విమానం పైకి ఎగిరినపుడు పైనుంచి కొన్ని ద్వీపాలు కనిపించి పలకరించాయి. ఆ ద్వీపాల మీద అడుగు పెట్టాను, రెండు మూడు రోజులు తిరిగాను అన్న ఆలోచనే నాకు విభ్రమ కలిగిస్తోంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి శిలాన్యాసం చేసిన ద్వీపాలవి. జీవరాసుల గురించి ప్రపంచపు అవగాహనను సమూలంగా మార్చిన సిద్ధాంతానికి పుట్టినిళ్ళవి.

త్యాగరాజస్వామి సంగీతానికే ప్రాముఖ్యత ఇచ్చినట్లు చక్కగా సాక్ష్యం ఇస్తాయి ఇలాంటి కీర్తనలు. నేటి తెలుగు సంగీతవిద్వాంసులకు కొందరికి త్యాగరాజుకున్న కీర్తనాసాహిత్యమ్మీద ఆయనకంటే ఎక్కువ ప్రేమ! అది అరవవిద్వాంసుల నోటిలో నలిగిపోతూంటే వీరు పద్యాలు పాడినట్టు కీర్తనలు అనేసి సాహిత్యాన్ని చక్కగా రక్షిస్తున్నారు. కలవవు రెండు కళలు! సంగీతమూ, సాహిత్యమూ కూడా కలవవు. వింత యేమిటి? ఇవి ఆదిలో వేరుగా పుట్టేయి, భరతముని చేర్చికట్టినా, కాలక్రమ వికాసంలో వేరైపోతున్నాయి. అస్తు.

“కాదు కాదు, అందరూ అలా అనుకుంటారు కాని, ఏఐ అవతార్ అయినా విడాకులకి గ్రౌండ్స్ ఉంటాయి. మీరనుకున్న దానిలో కొంత నిజం ఉంది. చట్టం, 2032 యాక్ట్ ద్వారా చెప్పేదేంటంటే, ఏఐ అవతార్‌లని కేవలం యంత్రాలుగా భావించాలి. అంటే, వాటితో కేవలం శారీరిక సంబంధం అనుకోవాలి.” నేను సెక్స్ డాల్స్ గురించి చెప్పడానికి సందేహించాను. “కానీ, ఆ వ్యక్తి ఆ అవతార్‌ని నిజం మనిషిలాగ చూస్తే, చట్ట ప్రకారం విడాకులకు కారణం అవుతుంది.”

ఏళ్ళ క్రితం, నేనూ నా ఫ్రెండు మదరాసు నగరాన్ని ఒక చూపు చూద్దామని బయట వీధులెంట తిరుగుతుంటే పదిహేడు-పద్దెనిమిది ఏళ్ళ వయసు కుర్రవాడొకడు, ఇంకా తక్కువ వయసు కూడానేమో! ఒక గోడ మీద రాజకీయనాయకుడి పోర్ట్రయిట్ ఒకటి వేస్తూ కనపడ్డాడు. చాలా పెద్ద బొమ్మ అది. గోడ మీద, అదీనూ అంత పెద్ద గోడ మీద.

ఫ్రాంక్‌కి బహుశా అరవై ఏళ్ళు ఉంటాయేమో. ‘దేని సౌందర్యమైనా దాని ఆత్మలో ఉంటుంది ఫ్రాంక్’ అంటే గట్టిగా నవ్వేవాడు. ‘ఆత్మలో సౌందర్యం, హృదయంలో సౌందర్యం, శరీరంలో సౌందర్యం ఇవన్నీ ఒట్టి మాటలు శ్యామా. సౌందర్యమంటే ఒకటే, అది నీకు సౌందర్యంగా కనపడటం మాత్రమే’ అంటాడు. ‘బ్యూటీ ఈజ్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్ అన్న మాట’ అంటే, ‘కాదు. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది బిహోల్డర్స్ లైఫ్, మూడ్, అండ్ ఛాయిస్’ అంటాడు.

పదడుగులేశి తలెత్తి సూస్తే, గుడి బెమ్మాండంగ కనిపించింది. విక్కీ అరిశినాడు, “తాతోవ్! అదో గుడి!” వాడి సంతోసాన్ని సూసి అన్వర్ తాతకి కొంచెం నిమ్మతైంది. “పదా. మనకి వణ్ణాలేశేవాళ్ళు వుండారా సూస్తాం.” అని గబగబా నడిశినారిద్దురూ. నిజ్జింగా శానామంది బక్తులుకి వణ్ణాలొండి వడ్డిస్తా వుండారక్కడ. కడుపు నిండా మెతుకు తిని ఎన్ని దినాలైందో, విక్కీ, తాతా లచ్చెనంగా బోంచేశినారు. వొస్తా పోతా వుండే జనాన్ని ఒక జాగాలో కూకోని సూస్తా వుంటే, టైమెట్లనో పూడేడ్శింది.

