కవిత్వాంశ అన్నది ఏ కోశానా లేని దీన్ని ప్రచురించడం “శేషేంద్రశర్మ కి నివాళి గా” అంటూ పైగా…అది ఈమాట వాళ్ళ లోపం !! ఎన్నో కవితలు శేషేంద్ర శర్మ గారివి మంచివి ఉన్నాయి. అయినా దీన్ని ఎన్నుకోవడం చేసారూ అంటే అది సంపాదకుల అభిరుచికి మాత్రమే నిదర్శనం. కవి రాసిన ప్రతీ అక్షరాన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉందనో లేదా ఉండాలనో అనుకోవడం కవిత్వతత్వం తెలియనివారనుకోవచ్చు. కానీ బాధ్యత కల్గిన పత్రికా సంపాదకులు అలా చేయకూడదు. ఎంపిక చేసి శేషేంద్ర శర్మ రాసిన ఏ మంచి కవితనైనా ఆయనకి నివాళిగా ఇచ్చి ఉండవచ్చు. ఇలాచేయడం పోయిన ఒక కవిని ప్రస్తుతించడం కిందకి రాదు సరికదా..ఆయన ఊహాశక్తి మీదో ఆయన శబ్దశక్తి మీదో ఒక వెక్కిరింత లాంటిది గుప్పించడమే !! ఐతే, అందువలన కవిగా శేషేంద్ర శర్మ గారికి వచ్చిన నష్టమూ ఏమీ లేదు. ఆయన కవిత్వం చదివిన వారు ఆయన మంచి కవిత్వం రాసినట్టు కూడా గుర్తించగలరు.
ఇంక ఈ రాత కవిగా మరింక ఆయన స్పందనలన్నీ ఉడిగిపోయిన తరువాత రాసి ఉండొచ్చు. చెప్పడానికి ఇవాళ ఆయన లేనప్పుడు ఈ ప్రశ్న కి జవాబూ రాదు.పాపం ఆయన మాత్రం ఏంచెప్పగలడూ?? అయితే అది కవికేనా వర్తించేదీ?? పస లేకపోయినా విమర్శ పేరుతో తమ రాతల్లోనానా చెత్తని చెలామణీ చేయడం లేదూ విమర్శకులూనూ?? ఏంచేస్తాం? చదివేసి
చాదస్తం అని ఊరుకుంటాం అంతే !!
అవును ఇస్మాయిల్ తత్వశాస్తమే బోధించినట్టు ఇప్పుడు గుర్తొస్తోంది. సవరించినందుకు యదుకుల భూషణ్ కి థాంక్స్. అలాగే ఏ కవీ శబ్దాన్ని తక్కువ చేయలేడనే నేను అనేది కూడాను.
ఇకపోతే సాహిత్యం లో ఎవరి దగ్గరా “అంకెలూ..సంకెలూ” ఉండవు. కానీ ఒక శ్రీశ్రీ కవితో ఒక తిలక్ కవితో నోటికొచ్చినట్టు చప్పున ఇస్మాయిల్ కవితాపంక్తులు నోటికొచ్చిన వారు సంఖ్యలో తక్కువే ఉంటారు. ఉంటారన్నది ఒక స్పృహ. వాదనకోసం నాలుగు వాక్యాలు రాయడం వట్టి కుర్రతనం. దానికి నేను ప్రతిస్పందించను.
ఇకపోతే యదుకులభూషణ్ చెప్పిన “పద్యం మనసులో రూపుదిద్దుకోవడం” అన్నది సరైన మాట. పరికరాలు అన్నవి కాదు నిర్ణయించిన విషయాలు. ఇవాళ కంప్యూటర్ ఉంది. కాయితం ఉంది. అంతకన్నా ముందు తాటాకుంది. ఇవి కాలానుగుణంగా వచ్చిన సదుపాయాలు మాత్రమే !! పాతరోజుల్లో కూడా పుస్తకాలకి నకళ్ళు తీయిచుకోవడం అన్నది ఉంది. అందరికీ పుస్తకం అన్నది అందుబాటులో లేదు గనక ఒకరు చదవడమో పదిమంది వినడమో జరిగి ఉండొచ్చు. అచ్చుయంత్రం వచ్చాకా సైతమ్ కవిత్వాన్ని అందరూ లోపలే చదువుకున్నారని ఏమీ చెప్పలేము. విషయం అది కానే కాదు.కవితా స్పందనలో దాని పాత్ర ఏమీ గణనీయమైనదీ కాదు.
ఇంక ఇస్మాయిల్ గారి కవిత్వానికి సంబధించి వెల్చేరు చెప్పిన మిగతా థియరీ అంతా కృతకంగా ఉంది. నేను చేసిన వ్యాఖ్య దానికి సంబంధించినది. కవులు అనేక రకాలైన వ్యక్తీకరణలు చేసారు. అందులో ఇస్మాయిల్ తరహా వ్యక్తీకరణ ఒకటి. దాని లోతుపాతులేమైనా అవి నారాయణరావు చెప్పిన కారణాలకి మాత్రం కాదు అన్నది నా భావం.
