వ్యాకరణం కన్నా కవిహృదయానికి ప్రాముఖ్యతనివ్వడం అన్నది ఒక సరసగుణం! ! నేను శ్రీశ్రీవిషయంలో చెప్పినది అదే!! పైగా శ్రీశ్రీ తాను స్వయంగా వివరణ ఇచ్చాకా మరింక అది చర్చకి రాకూడదు. అది ఒక మర్యాద.
సాహిత్యంలో వ్యాకరణ దోషాలు ఎన్నుకుంటూ పోతే మహామహులు చాలరు. “ఎమితిని సెపితివి కపితము” అని అల్లసాని పెద్దనని రామలింగడు వెక్కిరించాడని ప్రతీతి. అందువల్ల పెద్దన కవిత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయింది.
అలాగే అన్నమాచార్యులవారి వేల సంకీర్తనలలో వ్యాకరణ దోషాలు మెండుగానే దొరుకుతాయి. కానీ ఆయన పదాల ప్రాముఖ్యతకి అవేమీ అడ్డురాలేదు. రావు.
కవితా సంపన్నత ముందు ఇలాంటివి బహుచిన్నవని..లోకంవాటిని పట్టించుకోదనీ చెప్పడం నా ఉద్దేశ్యం!
శ్రీశ్రీకున్న అపార భాషా పరిజ్నానం తెలిసిన వారు “శ్రీశ్రీ తప్పుచేసేడోచ్ ” అని చాటనఖ్ఖరలేదు అన్నది నా భావం! తప్పు అన్నది ఒప్పు చేసే ప్రయత్నం నేను చేయలేదు. ఆయన మిగతావి అన్నీ “బహువచనం”లో పదాలని రాసేడు గనక అది వ్యక్తి గురించి కాక సమిష్టి పోరాటానికి ఆయన ఆ పాటని లక్ష్యించాడు గనక
ఆ “ప్రతి మనిషి ని ” మందికి గుర్తుగా గ్రహిస్తే చాలు అన్నది నా సూచన.
నేను కవితాసౌదర్యానికి వశురాలిని. దాని ముందు ఇతర దోషాలు నాకు ఎక్కవు. ఉత్తమ కవులందరికీ ఉత్తమ భావుకులకందరికీ ఇది అనుభవంలోకి వచ్చే విషయమే!!
వేంకటేశ్వర రావు గారి సమీక్ష బాగుంది. నిజానికి తెలుగు కథల రీతి ఇప్పుడలాగే అన్నిచోట్లా ఉంది. దానికి అమెరికా , ఇండియా అన్న భేదం లేదు. పూర్వం సాహిత్య సృజనచేయడానికి ముందు సాహిత్య అధ్యయనం ఉండేది. సమకాలీన సాహిత్యం పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకుని తర్వాత తమ సాహిత్య కృషి కొనసాగించే వారు. పత్రికలకు పేజీలునింపడం కావాలి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన టీవీ ఛానెళ్ళకి ఏ చెత్త కబురైనా వార్తలాగే. అలా అని సహజంగా రాయగల సమర్థులు ఉండరని కాదు. అది మనకు అందరికి తెలుసు. కోటికొక్కరు.
లక్ష్మన్నగారు చెప్పిన రెండుకారణాలూ ఆంధ్రదేశానికి కూడా డిటో. అయితే ఇక్కడ అవసరం వాసి పెరగడము గురించికాబట్టి ‘వ్యక్తిగతం’ కాకుండా, వస్తుగతం అయే విమర్శ తెలుగులో రావలసిన అవసరం ఎంతయినా ఉంది.
నిజానికి తెలుగులో రంగుటద్దాల విశ్లేషణలు తప్ప నిఖార్సయిన సహిత్య విమర్శ చదివి ఎన్నేళ్ళయింది?
‘ప్రతి’ వాదం ఇంత భయంకరమా?
