క్రితం సంచికలోని గడినుడి-30కి మొదటి మూడు రోజుల్లోనే ఏడుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: 1. జిబిటి సుందరి 2. కోడీహళ్ళి మురళీమోహన్ 3. బండారు పద్మ 4. అనూరాధా శాయి జొన్నలగడ్డ 5. వైదేహి అక్కిపెద్ది 6. అగడి ప్రతిభ 7. హరిణి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-30 సమాధానాలు, వివరణ.

అడ్డం దంతావళము శాస్త్రం మూడు అడుగులు (5) సమాధానం: మతంగజము ఆ తొమ్మిదిలో ఒకటి కలిపితే కోపం వస్తుంది (3) సమాధానం: ఆగ్రహం ఆశీర్వదించేటప్పుడు […]

కథ అంటే ఏమిటి? దాని లక్షణాలేమిటి? అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా ఏ సాహిత్య సమాజమూ స్పష్టమైన సమాధానమివ్వలేదు. రచయితలు, విమర్శకులు వారి భావాలు, వాదాలు, అభిప్రాయాలను బట్టి తమకు తోచినట్టుగా ఈ ప్రశ్నలకు స్థూలంగా, అస్పష్టంగా కవితాత్మకమైన వివరణలను ఇచ్చుకున్నారు తప్ప సరైన సమాధానాలను ఇవ్వలేకపోయారు. నిర్దిష్టత లేని వివరణలు కేవలం వర్ణనలే అవుతాయి తప్ప నిర్వచనాలు కాబోవు. వాటి ఆధారంగా సాహిత్యలక్షణ చర్చలు జరగలేవు, జరపకూడదు.

ఇది కథ ఎలా అయింది? అన్న ప్రశ్న లాగానే, ఇది కథ ఎందుకు కాదు? అన్న ప్రశ్న కూడా ఇప్పటిదాకా ఉన్న సాహిత్య వర్గీకరణలను, సంప్రదాయ ధోరణులను సవాలు చేస్తుంది. తమ మధ్య స్పష్టమైన విలక్షణతను చూపించగల కథ-కవిత-వ్యాసం వంటి ప్రక్రియలు కూడా కొన్నిసార్లు ఒకదానిలోకి ఒకటి కలిసిపోతుంటాయి. అందువల్ల సాహిత్యపు విశాలస్వభావాన్ని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకొనడానికి ప్రయత్నిస్తున్నట్టు గాని, సాహిత్య ప్రక్రియలను కుంచించి వర్గీకరించే కొద్దీ వాటి మధ్య ఎల్లలు చెరిగిపోతుంటాయన్న స్పృహ రచయితలకు విమర్శకులకు కలుగుతున్నట్టు గాని, కనిపించడం లేదు. ఈ కారణానికే, ఒక రచనను ఏదో ఒక ప్రక్రియలోకి ఇమడ్చకుండా చూడలేని పరిమితి, తమకున్న నిర్వచనాల్లోకి ఒదగని రచనలను అస్పష్టమైన వివరణలతో కొత్త ప్రక్రియగా భావిస్తూ సాహిత్య లక్షణాలను పునర్నిర్వచిస్తున్నామన్న భ్రమ, తెలుగు సాహిత్య సమాజంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇతర భాషా సాహిత్యాలలో ఈ రకమైన సాహిత్య లక్షణాల గురించిన చర్చ, ఇటీవల దాదాపుగా కనుమరుగవుతోంది. ఆయా భాషల రచయితలు మునుపెన్నడూ లేని తీరున వాక్య, వస్తు పరమైనవే కాక సాంకేతికతనూ ప్రతిభావంతంగా వాడుకుంటూ సాహిత్య ప్రయోగాలు చేస్తున్నారు, కథాది సాహిత్య ప్రక్రియలకు ఉన్న సరిహద్దులు చెరిపివేస్తున్నారు. తమ రచనలను ప్రత్యేక ప్రక్రియలుగా కొందరు రచయితలు పేర్లు పెట్టుకుంటున్నా అవి కేవలం వారి- వాటి- గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి. అందువల్ల ఈ గురుతుచీటీలకు, పాఠకుడి పఠనానుభవాన్ని ప్రభావితం చెయ్యగల శక్తి ఉన్నదా, ఉంటే దాని పరిధి ఏమాత్రం అన్నవి, ఆలోచించవలసిన విషయాలు.