రెండవ సర్గలో తొమ్మిదవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకూ తెలుగు ప్రతిపదార్థాల దగ్గిర నా చదువు కుంటుపడింది. రెండు క్రౌంచపక్షులు, రతిక్రీడలో పారవశ్యంతో ఆనందిస్తూ వుండగా ఒక బోయవాడు (నిషాదుడు) మొగ క్రౌంచపక్షిని నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. అది చూసి వాల్మీకి శోకించి ‘మానిషాద’ అని మొదలు పెట్టి బోయవాడిని శపిస్తాడు. ఈ శ్లోకం సంస్కృతసాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా పరిగణిస్తారు.

మార్నింగ్ వాక్‌లో ఎదురు వచ్చేవాళ్ళకు విషెస్ చెప్పేటప్పుడు అందరిలాగానే అతను కూడా కళ్ళల్లోకి చూస్తాడు గానీ అతనితో కొన్ని రోజులుగా ఆ అలవాటు కొనసాగుతూండడం గూర్చి ఆమె కొద్దిగా సంకోచించి తల దించుకున్న రోజే ఎదురుగా వచ్చిన అతని మాటలు తనని దాటిన తరువాతే చెవిని చేరాయని గ్రహించి తల తిప్పి చూసేసరికి అతను వేగంగా పరుగెత్తుతూ కనిపించాడు. “పోటీలకి తయారయే వయసు మించిపోలేదా?” అనుకుని ఆశ్చర్యపోయింది.

చెమటలు కక్కుకుంటూ బయటకు పరిగెత్తాను. కాళ్ళు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాను. నాకు ఏమీ అర్థం కాలేదు. మెలమెల్లగా నాలో తార్కిక చింతన తిరిగి మొదలై అంతా నా భ్రాంతేనని అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాను. గది లోపలికి వెళ్ళడానికి భయమేసింది. వరండాలోనే పడుకున్నాను. మా వీధి చాలా వెడల్పుగా ఉంటుంది. చక్కగా గాలి వీస్తుంది. అలసిపోయి ఉండటంతో నిద్రపోయాను. ఎదురింటి కుక్క వరండా కింద పడుకుని ఉంది.

ఆ గుడారం బయట కాపలా కాస్తూ, ఆ సంభాషణంతా వింటున్న ఓ భటుడు, ద్రోణుడు నిద్రకి ఉపక్రమించాడని నిర్థారించుకున్నాక, మెల్లగా గుడారం వెనకున్న అడవిలోకి నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఓ చోట ఆగి, చెయ్యి పైకెత్తి మెల్లగా ఈల వేయడం మొదలుపెట్టాడు. కొంత సేపటికి ఓ గద్ద రివ్వున ఎగురుకుంటూ వచ్చి అతడి చెయ్యి మీద వాలింది. దాన్ని సంతోషంగా నిమురుతూ, తన భుజానికున్న ఎర్ర తాయత్తుని తీసి దాని కాలికి కట్టాడు.

ఇట్లా ఉండగా జనవరి 12వ తేదీనాడు తెల్లవారి గుజరాతి పత్రికను తెరచినపుడు Demonetization శాననపు పిడుగు దొంగ వ్యాపారులు, లంచగొండులు అందరికీ సోకినట్లే అతనికి హఠాత్తుగా సోకెను. ‘500 రూ॥లకు పైన విలువగల నోట్లన్నీ రద్దు’ అనే పెద్ద అక్షరాల శీర్షిక కండ్లలో పడగానే పిలానికి తల తిరిగి కన్నులు చీకట్లు క్రమ్మెను. గుండెలు దడదడ లాడెను. శ్వాస నిలిచిపోయెను. చేతులు వణికి పత్రిక పడిపోయెను.