‘ పాడవోయి భారతీయుడా ’ ( శ్రీశ్రీ సినీమా పాటలు , పద్యాలూ -మొదటి సంపుటి -శ్రీశ్రీ ప్రచురణలు -1983) సంకలనం లోని మొదటి పాట అయిన ‘ పాడవోయి భారతీయుడా ’ కింద శ్రీశ్రీ గారిచ్చిన వివరణ ఇలా ఉంది – ‘’తెలుగు వీర లేవరా – అనే పాటతో ఈ సంపుటిని మొదలు పెట్టక పోవడానికో చిన్న కారణం ఉంది . అందులో – ప్రతి మనిషి తొడలు గొట్టి —–సింహాలై గర్జించాలి అనడంలో వ్యాకరణ దోషం ఉంది (ప్రతి మనిషి ఏక వచనం , సింహాలై బహు వచనం . సింహంలా గర్జించాలి ఆంటే సరిపోతుంది . సాహిత్య రీత్యా మాత్రమే కాక సంగీత పరంగా కూడా ). వచ్చే సంపుటి —లో —సవరణ ఉంటుంది . సినీమా పాటల్లో పెద్ద పెద్ద దూడలకే ఎవరూ కేర్ చెయ్యరని నాకు తెలుసు . నేను చేస్తాను .” (ఇక్కడ పాడినవారు ఘంటసాల అని మాత్రమే ముద్రితమైంది . సుశీల గారి పేరు లేదు ).
దరిమిలా రెండవ సంపుటి ‘ తెలుగు వీర లేవరా ’ (1996) లోని తొలి పాట ‘తెలుగు వీర ’ అయ్యి ‘సింహంలా ’ అనే సవరణతోనే వెలు వడింది ( ఇక్కడ పాడిన వారు ఘంటసాల అని మాత్రమే ఉంది . రామకృష్ణ పేరు లేదు . గమ్మత్తు ఏమిటంటే -ఈ సంపుటికి ముందు మాట రాసిన వారు గాయని సుశీల గారే ) .
( ఈ రెండవ సంపుటిలో వడ్డాది వారి పాట ‘చల్లని రాజా ఓ చందమామ ’ , కొసరాజు గారి ‘దేశమ్ము మారిందోయి కాలమ్ము మారిందోయి ’, మూడవ సంపుటిలో భుజంగరాయ శర్మ గారి పాట ‘కలిమి నిలవదు లేమి మిగలదు ’ ఈ రెండూ శ్రీశ్రీ గారివిగా భ్రమించి ముద్రించడం తప్పే . ఇక్కడ ఈ తప్పులకు శ్రీశ్రీ బాధ్యులు కారు ).
విశేషమేమిటంటే – తొలి సంపుటిలోని తొలి పాట లోనూ , రెండవ సంపుటి లోని తొలి పాట లోనూ ‘ప్రతి మనిషి ’ అన్నది చోటు చేసుకోవడమే . చూడండి – పాడవోయి భారతీయుడా ’ పాటలో ‘ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే ’ అని ఉంటుంది కదా . మొదటిది స్టేజి సాంగ్ అయితే రెండవది మార్చింగ్ సాంగ్ కనుక శ్రీశ్రీ లోని చిన్నయ్య సూరి కాస్తా పర వస్తు అయ్యారు .
రామాయణంలో పిడకల వేట – ఇటీవల ఒక టీవీ ఛానెల్లో ఒక కుర్ర గాయకుడు మల్లాది వారి ‘మది శారదా దేవి మందిరమే ’ పాటను అద్భుతంగా ఆలపించినా తరువాత ట్రైనరు అనబడు ఒక వర్ధమాన గాయని ‘ఆఖరి లైన్లో గుఱుతెఱిగిన కాదు గురునెరిగిన అని పాడాలి ’ అని అన్నారు .తాను పాడింది తప్పు కాదని ఆ అబ్బాయికి తెలిసినా బిక్క మొహం వేయక తప్ప లేదు . ఈనాటి అజ్ఞ్యాన తిమిరాంధకారానికి మల్లాది వారు ఎంతగా నవ్వుకొంటున్నారో ఏమో ? నిజానికి ఆ ఆఖరి లైన్లో – వర దాయిని కానీ గుఱుతెఱిగిన మన – మది శారదా దేవి మందిరమే ’ అని ఆ అబ్బాయి పాడినట్టే ఉంది .