నిజానికి వర్గీకరణ అన్నది, రచన పట్ల ముందస్తు అంచనాలను, అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి, పాఠకుడి దృష్టిని రచనాంశానికి దూరంగా మళ్ళించడానికి మాత్రమే దోహదపడుతుంది తప్ప ఒక రచనను రచనగా స్వీకరించడానికి, ఆ రచనని లోతుగా ఆస్వాదించడానికి సాయపడదు. ఇలా ఉంటే కథ, ఇలా ఉంటే కాదు, ఇది ఇది, ఇది ఇంకొకటి అంటూ విభజనలు ఎక్కువయే కొద్దీ అవి ఒకటైపోతుంటాయి. అందువల్ల, నిర్వచించిన మరుక్షణం ఆ నిర్వచనానికి వెలుపలగా నిలబడే లక్షణం ఉన్న సాహిత్యానికి, ఈ రకమైన వర్గీకరణలు అవసరమా అన్నది ముఖ్యమైన ప్రశ్న. శోధనకు సంబంధించిన సౌలభ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ నామకరణాలు ఒక వెసులుబాటే తప్ప సాహిత్య అవసరం కాదన్నది, మా స్థిరమైన అభిప్రాయం. ఈ ఆలోచనలతో, ఈ సంచిక నుండి ఈమాటలో ఒక ప్రయోగం మొదలు పెడుతున్నాం. ముందు పేజీలోను, రచనల పేజీలోను, రచనల కేటగిరీల ప్రస్తావన తీసివేస్తున్నాం. తద్వారా పాఠకుల దృష్టి కేవలం రచన మీద మాత్రమే ఉంటుందని, రచన చెప్తున్నదేమిటో మాత్రమే చూడబోతారని, అలా సాహిత్యాన్ని ప్రక్రియల పావురాల గూళ్ళల్లో పెట్టే ధోరణి కొంతైనా పోతుందని మా నమ్మకం. ఈ ప్రయోగం ఎటువంటి ఫలితాలనివ్వబోతోందో, మనమంతా కలిసి గమనిద్దాం.

నేతల తలకోతలు: నాయకులు బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారనేది నిజం కాదు. అలా అంటున్నారూ అంటే మన రాజ్యాంగపు చట్టాలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. నాయకులను ప్రజలతో నిజంగా కలిపే బంధం మన చట్టాల నిజమైన అర్థం, ఆశయం. నేతల తలలే తెగిపడతాయి ఎందుకూ అంటే తెగిపడడానికి సిద్ధపడని తల ఒక సమాజానికి పెద్దతల కాలేదు.

పోతూ వస్తూ దాటేసుకుంటూనే ఉంటాం. కానీ ఇంతకాలమైనా పరిచయం కాకుండా ఎందుకు ఉండిపోయింది? మనతో ప్రత్యేకించి పని పడకపోతే, ఉద్యోగరీత్యా సంభాషించుకోవాల్సిన అవసరం రాకపోతే ఎలా పరిచయం అవుతుంది? పనిగట్టుకొని పరిచయం చేసుకోవడంలో నాకు ఉత్సాహం లేదు. జరిగిపోవాలంతే. మన చుట్టూనే జీవితాలు ప్రవహిస్తూవుంటాయి. మనం వాటిని ఖండించుకుంటూనో, ఒరుసుకుంటూనో పోము. అసలు ఆ ప్రవాహానికీ మనకూ నిమిత్తమే లేదు. ఇదెంత శూన్యం?

