1841 సంవత్సరం ఏప్రియలు 14వ తేదీన మదరాసు కాలేజి హాలులో మదరాసు యూనివర్‌సిటి ప్రారంభోత్సవము ఎల్‌ఫిన్‌స్టన్‌ప్రభువు అధ్యక్షతక్రింద జరిగెను. ఆసభకు 1500మంది పౌరులు వచ్చిరి. అంతమంది నేటివు ప్రజలు అదివరకెన్నడును ఏ సందర్భమునను చెన్నపట్టణమున సమావేశమై యుండలేదు. ఈ విద్యావిధానమును గూర్చి ప్రజలలో అంత యుత్సాహముండెనని కనపడెను.

ఏమీ తోచక
నా తల చుట్టూ చమ్కీరేకులు చుట్టుకుని
వంటి నిండా తళుకులు పూసుకుని
కాసేపు గంతులు వేస్తాను
వీళ్ళు దాన్ని నాట్యం అని చప్పట్లు కొడతారు
అర్ధరాత్రులు ఒంటరి క్రేంకారం విని ఉలిక్కిపడి నువ్వు నిద్రలేస్తావు

పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు
నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి.
గాజు తలుపులు, మెరుపు వెలుగులు
నిన్ను పరివేష్టించి ఉంటాయి.
ఇక్కడ ఆకలిదప్పులే కాదు,
నిద్ర కూడా నిన్ను పలకరించదు.
నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక
నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు.

ఆత్మనొక దివ్వెగా యే సౌందర్యం పాదాల చెంత ఉంచాలో వెదుక్కుంటూ వెళ్ళిన అన్వేషకుడి కథ, మూలా సుబ్రహ్మణ్యం నవల ఆత్మనొక దివ్వెగా; తెలుగు మాండలీకాల అందానికి అద్దం పట్టే కథలు ఎండపల్లి భారతి ఎదారి బ్రతుకులు; అమెరికా మ్యూజియంలలో ఏం చూడాలో తెలీనివారికి, కరదీపిక రొంపిచెర్ల భార్గవిగారి ఒక భార్గవి-రెండు ప్రయాణాలు.

మనకి రోజువారీ నలుపు తెలుపుల్లో కనిపించే విషయాలు అతనికి మాత్రం పంచరంగుల్లో కనపడి ఊరిస్తాయి. ఝల్లుమని ఒళ్ళంతా తడిపే వాన తనని లవ్వించమంటుంది, కర్రా-బిళ్ళా ఆటలో పైకెగిసిన కర్రముక్క రెక్కలు విప్పుకున్న రంగురంగుల పిట్టలా మారి రా రమ్మని పిలుస్తుంటుంది. కుదిరిన బొమ్మలే కాదు, కుదరని బొమ్మలు కూడా తమ వెనకున్న వ్యథల కథలు చెబుతాయి.

సుగ్రీవ విజయము అనే పేరుగొన్న ఈ యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావుగారి (రజని) శతజయంతి సందర్భంగా ఆయనతో నాకున్న మంచి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ వినిపిస్తున్నాను. రుద్రకవి చరిత్ర, సాహిత్యంపై జరిగిన, జరుగుతున్న చర్చలపై మీకు ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఈ సంగీత కార్యక్రమం మాత్రం మీకందరికీ నచ్చుతుందనే ఆశిస్తాను.

అడ్డం సమయానికి న్యాయము తోడైతే చావే (5) సమాధానం: కాలధర్మము ఆకాశం నుండి ఊడిపడే రాయి (4) సమాధానం: వడగల్లు ఆంధ్రులకింకా ప్రత్యేకంగా దొరకనిది […]

