం.”శబ్దార్ధ దీపిక” ని రూపొందించే అనుభవంలో తన ఆరోగ్యం ఎంతగా పాడైపోయిందీ ప్రస్తావిస్తారు ముసునూరి వారు. అంత కష్టం ఆయన పడితే ఆయనకు ఆర్ధికంగా ఏమీ ఒన
గూరింది లేదు..అనారోగ్యం తప్ప.
ఆకారాదిక్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరాన్ని పరవస్తు (BTW his three mss were never published!), బహుజనపల్లిల కంటే ఒక 60-70 ఏళ్ళ ముందే గుర్తించిన మనిషి మామిడి వెంకయ్య. ఆయన తయారు చేసిన “ఆంధ్ర దీపిక” 1816 నాటికే అచ్చయ్యింది. Probably this is the first alphabetical dictionary in Indic languages.
తెలుగు నిఘంటువుల చరిత్రపైన చాలా పొడుగాటి వ్యాసమే రాయవచ్చు. A good summary is provided in: వెలగా వెంకటప్పయ్య “తెలుగు నిఘంటువికాసం” (తె.సా.అ,, హైదరాబాదు, 1975). This book also provides an extensive list of various dictionaries published in Telugu over 150 years.
“[సూర్యరాయాంధ్ర నిఘంటువు] ఆ తరువాత మళ్ళీ అచ్చువేసినట్టుగా లేదు” అన్న మాట కూడా నిజం కాదు. 1987 ప్రాంతం వరకు 8 సంపుటాలుగా, తరువాత 6 సంపుటాలుగా (కేవలం 300 రూపాయిలకే, దానిపైన మరల 10 శాతం రాయితీతో!) తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించి అమ్ముతున్నారు. గత 2-3 సంవత్సరాలలో చెప్పలేం కాని 2005-06 వరకు పూర్తి సెట్ మార్కెట్లో అందుబాటులో వుంది.
ముసునూరి వారి నిఘంటువులన్నీ (ఆయన 1971లో 2 భాగాలుగా చేసిన “ఆంధ్రనామ సర్వస్వము – అచ్చతెనుగు నిఘంటువు” కలుపుకొని) 2035 వరకు కాపీరైట్ చట్టం క్రిందకొస్తాయి. “కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు.” లాంటి వాక్యాలు రాయడం తేలిక. కొన్ని నిఘంటువులకి, చాలా పుస్తకాల పునర్ముద్రణకి హక్కుదారులను సంప్రదించిన అనుభవంతో చెప్తున్న మాటలివి!
శ.రత్నాకరం “మ ద్రాసు మిషనరీ సంస్థలు ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి.” అన్న మాట నిజం కాదు. శ.ర, దానిని అసలు కూర్చినదెవరు, దాని మూలాలేమిటి, రాస్తూ పోతే మరో పెద్ద వ్యాసమవుతుంది.
“ఆంధ్ర నిఘంటుత్రయము – సటీకము” అన్న పేరుతో “ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబ నిఘంటువు” ఇప్పటికీ ముద్రణలో వున్నాయి. అలాగే విద్యార్థి కల్పతరువు లాంటి నిఘంటువులు కూడా.
Theres no copyright on CPB’s dictionary. Nor on Bahujanapalli’s. The copyright for సూర్యరాయ… is claimed by Telugu university.
Here is an open request to one and all. Get us the CR permission from TU and we will put సూర్యరాయాంధ్ర on-line in one year’s time. For other dictionaries that don’t fall under CR law, watch these pages.
ఒక సలహా ఆచరణ సాధ్యం ఎలా అవగలదో అందులోని సాధక బాధకాలతో సహా ఆలోచించ గలిగితేనే ఆ సలహాకి అrthaమూ పరమాrthaమూనూ!!
కొత్త నిఘంటువులు తయారు చేసుకోగలిగితే మంచిది. అది జరగనప్పుడు కనీసం ఉపయోగించగల నిఘంటువుల్ని మళ్ళీ ఉపయోగంలోకి తెచ్చుకోవటమ్ ఉత్తమం. డబ్బు పెట్టి అచ్చు వేయగల సంస్థలకి కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు. సంప్రదింపులు ఒక సంస్థ తరుపున జరిపే వారుంటే..అన్నీ సాధ్యమే!! అడుగే కదపకుండా నడకే సాధ్యం కాదు కద!!