ఇండియాలో ఉన్న 1,500 మిలియన్ల జనాభాలో దరిదాపు 80 మిలియన్ల వయోజనులు అనగా (వయస్సు 20-79), నూరింట ఐదుగురు, మధుమేహం బారిన పడుతున్నారనిన్నీ, అందుకే ప్రపంచంలో ‘మధుమేహానికి ఇండియా ముఖ్యపట్నం’ అని ఇటీవల అనడం మొదలు పెట్టేరు! అతి రక్తపు పోటు విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది

భిక్షాటన, ముష్టి అనే ఈ రెండింటికి తేడా ఉంది. ప్రపంచంలో ఉన్నవన్నీ వదులుకుని, బతకడానికి కావాల్సినది మాత్రమే తీసుకునేది భిక్షాటన. ముష్టి అనేది ‘నాకింకా కావాలి’ అనుకుంటూ ఎంత ఉన్నా కూడబెట్టుకునేది. ముష్టివాడికి తన దగ్గిర డబ్బు ఉందా లేదా, అనేవన్నీ అనవసరం. ఆవురావుమని ఇచ్చినదంతా తీసుకోవడమే పని. ఈ ముష్టి ఎత్తేవాళ్ళు అత్యంత ధనవంతుల నుంచి అతి బీదవారి వరకూ ఉన్నారు. ముష్టి ఎత్తే సరుకు ఒకటే తేడా.

సంస్కృతములో మాఘునివలె, వేంకటాధ్వరివలె నొక ఆశ్వాసము నంతయు యమకాలంకారమయముగా చేసిన కవులు తెలుగులో నరుదుగా నున్నారు. అట్టివారిలో చంద్రికాపరిణయప్రబంధకర్త యగు సురభిమాధవరాయలు ముఖ్యుఁడు.ఇతఁడీ ప్రబంధములోని చతుర్థాశ్వాసమునంతయు యమకాలంకార మయము చేసినాడు.

నింగికి తెలియకుండా
కొన్ని నక్షత్రాలను
తలగడ కింద దాచేదాన్ని
జాబిలి చూడకుండా
గుప్పెట నిండా
వెన్నెలను నింపుకుని
రుమాలులో మూటగట్టేదాన్ని

పులియని రొట్టెల పండుగ ముంచుకొచ్చెను
ఇక ప్రథమ ఫలముల పండుగ తప్పనిసరి కాగా
తదుపరి బూరల పండుగను సందడి కూడా ఆయెను.
ఆపైన, ప్రాయశ్చిత్తార్థ దినమునకు తావులేక
పస్కా పండుగకూ తెర తీయబడెను
ఆశీర్వాద పండుగలు అనివార్యమయ్యెను.

గాలివాటపు జీవనం.
ఆడంబరాల హోరు,
యవ్వనం మెఱుఁగులు
చెరిగిపోయే మెరుపులు.
సమయజ్ఞానంతో
బిరాన ఎంచుకో నీదైన క్షణం.

ఈ కథలో ఇద్దరు మగవాళ్ళూ హెమింగ్‌వే రెండు రూపాలు. ఏ మాత్రం అడవి జంతువుకు బెదరని, స్త్రీ ని నిక్కచ్చిగా అంచనా వేయగల విల్సన్‌లో ఒక హెమింగ్‌వే ఉంటాడు. మృత్యుభయం వదలనివాడు, క్షణక్షణం తన స్త్రీ ముఖకవళికలను గమనిస్తుండే బలహీనుడు, భార్య ఎంత ప్రమాదకరురాలో తెలిసీ ఆమె లేనిది తనకు జీవితం లేదని అనుకునే నిస్సహాయుడు ఫ్రాన్సిస్ లోనూ రచయిత పూర్వానుభవాల ఛాయలు లేకపోలేదు.

మనం సాధారణంగా ఇగ్నోర్ చేసే వ్యక్తులు, పరిసరాలు అంటే ఒక చిన్న ఆడపిల్ల, ఒక చిన్న ఊరిలో ప్రాథమిక పాఠశాల, రిటైర్డ్ సేల్స్‌మన్ – ఇలాంటి వారి జీవితాలని జాగ్రత్తగా చూసి, ఆమె వారి గురించి వ్రాసింది. ఆమె వాళ్ళ జీవితాలను సీరియస్‌గా తీసుకుంది. అందువల్ల, ఒక్కొక్కసారి వారి పాత్రలు వారి కంటే పెద్దవిగా, ఘనంగా కనిపిస్తాయి. అది, కాల్పనిక సాహిత్యంలో మన్రో చేసిన గొప్ప పని. నిజం చెప్పాలంటే, ఆవిడ రాసిన ప్రతి ఒక్క కథా ఒక నవలగా మలచవచ్చు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: