అగస్త్యుడు తానొక్కడే చకచకా ఆ కొండెక్కి లోపాముద్రని వచ్చేయమనలేదు. పాపం అసలే సన్నని నడుమేమో, అంత పెద్ద కొండ ఎక్కేటప్పుడు ఆమెకి నడుమునొప్పి రాక మానదు. అది గ్రహించిన అగస్త్యుడు, తానొక అడుగు ఎక్కి, ఆమె చేయిపట్టుకొని, ప్రేమగా రమ్మని పిలిచి, ఎక్కిస్తూ, ఎంతో ఆదరంతో జాగ్రత్తగా తనతో పాటు కొండ చివరికంటూ తీసుకువెళ్ళాడట. ఆ తర్వాత అక్కడి జలపాతాలలో వారిద్దరూ సరిగంగ స్నానాలు చేశారు. ఎంత చూడముచ్చటైన దృశ్యమో కదా!

పోతనగారు శ్రీమహాభాగవతంలో మూలాతిరిక్తంగా కనీసం ముప్ఫై – నలభై గ్రంథాల నుంచి డెబ్భై దాకా అనువాదాలను చేశారు. అమోఘమైన ఈ పద్యానికి మూలం సంస్కృత భాగవతంలో లేదు. రుయ్యకుని అలంకారసర్వస్వానికి జయరథుడు కూర్చిన విమర్శినీ వ్యాఖ్యలో సారాలంకార వివరణ వద్ద ఉదాహృతమై ఉన్నది. పోతనగారి బహుగ్రంథశీలితకు, విశాలమైన వైదుష్యానికి, విపులపాండిత్యానికి నిదర్శకమైన మహాద్భుతఘట్టం ఇది.

కార్లు బైకులు. మల్టిప్లెక్సులు. ఇంగ్లీషు మాటల అడ్వాన్స్ క్యూ. షరా మామూలు టిక్కెట్టు క్యూ.
సోఫాల్లా సీట్లు. పెద్ద సైజు తెర. మొబైలు ఫోన్లపై తారాడే వేళ్ళు వేరార్యూ టెక్స్టింగులు.
జీరో సైజుల షో అప్పులు బ్యాక్‌లెస్ క్లోజప్పులు విఎఫెక్స్ ఫైట్స్ చేజెస్ హీరో బిల్డప్స్.

అలవికాని తళుకు బెళుకులతో,
అర్థరాత్రి దాకా ఆనందాన్ని వెతుకుతూ తిరిగే మనుషులతో
సతమతమయ్యే ఊరిని చూసి
ఆకుల రంగులే ఆభరణాలుగా ధరించిన అడవి
చిన్నగా నవ్వుకుంటుంది.

మనిద్దరి మధ్యా మాటల అవసరం యేముంది
చూపుల కొసలమీద వేళ్ళాడుతూ
కాళ్ళావేళ్ళా పడే అభ్యర్దనలు
వేలికొసలనుండి పాకిపాకి
నిలువెల్లా పరామర్శించే అనునయాలు

ఎక్కడెక్కడ తిరిగేవు నాయినా బిడ్డా సిపాయి చిన్న
ఎండనపడి వొచ్చేవు నాయినా నా కన్న?
కోనాడ అడివుల్లంట యేటకెల్లేనులేయే మాయమ్మ
పేనాలు పోతన్నాయి పక్కన్న పరిసిత్తు రమ్మీ!

నిన్న ఏ సమయంలో నువ్వు నాతో తిరగడానికి
బయలుదేరావో ఏడణాలిచ్చి రిక్షా ఎక్కి
అకస్మాత్తుగా సముద్రపు వడ్డుకు,

Did you know, that I would suddenly die,
wouldn’t be alive to break bread with you?

ఓ కొండచిలువ రాత్రి
నాలుగు వగరు బీర్లు ఖర్చవనిదే
ఓ స్నేహం చిక్కబడదు

ఒక శీతాకాలపు సాయంత్రం
కొన్ని అయస్కాంతపు చూపులు నలగనిదే
మంచం సద్దు చేయదు

మీరొక పుస్తకాల షాపులో అప్పటిదాకా మీకు తెలియని ఒక రచయిత పుస్తకాన్ని ఎందుకు మీరు చేతిలోకి తీసుకుంటారు? మీ కంటికి నదురుగా కనిపించే ఆ పుస్తకం ఎలా వుంటుంది? ఏవి ఆ పుస్తకంపై మనకి ఆపేక్ష ఏర్పడేలా చేస్తాయి? అంటే, విషయం ఏదైనా కూడా పుస్తకమూ ఒక వస్తువే!

