“రైల్ టికట్ సర్కార్‌నే ఫ్రీ మే దేదియా, గోవాలో తిరిగేసి టైమ్‌పాస్ చేసేసి పోదాంలే, కోర్స్ అయిపోతుంది కదా అనుకోకండి.” కరుకుగా మోగింది కనకప్పన్ గొంతు. “ఇంకోసారి మీ స్క్వాడ్ గురించి ట్రైనింగ్ జేసీవో నాకు కంప్లైంట్ చేశాడో…” అందర్నీ కలయజూశాడు ఒకసారి. పిడికిట్లో ఏదో నులుముతున్నట్లు సైగ చేస్తూ “నిచోడ్ దూంగా! ఇంకెందుకూ పనికి రాకుండా చేసేస్తాను జాగ్రత్త!” బయటికి నడిచాడు. పీకల్దాకా మండింది అందరికీ – జిబోన్‌గాడి మీద.

ఏదీ ముందుగా వ్రాసి పెట్టుకున్నది కాదు. ఏ నెల కానెల అప్పటికప్పుడు వ్రాస్తూ వచ్చిందే. ఈమాట నవంబర్ 2021 సంచికలో ఈ ధారావాహిక మొదలయ్యింది. నవంబరు 2022కి అంతా అయిపోదా అనే ధీమా ఉండింది. ఇప్పుడు మార్చి 2023. వ్రాస్తూ పోతే ఇంకా 16 నెలలు వచ్చేట్టు ఉంది.

తెలుగు సాహిత్యం చంద్రోదయవర్ణనల ఆటపట్టు కదా. పై రెండు పద్యాలలో మొదటి పద్యంలోని వస్తువదే. రెండవపద్యంలో వెన్నెల వర్ణించబడి ఉంది. ఎక్కువమంది కవులు వర్ణించిన వస్తువుపై మళ్ళీ ఒక కవితనల్లాలంటే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురాక తప్పదు. ఉదయాస్తమయ వర్ణనలయితే, ఇక కొత్తగా ఊహించడానికి ఏమీ లేదు అనేంతలా వర్ణనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా, ప్రతి చిన్ని కవినీ తమవైపుకు లాగుకొనే ప్రకృతిసమ్మోహనశక్తులవి.

మళ్ళీ తెలవారంగానే
తెలిసిందే అయినా సరే
ఏదో ఒక దారి ఎంచుకుంటూ
సమాధానపడుతూ
ఖాళీలను పూరించాలనుకుంటూ
ఒక ఘడియ నుంచి ఇంకో ఘడియలోకి

కొద్ది వారాల తర్వాత ఫ్రాన్సిస్ ఆంటీ మళ్ళీ ఫోన్ చేసింది. ఇంకో ఉత్తరం రాయాలట నేను. ఆ ఉత్తరం ఫ్రాన్సిస్ అత్తయ్యకు పంపాను. కొద్ది రోజుల తర్వాత ఆమె నుంచి ఫోన్ వచ్చింది. హెరాల్డ్ ఫోన్ తీసి, మౌత్‍పీస్‍కు చెయ్యి అడ్డం పెట్టి “ఫ్రాన్సిస్ ఆంటీ, నీ ఉత్తరం గురించి లేటెస్ట్ రివ్యూ కాబోలు” అన్నాడు. ఫోన్ తీసుకున్నాను. “జోనథన్? నీ దగ్గర చాలా టాలెంట్ ఉందిరా. ఎంత బాగా రాశావో ఉత్తరం. చదువుతుంటే నాన్నమ్మ మొహం వెలిగిపోయిందనుకో. “

ఇన్నేళ్ళుగా దాచిన సమావేశాల రహస్యం గురించి నాకెలా తెలిసింది? దానికి సమాధానం- యుద్ధం. ఈ యుద్ధం, యుద్ధానికి కారణమైన రహస్యాన్ని తప్ప తక్కిన రహస్యాలన్నిటికీ తెర దించింది. ఆత్మవిమర్శలో నిమగ్నమైన ఈ ప్రపంచం, ఆ ఒక్క రహస్యాన్నీ పక్కన పెట్టేసింది. ఎక్స్-క్లబ్ సభ్యులు పదిహేనుమందిలో తొమ్మండుగురు యుద్ధరంగంలోని ఆసుపత్రులలో పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. తక్కిన వారికి ఉన్నచోటే పని మరింత పెరిగింది.

ఆయన ఒక పెద్ద తాడు చివర్న కొక్కెం కట్టి చందమామ మీదకి విసురుతున్నాడు. తెల్లనిగోళం తన చేతుల్లోకి వచ్చి పడేవరకూ ప్రయత్నించాడు. చాలా అలసిపోయాడు. అంత పెద్ద గోళం అమాంతం వచ్చి పడేసరికి బరువు మోయలేక నానా యాతన పడ్డాడు. అక్కడికి దగ్గరలోని భవనాల నీడలో నక్కినక్కి చూస్తున్న వ్యక్తిని పిలిచాను, ఆ పెద్దాయనకి సాయం చేయమని. అప్పటికే చందమామ నుంచి జారిన నీటి చుక్కలు అతని పాదాలమీద పడ్డాయి.

