జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

అడ్డం నియమం పత్రంలో లేని మూలాన భీరువులు పఠించేది. (6) సమాధానం: పలాయనమంత్రం గిజిగాడు (6) సమాధానం: బంగారుపిచ్చుక ఇది అంటే నాకు తెలీదా […]

క్రితం సంచికలోని గడినుడి-38కి మొదటి పది రోజుల్లోనే పదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, పాటిబళ్ళ శేషగిరిరావు, జిబిటి సుందరి, అగడి ప్రతిభ, వైదేహి అక్కిపెద్ది, ముకుందుల బాలసుబ్రహ్మణ్యం, బండారు పద్మ, సరస్వతి పొన్నాడ, విజయాదిత్య, రవిచంద్ర ఇనగంటి.

గడి నుడి-38 సమాధానాలు, వివరణ.

విమల్‌కు చేతులు కాళ్ళు వణకసాగాయి. మిథున్ సంచి, స్సాక్స్, నీళ్ళ సీసా అన్నీ కారులోనే ఉన్నాయి. విమల్ లేప్‌టాప్, పుస్తకాల సంచీ, ఫైళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మిథున్ మాత్రం లేడు. ఏం జరిగింది? బిడ్డ ఎలా తప్పిపోయాడు? అన్నది వాడి బుర్రకు అందలేదు. బయలుదేరే తొందరలో బిడ్డను కారులో ఎక్కించడం మరిచిపోయాడా? వాడికి నమ్మబుద్ధి కాలేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద దుమారాన్నే లేపింది. ప్రస్తుత ప్రపంచంలో ఎదగడానికి, ఆర్థికంగా ఉన్నతమైన వర్గాలతో విద్యావుద్యోగాలలో పోటీ పడడానికి బడుగు వర్గాలవారికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయాన్ని సమర్థించే వారొకపక్క, విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని ఆవేశంతో ప్రతిఘటిస్తున్న భాషాభిమానులొకపక్క, తమ తమ కులమతవర్గ వాదాలకనుగుణంగా దీనికి రకరకాల రంగులలుముతున్న మరికొందరొకపక్క, తలో వైపు నుండి కూడి విషయాన్ని ఫక్తు రాజకీయం చేశారు. వీళ్ళ నినాదాలన్నీ తమ లబ్ధి కోసమూ, తమ అత్యుత్సాహమో, అజ్ఞానమో ప్రదర్శించడం కోసమూ తప్ప నిజంగా ప్రభుత్వ పాఠశాలలు తప్ప గతిలేని పిల్లల బాగోగుల గురించి కాదు. వాళ్ళకు ఎలాంటి చదువు కావాలి, అది ఎలా చెప్పచ్చు, వారికీ ఎలా సమానావకాశాలు కల్పించచ్చు అని కాదు. ఉద్వేగపూరిత విశ్వాసాలను దాటి, తెలుగు బోధన కావాలనేవారు దానివల్ల విద్యార్థులకు ఏం ప్రయోజనం కలుగుతోంది అని ఆలోచించటంలేదు. ఆంగ్ల బోధనను సమర్థించేవారు అసలు మన పాఠశాలల్లో ఆంగ్లం చక్కగా నేర్పగలిగే ఉపాధ్యాయులెంతమంది ఉన్నారు, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా అమలు చేయగలదు అన్నవి ఆలోచించటంలేదు. ఒక భాష మాట్లాడగలగడం వేరు. ఆ భాషలో ఆలోచించగలిగే సామర్థ్యం తెచ్చుకోవడం వేరు. కనీసం తను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పగలిగేంతగా, రాయగలిగేంతగా తర్ఫీదునివ్వగలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి? ఉపాధ్యాయులెందరున్నారు? ఇప్పటికే తెలుగు ఆలోచననిచ్చే భాషగా కాకుండాపోయింది. అందువల్ల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ప్రస్తుత తెలుగు సమాజాల్లో విద్యార్థులకు ఏ మేలు జరుగుతుంది అనేది చర్చనీయాంశమే. అదేవిధంగా అరకొర ఆంగ్లబోధన వల్ల విద్యార్థులకు భావిజీవితంలో ఉపయోగపడేంత భాషాసామర్థ్యం వస్తుందన్నదీ అనుమానాస్పదమే. గత ముప్ఫై నలభై ఏండ్లలో తెలుగు ఇంగ్లీషు మీడియాలలో చదివిన విద్యార్థులెందరిని చూసినా మాధ్యమం వారి భాషను కాని, ఆలోచనను కాని ప్రభావితం చేసినట్టు కనిపించదు. మరోపక్క, గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశంలో విద్యాబోధన స్థాయి క్షీణిస్తూ వచ్చిన మాటా రహస్యమేం కాదు. ఈ స్థితిలో, విద్యాబోధన ఏ మాధ్యమంలో అన్న చర్చకు ముందు, ఏ విద్య? ఏ రకమైన బోధన? అన్న ప్రశ్నలు వివరంగా చర్చించబడాలి. కేవలం ఉపాధి కోసమే విద్య అనుకున్నప్పుడు అది ఏ మాధ్యమంలో ఉండాలి అనేది ఆర్థిక సామాజిక కారణాల బట్టే ఉంటుంది. కానీ విద్య కేవలం మనుగడ కోసం మాత్రమే కాదు. భాష మనిషికీ మనిషికీ మధ్య ఉన్న సంభాషణ అంతరించకుండా ఉండేందుకే కాదు. ఏ తరానికాతరంలో బుద్ధిజీవులను పెంచేదే విద్య అని, అందుకు తోడ్పడే భాష అవసరమని, మర్చిపోకూడదు. ఇప్పుడు మన తెలుగుదేశంలో జనం వెంపర్లాడుతున్న భాష, అది తెలుగైనా ఇంగ్లీషైనా, ఒక స్వంత ఆలోచననిచ్చే భాషగా ఉందా? మనం పిల్లలకు ఏ రకమైన విద్య నేర్పించాలనుకుంటున్నాం, నేర్పిస్తున్నాం, ఎందుకు, ఎలా నేర్పిస్తున్నాం? అన్న చర్చలు మొదవలవ్వాలి. మాధ్యమాల మార్పుకన్నా, శిక్షణలోనూ, శిక్షకులలోనూ మార్పు ముఖ్యమన్న ఎరుక అన్ని చర్చల్లోనూ ప్రధానంగా వినపడనంతకాలం, అవి ఎంతకాలం, ఏ స్థాయిలో నడిచినా ఏ లాభమూ లేదు.