ఉన్న తప్పుని ఒప్పుకోవడం గొప్ప . లేని తప్పుని చొప్పించడం నేరం .
ఇలా ఈ వివరాలు ఇస్తున్నానో లేదో ఒక టీవీ ఛానల్ శ్రీశ్రీ గారి మీద డాక్యుమెంటరీ తీసి నందులు గెలుచుకుంది అని విన్నాను. కృష్ణ శాస్త్రి గారి ‘మాట’ ఒక్క రికార్డ్ గా నైనా దాచుకోలేక పోవడం మన దురదృష్టం అని శ్రీశ్రీ అన్నారు. శ్రీశ్రీ ఆ మాటకొస్తే అదృష్టవంతులే.
-డాక్టర్ తాతిరాజు వేణుగోపాల్
నా అభిమాన గాయనులు బాలసరస్వతి, ఎస్.వరలక్ష్మి, లీల గార్లు. వీరిలోని వరలక్ష్మి గారి గురించి శ్రీనివాస్ గారు వ్రాసిన వ్యాసము బహు చక్కగా ఉన్నది. క్లుప్తంగా ఉంటూనే నాకు తెలియని చాలా విషయములు తెలియునట్లు చేసినది. రోహిణీప్రసాద్ గారి అభిప్రాయము చాలా సూటిగా స్పష్టముగా ఉన్నది.
జాషువా గారు గొప్ప కవి. స్థూలంగా వారి కవిత్వాన్ని స్ప్రుశించిన ఈ వ్యాసం బాగుంది. మరింత విపులంగా మరో వ్యాసాన్ని బృందావనరావు గారి కలం నుండి వెలువడుతుందని ఆశిస్తున్నాను.
అవును రోహిణీ ప్రసాద్ గారూ! సముద్రాల సీనియర్ రాసిన పాట అది. నాకు ఆ పాట కూడా భలే ఇష్టమ్ . ఇంకా చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు చేర్చినవి తరుచూ వినిపించనివి. వినిపించే వాటిల్లో మీరు చెప్పిన “నా సరి మనోహరి” వరలక్ష్మి గారి మరో మంచి పాట.
రమ.
నీ సరి మనోహరి అనే యుగళగీతంలో చరణం ముగించడానికి వరలక్ష్మి వేసిన “సంగతి” ఆమె పాటలోని “పవర్” కు అద్దంపడుతుది. ఆ గమకాన్ని ఘంటసాల చేత పాడించకుండా ఆమెకే ఇవ్వడం యాదృచ్ఛికం కాదు.
చాలా చక్కని వ్యాసాన్ని, అంతకంటె చక్కని పాటలను అందజేసిన శ్రీనివాస్గారికి కృతజ్ఞతాంజలులు. ఎస్. వరలక్ష్మి నిజముగా సుస్వరలక్ష్మియే. ఈమె తమిళ సినిమాలలో కూడా చక్కగా పాడేవారు. వీరపాండ్య కట్టబొమ్మన్లో శివాజీ గణేశన్తో నటించి పాడారు. వీరు నాగేశ్వరరావు పెళ్లిలో ఫాడారట. బాలమురళీకృష్ణ మొదటి సినిమా పాట ఈమె చిత్రములోనే అట. ఈమె భర్త శ్రీనివాసన్గారి సహోదరుడే సుప్రసిద్ధ తమిళ కవి కణ్ణదాసన్. ఆసక్తిగల వారికి సేవాసదనములో సుబ్బులక్ష్మిగారితో ఈమె చిత్రాన్ని ఇక్కడ చూడగలరు.
తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj అభిప్రాయం:
03/03/2010 1:51 am
వ్యాకరణం కన్నా కవిహృదయానికి ప్రాముఖ్యతనివ్వడం అన్నది ఒక సరసగుణం! ! నేను శ్రీశ్రీవిషయంలో చెప్పినది అదే!! పైగా శ్రీశ్రీ తాను స్వయంగా వివరణ ఇచ్చాకా మరింక అది చర్చకి రాకూడదు. అది ఒక మర్యాద.