రీమాన్ ఒక అమూల్య అభిప్రాయం వెలిబుచ్చేడు, రుజువు చెయ్యకుండా! ఈ అభిప్రాయం నిజమే అని రుజువు చేసిన వారికి మిలియను డాలర్లు బహుమానం ఇచ్చేస్తారు. ఏదో పెద్ద విశ్వవిద్యాలయం వారు ఆచార్య పదవి అంటగడతారు. ఏ హా(బా)లివుడ్ తారో పెళ్ళి ప్రతిపాదిస్తే, డాలర్లతో పాటు స్వర్గ ద్వారాలు కూడ తెరుచుకోవచ్చు!

ప్రపంచంలోని నూటా తొంభయ్యారు దేశాల్లోన ఒక్క పాతిక దేశాలే బాగా డబ్బున్న దేశాలు. గొప్ప దేశాల్లోన గొప్ప సంస్థలు, వ్యవస్థలూ ఉంటాయి. తమ తమ ఇష్టాలు, ఆశలు, కష్టం సుఖం ప్రకారం వాటిలో చేరి జనం తమ బుర్రల్ని, బతుకుల్ని ఓదార్చుకుంటారు; తమ సంఘాల్నీ, దేశాల్నీ బావు చేసుకుంటారు. ఇలాంటి వ్యవస్థలు లేనివి, ఉన్నా ఖరాబు చేసుకుని ధ్వంసం చేసుకున్నవీ బీద దేశాలుగా మిగిలిపోతాయి.

నాకు ఊహ తెలిశాకా బాపు బొమ్మలు మొదటి సారి చూసింది వారపత్రికల్లోనే. పత్రికల ముఖ చిత్రాలకీ, కథలకి, కవితలకీ వేసిన బొమ్మలు చూశాకనే బాపు గురించి తెలిసింది. చిన్నతనంలో నాకూ చిత్రకళలో ప్రవేశం ఉండడం వలన, బాపు బొమ్మలు శ్రద్ధగా గమనించేవాణ్ణి.

అప్పుడెపుడో చిన్నపుడు గుళ్ళో ఉన్నప్పుడు భోరున వర్షం కురవడం మొదలై అక్కడే కూచుండిపోతే ఆ చీకట్లో దీపపు వెలుగులో ఉన్నట్టుండి మెరుపు మెరిసి ఆ తెల్లటి వెలుతురు తెర వెనుక వెచ్చగా –

ఈ సంచికలో ప్రముఖ గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం వినవచ్చు. ఈ కార్యక్రమం విజయవాడ స్టేషన్ నుండి 1979-1980 ప్రాంతంలో ప్రసారమయ్యిందని జ్ఞాపకం.