ఏమనుకుంటున్నావు నాగురించి? వెండిరంగు దేవుడు పసుపుపచ్చ ఫాదర్‌ను అడిగేడు ఆక్రోశంతో, అలిసిపోయి, రాజీ పడిపోయిన గొంతుతో. నేను మిమ్మల్ని ఇలా కావాలనే, నాకు ఇష్టమయే పుట్టించాననుకుంటున్నావా? నేను మీ అందరూ బాధ పడుతుంటే చూసి ఆనందిస్తున్నానని అనుకుంటున్నావా? మీరు ఏడుస్తుంటే చూసి నవ్వుకొనే శాడిస్టులాగా కనిపిస్తున్నానా నీకు? ఇలా పుట్టించడమే నేను చేయగలిగింది. నాకు చేతనయింది. అంతే.

వీళ్ళకు మనలాంటి శ్రుతిమించిన పోటీతత్వం లేదు. నింపాదిగా తమ పని తాము చేసుకొంటూ పోతారు. రేయింబవళ్ళు పనిచేసి అందరికన్నా ముందు ఉండాలి అన్న తాపత్రయం లేదు. ఒక పట్టాన సహనం కోల్పోరు, ఆవేశపడరు. మనం కోల్పోయి ఆవేశపడినా స్పందించనే స్పందించరు. తరిమో, ఆశపెట్టో, భయపెట్టో వీళ్ళతో పనిచేయించలేం.

జనార్ధనరాజుకి రోజూ పిట్ట మాంసం వుండాలి. లేకపోతే ముద్ద దిగదు. నల్లగా నేరేడుపండులా నిగనిగలాడే జనార్ధనరాజు వయస్సు యాభైకి అటూ ఇటూ వుంటాయి. అంతటి నలుపు మొహంలోనూ ఎర్రటి పెదాలు ఎప్పుడూ తాంబూలం వేసుకున్నట్టు కనిపిస్తాయి. కాంతులీనే ఆయన కళ్ళు ఎలాటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆడవాళ్ళనైతే మరీను. ఆయన్ని బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆయన కళ్ళ వెనక కదిలే భావాల గురించి తెలుస్తుంది.

