మీరనుకునే ఒంటరితనంలో నేనున్నప్పుడు
ఎదురుగా ఉన్న ఆకాశహర్మ్యాలు
మనసులు పట్టని మనుషులు
మురికిపట్టిన గుండెలు
అన్నీ మాయం.పుట్టబోయే బిడ్డని
అమ్మ మోసినంత భధ్రంగా మోస్తున్న
జ్ఞాపకాల సంచీలోంచి
కొన్ని క్షణాల వెలికితీతఅప్పుడక్కడ క్షణాల్లో
మనసంత మైదానాలు
పూలచెట్లూ, సెలయేళ్ళూసెలయేట్లో కాగితం పడవలు
ఒడ్డుమీద గుజ్జనగూళ్ళూ
మైదానంలో ఒంగుడుదూకుళ్ళుమీరు
ఈ ప్రపంచం
ఒంటరివాళ్ళుమీ ఒంటరితనం పొగోట్టుకోడానికి
నన్నొంటరిని చేసి
ఈ ప్రపంచంలోకి లాక్కొస్తారు.

రచయిత క్రాంతి కుమార్ మలినేని గురించి:
అనేక తెలుగు సాహిత్య వేదికలపై తన కవితలతో గుర్తింపు పొందిన కవి క్రాంతికుమార్ మలినేని. ఆయన “ఎన్నెన్ని వసంతాలో..”, “ఒంటరి ప్రపంచం”, “తెల్లని కాగితాలు” మొదలుకొని ఎన్నో కవితలు రచించారు. సృజనాత్మక కవిత్వానికి, ప్రశంసలు పొందారు. ‘వాకిలి’ సాహిత్య పత్రికలో ‘జయభేరి రెండవ భాగం’లో గొలుసు కవితలు రాశారు.
... పూర్తిగా »