సాహిత్యంలో వ్యాకరణ దోషాలు ఎన్నుకుంటూ పోతే మహామహులు చాలరు. “ఎమితిని సెపితివి కపితము” అని అల్లసాని పెద్దనని రామలింగడు వెక్కిరించాడని ప్రతీతి. అందువల్ల పెద్దన కవిత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయింది.
అలాగే అన్నమాచార్యులవారి వేల సంకీర్తనలలో వ్యాకరణ దోషాలు మెండుగానే దొరుకుతాయి. కానీ ఆయన పదాల ప్రాముఖ్యతకి అవేమీ అడ్డురాలేదు. రావు.
కవితా సంపన్నత ముందు ఇలాంటివి బహుచిన్నవని..లోకంవాటిని పట్టించుకోదనీ చెప్పడం నా ఉద్దేశ్యం!
శ్రీశ్రీకున్న అపార భాషా పరిజ్నానం తెలిసిన వారు “శ్రీశ్రీ తప్పుచేసేడోచ్ ” అని చాటనఖ్ఖరలేదు అన్నది నా భావం! తప్పు అన్నది ఒప్పు చేసే ప్రయత్నం నేను చేయలేదు. ఆయన మిగతావి అన్నీ “బహువచనం”లో పదాలని రాసేడు గనక అది వ్యక్తి గురించి కాక సమిష్టి పోరాటానికి ఆయన ఆ పాటని లక్ష్యించాడు గనక
ఆ “ప్రతి మనిషి ని ” మందికి గుర్తుగా గ్రహిస్తే చాలు అన్నది నా సూచన.
నేను కవితాసౌదర్యానికి వశురాలిని. దాని ముందు ఇతర దోషాలు నాకు ఎక్కవు. ఉత్తమ కవులందరికీ ఉత్తమ భావుకులకందరికీ ఇది అనుభవంలోకి వచ్చే విషయమే!!
రమ.
హిమబిందు గురించి sureshnaik అభిప్రాయం:
03/03/2010 12:24 am
చాల బాగా వ్రాసారు.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Raghu Echempati అభిప్రాయం:
03/03/2010 12:02 am
చాల థన్యవాదములు ఈ పాట లకు.
రఘు
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి ns murty అభిప్రాయం:
03/02/2010 10:30 pm
వేంకటేశ్వర రావు గారి సమీక్ష బాగుంది. నిజానికి తెలుగు కథల రీతి ఇప్పుడలాగే అన్నిచోట్లా ఉంది. దానికి అమెరికా , ఇండియా అన్న భేదం లేదు. పూర్వం సాహిత్య సృజనచేయడానికి ముందు సాహిత్య అధ్యయనం ఉండేది. సమకాలీన సాహిత్యం పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకుని తర్వాత తమ సాహిత్య కృషి కొనసాగించే వారు. పత్రికలకు పేజీలునింపడం కావాలి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన టీవీ ఛానెళ్ళకి ఏ చెత్త కబురైనా వార్తలాగే. అలా అని సహజంగా రాయగల సమర్థులు ఉండరని కాదు. అది మనకు అందరికి తెలుసు. కోటికొక్కరు.
లక్ష్మన్నగారు చెప్పిన రెండుకారణాలూ ఆంధ్రదేశానికి కూడా డిటో. అయితే ఇక్కడ అవసరం వాసి పెరగడము గురించికాబట్టి ‘వ్యక్తిగతం’ కాకుండా, వస్తుగతం అయే విమర్శ తెలుగులో రావలసిన అవసరం ఎంతయినా ఉంది.
నిజానికి తెలుగులో రంగుటద్దాల విశ్లేషణలు తప్ప నిఖార్సయిన సహిత్య విమర్శ చదివి ఎన్నేళ్ళయింది?
తెలుగు వీర లేవరా గురించి tatiraju venugopal అభిప్రాయం:
03/02/2010 3:48 pm
‘ప్రతి’ వాదం ఇంత భయంకరమా?
