జయంతన్
జీవిత విశేషాలు
ప్రఖ్యాత తమిళ రచయిత జయంతన్ మూడు నవలలు, ఎన్నో కథలు, నాటకాలు రచించి తమిళ సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారు. మధ్య తరగతి వర్గానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన మనిషిగా సగటు మనుషుల ప్రవర్తనను విశ్లేషిస్తూ ఆయన రాసిన కథలు ఇప్పటికీ పాఠకులను అలరిస్తున్నాయి. అన్యాయాన్ని ఎదిరించలేని సగటు మనిషి పిరికి తనం, అట్టడుగు తరగతి మనుషుల ప్రవర్తన జయంతన్ గారి కథలలో ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. జయంతన్ గారి బోడి అన్న అనువాద కథ కౌముదిలో ఏప్రిల్ 2009లో వచ్చింది. ‘వానం ఉనదు’ అన్న నాటకానికి ఆల్ ఇండియా రేడియోలో మొదటి బహుమతి లభించింది.