తిలక్ రాసిన ‘గోరువంకలు’ ఛందోబధ్ధ కవిత్వ సంకలనం నుండి కొన్ని పద్యాలు ఈమాట పాఠకులకోసం…
దేవరకొండ బాలగంగాధర తిలక్
జీవిత విశేషాలు
కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966). భావుకత, అభ్యుదయం వీరి కవిత్వంలో ముఖ్యలక్షణాలు. 1940ల్లో తిలక్ భావకవుల ప్రభావంతో ఛందస్సులోని పద్యాల్లో ఖండకావ్యాలు రాశాడు. గోరువంకలు, స్వయంవరం, ఆవాహన, వర్షా, మధువిరహం, శర్వరీప్రియ, ఆటవెలది, శ్రీ వివేకానందస్వామి, సీత-1, సీత-2, అద్వైతమాన్మధం, అమృతభావము వంటి ఖండకావ్యాలు రచించారు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
దేవరకొండ బాలగంగాధర తిలక్ రచనలు
అహల్య శాపగాథను తనదైన శైలిలో ఒక రమ్యనాటికగా ఆవిష్కరించిన తిలక్ రచన సుప్తశిల నాటకం ఆడియో.
తిలక్ తన కవిత వెన్నెలను తన గొంతులోనే వినిపించిన ఈ అపురూపమైన ఆడియో 1965లో ఆలిండియా రేడియో వారిచే రికార్డు చేయబడింది.