డా. పుల్లెల శ్రీరామచంద్రుడు (24 అక్టోబర్ 1927 – 24 జూన్ 2015): సంస్కృతాంగ్లాంధ్రహిందీ భాషలలో, వేదాంత వ్యాకరణ అలంకారశాస్త్రాలలో అద్వితీయమైన పాండిత్యప్రతిభతో నూటయాభైకి పైగా పుస్తకాలు వ్రాసి, సంస్కృతభాష నుండి ఎన్నో క్లిష్టమైన రచనలను తెలుగు లోకి అనువాదం చేసిన కవి, రచయిత, లాక్షణికుడు, విమర్శకుడు, అలంకారికుడు, వైయాకరుణి, నైఘంటికుడు, సంస్కృతాంధ్ర భాషాసాహిత్యాలకు ఇతోధికంగా సేవ చేసిన మహనీయుడు, డా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఇక లేరు. 1927లో జన్మించిన శ్రీరామచంద్రుడు హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలను, సంస్కృతంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాను సాధించారు. ప్రతిపదార్థాలతో, విశ్లేషణాసహితంగా వాల్మీకి రామాయణానికి చేసిన పది సంపుటుల చక్కటి తెలుగు అనువాదం ఆయన ప్రతిభకు ఒక చిన్న నిదర్శనం మాత్రమే. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం, భరతుడి నాట్యశాస్త్రం, ఉపనిషత్తులు, రాజశేఖరుడి కావ్యమీమాంసా, పతంజలి యోగసూత్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, మమ్మటుడి కావ్యాదర్శం, బ్రహ్మసూత్ర శంకరభాష్యం, ఇలా ఎన్నో సంస్కృత గ్రంథాలను అందరికీ అర్థమయేలా అనువాదం చేసి శ్రీరామచంద్రుడు తెలుగువారికి ఎనలేని మేలు చేశారు; అలంకారశాస్త్ర చరిత్ర, ప్రాకృతభాషాసాహిత్యచరిత్ర వంటి గ్రంథాలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. వైజ్ఞానికశాణ్ముఖమ్, కో వై రసః, పాశ్చాత్యతత్వశాస్త్రేతిహాసః, పారసీకలోకోక్తయః, తదితర సంస్కృత రచనల ద్వారా దేశవ్యాప్తంగా గౌరవం అందుకున్న పండితుడు, సంస్కృతాంధ్రభాషాభివృద్ధి కోసం జీవితాంతమూ కృషి చేసిన మహామహోపాధ్యాయుడు అయిన శ్రీరామచంద్రుడికి 2011లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి కేంద్రప్రభుత్వం సత్కరించింది. నిగర్వి, సహృదయుడు అయిన ఆయన మరణం తెలుగుసాహిత్యం పూడ్చుకోలేని ఒక పెద్ద లోటు.

సంస్కృత గ్రంథాలు, వాటి సమయ సందర్భాలు తెలియని అజ్ఞానం కారణం గానూ, భారత దేశానికి పాశ్చాత్య ప్రపంచం కన్నా గొప్ప నాగరికత వున్నదని అంగీకరించడానికి తమ గర్వం అడ్డు రావడం కారణం గానూ, కొందరు పాశ్చాత్యులు చేసిన దుర్వ్యాఖ్యానాలని సహేతుకంగా కాదనగలగడం శ్రీరామచంద్రుడు చేసిన మహోపకారం. ఈ పని, భారత దేశంలో ప్రతిదీ గొప్పది, పాశ్చాత్యమైనది ప్రతిదీ చెడ్దది అనే చెక్కపడి పద్ధతిలో కాకుండా, సహేతుకంగా, సున్నితంగా చెయ్యడం ఆయన ప్రత్యేకత.

నాకు ఆలోచించడానికి సమయం లేదు. అతడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ఒక్క ఉదుటున గదిలోంచి బయటపడి అతణ్ణి దాటాను. వెంటనే పరుగు లంకించుకున్నాను. నా వెనుక అతడి అడుగుల చప్పుడు. అది నేలమీద కాక నా గుండెల మీదన్నట్లుంది. వేగంగా పరుగెడుతుంటే ఆ చప్పుడు గుండెలమీంచి చెవుల్లోకి వచ్చింది. ఇంకా వేగం పెంచాలనుకునేలోగానే ఓ బలమైన హస్తం వెనుకనుంచి నా భుజంమీద పడింది.

ఇంటి పని, ఆఫీసు పని గుర్తొచ్చి పాపను ఇక వెళ్దామని అడిగింది అమ్మ. చలికాలమంతా ఇంట్లో ఒక్కతే ఆడుకుని ఇప్పుడిప్పుడే చలి తగ్గడంతో బయట తన స్నేహితులతో ఎంత ఆడినా తనివి తీరట్లేదు పాపకు. ఇంకో ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలంటూ ఓ ఐదు ఐదు నిమిషాలను దాటేసింది. “ఇక ఇంటికి వెళ్ళకపోతే బూచాడొస్తాడు,” పాపపై ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది అమ్మ. “నల్లగా, భయంకరంగా ఉంటాడు!” అమ్మ స్నేహితురాలు అమ్మకు సాయం వచ్చింది.