అతి ఆంగ్లత్వం అన్నది ఒకటుంది ఆధునిక కాలంలో! వెనకటికి నా మిత్రుడు అంటూండేవాడు. తెలుగులో పదజాలం అమితం. అంత వొకాబులరీ అనవసరం. సగం పదాలు వదిలేయడం మంచిదీ అని.
ఇది అనువాదాలు చేసేవాళ్ళకి వచ్చే ఇబ్బందులని చర్చించినప్పుడు వచ్చిన మాట అన్నమాట. ఏతావాతా చెప్పేదేమంటే… అనువాదకులకి బాగుంటాయని కవులు “క్లుప్తం” గానూ రాయరు. విస్తరించీ రాయరు.
సాధారణంగా కవితలో భావాన్ని”లౌడ్” గా చెప్పడం అన్నది ఇంగ్లీషు యూరోప్ దేశాల వెరసి పశ్చిమ దేశాల సాహిత్యానికి ఇమిడే విషయం కాదు. వారికి “క్లుప్తంగా” ఉన్న భావం చప్పున అందుతుంది. అందువలన ఇస్మాయిల్ కవితని అనువాదాలనించి కూడా వాళ్ళు నచ్చుకుని ఉండిఉండొచ్చు.కానీ కవితని పశ్చిమ దేశాల వారు మెచ్చుకోవడం అన్నది ఆ కవి గొప్పతనానికి నిదర్శనమూ కాదు.లేదా ఆ కవి కవితకి అదొక అదనపు అర్హతా కాదు. కేవలమ్ కవిత్వలో క్లుప్తత అన్నది పాశ్చ్యాత్యుల సెన్సిబిలిటీస్ కి దగ్గరగా అన్పించడానికి అవకాశం ఉంది. అంతమాత్రమే !! ఇంగ్లీషు ప్రభావమో లేక తాను బోధించిన తత్వశాస్త్ర ప్రభావమో కూడా ఇస్మాయిల్ గారి మీద లేదనీ అనలేం !! దానికనుగుణంగా ఆయన వ్యక్తీకరణ సాగిందా అన్నది చూడొచ్చు. నారాయణరావు దాన్ని కవిలోని ఒక “గడుసుతనం” గా అభివర్ణిస్తున్నారు. అది నారాయణరావు గారి వ్యాఖ్యానమే తప్ప ఇస్మాయిల్ గారి దృక్పధం అయి ఉంటుందని అనిపించదు. ఏ కవీ “పనిగట్టుకుని “గడుసు” గా కవిత్వం రాయడనుకుంటాను.. కానీ విమర్శకుడు మాత్రం తనలోని “గడుసు” తనంతో కవిలో లేని అలాంటి కొన్ని”గడుసుతనాలని” తన సిధ్ధాంతంలోంచి చూస్తాడు. దాన్నే ఆ కవికీ ఆపాదిస్తాడు. కానీ పాఠకులకి వాటితో ఏ ప్రమేయమూ ఉండదు. ఒక కవి కొందరికి నచ్చడానికీ మరి కొందరికి అంతగా ఆస్వాదయోగ్యం కాకపోవడానికీ ఉండే కారణాలు రకరకాలు.
సాహిత్యం పాట వరసలోకి ఒదిగినప్పుడే వినడానికయినా, పాడుకోడానికయినా బావుంటుంది. అలాంటి పాటలే హత్తుకుంటాయి. పాటకి పాటా ( ట్యూనూ ), సాహిత్యానికి సాహిత్యమూ విడివిడిగా బాగానే ఉన్నా, రెంటినీ తాళంతో బంధించేసరికి విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లా అనిపించాయి. బహుశా ఒక వెస్ట్రన్ ట్యూన్కి తెలుగు సాహిత్యం అతికించడం వల్ల వచ్చిన ఇబ్బందేమో? సాహిత్యంలో కూడా పాటకి వుండాల్సిన సరళత లోపించింది. ఈ క్రింది వాక్యం చూడండి.
“కల్లరి మబ్బుల కావిరుల ఏ కలలో కల్లలో “, పాడేటప్పుడు చివరి పదాలు
రెండూ(కలా, కల్లా ) ఒకేలా వినిపించే ప్రమాదం ఉండీ, భావం చెడిపోతుంది.
లోపలి లోతులు నాకు తెలీవు. పైకి కనిపించేది మాత్రం ఇదే!
ఈ అభిప్రాయంలో ఆధారం లేని వ్యాఖ్యలు అనేకం. మచ్చుకి రెండు :
౧. ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది.
ఆయన జీవితకాలం బోధించింది తత్వ శాస్త్రం. ఆయన సన్నిహితులకు , ఆయన కవిత్వం సీరియస్ గా చదివిన అందరికీ ఇది తెలిసిన విషయమే.