ఇకపోతే, తెలిసిన సమాచారాన్ని నలుగురి దృష్టికీ తేవటం “ఉచిత సలహా” లాంటిది కాదు.
కథ బాగుంది. ఇలాటి జాతక కథలంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ చెప్పబడిన ఉదంతం మిగారుడి ఇంటిలోనే జరిగిందని ఒక కథలో ఉంది. బుద్ధుడిని విశాఖ ఇంటికి ఆహ్వానించిందని, మిగారుడు తెర వెనుకనుండి బుద్ధుడి పలుకులను విన్నాడని ఆ కథలో ఉంది. ఒకప్పుడు విశాఖ బుద్ధుడిని చూడడానికి జేతవనానికి వెళ్లింది. ఆమె రత్నఖచితమైన ఒక కంబళిని కప్పుకొని ఉండిందట ఆరోజు. అది కొద్దిగా బరువుగా ఉండడంవల్ల దానిని తనతో వచ్చిన పరిచారికకు ఇచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు పరిచారిక ఆ శాలువాను మరచిపోయిందట. ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె పరిచారికను మళ్ళీ పంపిందట. ఒక వేళ ఆనందుడు (బుద్ధుని ప్రథమ శిష్యుడు) దానిని జాగ్రత్తపరిచి ఉంటే తీసికొని రావద్దు, అలాగే అది అక్కడే పడి ఉంటే తీసికొనిరా అని పంపిందట. ఆనందుడు అలవాటు ప్రకారం దానిని భద్రపరిచి ఉంచాడు. వద్దన్నా ఆనందుడు తిరిగి ఇచ్చాడట. దానిని అమ్మి ఆ డబ్బుతో విహారం కట్టిద్దామనుకొన్నది విశాఖ. కాని దాన్ని కొనేటంత డబ్బు ఎవరివద్ద లేకపోయింది. చివరకు విశాఖ తానే దానిని కొని ఆ డబ్బుతో విహారమొకటి కట్టించింది. తరువాత విశాఖ తన కుటుంబం లోని వారందరినీ పిలిచి నా కోరికలు ఈడేరాయి. నాకింకేమి అక్కరలేదు అని చెప్పి బుద్ధ విహారానికి వెళ్లి ప్రదక్షిణం చేస్తూ పాడుతూ ఆడుతూ ఉండిందట. ఈ దృశ్యాన్ని చూచిన కొందరికి ఆమె కేమైనా పిచ్చి పట్టిందో ఏమో అని అనుకొన్నారు. బుద్ధుడికి ఈ విషయం చెప్పగా అప్పుడు బుద్ధుడు తాను పూర్వజన్మలో ఒక బోధిసత్త్వుడుగా ఉన్నప్పుడు విశాఖ మరొక భక్తురాలిని చూచి ఆమెలా నేను కూడా ఉండాలనుకొన్నదట. దాని ఫలితమే ఈ జన్మలో ఆమె మంచి కార్యాలు చేసి ఈ స్తాయికి చేరింది అని బుద్ధుడు శిష్యులకు వివరించాడు. ఇది తరువాతి కథ. విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం అన్న శీర్షికలోకి వాల్మీకీ, విశ్వనాthaల తారతమ్యం అనే అంశం ఎలా చొరబడిందో!! విశ్వనాtha మంచి పద్యాలు అనేకం ఉండగా, ఈ పద్యమే బృందావనరావు గారికి నచ్చటం ఆయన అభిరుచిని తెలియజేస్తోంది.
ఉపమానం ఉపమానం కోసమే గొప్పది కాలేదు. అందులోని స్వారస్యంలో ఒక ఒప్పుదల ఉండాలి. అటువంటి ఒప్పుదల అన్పించక పోవటమే ఈ పద్యంలోని వెలితి. ఆ వెలితిని లైలా బాగానే చెప్పారు.