ఇందాకా అనుకున్నాం కదా పిన్నీసు అని; చెప్పులు, పిన్నీసు రెండూ జంట కవులు. ఆ రోజుల్లో పిన్నీసుల హారం లేని ఆడ మెడ ఉండేది కాదు. పిన్నీసుకు జాత్యంతరం అంటదు. హిందూ, ముస్లిమ్, కిరస్తానీ అందరి మెడల గొలుసుల్లో పిన్నీసులు తళుకుమనేవి. అంగళ్ళల్లో పిన్నీసులు కొనడం డబ్బు దండగ, రోడ్ల మీద మొలతాడు దారాలు అమ్ముకునేవారి దగ్గర పిన్నీసు ప్యాకెట్లు కాస్త అగ్గువ. చొక్కాకు గుండీలు లేవా పిన్నీసు ఉందిగా!

“నేనెందుకు మరొకరి దగ్గర సాయం అడగాలి? ఇది నా బాధ్యత కదా? చెట్టుకు మధ్య భాగమే బలం. గట్టిబడి ఉక్కులా ఉంటుంది. ఆ చెట్టులో మొట్టమొదటి భాగమూ అదే. అయితే చెట్టుకి కావలసిన ఆహారాన్ని సరఫరా చెయ్యడం ఆ భాగంవల్ల కాదు. చెట్టుయొక్క తాట భాగమే ఆహారాన్నీ నీటినీ సరఫరా చేస్తుంది. ఆ భాగం లేతది, వయసులో చిన్నది. మనుషులూ అంతే. పెద్దలు కుటుంబానికి బలం. కొత్తతరం వాళ్ళే సంపాదనలవీ చూసుకోవాలి.”

చీకటి చీర
కొండచరియ అంచు
రాలుటాకులు కలంకారీ అద్దకాలు
కదిలే నీడలు ఎగిరేపైట
ఊగే ఊడలు చెరిగే కుచ్చిళ్ళు
లోయల ఒడి నిండుగ వనాలు జీవచరాలు

నిజానికి మనుగడలో ఉండే చిన్న పత్రికలు ఈనాడూ ఆనాడూ ఏ నిజాల కోసం, సత్యాలకోసం అచ్చు కాబడవు, పెద్ద పత్రికలూ అంతేననుకోండి! వాటి గురి పెద్ద ప్రయోజనాలు నెరవేర్చుకోడంలో ఉంటుంది. చిన్న పత్రికలు కేవలం నాలుగు డబ్బులు గిట్టుబాటు కావడం కోసం మాత్రమే అచ్చవుతాయి. ఈ చిన్న పత్రికలవారికి అతి ముఖ్యంగా కావలసినవి అడ్వర్‌టైజ్‌మెంట్లు. ఇలాంటి పత్రికలు నిజంగా పత్రికల్లా ఉండవు.

మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థం కాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నం గానీ, కనీసం పశ్చాత్తాపం గానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు?

అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు.

కౌగిలించుకు
బతుకునిచ్చే నవ్వూ, మాటా,
ప్రతి కొత్త కోరికా
నువ్వేనని
నీ తొలి అడుగుకై
ప్రతి పడిగాపూ నాదే

“మొదటిసారి సుజాత ఇచ్చిన పాయసం వల్ల నా ప్రాణలు నిలిచి గౌతముడినైన నేను జ్ఞానోదయంతో ధర్మాన్ని కనుక్కోగలిగాను. ఆ రోజు సుజాత పాయసం ఇచ్చి ఉండకపోతే తథాగతుడే లేడు. బుద్ధత్వం పొందాక ప్రారంభించిన ధర్మ చక్ర పరివర్తనం ఈ రోజుకి దాదాపు పూర్తైంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు; ప్రతీ ప్రాణీ అంతమై తీరుతుంది. ఆ క్రమంలోనే ఈ పరివర్తనం అనేది ఎప్పుడో ఒకసారి అంతమవ్వవల్సిందే కదా?”