మరిన్ని వివరాలకు ఇంద్రగంటి గారి అమ్మాయి ఇస్మాయిల్ గారు బ్రతికుండగానే చిత్రీకరించిన ఆయన ఆత్మకథ DVD చూడండి. లేదా ” కవిత్వంలో నిశ్శబ్దం” వ్యాస సంపుటిలో రమణారెడ్డి గారికి ఇచ్చిన బదులు చూడండి.
౨. ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఎవడా పాఠకుడు? ఏమా కథ ?? సదరు పాఠకునికి ఇతర కవులు ఆమోద యోగ్యమన్న విషయం మీకెలా తెలిసింది ?? మీకేమైనా కర్ణ పిశాచి ఉందా ?? పై అభిప్రాయం మీ అభిప్రాయం లాగే ఉంది. తప్పు లేదు.పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
ఇక అసలు వ్యాసం విషయానికొస్తే -పొసగని విషయాలు అనేకం , మచ్చుకు రెండు :
౧.ప్రసార మాధ్యమాల పాత్రను అతిగా అంచనా వేశారు.
౨. శబ్దార్థాలను అర్థం చేసుకున్న తీరులో గందరగోళం ఉంది.,
” పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్ ఒక్కడే.”
ప్రాచీన కాలం నుండి నానా విధాల మాధ్యమాలు వచ్చాయి: వెదురు బద్ద, గట్టి ఎముక,మట్టి పలక, పట్టు వస్త్రం ,తాటాకు..నానా రకాల కాగితాలు ,ఇప్పుడు ఈ రీడర్లు. మాధ్యమాలు కవికి ఎటువంటి
అవకాశాన్ని ఇవ్వవు.అవి కేవలం మాధ్యమాలే.పద్యం రూపు దిద్దుకోనేది కవి మనసులో.ఆ తర్వాత, ఏదో ఒక మాధ్యమం ద్వారా అది పాఠకుని మనసు చేరుతుంది. అంతవరకే దాని పాత్ర.పద్యం చేరవలసిన చోటు చేరిన తర్వాత మాధ్యమంతో ఇక పని లేదు. అది , పాఠకుని మనసులో స్వతంత్రంగా మనగలదు అన్నది మనకు అనుభవంలోని విషయం. ఆసక్తి ఉండాలే గాని, ఎన్నో పద్యాలు గుర్తుంటాయి.
కాబట్టి శబ్దం అప్రధాన మయ్యే ప్రసక్తే లేదు. అచ్చు యంత్రం రాక ముందు కూడా లేఖకులు ఉండే వారు , కావలసినన్ని ప్రతులు తయారయ్యేవి , చలామణీ లోకి వచ్చేవి. చైనా లోని సమాధులు తవ్విన ప్రతి సారి సదరు వ్యక్తికీ ఇష్టమైన పుస్తకాలూ పట్టు వస్త్రం పై రాసినవి దొరుకుతూనే ఉన్నాయి. ( క్రీ.పూ రెండవ శతాబ్దం నాటి ప్రతులు లభ్యం ) ఇంకా ముందుకు వెళితే వెదురు ( క్రీ.పూ నాల్గవ శతాబ్దం )కూడా వాడారు.( వాటి పరిష్కృత ప్రతులు నా దగ్గరున్నాయి.)
” తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్ అపూర్వంగా సాధించారు “
ఇస్మాయిల్ శబ్దానికి పట్టం కట్ట లేదు అంటే నిలువునా నిశ్శబ్దంలోకి దూకారని కాదు.మాటలు ఎక్కడ ఆపాలో గ్రహించారు. అక్కడి నుండి మౌనం ప్రవేశిస్తుంది.( అది తూర్పు దేశాల కవులు వేల ఏళ్లుగా
చేస్తున్నదే.). శబ్దాన్ని అనుసరించే ఉంటుంది అర్థం. కాబట్టే, ఇమేజ్ ని పదచిత్రం అన్నారు కాని అర్థ చిత్రం అనలేదు.
వెల్చేరు గారు ఈ వ్యాసంలో కవిత్వమ్లో ఉండే “నిశ్శబ్దాన్ని” నిర్వచించడంలో వెనకబడ్డారో.. లేక ఆయనకే ఆ విషయం లో సరైన స్పష్టత లేదో నాకు బోధపడలేదు గానీ మొత్తంగా ఇస్మాయిల్ ని కవిగా చూపించడంలో వెల్చేరు ఎక్కడో తోవమరిచినట్టున్నారు.
“క్లుప్తత” అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది. కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా!! జపనీయుల “హైకూ” లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే!! అది ఒక తరహా కవిత్వం!
మాటలని మించిన మౌనానికి భాష లేదని నేనను గానీ అది “క్లుప్తత” అయితే కాదు. అదొక తాత్వికత. దాన్ని ఇస్మాయిల్ కవితలో ఎలా చూసారో మరింత వివరంగా వెల్చేరు చెప్పగలిగితే బాగుండేదేమో? అలాంటి కవి ఇస్మాయిల్ అవునో కాడో స్పష్టపడేది కూడాను.