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ద్విజావంతి రాగంపై చేసిన ప్రసంగం విందాం. హిందుస్తానీ పద్ధతిలో ఈ రాగాన్ని జయజయావంతి అని పిలుస్తారని అనంతకృష్ణశర్మగారు చెప్తారు. శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్ళకి సినిమా పాటల భాషలో చెప్పాలంటే ఈ రాగం ఆధారంగా తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వచ్చాయి.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఒక కొత్త సంవత్సరమే కాదు, ఒక కొత్త దశాబ్దమూ మొదలవుతున్నది. గడిచిన పదేళ్ళూ ప్రపంచమంతటా లాగానే మన దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయార్థిక కళాసాంస్కృతిక రంగాలాదిగా ఎన్నో మార్పులు సంభవించాయి. మతోన్మాదం, సంకుచితత్వం రాజ్యమేలుతున్నాయి. మనిషిని మనిషి కులమతప్రాంత భేదాల విచక్షణతో చూడడం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. నిర్మూలించబడవలసిన సామాజిక రుగ్మతలు వ్యక్తుల అస్తిత్వాలకు గర్వచిహ్నాలుగా మారి సమాజానికి హాని చేసే ఆయుధాలవుతున్నాయి. ప్రభుత్వాలు చెదపురుగుల లాగా ప్రజాస్వామ్యాన్ని తొలుచుకు తింటూ, పౌరుల ప్రాథమిక రాజ్యాంగహక్కులను కాలరాస్తూ నియంతృత్వం చెలాయిస్తున్నాయి. నిలదీసి నిజాన్ని నిగ్గు తేల్చవలసిన పత్రికలు ప్రభుత్వాలకూ, పార్టీలకూ భజంత్రీలుగా మారిపోయాయి. అసత్యప్రచారాలు నిజాలుగా చలామణీ అవుతున్నాయి. నోరువిప్పి ప్రశ్నించగల హక్కు ఎన్నడో అఘాయిత్యపు దాడులకు బలి అయింది. సామాజిక కార్యకర్తలు, కళాకారులు, రచయితల గొంతులు మునుపెన్నడూ లేనంతగా నొక్కివేయబడుతున్నాయి. చివరికి ఆటవిక న్యాయాన్ని హర్షించి ఆమోదిస్తూ, కాపాడవలసిన చట్టాన్నే కాలరాసే అధికారులకు సన్మానాలు చేసే స్థితికి మన సమాజం దిగజారిపోయింది. కళాసాహిత్యకారులు తమ కనీస స్వేఛ్ఛకోసం పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో సమాజపు పోకడలను, ప్రభుత్వాల తీరును ప్రశ్నించే విమర్శించే ఏ పాత్రికేయులకైనా, సామాజిక కార్యకర్తలకైనా, కళాసాహిత్యకారులకైనా ఆందోళన, నిరాశానిస్పృహలు సహజం. కాని, ఇలాంటి చీకట్లు కమ్మడం ఇది మొదటిసారి కాదు. ఆఖరుసారీ కాబోదు. తిరిగి కొత్త ఉదయం రాక తప్పదు. మార్పుకోసం పోరాడేవారు ఎప్పుడూ ఉంటారు. కళాకారులు రచయితలపట్ల అనాగరికమూ అప్రజాస్వామ్యమూ అయిన దాడులను ఖండించి, ఒకనాడు పోరాడి సాధించుకున్న భావప్రకటనాస్వేచ్ఛ కోసం ఈనాడు మళ్ళీ పోరాడుతున్న ప్రతీ గొంతుక ఒక గడ్డిపోచలానే కనపడవచ్చు; కాని, అవన్నీ ఒక్కటిగా కూడినప్పుడు ఆ త్రాటి బలానికి మదపుటేనుగులైనా లోబడక తప్పదు. కట్టి లాగితే ఏ పీఠాలైనా కదిలి కుదేలు కాకతప్పదు. ఆ గొంతుకలు చీకటిని పారదోలడానికి ప్రయత్నించే చిరుదీపాలే కావచ్చు; కాని, అన్నీ కలిసి వెలిగితే చీకటి పటాపంచలు కాకతప్పదు. ప్రతిఘటించాలన్న ఎరుక ముఖ్యం. సమైక్యత అవసరమన్న స్పృహ అవసరం. మార్పు అనివార్యం.

నిశ్చల స్థితికి గుండె చప్పుడే అడ్డుపడుతూ. అస్తిత్వానికి ఏ అదనపు ప్రాధాన్యతా లేదు. నువ్వూ ఈ ప్రకృతిలో భాగమే అని కణకణంలోనూ ఇంకించుకుంటే గనక సాటిజీవిని అపార కరుణతో చూస్తావు. నేను ప్రత్యేకమనే అతిశయమేదో డ్రైవ్‌ చేయకుండా మనిషనేవాడు ఎట్లా బతకాలి? అందరూ అదే అతిశయంలోకి వచ్చాక అది అతిశయం కాకుండా పోతుంది. అప్పుడు ముందువరసలోని వాళ్ళు ఇంకో అతిశయాన్ని మోస్తూవుంటారు కదా?