‘ పాడవోయి భారతీయుడా ’ ( శ్రీశ్రీ సినీమా పాటలు , పద్యాలూ -మొదటి సంపుటి -శ్రీశ్రీ ప్రచురణలు -1983) సంకలనం లోని మొదటి పాట అయిన ‘ పాడవోయి భారతీయుడా ’ కింద శ్రీశ్రీ గారిచ్చిన వివరణ ఇలా ఉంది – ‘’తెలుగు వీర లేవరా – అనే పాటతో ఈ సంపుటిని మొదలు పెట్టక పోవడానికో చిన్న కారణం ఉంది . అందులో – ప్రతి మనిషి తొడలు గొట్టి —–సింహాలై గర్జించాలి అనడంలో వ్యాకరణ దోషం ఉంది (ప్రతి మనిషి ఏక వచనం , సింహాలై బహు వచనం . సింహంలా గర్జించాలి ఆంటే సరిపోతుంది . సాహిత్య రీత్యా మాత్రమే కాక సంగీత పరంగా కూడా ). వచ్చే సంపుటి —లో —సవరణ ఉంటుంది . సినీమా పాటల్లో పెద్ద పెద్ద దూడలకే ఎవరూ కేర్ చెయ్యరని నాకు తెలుసు . నేను చేస్తాను .” (ఇక్కడ పాడినవారు ఘంటసాల అని మాత్రమే ముద్రితమైంది . సుశీల గారి పేరు లేదు ).
దరిమిలా రెండవ సంపుటి ‘ తెలుగు వీర లేవరా ’ (1996) లోని తొలి పాట ‘తెలుగు వీర ’ అయ్యి ‘సింహంలా ’ అనే సవరణతోనే వెలు వడింది ( ఇక్కడ పాడిన వారు ఘంటసాల అని మాత్రమే ఉంది . రామకృష్ణ పేరు లేదు . గమ్మత్తు ఏమిటంటే -ఈ సంపుటికి ముందు మాట రాసిన వారు గాయని సుశీల గారే ) .
( ఈ రెండవ సంపుటిలో వడ్డాది వారి పాట ‘చల్లని రాజా ఓ చందమామ ’ , కొసరాజు గారి ‘దేశమ్ము మారిందోయి కాలమ్ము మారిందోయి ’, మూడవ సంపుటిలో భుజంగరాయ శర్మ గారి పాట ‘కలిమి నిలవదు లేమి మిగలదు ’ ఈ రెండూ శ్రీశ్రీ గారివిగా భ్రమించి ముద్రించడం తప్పే . ఇక్కడ ఈ తప్పులకు శ్రీశ్రీ బాధ్యులు కారు ).
విశేషమేమిటంటే – తొలి సంపుటిలోని తొలి పాట లోనూ , రెండవ సంపుటి లోని తొలి పాట లోనూ ‘ప్రతి మనిషి ’ అన్నది చోటు చేసుకోవడమే . చూడండి – పాడవోయి భారతీయుడా ’ పాటలో ‘ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే ’ అని ఉంటుంది కదా . మొదటిది స్టేజి సాంగ్ అయితే రెండవది మార్చింగ్ సాంగ్ కనుక శ్రీశ్రీ లోని చిన్నయ్య సూరి కాస్తా పర వస్తు అయ్యారు .
రామాయణంలో పిడకల వేట – ఇటీవల ఒక టీవీ ఛానెల్లో ఒక కుర్ర గాయకుడు మల్లాది వారి ‘మది శారదా దేవి మందిరమే ’ పాటను అద్భుతంగా ఆలపించినా తరువాత ట్రైనరు అనబడు ఒక వర్ధమాన గాయని ‘ఆఖరి లైన్లో గుఱుతెఱిగిన కాదు గురునెరిగిన అని పాడాలి ’ అని అన్నారు .తాను పాడింది తప్పు కాదని ఆ అబ్బాయికి తెలిసినా బిక్క మొహం వేయక తప్ప లేదు . ఈనాటి అజ్ఞ్యాన తిమిరాంధకారానికి మల్లాది వారు ఎంతగా నవ్వుకొంటున్నారో ఏమో ? నిజానికి ఆ ఆఖరి లైన్లో – వర దాయిని కానీ గుఱుతెఱిగిన మన – మది శారదా దేవి మందిరమే ’ అని ఆ అబ్బాయి పాడినట్టే ఉంది .