ఇకపోతే కవిత్వంలో ” మాటల” ప్రయోజనం లేదని అనడానికి కూడా కుదరదు. విస్తరించ వలసిన చోట భావంలో “క్లుప్తత” అంతే చికాగ్గా ఉంటుంది.ఈ తారతమ్యం చూపించడంలో విమర్శకుడు విఫలమ్ కావడమ్ తరుచూ జరిగింది. ఇందుకు విమర్శకులు విమర్శకన్నా మించి కవులకి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వడం ఒక కారణమ్ బహుశా!! వీళ్ళ మెచ్చుకోళ్ళలోనూ లేదా వీళ్ల దాటివేతలోనూ కూడా ఏ అంతస్సూత్రమూ కనిపించకపోవడం అన్నది విమర్శలోని పెద్ద లోపం !!
నారాయణరావు గారి అభిప్రాయాన్ని అనుసరించామా ” శ్రీశ్రీ” కవి కాడు. “తిలక్” కవి కాడు. అజంతా అసలే కాడు. అలాగే మరి కొందరు మిగతా కవులు కూడాను. శ్రీశ్రీ ” ఆహ:” తప్ప కవితా ఓ కవితా అన్నది కవితే కాకూడదు. అది శబ్ధమయమూ.. మాటల మయమూను. భాషని అతి చిక్కగా తన ఊహాచిత్రాలకి అతికించిన తిలక్ కవిత్వం ఈ లెఖ్ఖన వట్టి మాటల పోగులాగా మారిపోయే పరిస్థితి ఉంది మరి. ఒక కవిది ఒక తరహా కవిత్వం అని చెప్పడమ్ వేరు. అదులోని విశిష్టతని వివరించడమ్ వేరు. మాట ద్వారా ..ధ్వని ద్వారా అందవలసిన ఊహ దగ్గర కవిత్వంలో క్లుప్తతకీ నిశ్శబ్దానికీ పెద్దపీట వేయడమ్ వేరు.అది అన్ని చోట్లా నిజమ్ కాదు గనక. క్లుప్తతని ముందుకు తీసుకుని రావడం కోసం శబ్దశక్తిని తక్కువ చేయనఖ్ఖర లేదు. అయితే తన విమర్శనా శైలిలో ఇలాంటి దూకుడు విమర్శకునిగా వెల్చేరు చూపించడం కొత్త విషయమేమీ కాదు.
ఒక్కోసారి సాదా సీదా వచనంలో “మాటల్లో” సైతం మనసుని మేల్కొలిపే ఒక చిత్రిక పట్టిన భావం మృదువుగా తాకకపోదు. మాట అవసరమ్ ఎంత అని తెలిసి వాడగలగడమే కవితా నాణ్యతకి గుర్తు. అంతే గానీ పికాసా గీతల్లోలాగా మూడే మూడు మాటల్లో చిత్రం గీయడం కవికి అవసరం లేదు. కవి చిత్రకారుడి పాత్రలోకి వెళితే చిత్రకారుడు మాటల్లోంచి చెప్పినట్టు పాఠకునికి చెప్పాలీ అంటే ఎక్కువ రంగులు వాడాలి కాబోలు. అప్పుడక్కడ అదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది కాదా??.
మాటకీ మాటకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం కవికి సహజంగా తెలుస్తుంది. అప్పుడే మంచి కవిత పుడుతుంది. సరైన మాటలు వాడటమే కవిత్వం!! అందువలన క్లుప్తతా.. నిశ్శబ్దమ్ కవితాస్వాదనకి చాలాసార్లు ప్రతిబంధకాలే అవుతాయి!!
ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది. తన భావ వ్యక్తీకరణకి ఆయన తెలుగు భాషని ఎన్నుకోవడమ్ అన్నది ఆయనకి మరి ఎందుకని అవసరం అయ్యిందో??
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి rama bharadwaj అభిప్రాయం:
12/03/2010 2:58 pm
కవిత్వాంశ అన్నది ఏ కోశానా లేని దీన్ని ప్రచురించడం “శేషేంద్రశర్మ కి నివాళి గా” అంటూ పైగా…అది ఈమాట వాళ్ళ లోపం !! ఎన్నో కవితలు శేషేంద్ర శర్మ గారివి మంచివి ఉన్నాయి. అయినా దీన్ని ఎన్నుకోవడం చేసారూ అంటే అది సంపాదకుల అభిరుచికి మాత్రమే నిదర్శనం. కవి రాసిన ప్రతీ అక్షరాన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉందనో లేదా ఉండాలనో అనుకోవడం కవిత్వతత్వం తెలియనివారనుకోవచ్చు. కానీ బాధ్యత కల్గిన పత్రికా సంపాదకులు అలా చేయకూడదు. ఎంపిక చేసి శేషేంద్ర శర్మ రాసిన ఏ మంచి కవితనైనా ఆయనకి నివాళిగా ఇచ్చి ఉండవచ్చు. ఇలాచేయడం పోయిన ఒక కవిని ప్రస్తుతించడం కిందకి రాదు సరికదా..ఆయన ఊహాశక్తి మీదో ఆయన శబ్దశక్తి మీదో ఒక వెక్కిరింత లాంటిది గుప్పించడమే !! ఐతే, అందువలన కవిగా శేషేంద్ర శర్మ గారికి వచ్చిన నష్టమూ ఏమీ లేదు. ఆయన కవిత్వం చదివిన వారు ఆయన మంచి కవిత్వం రాసినట్టు కూడా గుర్తించగలరు.