ఇతిహాసాలు, తెలుగు పద్యాలు, వాటిని ఆధారంగా తీసుకు చేసే రచనలు చదవటం నాకు చాలా ఇష్టం. చదివాక సరదాగా చర్చలోకి దిగకుండా ఎలా?
విశ్వనాథ రచనలు బాగా ఇష్టమే నాకు. ఐనా ఈ పద్యం, ఈ సందర్భంలో, ఈ క్రింది కారణాల వల్ల నాకు నచ్చలేదు.
“దుర్ముఖి, మహోదరి, విరూపాక్షి, తామ్ర మూర్ధజ, విరూప, భైరవ స్వర,
దారుణ, వృద్ధ, యర్కప్రసూన కైశిక, రుండమాలా కాంచి, వసాకజ్జల యయ;కంకణ” – అని అప్పటికే శూర్పణఖను వర్ణించి ఉన్నాడు కవి. ఇంత సుందరి శూర్పణఖకు ముక్కూ చెవులూ కోసినంత మాత్రాన ఇంక ఆమెకు కొత్తగా వచ్చే వికారరూప మేమిటి! మళ్ళీ అంత కష్టపడి శూర్పణఖను ఎవరికోసం వర్ణిస్తున్నట్లు?
ఇంతకీ ఇక్కడ ఇవ్వబడిన సందర్భంలో,
ఈ రాక్షస స్త్రీని చూస్తున్నదెవరు! ఇంకో రాక్షసుడే. స్వయానా ఆమె తమ్ముడు ఖరుడు.
ఏదో సగం కాలిన మద్ది, సగం కాలిన కాష్ఠం, ఏదో ఎండిన మట్టల బుల్లీత చెట్టు, పుట్టలున్న వెదురు గుబురు- ఖరుడికి శూర్పణఖ ఇలా ఎందుకు కనిపిస్తుంది! మనుషుల కన్నమద్దిచెట్లు పెద్దవి గానూ, చెట్ల కన్నా రాక్షసులు ఇంకా ఎంతో, ఎంతో పెద్దగానూ ఉంటారనుకున్నా. కాదా? Pygmy రాక్షసులా వీళ్ళు?
ఎంత ఉన్నత శరీరం లేకపోతే రావణుడు కైలాసగిరిని ఎత్తుతాడు? శూర్పణఖ, ఖరుడు, దూషణుడు, అతని పినతల్లి సంతానమేగా?
ఏమైనా,
వాల్మీకి రాసిన రామాయణాన్ని తిరగరాస్తూ -వల్మీకాలున్న వెదురు తోపు లాగా శూర్పణఖ ఉందంటం – విశ్వనాథకు ఉచితమంటారా? 🙂
పైగా ఆ తర్వాత పద్యంలో,
ఖరుడు ముక్కూ, చెవులూ తెగి ఏడుస్తున్న పెద్ద అప్పగారిని – హెల్త్ ఇన్స్యురెన్స్ లేకుండా హాస్పిటల్ కి వచ్చిన పేషెంటును చూసినట్లు చూస్తూ- “వనమూలికల్ వెదకి గాయము మాన్పుకొనంగ రాదె..” అంటాడేమిటీ, అదీ నచ్చలేదు 🙂
మరియు,
వ్యాస రచయిత రామాయణం రాసిన విశ్వనాథను రావణాసురుడితో పోల్చటం చూశాక – విశ్వనాథ సత్యనారాయణ గాని – ‘Paradise Lost’ చదివి ఒకవేళ John Milton ని Satan తో పోలిస్తే ఎలా ఉంటుందో – అప్పుడు ఆ ఇద్దరు కవులకూ ఎంత 🙂 రావణ రామ యుద్ధం జరిగేదో- perhaps all hell will break loose in the Poets’ Heaven, after reading this essay even now – అని ఊహిస్తూ,
ఈ అభిప్రాయము వెలిబుచ్చినందుకు అది దూషణగాను, నన్ను ఖరము గాను, కాకున్న శూర్పణఖ గాను ఎంచరనీ, విశ్వనాథ – “కల్పవృక్ష రహస్యములు” అన్న పుస్తకంలో వారే తొలిపలుకులో విమర్శకుల గురించి చెప్పినట్లు -విమర్శ చేసిన నన్ను ఒక పామరస్త్రీ గా మాత్రమే పరిగణిస్తారనీ ఆశిస్తూ,
చాలా చాలా బావుంది! ఇలా రాగాల కూర్పు గురించి చదవాలంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అవి మళ్ళీ మళ్ళీ పాడుకోవడం, ఇతర పాటలతో పోల్చి చూసుకోవడం …ఆనందకరమైన అనుభవం! రోహిణీ ప్రసాద్ గారికి అనేకానేక ధన్యవాదాలు!
