అబ్దుల్ రషీద్


సొంత ఊరు:
కూర్గ్, కర్ణాటక
ప్రస్తుత నివాసం:
మైసూరు
వృత్తి:
ప్రోగ్రామ్ డైరక్టర్, ఆకాశవాణి, మైసూరు కేంద్రం
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

అబ్దుల్ రషీద్ ఇప్పటి వరకూ కన్నడంలో నాలుగు కథాసంపుటాలు, ఒక నవల, రెండు కవితా సంపుటాలు, నాలుగు వ్యాస సంపుటాలు ప్రచురించారు. కెండసంపిగె (kendasampige.com) అనే అంతర్జాల పత్రికకు గౌరవ సంపాదకులు. కేంద్ర సాహిత్య అకాడమీ సువర్ణ మహోత్సవ అవార్డు, కర్ణాటక సాహిత్య అకాడమీ సాహిత్యశ్రీ అవార్డు అందుకున్నారు. రషీద్ ఊరు కొడగు (కూర్గ్). ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వాహకులుగా పనిజేస్తూ మంగళూరు, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, గుల్బర్గ, మడికేరి, లక్షద్వీప సమూహాల్లోని కవరత్తి ద్వీపాల్లో ఉండి వచ్చి, ప్రస్తుతం మైసూరులో ఉంటున్నారు. “కథలు చెప్పడం, రాయడం, ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా ఉండడం నా జీవితంలోని మహావ్యసనాల్లో కొన్ని” అనే రషీద్, “పేరుప్రఖ్యాతలు, అవార్డులు రచనా వ్యాసంగానికి ఉపఫలాలు (by products) మాత్రమే. జీవితం, ప్రకృతుల రంగుల్లో కరిగిపోయే ఆనందమే అన్నింటికీ మించింది” అంటారు.


 

ఆమెకు ఈ తంతు అంతా అయోమయంగా అనిపించేది. ఉజిరెలో హాస్టల్లో అమ్మాయిలు పెళ్ళి గురించి, భర్త గురించి గుసగుసలాడుతూ కిసుక్కున నవ్వుకుంటున్నవారు ఆమెను చూడగానే మాటలాపి మౌనం వహించేవారు. ఎందుకంటే ఆమెకి భర్త గురించి, పెళ్ళి గురించి, తర్వాతి సంగతుల గురించి మాటలు వింటే యాక్ అనిపించేది. అందుకే ఆమె వచ్చాక హాస్టలు అమ్మాయిల ఆటపట్టింపులు ఆగిపోయేవి.