ఇంక ఈ రాత కవిగా మరింక ఆయన స్పందనలన్నీ ఉడిగిపోయిన తరువాత రాసి ఉండొచ్చు. చెప్పడానికి ఇవాళ ఆయన లేనప్పుడు ఈ ప్రశ్న కి జవాబూ రాదు.పాపం ఆయన మాత్రం ఏంచెప్పగలడూ?? అయితే అది కవికేనా వర్తించేదీ?? పస లేకపోయినా విమర్శ పేరుతో తమ రాతల్లోనానా చెత్తని చెలామణీ చేయడం లేదూ విమర్శకులూనూ?? ఏంచేస్తాం? చదివేసి
చాదస్తం అని ఊరుకుంటాం అంతే !!
రమ.
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి వంశీ అభిప్రాయం:
12/03/2010 11:10 am
చాలా దుర్భరంగా ఉంది కవిత. ఆయనే రాసాడా అనేది నా అనుమానం..
అఫ్సర్ “వలస”, కల్పనా రెంటాల “కనిపించే పదం” గురించి Sowmya అభిప్రాయం:
12/03/2010 4:53 am
ఇంతకీ ఇది రాసిందెవరండీ? పేరే కనబడ్డం లేదూ?
[భూషణ్ గారు. తప్పు సవరించాం. మీకు కృతజ్ఞతలు – సం.]
జీనో పేరడాక్సు గురించి madhurasree అభిప్రాయం:
12/03/2010 1:43 am
కవిత చాలా బాగుంది
ఒకే ఒక్క ఇస్మాయిల్ గురించి rama bharadwaj అభిప్రాయం:
12/03/2010 1:32 am
అవును ఇస్మాయిల్ తత్వశాస్తమే బోధించినట్టు ఇప్పుడు గుర్తొస్తోంది. సవరించినందుకు యదుకుల భూషణ్ కి థాంక్స్. అలాగే ఏ కవీ శబ్దాన్ని తక్కువ చేయలేడనే నేను అనేది కూడాను.
ఇకపోతే సాహిత్యం లో ఎవరి దగ్గరా “అంకెలూ..సంకెలూ” ఉండవు. కానీ ఒక శ్రీశ్రీ కవితో ఒక తిలక్ కవితో నోటికొచ్చినట్టు చప్పున ఇస్మాయిల్ కవితాపంక్తులు నోటికొచ్చిన వారు సంఖ్యలో తక్కువే ఉంటారు. ఉంటారన్నది ఒక స్పృహ. వాదనకోసం నాలుగు వాక్యాలు రాయడం వట్టి కుర్రతనం. దానికి నేను ప్రతిస్పందించను.
ఇకపోతే యదుకులభూషణ్ చెప్పిన “పద్యం మనసులో రూపుదిద్దుకోవడం” అన్నది సరైన మాట. పరికరాలు అన్నవి కాదు నిర్ణయించిన విషయాలు. ఇవాళ కంప్యూటర్ ఉంది. కాయితం ఉంది. అంతకన్నా ముందు తాటాకుంది. ఇవి కాలానుగుణంగా వచ్చిన సదుపాయాలు మాత్రమే !! పాతరోజుల్లో కూడా పుస్తకాలకి నకళ్ళు తీయిచుకోవడం అన్నది ఉంది. అందరికీ పుస్తకం అన్నది అందుబాటులో లేదు గనక ఒకరు చదవడమో పదిమంది వినడమో జరిగి ఉండొచ్చు. అచ్చుయంత్రం వచ్చాకా సైతమ్ కవిత్వాన్ని అందరూ లోపలే చదువుకున్నారని ఏమీ చెప్పలేము. విషయం అది కానే కాదు.కవితా స్పందనలో దాని పాత్ర ఏమీ గణనీయమైనదీ కాదు.
ఇంక ఇస్మాయిల్ గారి కవిత్వానికి సంబధించి వెల్చేరు చెప్పిన మిగతా థియరీ అంతా కృతకంగా ఉంది. నేను చేసిన వ్యాఖ్య దానికి సంబంధించినది. కవులు అనేక రకాలైన వ్యక్తీకరణలు చేసారు. అందులో ఇస్మాయిల్ తరహా వ్యక్తీకరణ ఒకటి. దాని లోతుపాతులేమైనా అవి నారాయణరావు చెప్పిన కారణాలకి మాత్రం కాదు అన్నది నా భావం.