వానకూడా వింతే! గురించి Dhanya అభిప్రాయం:
09/04/2009 8:05 am
చాలా బాగుంది
తెలుగు నిఘంటువు గురించి… గురించి rama bharadwaj అభిప్రాయం:
09/04/2009 1:10 am
శబ్దరత్నాకరం నిఘంటువు కూర్పు గురించీ..బ హుజనపల్లి సీతారామాచార్యుల వారి పేర అది చెలామణీ అవటం గురించీ ఆదిగా గల సమ స్త దుమారాలూ..నాకు తెలుసు. కానీ ప్రస్తుత విషయం అది కాదు గన్క
వాటి ప్రస్తావన నేను తేలేదు.
కాపీరైటు అన్న ది పరిష్కరించలేని సమ స్య గానే ఉంటే వాటి కాల పరిమితి
దాటేదాకా ఎదురుచూస్తూ ఉంటే..ఈ లోగా వాటి ప్రయోజనం కొండెక్కాల్సిందే!!
నిఘంటువుల ప్రచురణ డబ్బుల్తో కూడిన వ్యవహారం గాన..దాన్ని గురించి ఎంత బాధ్యత కలిగినా..ఎంత ఆసక్తి కలిగినా వ్యక్తులెవరూ వ్యవహరించగలిగే విషయాలు కావు. ఏ సంస్థలైనా సరే చేస్తే అవే చేయాలి మరి.ఇవన్నీ మీరన్న ట్టు కష్టపడితేనే గానీ అందుబాటు లోకి రావు.అయితే ఆ కష్టం ఎవరు పడతారూ?? అన్న ది సైతం అంతే ముఖ్యమైన విషయం.”శబ్దార్ధ దీపిక” ని రూపొందించే అనుభవంలో తన ఆరోగ్యం ఎంతగా పాడైపోయిందీ ప్రస్తావిస్తారు ముసునూరి వారు. అంత కష్టం ఆయన పడితే ఆయనకు ఆర్ధికంగా ఏమీ ఒన
గూరింది లేదు..అనారోగ్యం తప్ప.
రమ.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
09/03/2009 5:45 pm
ఆకారాదిక్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరాన్ని పరవస్తు (BTW his three mss were never published!), బహుజనపల్లిల కంటే ఒక 60-70 ఏళ్ళ ముందే గుర్తించిన మనిషి మామిడి వెంకయ్య. ఆయన తయారు చేసిన “ఆంధ్ర దీపిక” 1816 నాటికే అచ్చయ్యింది. Probably this is the first alphabetical dictionary in Indic languages.
తెలుగు నిఘంటువుల చరిత్రపైన చాలా పొడుగాటి వ్యాసమే రాయవచ్చు. A good summary is provided in: వెలగా వెంకటప్పయ్య “తెలుగు నిఘంటువికాసం” (తె.సా.అ,, హైదరాబాదు, 1975). This book also provides an extensive list of various dictionaries published in Telugu over 150 years.
“[సూర్యరాయాంధ్ర నిఘంటువు] ఆ తరువాత మళ్ళీ అచ్చువేసినట్టుగా లేదు” అన్న మాట కూడా నిజం కాదు. 1987 ప్రాంతం వరకు 8 సంపుటాలుగా, తరువాత 6 సంపుటాలుగా (కేవలం 300 రూపాయిలకే, దానిపైన మరల 10 శాతం రాయితీతో!) తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించి అమ్ముతున్నారు. గత 2-3 సంవత్సరాలలో చెప్పలేం కాని 2005-06 వరకు పూర్తి సెట్ మార్కెట్లో అందుబాటులో వుంది.