కానీ ఈ పాటైనా, తక్కిన కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా హరి హరి గోవింద బాలా కృష్ణమ్మా, ఓ యశోద ఏమి చేయుదమే, నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా, పాటల కైనా సాహిత్యాన్ని ఇవ్వటం కష్టమైన పని. సాధ్యంకాని పని అని చెప్పాలేమో! ఈ ఆడియోలో పాడిన పాఠం మీకు పుస్తకాలలో కనపడే పాఠాలకి భిన్నంగా ఉంటే ఆశ్చర్యం లేదు.

క్రితం సంచికలోని గడినుడి-29కి మొదటి ఆరు రోజుల్లోనే ఆరుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: 1. శైలజ/ఆగడి ప్రతిభ, 2. వైదేహి అక్కిపెద్ది, 3. అనూరాధా శాయి జొన్నలగడ్డ, 4. బండారు పద్మ, 5. ప్రణీత, 6. కోడిహళ్ళి మురళీమోహన్. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-29 సమాధానాలు, వివరణ.

అడ్డం ఒక సంవత్సరం సంతోషం (3) సమాధానం: ఆనంద పుట్టలో పుట్టిన కవి? (3) సమాధానం: వాల్మీకి ఎటునుండి చూసినా ఎక్కువే (3) సమాధానం: […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఈమాట జులై 2007 సంచికతో మొదలై నిరాఘాటంగా షుమారు పన్నెండేళ్ళు సాగిన నాకు నచ్చిన పద్యం శీర్షిక అనివార్య కారణాల వల్ల వచ్చే సంచిక నుండీ ఆగిపోతున్నదని చెప్పడానికి చింతిస్తున్నాం. కేవలం ఒక పద్యానికి అర్థం చెప్పడమే కాదు, ఆ పద్యం ఎందుకు మంచి పద్యమో, అందులో కవి గొప్పతనమేమిటో, ఇలా వివరించి చెప్తూ పద్యకవిత్వపు లోతులని నేటి పాఠకులకు అందజేయడం ద్వారా వారికి పద్యాన్ని, తద్వారా కవిత్వాన్ని చదవడం ఎలాగో కూడా తెలియజెప్పిన శీర్షిక ఇది. మొదలైన నాటినుండీ ఎందరో పాఠకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన శీర్షిక ఇది. ఈ శీర్షికను ఇన్నేళ్ళపాటు సమర్థవంతంగా పాఠకాదరణకు ఇంతగా నోచుకొనేలా నిర్వహించిన చీమలమర్రి బృందావనరావు, భైరవభట్ల కామేశ్వరరావులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతీ సంచికకూ కాకపోయినా, ఇక ముందు కూడా వారికి నచ్చిన పద్యాలను అప్పుడప్పుడు ఈమాట పాఠకులతో పంచుకుంటూ ఉంటారని, ఉండాలని ఆశిస్తున్నాం. ఇదే సందర్భంలో, ఈ శీర్షికను ఇక ముందు కొనసాగించటానికి, ఇదే ధోరణిలో తమకు నచ్చిన పద్యాలను పాఠకులకు పరిచయం చెయ్యడానికి, ఇతర కవిపండితరచయితలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

ఇటాలియన్ ఆపెరాలను తెలుగులో యక్షగానాలుగా పునఃసృజిస్తున్న తిరుమల కృష్ణదేశికాచార్యుల మరొక నాటిక సేవికయే నాయిక; నలభై అయిదేళ్ళకు పైగా అమెరికా విశ్వవిద్యాలయాలలో తన తెలుగు సాహిత్య పరిశోధనలో భాగంగా రాసిన వ్యాసాలే కాక ఎన్నో అనువాదాలు కూడా చేసిన ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు అమోఘమైన కృషిని తెలుగువారికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో పరుచూరి శ్రీనివాస్ ఆయనతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం జరిపిన ఇంటర్‌వ్యూ; ఇటీవల మరణించిన విశిష్ట కథకుడు కవనశర్మ స్మృతిలో దాసరి అమరేంద్ర నివాళితో పాటూ ఆయన కథలు; ఇతర రచనలు, గడి నుడి…ఈ సంచికలో.