మా నాన్నకి కామ్రేడ్ గావ్‌ని చాచి లెంపకాయ కొట్టాలనిపించిందిట. మా అమ్మ చనిపోతే అతనికెందుకానందమో మా నాన్నకర్థం కాలేదు. నిజానికి, కామ్రేడ్ గావ్ ఆనందమల్లా, తను ఇంకా వెతకాల్సిన పని తప్పినందుకు మాత్రమే. కామ్రేడ్ గావ్ మా నాన్నతో తరువాత అన్నాడట. “షాంగ్‌హాయ్‌లో ఎంతమంది షూ గూయింగ్‌లున్నారో, మీకు తెలుసునా? 288 మంది! వాళ్ళలో ఒక మగవాడు కూడా ఉన్నాడు.

ఊహ కందని ఉదాసీనత
బరువుకాని బరువై
ఎద మీద వాలుతున్నప్పుడు
మూసీ మూయని నా కనురెప్పల మాటున
కదలీ కదలని ఒంటరి మౌన మేదో
దైన్య చిత్రాలను చెక్కుతుంటుంది.

కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను
శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను

సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను
పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను

కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను.

తమని బాణాలతో కొట్టిన ఆ రాముడే కొద్ది రోజుల ముందు, తమ తల్లి తాటకిని కడతేర్చాడు. ఆ కుర్రాడు పినతల్లి కైక దగ్గిరే విలువిద్య అంతా నేర్చుకున్నాడనీ ఆవిడ ఈ కుర్రాణ్ణి స్వంత తల్లికంటే ఎక్కువగా చూసుకుంటోదంనీ తెలిసొచ్చింది. సవితి అంటేనే తన పిల్లలు కాని వారిని రాచిరంపాన పెడుతుందని కదా లోకంలో అనుకునేది? ఇదో వింత అయితే, తన తల్లి తాటకిని చంపినందుకు విశ్వామిత్రుడు తన దగ్గిరున్న అస్త్రవిద్యంతా ఈ రాముడికి ఉచితంగా ధారపోశాడు.

నీ పచ్చని నవ్వుల నాట్యం
మొగ్గలు తొడిగే కొమ్మ చివర్లు
ప్రసరించే రంగుల మేళవింపు
నేల గుండెపై పసిపాదాల తప్పటడుగులను
గుర్తు చేస్తే, మళ్ళీ అదే ప్రశ్న-
అసలేం చేశానని?!

ఉరికంబంలాగానో, ధ్వజస్థంభంలాగానో నిటారుగా నిలబడి మనం అన్నిటినీ ప్రశ్నించగలం. అసలు ప్రశ్నే ఎదురవని సమాజం చివరికి అంతరంగం కూడా సులువుగా పట్టుబడవని రచయిత నందిగం కృష్ణారావు ఈ నవలతో మనముందుకు వచ్చారు. ఆ పై, ఇరుపక్కల తోడై నీకో నిజాయితీ, నిన్ను దాటిన ప్రయోజనం, వీటిలో మనిషితనం వుండాలనీ కూడా గుర్తు చేయించే పనిపెట్టారు ఈ నవలతో.

రోజూ కనిపిస్తే ఊరికే వినిపిస్తే
మర్చిపోవడం దృష్టి మరల్చుకోవడం
ఖాయమే కానీ…
అందుకోవాలని లేదు అంతులేనిదనీ కాదు
ఆశువుగా చిప్పిల్లిన అలవిగాని ముదమేదో
అంతటా నిండి అలరిస్తుంటే…

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

నిజానికి ప్రతి మనిషి మనసూ ఒక యుద్ధ రంగమే. ప్రత్యర్థులూ, పరిష్కారాలూ, కొండొకచో ఒప్పంద మార్గాలూ మారుతూ ఉంటాయంతే. నేరుగా వస్తున్న కథల్లోనైనా, అనువాదాల్లోనైనా, అరిగిపోయిన వస్తువుగా కనపడుతోన్న స్త్రీ పురుష సంబంధాలను దాటి, విభిన్నమైన వస్తువులతో ముడిపడ్డ కథల ఎంపిక పాఠకులకు తెరిపినిస్తుంది.

క్రితం సంచికలోని గడినుడి-37కి మొదటి ఏడు రోజుల్లోనే ఏడుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, వైదేహి అక్కిపెద్ది, భమిడిపాటి సూర్యలక్ష్మి, బండారు పద్మ, జి.బి.టి సుందరి, అగడి ప్రతిభ, రవిచంద్ర ఇనగంటి, ఆళ్ళ రామారావు, అన్నపూర్ణాదేవి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-37 సమాధానాలు, వివరణ.