ముసునూరి వారి నిఘంటువులన్నీ (ఆయన 1971లో 2 భాగాలుగా చేసిన “ఆంధ్రనామ సర్వస్వము – అచ్చతెనుగు నిఘంటువు” కలుపుకొని) 2035 వరకు కాపీరైట్ చట్టం క్రిందకొస్తాయి. “కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు.” లాంటి వాక్యాలు రాయడం తేలిక. కొన్ని నిఘంటువులకి, చాలా పుస్తకాల పునర్ముద్రణకి హక్కుదారులను సంప్రదించిన అనుభవంతో చెప్తున్న మాటలివి!
శ.రత్నాకరం “మ ద్రాసు మిషనరీ సంస్థలు ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి.” అన్న మాట నిజం కాదు. శ.ర, దానిని అసలు కూర్చినదెవరు, దాని మూలాలేమిటి, రాస్తూ పోతే మరో పెద్ద వ్యాసమవుతుంది.
“ఆంధ్ర నిఘంటుత్రయము – సటీకము” అన్న పేరుతో “ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబ నిఘంటువు” ఇప్పటికీ ముద్రణలో వున్నాయి. అలాగే విద్యార్థి కల్పతరువు లాంటి నిఘంటువులు కూడా.
Theres no copyright on CPB’s dictionary. Nor on Bahujanapalli’s. The copyright for సూర్యరాయ… is claimed by Telugu university.
చివరిగా వేలూరిగారు ప్రతిసారి తానా, ఆటాల మీదెందుకు పడతారో అంతు చిక్కని విషయం.
Here is an open request to one and all. Get us the CR permission from TU and we will put సూర్యరాయాంధ్ర on-line in one year’s time. For other dictionaries that don’t fall under CR law, watch these pages.
— పరుచూరి శ్రీనివాస్
— వాడపల్లి శేషతల్పశాయి
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
09/03/2009 2:00 pm
ఈ పద్యాలు రికార్డు చేసిన తరవాత ఘంటసాల కనీసం 20 ప్రైవేట్ రికార్డ్లు పాడారని పరుచూరి శ్రీనివాస్ తెలియజేశారు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి rama bharadwaj అభిప్రాయం:
09/03/2009 1:01 pm
ఒక సలహా ఆచరణ సాధ్యం ఎలా అవగలదో అందులోని సాధక బాధకాలతో సహా ఆలోచించ గలిగితేనే ఆ సలహాకి అrthaమూ పరమాrthaమూనూ!!
కొత్త నిఘంటువులు తయారు చేసుకోగలిగితే మంచిది. అది జరగనప్పుడు కనీసం ఉపయోగించగల నిఘంటువుల్ని మళ్ళీ ఉపయోగంలోకి తెచ్చుకోవటమ్ ఉత్తమం. డబ్బు పెట్టి అచ్చు వేయగల సంస్థలకి కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు. సంప్రదింపులు ఒక సంస్థ తరుపున జరిపే వారుంటే..అన్నీ సాధ్యమే!! అడుగే కదపకుండా నడకే సాధ్యం కాదు కద!!
ఇకపోతే, తెలిసిన సమాచారాన్ని నలుగురి దృష్టికీ తేవటం “ఉచిత సలహా” లాంటిది కాదు.
రమ.