అతి ఆంగ్లత్వం అన్నది ఒకటుంది ఆధునిక కాలంలో! వెనకటికి నా మిత్రుడు అంటూండేవాడు. తెలుగులో పదజాలం అమితం. అంత వొకాబులరీ అనవసరం. సగం పదాలు వదిలేయడం మంచిదీ అని.
ఇది అనువాదాలు చేసేవాళ్ళకి వచ్చే ఇబ్బందులని చర్చించినప్పుడు వచ్చిన మాట అన్నమాట. ఏతావాతా చెప్పేదేమంటే… అనువాదకులకి బాగుంటాయని కవులు “క్లుప్తం” గానూ రాయరు. విస్తరించీ రాయరు.
సాధారణంగా కవితలో భావాన్ని”లౌడ్” గా చెప్పడం అన్నది ఇంగ్లీషు యూరోప్ దేశాల వెరసి పశ్చిమ దేశాల సాహిత్యానికి ఇమిడే విషయం కాదు. వారికి “క్లుప్తంగా” ఉన్న భావం చప్పున అందుతుంది. అందువలన ఇస్మాయిల్ కవితని అనువాదాలనించి కూడా వాళ్ళు నచ్చుకుని ఉండిఉండొచ్చు.కానీ కవితని పశ్చిమ దేశాల వారు మెచ్చుకోవడం అన్నది ఆ కవి గొప్పతనానికి నిదర్శనమూ కాదు.లేదా ఆ కవి కవితకి అదొక అదనపు అర్హతా కాదు. కేవలమ్ కవిత్వలో క్లుప్తత అన్నది పాశ్చ్యాత్యుల సెన్సిబిలిటీస్ కి దగ్గరగా అన్పించడానికి అవకాశం ఉంది. అంతమాత్రమే !! ఇంగ్లీషు ప్రభావమో లేక తాను బోధించిన తత్వశాస్త్ర ప్రభావమో కూడా ఇస్మాయిల్ గారి మీద లేదనీ అనలేం !! దానికనుగుణంగా ఆయన వ్యక్తీకరణ సాగిందా అన్నది చూడొచ్చు. నారాయణరావు దాన్ని కవిలోని ఒక “గడుసుతనం” గా అభివర్ణిస్తున్నారు. అది నారాయణరావు గారి వ్యాఖ్యానమే తప్ప ఇస్మాయిల్ గారి దృక్పధం అయి ఉంటుందని అనిపించదు. ఏ కవీ “పనిగట్టుకుని “గడుసు” గా కవిత్వం రాయడనుకుంటాను.. కానీ విమర్శకుడు మాత్రం తనలోని “గడుసు” తనంతో కవిలో లేని అలాంటి కొన్ని”గడుసుతనాలని” తన సిధ్ధాంతంలోంచి చూస్తాడు. దాన్నే ఆ కవికీ ఆపాదిస్తాడు. కానీ పాఠకులకి వాటితో ఏ ప్రమేయమూ ఉండదు. ఒక కవి కొందరికి నచ్చడానికీ మరి కొందరికి అంతగా ఆస్వాదయోగ్యం కాకపోవడానికీ ఉండే కారణాలు రకరకాలు.
రమ
ఏ నడలో ఏ ఎడలో! గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
12/01/2010 9:25 pm
సాహిత్యం పాట వరసలోకి ఒదిగినప్పుడే వినడానికయినా, పాడుకోడానికయినా బావుంటుంది. అలాంటి పాటలే హత్తుకుంటాయి. పాటకి పాటా ( ట్యూనూ ), సాహిత్యానికి సాహిత్యమూ విడివిడిగా బాగానే ఉన్నా, రెంటినీ తాళంతో బంధించేసరికి విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లా అనిపించాయి. బహుశా ఒక వెస్ట్రన్ ట్యూన్కి తెలుగు సాహిత్యం అతికించడం వల్ల వచ్చిన ఇబ్బందేమో? సాహిత్యంలో కూడా పాటకి వుండాల్సిన సరళత లోపించింది. ఈ క్రింది వాక్యం చూడండి.
“కల్లరి మబ్బుల కావిరుల ఏ కలలో కల్లలో “, పాడేటప్పుడు చివరి పదాలు
రెండూ(కలా, కల్లా ) ఒకేలా వినిపించే ప్రమాదం ఉండీ, భావం చెడిపోతుంది.
లోపలి లోతులు నాకు తెలీవు. పైకి కనిపించేది మాత్రం ఇదే!
ఒకే ఒక్క ఇస్మాయిల్ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
12/01/2010 4:49 pm
ఈ అభిప్రాయంలో ఆధారం లేని వ్యాఖ్యలు అనేకం. మచ్చుకి రెండు :
౧. ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది.
