రెండు ప్రయాణాలు

ఎన్నో రైళ్ళుమారుతూ
మరెన్నో ఊళ్ళు తిరుగుతూ
నదులూ అడవులూ
కొండలూ గుహలూ
వెతుక్కుంటూ సాగిపోతావు
నీ సత్యం నీకెక్కడో
తారసపడకపోదు

నిన్ను రైలెక్కించిన ప్లాట్‌ఫామ్ మీదే
నిశ్చలంగా కూచుంటాను నేను
ఎన్నో ఊళ్ళు తిరిగి
మరెన్నో రైళ్ళుమారి
నా సత్యం నన్ను వెతుక్కుంటూ
నిరీక్షిస్తున్న ప్లాట్‌ఫామ్ మీదకి
నిశ్చయంగా దిగుతుంది!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...