మిగారమాత గురించి mOhana అభిప్రాయం:
09/03/2009 12:41 pm
కథ బాగుంది. ఇలాటి జాతక కథలంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ చెప్పబడిన ఉదంతం మిగారుడి ఇంటిలోనే జరిగిందని ఒక కథలో ఉంది. బుద్ధుడిని విశాఖ ఇంటికి ఆహ్వానించిందని, మిగారుడు తెర వెనుకనుండి బుద్ధుడి పలుకులను విన్నాడని ఆ కథలో ఉంది. ఒకప్పుడు విశాఖ బుద్ధుడిని చూడడానికి జేతవనానికి వెళ్లింది. ఆమె రత్నఖచితమైన ఒక కంబళిని కప్పుకొని ఉండిందట ఆరోజు. అది కొద్దిగా బరువుగా ఉండడంవల్ల దానిని తనతో వచ్చిన పరిచారికకు ఇచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు పరిచారిక ఆ శాలువాను మరచిపోయిందట. ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె పరిచారికను మళ్ళీ పంపిందట. ఒక వేళ ఆనందుడు (బుద్ధుని ప్రథమ శిష్యుడు) దానిని జాగ్రత్తపరిచి ఉంటే తీసికొని రావద్దు, అలాగే అది అక్కడే పడి ఉంటే తీసికొనిరా అని పంపిందట. ఆనందుడు అలవాటు ప్రకారం దానిని భద్రపరిచి ఉంచాడు. వద్దన్నా ఆనందుడు తిరిగి ఇచ్చాడట. దానిని అమ్మి ఆ డబ్బుతో విహారం కట్టిద్దామనుకొన్నది విశాఖ. కాని దాన్ని కొనేటంత డబ్బు ఎవరివద్ద లేకపోయింది. చివరకు విశాఖ తానే దానిని కొని ఆ డబ్బుతో విహారమొకటి కట్టించింది. తరువాత విశాఖ తన కుటుంబం లోని వారందరినీ పిలిచి నా కోరికలు ఈడేరాయి. నాకింకేమి అక్కరలేదు అని చెప్పి బుద్ధ విహారానికి వెళ్లి ప్రదక్షిణం చేస్తూ పాడుతూ ఆడుతూ ఉండిందట. ఈ దృశ్యాన్ని చూచిన కొందరికి ఆమె కేమైనా పిచ్చి పట్టిందో ఏమో అని అనుకొన్నారు. బుద్ధుడికి ఈ విషయం చెప్పగా అప్పుడు బుద్ధుడు తాను పూర్వజన్మలో ఒక బోధిసత్త్వుడుగా ఉన్నప్పుడు విశాఖ మరొక భక్తురాలిని చూచి ఆమెలా నేను కూడా ఉండాలనుకొన్నదట. దాని ఫలితమే ఈ జన్మలో ఆమె మంచి కార్యాలు చేసి ఈ స్తాయికి చేరింది అని బుద్ధుడు శిష్యులకు వివరించాడు. ఇది తరువాతి కథ. విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి rama bharadwaj అభిప్రాయం:
09/03/2009 12:40 pm
నాకు నచ్చిన పద్యం అన్న శీర్షికలోకి వాల్మీకీ, విశ్వనాthaల తారతమ్యం అనే అంశం ఎలా చొరబడిందో!! విశ్వనాtha మంచి పద్యాలు అనేకం ఉండగా, ఈ పద్యమే బృందావనరావు గారికి నచ్చటం ఆయన అభిరుచిని తెలియజేస్తోంది.
ఉపమానం ఉపమానం కోసమే గొప్పది కాలేదు. అందులోని స్వారస్యంలో ఒక ఒప్పుదల ఉండాలి. అటువంటి ఒప్పుదల అన్పించక పోవటమే ఈ పద్యంలోని వెలితి. ఆ వెలితిని లైలా బాగానే చెప్పారు.
రమ.
పెదవి దాటనివి గురించి ram mohan అభిప్రాయం:
09/03/2009 5:44 am
story బాగున్నది.ఆటో బయొగ్రాఫికల్ ? పెదవి దాటిస్తే సరి.
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి lyla yerneni అభిప్రాయం:
09/03/2009 1:22 am
ఇతిహాసాలు, తెలుగు పద్యాలు, వాటిని ఆధారంగా తీసుకు చేసే రచనలు చదవటం నాకు చాలా ఇష్టం. చదివాక సరదాగా చర్చలోకి దిగకుండా ఎలా?
విశ్వనాథ రచనలు బాగా ఇష్టమే నాకు. ఐనా ఈ పద్యం, ఈ సందర్భంలో, ఈ క్రింది కారణాల వల్ల నాకు నచ్చలేదు.