ఉన్న తప్పుని ఒప్పుకోవడం గొప్ప . లేని తప్పుని చొప్పించడం నేరం .
ఇలా ఈ వివరాలు ఇస్తున్నానో లేదో ఒక టీవీ ఛానల్ శ్రీశ్రీ గారి మీద డాక్యుమెంటరీ తీసి నందులు గెలుచుకుంది అని విన్నాను. కృష్ణ శాస్త్రి గారి ‘మాట’ ఒక్క రికార్డ్ గా నైనా దాచుకోలేక పోవడం మన దురదృష్టం అని శ్రీశ్రీ అన్నారు. శ్రీశ్రీ ఆ మాటకొస్తే అదృష్టవంతులే.
-డాక్టర్ తాతిరాజు వేణుగోపాల్
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Gopikrishna అభిప్రాయం:
03/02/2010 3:02 pm
నా అభిమాన గాయనులు బాలసరస్వతి, ఎస్.వరలక్ష్మి, లీల గార్లు. వీరిలోని వరలక్ష్మి గారి గురించి శ్రీనివాస్ గారు వ్రాసిన వ్యాసము బహు చక్కగా ఉన్నది. క్లుప్తంగా ఉంటూనే నాకు తెలియని చాలా విషయములు తెలియునట్లు చేసినది. రోహిణీప్రసాద్ గారి అభిప్రాయము చాలా సూటిగా స్పష్టముగా ఉన్నది.
కృతజ్ఞతలతో
గోపీకృష్ణ
నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి bollojubaba అభిప్రాయం:
03/02/2010 2:54 pm
జాషువా గారు గొప్ప కవి. స్థూలంగా వారి కవిత్వాన్ని స్ప్రుశించిన ఈ వ్యాసం బాగుంది. మరింత విపులంగా మరో వ్యాసాన్ని బృందావనరావు గారి కలం నుండి వెలువడుతుందని ఆశిస్తున్నాను.
బొల్లోజు బాబా
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి rama bharadwaj అభిప్రాయం:
03/02/2010 2:48 pm
అవును రోహిణీ ప్రసాద్ గారూ! సముద్రాల సీనియర్ రాసిన పాట అది. నాకు ఆ పాట కూడా భలే ఇష్టమ్ . ఇంకా చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు చేర్చినవి తరుచూ వినిపించనివి. వినిపించే వాటిల్లో మీరు చెప్పిన “నా సరి మనోహరి” వరలక్ష్మి గారి మరో మంచి పాట.
రమ.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Rohiniprasad అభిప్రాయం:
03/02/2010 1:29 pm
నీ సరి మనోహరి అనే యుగళగీతంలో చరణం ముగించడానికి వరలక్ష్మి వేసిన “సంగతి” ఆమె పాటలోని “పవర్” కు అద్దంపడుతుది. ఆ గమకాన్ని ఘంటసాల చేత పాడించకుండా ఆమెకే ఇవ్వడం యాదృచ్ఛికం కాదు.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి mOhana అభిప్రాయం:
03/02/2010 12:33 pm
చాలా చక్కని వ్యాసాన్ని, అంతకంటె చక్కని పాటలను అందజేసిన శ్రీనివాస్గారికి కృతజ్ఞతాంజలులు. ఎస్. వరలక్ష్మి నిజముగా సుస్వరలక్ష్మియే. ఈమె తమిళ సినిమాలలో కూడా చక్కగా పాడేవారు. వీరపాండ్య కట్టబొమ్మన్లో శివాజీ గణేశన్తో నటించి పాడారు. వీరు నాగేశ్వరరావు పెళ్లిలో ఫాడారట. బాలమురళీకృష్ణ మొదటి సినిమా పాట ఈమె చిత్రములోనే అట. ఈమె భర్త శ్రీనివాసన్గారి సహోదరుడే సుప్రసిద్ధ తమిళ కవి కణ్ణదాసన్. ఆసక్తిగల వారికి సేవాసదనములో సుబ్బులక్ష్మిగారితో ఈమె చిత్రాన్ని ఇక్కడ చూడగలరు.
విధేయుడు – మోహన