అందరూ వెళ్ళిపోయాక ఒక్కడే మిగిలాడు. ఒక్కడే! వెళ్ళినవాళ్ళు వచ్చేవరకూ ఏం నమ్మకం? వాళ్ళొస్తే లక్ష్మి ఇక్కడే ఎక్కడో ఉందని, ఉంటుందని అనిపిస్తుంది. బయటో, లోపలో ఉండే ఉంటుంది. కళ్ళు దించుకొని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వచ్చి ఎదుట నించుంటుంది. వచ్చి నిలబడకపోతే మానె. అసలు లక్ష్మిని మళ్ళీ ఎవరు తీసుకు రాగలరు? ఎవరు తిరిగి వచ్చారు ఇంతవరకూ? ఎవరైనా తీసుకొని రాలేరు. అసలిప్పుడు వాళ్ళకు అమ్మ ఎందుకు? వాళ్ళు పెళ్ళాల సొంతమైపోయారు.
శీర్షికలు సంచికలు
“ఆర్మీలో పని చేశాక అంతో ఇంతో నట్ కాకుండా ఎలా ఉంటారు? పిటిఎస్డి – పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిౙార్డర్. రామాయణంలో రాముడికి అదే జరిగింది. లేకపోతే యుద్ధం ముందు భార్య నెత్తుకుపోయారని అంత ఏడ్చిన వాడు యుద్ధం గెలిచాక, ఆమెను నిప్పుల్లోకి ఎందుకు దూకమంటాడు? కాంబాట్ స్ట్రెస్. టెంపరరీ ఇన్సేనిటీ. ఐ హోప్, నీ విద్యార్థినికి సైకియాట్రిక్ హెల్ప్ ఉందని.”
“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.
గ్రెటా అంత పెద్ద అందగత్తేం కాదు. కానీ ఆమె మొహంలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. ముఖ్యంగా నవ్వుతుంటే! వయసు నలభై ఉండచ్చు. ఒకసారి నీ వయసు నలభై ఉండచ్చు కదూ అని అడిగితే కొట్టినంత పని చేసింది. మిసమిసలాడుతూ ఉన్న గ్రెటాకి నప్పనిది ఆమె జుట్టుకేసుకున్న రంగే! తెల్ల రంగు మొహమ్మీద నల్ల టోపీ పెట్టుకున్నట్లుంటుంది. అదే అంటే ఒక్క తోపు తోసింది. నేను తనని వేళాకోళం చేస్తానన్న విషయం ఆమె గ్రహించి నాతో తక్కువగా మాట్లాడేది.
“నేనొచ్చిన సంగతి తెలిసి అమ్మ ఒక్క గెంతుతో కిందకి దిగింది. అందరూ నన్ను ముట్టుకోడానికి పోటీలు పడ్డారు. దెయ్యాన్ని కాదని నిశ్చయించుకోడానికి కాబోలు! నా మీద పడి అంతా ముద్దులు కురిపించేసరికి ఊపిరాడలేదంటే నమ్ము! అది సరే కానీ, ఈ కుక్క పిల్లకెంత దాహమో చూడు! అసలు దీంతో పాటు ఒక నీళ్ళ టాంకరు తెచ్చుకోవాల్సింది మనం. ఈ ఎండలకిది ఇద్దరు మనుషుల నీళ్ళు తాగుతుంది.”
మన తెలుగుభాషలో ‘పొంకము,’ ‘బింకము’ అని రెండు చక్కని పదాలున్నాయి. పొంకము అంటే పొందిక, బింకము అంటే బిగువు. శారీరక సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ముఖ్యంగా యీ పదాలు వాడుతూ ఉంటాం. సంస్కృతంలో సౌష్ఠవం అనే పదానికి యిదే అర్థముంది. మనిషి శరీరంలోనే కాకుండా సృష్టిలో అనేక చోట్ల అనేక రూపాల్లో మనకీ సౌష్ఠవం దర్శనమిస్తుంది. పూలరేకుల అమరిక దగ్గరనుండీ, గ్రహగతుల సమీకరణాల వరకూ విస్తరించిన సౌందర్యం అది.
చేతులారంగ తెలుగును జేయ హత్య
దివురుచున్నవి పత్రికల్ దినము కొన్ని!
వాక్యనిర్మాణ చాతుర్యవాంఛ వ్యాక
రణము దొరగుచు కావ్యలక్షణము మరచి!
ఎప్పుడో చూశాను ఇవే గోడల్ని, ఇదే, ఈ ఆకలి గొన్న శునకాన్ని
నన్ను గిరాకీ అనే ఒక సర్వనామంతో సంభావించే చోదక నేత్రాల్ని
ఎప్పుడో చూశాను ఈ గోడల్ని సరిగ్గా ఇవే గొడవల్ని, ఇది మామూలే.
దులిపేం
చొక్కాల మీది
గండు చీమల్ని
కంగారు గాలిని
తోసేం
పొద్దు పచ్చిక
మేసేం.
బోడిగుండంత సుఖం లేదని తెలిసినా
జులపాల జుత్తు పెంచుకున్న వాణ్ణి.
ఊరుకున్నంత ఉత్తమం లేదని తెలిసినా
కంద దురదా కత్తిపీట దురదా
కలిపి కళ్ళకద్దుకుని
నాలుకకు రాసుకున్న వాణ్ణి…
ఒకసారి వెళ్ళి ఆ దాక్కున్న నదిలో
మునకేసివద్దామా?
ఇక్కడ ఎవరికి ఎవరు ఏమైయ్యారని
మురికి అవయవాల మధ్య మలినమైన
బ్రతుకు వివరాలన్నీ ఏ భాగీరథిలో
కలిశాయని అడుగుదాం.