“దుర్ముఖి, మహోదరి, విరూపాక్షి, తామ్ర మూర్ధజ, విరూప, భైరవ స్వర,
దారుణ, వృద్ధ, యర్కప్రసూన కైశిక, రుండమాలా కాంచి, వసాకజ్జల యయ;కంకణ” – అని అప్పటికే శూర్పణఖను వర్ణించి ఉన్నాడు కవి. ఇంత సుందరి శూర్పణఖకు ముక్కూ చెవులూ కోసినంత మాత్రాన ఇంక ఆమెకు కొత్తగా వచ్చే వికారరూప మేమిటి! మళ్ళీ అంత కష్టపడి శూర్పణఖను ఎవరికోసం వర్ణిస్తున్నట్లు?
ఇంతకీ ఇక్కడ ఇవ్వబడిన సందర్భంలో,
ఈ రాక్షస స్త్రీని చూస్తున్నదెవరు! ఇంకో రాక్షసుడే. స్వయానా ఆమె తమ్ముడు ఖరుడు.
ఏదో సగం కాలిన మద్ది, సగం కాలిన కాష్ఠం, ఏదో ఎండిన మట్టల బుల్లీత చెట్టు, పుట్టలున్న వెదురు గుబురు- ఖరుడికి శూర్పణఖ ఇలా ఎందుకు కనిపిస్తుంది! మనుషుల కన్నమద్దిచెట్లు పెద్దవి గానూ, చెట్ల కన్నా రాక్షసులు ఇంకా ఎంతో, ఎంతో పెద్దగానూ ఉంటారనుకున్నా. కాదా? Pygmy రాక్షసులా వీళ్ళు?
ఎంత ఉన్నత శరీరం లేకపోతే రావణుడు కైలాసగిరిని ఎత్తుతాడు? శూర్పణఖ, ఖరుడు, దూషణుడు, అతని పినతల్లి సంతానమేగా?
ఏమైనా,
వాల్మీకి రాసిన రామాయణాన్ని తిరగరాస్తూ -వల్మీకాలున్న వెదురు తోపు లాగా శూర్పణఖ ఉందంటం – విశ్వనాథకు ఉచితమంటారా? 🙂
పైగా ఆ తర్వాత పద్యంలో,
ఖరుడు ముక్కూ, చెవులూ తెగి ఏడుస్తున్న పెద్ద అప్పగారిని – హెల్త్ ఇన్స్యురెన్స్ లేకుండా హాస్పిటల్ కి వచ్చిన పేషెంటును చూసినట్లు చూస్తూ- “వనమూలికల్ వెదకి గాయము మాన్పుకొనంగ రాదె..” అంటాడేమిటీ, అదీ నచ్చలేదు 🙂
మరియు,
వ్యాస రచయిత రామాయణం రాసిన విశ్వనాథను రావణాసురుడితో పోల్చటం చూశాక – విశ్వనాథ సత్యనారాయణ గాని – ‘Paradise Lost’ చదివి ఒకవేళ John Milton ని Satan తో పోలిస్తే ఎలా ఉంటుందో – అప్పుడు ఆ ఇద్దరు కవులకూ ఎంత 🙂 రావణ రామ యుద్ధం జరిగేదో- perhaps all hell will break loose in the Poets’ Heaven, after reading this essay even now – అని ఊహిస్తూ,
ఈ అభిప్రాయము వెలిబుచ్చినందుకు అది దూషణగాను, నన్ను ఖరము గాను, కాకున్న శూర్పణఖ గాను ఎంచరనీ, విశ్వనాథ – “కల్పవృక్ష రహస్యములు” అన్న పుస్తకంలో వారే తొలిపలుకులో విమర్శకుల గురించి చెప్పినట్లు -విమర్శ చేసిన నన్ను ఒక పామరస్త్రీ గా మాత్రమే పరిగణిస్తారనీ ఆశిస్తూ,
పద్యం బాగోక పోయినా, వ్యాసం బాగుందని తెలుపుతూ,
లైలా
పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి sujatha అభిప్రాయం:
09/02/2009 8:23 pm
చాలా చాలా బావుంది! ఇలా రాగాల కూర్పు గురించి చదవాలంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అవి మళ్ళీ మళ్ళీ పాడుకోవడం, ఇతర పాటలతో పోల్చి చూసుకోవడం …ఆనందకరమైన అనుభవం! రోహిణీ ప్రసాద్ గారికి అనేకానేక ధన్యవాదాలు!