ముసలివాడికి సమయం ముగిసింది. లాంతరు వెలుగు పూర్తిగా పెంచి పెద్దగా పొలికేక పెడుతూ గదిలోకి దూకాను. ముసలివాడు అరిచాడు – ఒకే ఒకసారి. క్షణం ఆలస్యం కాకుండా ముసలివాడిని మంచం మీద నుండి కిందకు తోసి బరువైన పరుపు వాడి మీదకు లాగాను. కొట్టుకుంటున్న వాడి గుండె చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది. అయితే అది ఇప్పుడు గోడ దాటి వినిపించదుగా. చివరకి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది. ముసలివాడు చచ్చిపోయాడు.

శూన్యం చిటికెనవేలు పట్టుకొని
ధీమాగా నడిచానని
మరొకరి ముందు మోకరిల్లిన నీడను
తనదిగా పొరబడ్డానని
మనసును మళ్ళీ మళ్ళీ
ముక్కలుగా చేసుకున్నదేమో!

కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం తీసుకువచ్చిన దేవదాసీల గురించి పరిశోధనలు జరిగాయి. జీవిత చరిత్రలూ వచ్చాయి. కానీ అవి ఒకరిద్దరిని తప్ప ప్రతిభావంతులైన ఎంతో మందిని పట్టించుకోలేదు. వీళ్ళంతా తుదీ మొదలూ లేని అయోమయంలోకి జారిపోయారు. నవలారూపంలో అయినా వారికి మాట్లాడే కనీసపు హక్కుని ఇవ్వడానికి నేను ప్రయత్నించాను.

అరబ్బీ, పారసీక కవిత్వములో ముఖ్యమైన ప్రక్రియలు నాలుగు: అవి గజల్, ఖసీదా, మస్నవీ, రుబాయి. చాలమందికి గజల్, రుబాయీలు పరిచయమే. వీటిలో ఒక పాదమును మిస్రా అంటారు; రెండు పాదములను శేర్ అంటారు. రెండు శేర్‌లు ఒక రుబాయీ. అనగా రుబాయీ ఒక చతుష్పది. అరబ్ భాషలో అర్బా అంటే నాలుగు అని అర్థము.

అడ్డం భూమితల కింద రాక్షస స్త్రీ (3) సమాధానం: భూతకి అన్నింటికన్నా చిన్నదైన లేశము (3) సమాధానం: అణువు వికృతమైన లక్షణము (4) సమాధానం: […]

క్రితం సంచికలోని గడినుడి-76కి మొదటి ఇరవై రోజుల్లో పదహారుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-76 సమాధానాలు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