ఇక్కడ ఒకడుగు
అక్కడ రెండడుగులు
నేలమీద నేను
నేలా నింగీ తను
పరుగుల పందెంరెక్కల్లా చేతులు చాచి
తనకోసం పరుగెడుతూ నేను.
గణితంలో ప్రావీణ్యం లేని వారు కూడ, గణితపు లోతులని తరచి చూసే సామర్ధ్యం లేని వారు కూడ, ఈ ప్రధాన సంఖ్యల అందచందాలని చవి చూడకపోతే జీవితంలో ఒక వెలితి మిగిలిపోయినట్లే. అదృష్టవశాత్తు ఈ ప్రధాన సంఖ్యలలోని అందచందాలని చవి చూసి ఆనందించడానికి గణితం లోతుల్లోకి అతిగా వెళ్ళనక్కరలేదు.
ఇది భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, ఇటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. ఆంధ్రభాషలో పాండిత్యం కోసం కావ్యనాటకసాహిత్యాలలోని వ్యాకరణ ఛందోలంకార శాస్త్రాధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు, పాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం!
ప్రబంధరాజంలో వేంకటకవి కావించిన సంస్కృత శ్లోకానువాదాలను గురించి ఇంకా లోతుగా పరిశోధింపవలసి ఉన్నది. వేంకటకవి ఆ పద్యాన్ని ఏదో సంస్కృతశ్లోకానికి అనువాదంగా కాక, తన ముందున్న ఏదో తెలుగు పద్యాన్నే పర్యాయపదాలతో మార్చి చెప్పివుంటాడనే నమ్మకం వల్ల అలా గుర్తుపట్టిన కొన్నింటిలో ముఖ్యమైనవాటిని ఈ 2వ ప్రకరణంలో వివరిస్తాను.
స్వరార్చనం కల
రాగ సుధా రసార్ణవం
చెన్నారెడు చెవి తేనియలై కీర్తనలూ
అనశ్వరం
ఎందరో హేమాహేమీలు: మల్లిక్, ఓలేటి, ఎన్.సిహెచ్.వి. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, … పాల్గొన్న ఈ చక్కటి సంగీతనాటిక విజయవాడ స్టేషన్లో, 1970ల చివర్లోనో, 1980ల ప్రారంభంలోనో, ప్రసారితమైంది.
కోనసీమని తలచుకుంటే ఇప్పటికీ కొబ్బరి తోటలు, కాలువలు, పచ్చని పొలాలు – ఇవే గుర్తొస్తాయి. ఈ సీమ నుంచి బయటపడి ఇంగ్లీషు చదువులు చదువుకుని పైకొచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నా కానీ, వేదపారాయణులు, నిత్యాగ్నిహోత్రులు అయిన అతి కొద్దిమంది బ్రాహ్మణులు ఈ ప్రాంతంలో ఇంకా వున్నారు. భమిడిపాటి వారు, బులుసు వారు, దువ్వూరి వారు, పుల్లెల వారు, ఇలా. వేదపఠన పాఠనాన్ని , యజ్ఞయాగాదులని శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ ఈ కుటుంబాల వాళ్ళు మూడువేల ఏడువందల సంవత్సరాల వైదిక సంప్రదాయాన్ని నిలబెట్టారు. ఇది మానవ జాతి చరిత్రలోనే అపూర్వమైన విషయం. వీరిని క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మమైన వివరాలతో సహా, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయపు ఆచార్యుడు డేవిడ్ నైప్ (David M. Knipe) Vedic voices – Intimate narratives of a living Andhra tradition (2015) అనే ఒక పుస్తకం రాశారు. కేరళ నంబూద్రి బ్రాహ్మణుల అతిరాత్ర అగ్నిచయన క్రతువుని ఫ్రిట్స్ స్టాల్ (Frits Staal)వివరంగా రెండు పుస్తకాలు, ఒక చలనచిత్రంగా భద్రపరిచాడు. ఇప్పటికీ వైదిక సంప్రదాయాన్ని గురించి పాఠాలు చెప్పే తరగతుల్లో వీటిని వాడుతూ వుంటారు. కానీ, వైదిక బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గుర్తింపు ఇప్పటి దాకా లేదు. నైప్ పరిశోధన ద్వారా ఆ సంప్రదాయాల నిర్వికార ప్రాచీనత గురించి వివరంగా తెలుస్తుంది. వైదిక సంప్రదాయాన్ని గురించి ఇతర ఆధారాలతో రాసిన పుస్తకాలు చాలా వున్నాయి కానీ ఇప్పటికీ వున్న వైదిక కుటుంబాల దైనందిక జీవితాన్ని పరిశీలించి వివరంగా రాసిన పుస్తకం ఇదొక్కటే.
డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి (1944 – 2015): నరసింహ మూర్తిగారు చక్కటి సాహిత్య విమర్శకుడు, గొప్ప వక్త కూడా. ఇతర భారతీయ భాషల ఆధునిక నాటకాలతో పోల్చి, మూర్తిగారు రాసిన కన్యాశుల్కం – తులనాత్మక పరిశీలన అన్న బృహద్గ్రంథం వారికెంతో పేరు తెచ్చింది. ఔచిత్యప్రస్థానం, కథాశిల్పి చాసో, కవిత్వదర్శనం మొదలైన పుస్తకాలు ప్రచురించారు. రబీంద్రనాథ్ టాగోర్ నేషనల్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక తెలుగువాడు, ఇటీవలే పరమపదించిన ఈ సాహితీవేత్తకు ఈమాట శ్రద్ధాంజలులు.
తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, వాళ్ళు తెలుగు పుస్తకాలు చదివి అందువల్ల గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — తెలుగు ప్రపంచ భాష అవుతుంది.