నరేష్ నున్నా


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
సీనియర్ ఎడిటర్, ప్రాంప్ట్ ఇంజనీర్
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

నరేష్ నున్నా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రింట్, డిజిటల్ మీడియా రెండింటిలోనూ మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ద్విభాషా పాత్రికేయులు. నరేష్ సృజనాత్మక రచనలోని వివిధ ప్రక్రియలలో పది పుస్తకాలను రచించారు. కథనాలను తీర్చిదిద్దడానికి, జర్నలిజం భవిష్యత్తుకు మార్గదర్శకత్వం వహించడానికి, తన పనిలో సాంప్రదాయ కథనానికి, అత్యాధునిక సాంకేతికతకు మధ్య సమన్వయం సాధిస్తున్నారు. AI నైపుణ్యంతో వార్తల పరిణామాన్ని రూపొందిస్తూ, ఆకట్టుకునే కథలను అల్లడంలో నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక చేతిలో కలం, మరో చేతిలో AIతో తాను కేవలం వార్తలను రిపోర్ట్ చేయడం లేదని, అల్గారిథమ్‌ల కచ్చితత్వంతో వాటికి కొత్త నిర్వచనం ఇస్తున్నానని నరేష్ నమ్ముతారు.


 

బైరాగి కవిత్వోపాసకుల్లో బహుశా anthropophagic సహదేవుని అంశ ఉంటుందేమో అనిపిస్తుంటుంది. మరొక పోలిక చెప్పాలంటే, Ray Bradbury నవల ‘Fahrenheit 451’ లో ‘బుక్ పీపుల్’ ఉంటారు, తమని తాము పుస్తకాలుగా మార్చేసుకునే ఒక రహస్య కూటమి.

ఈ ముక్కుపుల్లలు అన్నీ అధివాస్తవ చిత్రాలే. సర్రియలిస్ట్ కవిత్వమంటే – పాశ్చాత్య దేశాలలో మొదలెట్టిన సర్రియలిజం కాదు. అంతకు వందల వేల సంవత్సరాల క్రితం భారతీయత కళారూపాల్లో అంతర్భాగమైపోయిన సర్రియలిజం.

ఇంద్ర ప్రసాద్ కవితాసంపుటి నుంచి అతనంటాడు కదా అనే కవితలో ‘ఇంకా వసనాలంపటాలెందుకు’ అని చదవగానే ఝల్లుమన్నాయి నా తలపులు. అది చిన్నాచితకా మాట కాదు. దుస్తుల కాపట్యాన్ని నిరసిస్తూ, భౌతిక సౌఖ్యానికి, మానసిక వికాసానికీ నగ్నత్వాన్ని కోరుకోవడం, తద్వారా ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి సంబంధించిన నిన్న మొన్నటి భావాన్ని అధిగమించిన మాట.