రచయితల బృందాలే మనకు మిగిలిన పాఠక బృందాలు కూడానా అన్న అనుమానం కలిగించే సంధికాలంలో నిలదొక్కుకోవడానికి తెలుగు సాహిత్యం ప్రస్తుతం అవస్థపడుతోంది. బహుశా అందుకే రచయితలు కూడా పాఠక బృందాల కోసం, రచయితలుగా తామే గుంపులో చేరాలో కూడా ముందుగానే నిశ్చయించుకుంటున్నారు. ఈ సాంఘిక సాహిత్య సంప్రదాయాలని ఎంత వంటబట్టించుకున్నా, రచన మనగలిగేది దాని నాణ్యత వల్ల మాత్రమే. పుస్తక ప్రచురణ అరచేతిలో ఉసిరికాయలా మారిపోయాక, అచ్చులో పేరు చూసుకోవడమనేది ఈనాడు ఆర్థికంగా పుష్టిగా ఉన్న అందరికీ తీరగల్గిన కలే అయింది. వేరే పత్రికవారు ప్రచురించకుంటే తామే పత్రిక పెట్టుకొని ప్రచురించుకోవడమూ ఒక పంథాగా మారింది. అందువల్లనేనా అచ్చులో తమ పేరు చూసుకోగలిగిన వారంతా తాము ‘రచయితల’మని భ్రమపడుతున్నారు? ఆ వెంటనే తెలుగునాట సంప్రదాయం ప్రకారం ఆ భుజకీర్తి ధరించి సమాజోద్ధరణ తమ బాధ్యతన్న అహాన్ని శిలువలా మోస్తున్నారు? రచయితకు సమాజం పట్ల ఎలాంటి బాధ్యతా ఉండనవసరం లేదన్నది అటుంచుదాం. నిజానికి, సమాజంలో మార్పు తేవాలంటే రచన అన్నిటికన్నా బలహీనమైన ఆయుధం అన్న నిజాన్నీ పక్కనపెడదాం. దానికంటే ముందు, రచయితలు అని ఎవరికి వారు అనుకోవడమేనా? లేదా ఏదైనా ప్రామాణికత ఉందా? చిత్రమైన విషయమేమంటే, సాహిత్యం ఇతర కళలలాగా మన లోటుపాటులు మనకు చెప్పదు. మన పాట, మన ఆట మన స్థాయేదో వెంటనే చెప్తాయి. కానీ వ్రాత అలా కాదు. మనది అనుకున్న రచనలో ఏం ఉందో, ఏం లేదో అర్థం చేసుకోవడం కూడా దానికదే ఒక అభ్యాసం. దురదృష్టవశాత్తూ తెలుగులో ఆ అభ్యాసానికి చోటు లేదు. ఇది మాతృభాష కాబట్టి, తమకు బాగా వచ్చని, ఇందులో తమ భావాలను తాము అనుకున్న విధంగానే వ్యక్తపరుచుకుంటున్నామనీ అపోహలో వ్రాసుకుపోయేవారు ఎందరో లెక్కలేదు. పైగా, రచన సహజంగా అంతరాంతరాల్లో నుండి సజీవ అనుభవంగా కాగితం మీదకి రావాలన్న ఊకదంపుడు ఉండనే ఉంది. ఆ సజీవ స్పందన ఒక మనిషి నిజంగా అనుభవించినదే అయితే, అందులోని ఉద్వేగాలు అంతే బలంగా, అంతే నిర్మలంగా అక్షరాల్లోకి తర్జుమా కాకపోతే అది ఆ అనుభవానికే అవమానం అన్న ఎరుక, రచయితల్లో కొరవడిందని ఇటీవల వస్తున్న ఎన్నో స్వగతాలు, సొంత కథలు, అదే ధోరణిలో సాగుతున్న కవితలు చెబుతూనే ఉన్నాయి. నిజానికి ప్రపంచంలో కథకు పనికిరాని వస్తువు లేదు. ఏదయినా కథగా మారుతుంది, అది ఒక మంచి కథగా చెప్పగలగాలి, కథనంలో పదును, ఒడుపు ఉండాలి. పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి. ఆ ప్రతిభ ఇప్పుడున్న రచయితలలో నూటికో కోటికో ఒకరిద్దరిలో ఉంది. సహజ ప్రతిభ చాలా కొద్దిమందికే దక్కిన వరం. మిగతా అందరికీ రచయిత కావాలి అంటే వాక్యంతో ఎంతో పరిశ్రమ అవసరం. వాక్యంతో వస్తువుతో మమేకమవ్వడం అవసరం. ఎవరికి వారే రచయిత అనుకోవడంలో అర్థం లేదు. రచనావ్యాసంగం మిగతా కళలకంటే కష్టతరమని, దానికి ఎంతో సాధన, అధ్యయనం కావాలని గమనించనంత కాలం ఎవరూ రచయితలు కాలేరు. పాఠకలోకం మీద విమర్శలు గుప్పించి తమ అసహనాన్ని చాటుకోవడం నుండి ఈ తరహా రచయితలు ఎన్నటికీ విముక్తులు కాలేరు. తమ పుస్తకపు, రచనల విలువను ఎవరూ గుర్తించడం లేదని, తెలుగునాట ఆ స్థాయి గల పాఠకులు లేరని, తమ పుస్తకాలకు అమ్మకాలు లేవని, ఇక్కడ కుట్రలూ మోసాలు జరుగుతున్నాయనీ సామాజిక మాధ్యమాలు వేదికగా గొంతెత్తి చెబుతున్న రచయితలకు కొదువేం లేదు. అయితే వీటిలో నిజమెంత? అమ్మకాలు సమీక్షలు ఎంత మేరకు రచన విలువను పట్టివ్వగలవు? అన్న ప్రశ్నల కన్నా ముందు రచయితల లోపల సుళ్ళు తిరగాల్సిన ప్రశ్న: నేను నిజంగా రచయితనేనా?

వేస్డ్‌ లాండ్‌లో ఏ గొంతు ఎవరిది అని అడుగడుగునా అడుగుతూ చదవాలి. మరి ఆ మొదటి మాటలు ఎవరివి? ఎనిమిదో పాదంలో మరీ అనే ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ మరీయే, మొదటి ఏడు పాదాల నాందీ పద్యం కూడా చదివిందనుకోవాలా? అలా అనిపించదు. మరి, ఎవరి మాటలు?

మనోరమ నాకన్నా బాగా పెద్దమ్మాయి. దానికి చాలా విషయాలు తెలుసు. అది మగపిల్లల బళ్ళో చదూతూంది. నే నాల్గోక్లాసు చదూతూన్నప్పుడు నాన్న తనతోపాటు నన్నూ కానుకుర్తివారి సత్రంకి తీసుకెళ్ళేడు. అదిగో – ఆవేళ అక్కడ మొట్టమొదటి సారి మనోరమని చూశా. మాటాడే. నాటకం చూడ్డానికే కాదు, డబ్బులు దండడానికీ వచ్చేనని చెప్పింది.