అడ్డం తరుణోత్పలంలో ఎర్రరాయి (5) సమాధానం: అరుణోపలం పద్యంలో పావువంతు (3) సమాధానం: పాదము విడూరదేశ అంబాలారాజముద్ర (5) సమాధానం: బాలారాజము తెల్లనిదే కాని […]

కేవలం తన ఆలోచనలను అక్షరబద్ధం చేసుకొని చూసుకోవడమే రచయిత లక్ష్యమైతే సాహిత్యం అనేదే ఉండదు. తన ఊహలు, అభిప్రాయాలు, ఆలోచనలు పదిమందికి తెలుపవలసి ఉన్నదనే స్పృహ సాహిత్యానికి, ప్రత్యేకించి ఆత్మకథాసాహిత్యానికి మూలబీజం. రచనకు కావలసిన ముడిసరుకులన్నీ జీవితంలోనే ఉంటాయి. కానీ అనుభవాన్ని రచనగా మార్చే పాటవం, ఆ చెప్పడంలో తనలోకి తాను నిజాయితీగా చూసుకునే చూపు రచనలను మనకు దగ్గర చేస్తాయి. అనుభవాలు వ్యక్తిగతమై, మనిషి లోతులు, బలహీనతలతో సహా అర్థమవుతున్న కొద్దీ, ఆ రచయిత మనిషిగా పాఠకుడికి ఆప్తుడవుతాడు. బహుశా ఇందుకే ఆత్మకథలు ఎప్పుడు ఎవరు రాసినా చెల్లుతూనే ఉన్నాయి. అవి శ్రీపాద అనుభవాలూ- జ్ఞాపకాలూ, దాశరథి జీవనయానం లాగా తమ తమ జీవితాల సాక్షిగా పాఠకులకు ఆనాటి చరిత్రను పరిచయం చేయవచ్చు. అబ్బూరి వరదకాలం లాగా, ఆచంట జానకిరామ్ సాగుతున్న యాత్ర లాగా, తమ జీవితాల్లోని ముఖ్య సంఘటనలను, ప్రముఖుల సాంగత్యాన్నీ మాత్రమే పొందుపరచవచ్చు. లేదూ, తమ మామూలు జీవితానుభవాలనే ముళ్ళపూడి శ్రీదేవిలా నెమరేసిన మెమరీస్‌ గానో, సోమరాజు సుశీలలా ఇల్లేరమ్మ కతలు గానో చెప్పి ఆకట్టుకోనూవచ్చు. ఒక ‘నేను’ తన జీవితంలోని బాధనైనా సంతోషాన్నైనా, తనకు తానుగా సాధించుకున్న విజయాలైనా పరాజయాలైనా, తన తలపొగరైనా, గర్వభంగమైనా, పంచుకోదగినదేనని నిస్సంకోచంగా నమ్మి ఉండకపోతే, ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో సింహభాగం వెలుగు చూసేది కాదు. నిరాధారమూ, అసమంజసమూ, అసందర్భమూ అయితే తప్ప, స్వోత్కర్ష, పరనింద కూడా సాహిత్యంలో చొరబడరానివేం కావు. అందుచేత, ఎవ్వరైనా ఏదైనా ఎలాగైనా చెప్పవచ్చు. కానీ, నిజం నిక్కచ్చిగా చెప్తున్నామన్న అపోహలో అకారణమైన అక్కసునీ, ఇతరుల పట్ల ద్వేషాన్నీ కథలుగా, ఆత్మకథలుగా రాయడం సరి కాదు. సాహిత్యానికున్న పరిధినీ విశాలమైన వేదికనూ స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించుకుంటే, ఇప్పటిప్పుడు అడ్డుకునేవారు లేకపోవచ్చు. అంతమాత్రాన, రాసినదంతా సాహిత్యమూ కాదు, సాహిత్య చరిత్ర అంతకన్నా కాబోదు. తాత్కాలికమైన ఉద్వేగాలూ స్నేహాలూ శత్రుత్వాలూ కాలంతో కరిగిపోయాక, నిజాయితీగా తమ కథలు వినిపించిన గొంతులే మిగిలి, ముందుతరాలకు తమ కాలపు సాహిత్య చరిత్రను నిష్పక్షపాతంగా చెప్తాయి.