ఫోనులు రాజ్యమేలే ఈ రోజుల్లో ఉత్తరాలేమిటండీ అంటే, ‘ఉత్తరమే నా ఆయుధం. చూస్తూ వుండండి రిప్లయ్ వస్తుంది’ అనేవారు. ఆశ్చర్యం! అలాగే సమాధానాలు కూడా వస్తూ వుండేవి. యే పుస్తకం కావాలన్నా ఆ పుస్తకం ఆయన షాపులో వుంటే సరే, లేదంటే యెక్కడుందో వెతికి సాధించి ఆయనకు అందజేసేదాకా ఒంటి కాలిమీద వుండేవారు.

మొదటి రోజు జనం చాలామంది ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు. స్టేడియం వేదిక మీద ఏం జరిగేదీ పెద్ద తెరల మీద అందరికీ కనిపిస్తూంది. అన్ని టీవీ చానెల్స్ లైవ్ కవరేజ్ ఇస్తూ, వచ్చిన వాళ్ళ స్పందనలు కనుక్కుంటూ మధ్యమధ్యలో సగం కాలిన పాప మృతదేహాన్ని చూపుతూ అతను చేసిన ఘాతుకాన్నీ, పోలీసులు ఎంత చాకచక్యంగా రెండ్రోజుల్లోనే ఎలా పట్టుకున్నదీ, అయిదోరోజునే శిక్ష ఎలా అమలు చేస్తున్నదీ వివరిస్తున్నారు.

1820లో మదరాసు స్కూలుబుక్కు సొసయిటీకి సదరు కోర్టు ఇంటర్‌ప్రిటరగు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావుగారు ఇంగ్లిషులో నొక దీర్ఘమైన లేఖ వ్రాసి ఈ దేశమునందు పాఠశాలలను సంస్కరించి ఆంగ్లేయవిద్యను వ్యాపింప జేయుడని ప్రభుత్వమువారిని కోరియుండిరి. ఈ లేఖ ఈ సొసైటీ వారి ప్రథమ నివేదికలో 1823లో ప్రకటింపబడినది.

అయినా విషాదాన్ని మోశాం అకారణంగానే. నిరంతర దుఃఖితులుగా బతికాం ఆయాచితంగానే. ఇప్పుడీ తటస్థ బిందువు మీద నిశ్చలంగా, ఈ గాలిబుడగలో పదిలంగా ఎదురుచూస్తున్నాం. లోతుగా లోతుగా మెలాంకొలిగ్గా జీబురు జీబురుగా ఏళ్ళకేళ్ళు సాగదీశాక ఒక్కపూట, ఒక్కపూట కావాలనే, అదేంటో చూద్దామనే ఢమఢమ మెరుపుల్ని లౌడ్‌స్పీకర్లో వేసి గదిగోడలతో పిచ్చినాట్యాలు చేయించాం.

గ్రీసు దేశపు పురాణ గాథలు చదువుతూ ఉంటే వాటికీ హిందూ పురాణ గాథలకి మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోలికలు పేర్లలో కావచ్చు, సంఘటనలలో కావచ్చు, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, దేవతల ఆయుధాలలో కావచ్చు, దేవతల వాహనాలలో కావచ్చు, దేవతలకి మానవులకి మధ్య సంబంధబాంధవ్యాల రూపేణా కావచ్చు. ఈ పోలికలకి కారణాలు రకరకాల కోణాలలో వెతకవచ్చు.

మరో రెండు మూడు వారాలు గడిపితే బావుండునన్న ఊహ. నచ్చిన దేశాన్ని వదిలివెళ్తున్నందుకు చిన్నపాటి బెంగ. అమెరికాలూ, ఆస్ట్రేలియాలూ, జర్మనీలూ తిరిగినపుడు తెలియకుండానే పరాయి దేశమన్న స్పృహ నావెంట ఉంటూవచ్చింది. సింగపూరు, ఇండోనేషియాలు వెళ్ళినపుడూ అవి విదేశాలనే అనుకొన్నాను. మరి ఈ థాయ్‌లాండ్‌లో ఎప్పుడూ లేనిది ఈ స్వదేశ భావన ఏమిటీ?

ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి ఈ విశాల విశ్వం అంతానూ ప్రాణికోటితో, వివిధ గ్రహాలపై వివిధ జాతులకు చెందిన వైవిధ్యమైన కంఠధ్వనుల రొదలతో నిండిపోయుండాలి కదా! కానీ దీనికి విరుద్ధంగా ఎటు చూసినా కలవరపరిచేంత నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అందుకేనేమో, ఈ సృష్టివైరుధ్యాన్ని మహా నిశ్శబ్దం అని పిలుచుకుంటారు ఈ మనుషులు.