ఆయన జీవితకాలం బోధించింది తత్వ శాస్త్రం. ఆయన సన్నిహితులకు , ఆయన కవిత్వం సీరియస్ గా చదివిన అందరికీ ఇది తెలిసిన విషయమే.
మరిన్ని వివరాలకు ఇంద్రగంటి గారి అమ్మాయి ఇస్మాయిల్ గారు బ్రతికుండగానే చిత్రీకరించిన ఆయన ఆత్మకథ DVD చూడండి. లేదా ” కవిత్వంలో నిశ్శబ్దం” వ్యాస సంపుటిలో రమణారెడ్డి గారికి ఇచ్చిన బదులు చూడండి.
౨. ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఎవడా పాఠకుడు? ఏమా కథ ?? సదరు పాఠకునికి ఇతర కవులు ఆమోద యోగ్యమన్న విషయం మీకెలా తెలిసింది ?? మీకేమైనా కర్ణ పిశాచి ఉందా ?? పై అభిప్రాయం మీ అభిప్రాయం లాగే ఉంది. తప్పు లేదు.పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
ఇక అసలు వ్యాసం విషయానికొస్తే -పొసగని విషయాలు అనేకం , మచ్చుకు రెండు :
౧.ప్రసార మాధ్యమాల పాత్రను అతిగా అంచనా వేశారు.
౨. శబ్దార్థాలను అర్థం చేసుకున్న తీరులో గందరగోళం ఉంది.,
” పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్ ఒక్కడే.”
ప్రాచీన కాలం నుండి నానా విధాల మాధ్యమాలు వచ్చాయి: వెదురు బద్ద, గట్టి ఎముక,మట్టి పలక, పట్టు వస్త్రం ,తాటాకు..నానా రకాల కాగితాలు ,ఇప్పుడు ఈ రీడర్లు. మాధ్యమాలు కవికి ఎటువంటి
అవకాశాన్ని ఇవ్వవు.అవి కేవలం మాధ్యమాలే.పద్యం రూపు దిద్దుకోనేది కవి మనసులో.ఆ తర్వాత, ఏదో ఒక మాధ్యమం ద్వారా అది పాఠకుని మనసు చేరుతుంది. అంతవరకే దాని పాత్ర.పద్యం చేరవలసిన చోటు చేరిన తర్వాత మాధ్యమంతో ఇక పని లేదు. అది , పాఠకుని మనసులో స్వతంత్రంగా మనగలదు అన్నది మనకు అనుభవంలోని విషయం. ఆసక్తి ఉండాలే గాని, ఎన్నో పద్యాలు గుర్తుంటాయి.
కాబట్టి శబ్దం అప్రధాన మయ్యే ప్రసక్తే లేదు. అచ్చు యంత్రం రాక ముందు కూడా లేఖకులు ఉండే వారు , కావలసినన్ని ప్రతులు తయారయ్యేవి , చలామణీ లోకి వచ్చేవి. చైనా లోని సమాధులు తవ్విన ప్రతి సారి సదరు వ్యక్తికీ ఇష్టమైన పుస్తకాలూ పట్టు వస్త్రం పై రాసినవి దొరుకుతూనే ఉన్నాయి. ( క్రీ.పూ రెండవ శతాబ్దం నాటి ప్రతులు లభ్యం ) ఇంకా ముందుకు వెళితే వెదురు ( క్రీ.పూ నాల్గవ శతాబ్దం )కూడా వాడారు.( వాటి పరిష్కృత ప్రతులు నా దగ్గరున్నాయి.)
” తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్ అపూర్వంగా సాధించారు “
ఇస్మాయిల్ శబ్దానికి పట్టం కట్ట లేదు అంటే నిలువునా నిశ్శబ్దంలోకి దూకారని కాదు.మాటలు ఎక్కడ ఆపాలో గ్రహించారు. అక్కడి నుండి మౌనం ప్రవేశిస్తుంది.( అది తూర్పు దేశాల కవులు వేల ఏళ్లుగా
చేస్తున్నదే.). శబ్దాన్ని అనుసరించే ఉంటుంది అర్థం. కాబట్టే, ఇమేజ్ ని పదచిత్రం అన్నారు కాని అర్థ చిత్రం అనలేదు.
తమ్మినేని యదుకుల భూషణ్.
విద్యాసుందరి గురించి G VENKAT అభిప్రాయం:
12/01/2010 2:20 am
ఛాల భాగుంది. థాంక్స్
ఒకే ఒక్క ఇస్మాయిల్ గురించి rama bharadwaj అభిప్రాయం:
12/01/2010 1:08 am
వెల్చేరు గారు ఈ వ్యాసంలో కవిత్వమ్లో ఉండే “నిశ్శబ్దాన్ని” నిర్వచించడంలో వెనకబడ్డారో.. లేక ఆయనకే ఆ విషయం లో సరైన స్పష్టత లేదో నాకు బోధపడలేదు గానీ మొత్తంగా ఇస్మాయిల్ ని కవిగా చూపించడంలో వెల్చేరు ఎక్కడో తోవమరిచినట్టున్నారు.
“క్లుప్తత” అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది. కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా!! జపనీయుల “హైకూ” లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే!! అది ఒక తరహా కవిత్వం!
మాటలని మించిన మౌనానికి భాష లేదని నేనను గానీ అది “క్లుప్తత” అయితే కాదు. అదొక తాత్వికత. దాన్ని ఇస్మాయిల్ కవితలో ఎలా చూసారో మరింత వివరంగా వెల్చేరు చెప్పగలిగితే బాగుండేదేమో? అలాంటి కవి ఇస్మాయిల్ అవునో కాడో స్పష్టపడేది కూడాను.
ఇకపోతే కవిత్వంలో ” మాటల” ప్రయోజనం లేదని అనడానికి కూడా కుదరదు. విస్తరించ వలసిన చోట భావంలో “క్లుప్తత” అంతే చికాగ్గా ఉంటుంది.ఈ తారతమ్యం చూపించడంలో విమర్శకుడు విఫలమ్ కావడమ్ తరుచూ జరిగింది. ఇందుకు విమర్శకులు విమర్శకన్నా మించి కవులకి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వడం ఒక కారణమ్ బహుశా!! వీళ్ళ మెచ్చుకోళ్ళలోనూ లేదా వీళ్ల దాటివేతలోనూ కూడా ఏ అంతస్సూత్రమూ కనిపించకపోవడం అన్నది విమర్శలోని పెద్ద లోపం !!
నారాయణరావు గారి అభిప్రాయాన్ని అనుసరించామా ” శ్రీశ్రీ” కవి కాడు. “తిలక్” కవి కాడు. అజంతా అసలే కాడు. అలాగే మరి కొందరు మిగతా కవులు కూడాను. శ్రీశ్రీ ” ఆహ:” తప్ప కవితా ఓ కవితా అన్నది కవితే కాకూడదు. అది శబ్ధమయమూ.. మాటల మయమూను. భాషని అతి చిక్కగా తన ఊహాచిత్రాలకి అతికించిన తిలక్ కవిత్వం ఈ లెఖ్ఖన వట్టి మాటల పోగులాగా మారిపోయే పరిస్థితి ఉంది మరి. ఒక కవిది ఒక తరహా కవిత్వం అని చెప్పడమ్ వేరు. అదులోని విశిష్టతని వివరించడమ్ వేరు. మాట ద్వారా ..ధ్వని ద్వారా అందవలసిన ఊహ దగ్గర కవిత్వంలో క్లుప్తతకీ నిశ్శబ్దానికీ పెద్దపీట వేయడమ్ వేరు.అది అన్ని చోట్లా నిజమ్ కాదు గనక. క్లుప్తతని ముందుకు తీసుకుని రావడం కోసం శబ్దశక్తిని తక్కువ చేయనఖ్ఖర లేదు. అయితే తన విమర్శనా శైలిలో ఇలాంటి దూకుడు విమర్శకునిగా వెల్చేరు చూపించడం కొత్త విషయమేమీ కాదు.
ఒక్కోసారి సాదా సీదా వచనంలో “మాటల్లో” సైతం మనసుని మేల్కొలిపే ఒక చిత్రిక పట్టిన భావం మృదువుగా తాకకపోదు. మాట అవసరమ్ ఎంత అని తెలిసి వాడగలగడమే కవితా నాణ్యతకి గుర్తు. అంతే గానీ పికాసా గీతల్లోలాగా మూడే మూడు మాటల్లో చిత్రం గీయడం కవికి అవసరం లేదు. కవి చిత్రకారుడి పాత్రలోకి వెళితే చిత్రకారుడు మాటల్లోంచి చెప్పినట్టు పాఠకునికి చెప్పాలీ అంటే ఎక్కువ రంగులు వాడాలి కాబోలు. అప్పుడక్కడ అదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది కాదా??.
మాటకీ మాటకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం కవికి సహజంగా తెలుస్తుంది. అప్పుడే మంచి కవిత పుడుతుంది. సరైన మాటలు వాడటమే కవిత్వం!! అందువలన క్లుప్తతా.. నిశ్శబ్దమ్ కవితాస్వాదనకి చాలాసార్లు ప్రతిబంధకాలే అవుతాయి!!
ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది. తన భావ వ్యక్తీకరణకి ఆయన తెలుగు భాషని ఎన్నుకోవడమ్ అన్నది ఆయనకి మరి ఎందుకని అవసరం అయ్యిందో??
రమ.
దుప్పట్లో ముడుక్కున్నా గురించి madhurasree అభిప్రాయం:
11/30/2010 6:53 am
తీసుకున్న వస్తువును శిల్ప పరంగా చెప్పడం సాహిత్య లక్షణం లక్షణం కోల్పొయింది