శ్రీరాముడు నదిలో సంధ్య వార్చి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. లక్ష్మణుడు “మమ” అనుకున్నాడు. సీత, లక్ష్మణుడు నీరు త్రాగి,దప్పిక తీర్చుకున్నారు. ఏమయిందో కాని, ఇక్కడనుంచి లక్ష్మణుడు సీత వెనుక నడవడం మొదలెట్టాడు! విడ్డూరం!!

రిక్షా లోంచి ఒక అమ్మాయి దిగింది. వాన ఎంత ఉధృతంగా ఉందంటే పరదా ఏమీ పని చెయ్యలేదు. ఆమె కూడా మొత్తం తడిసిపోయింది.

సుందరి నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తయారయ్యింది. పరిచారికలు ఆమె పరిస్థితి చూసి బాధపడుతున్నారు. కాని సుందరికింకా ఆశ చావ లేదు. ఏ మూలో తన ప్రియుడ్ని కలుస్తానన్న నమ్మకం ఉంది.

మమ్మీకి బోలెడు పనికదా! అయినా కథలు మమ్మీలు చెప్పరు. అమ్మమ్మలే చెప్తారు. నాక్కూడా మా అమ్మమ్మే చెప్పింది.

ఇది కధ కాదు.ఇందులో పాత్రలు, సంభాషణలు, అపార్ధాలు, కొట్లాటలు, ప్రేమవివాహాలు ఇత్యాదులు లేవు.కేవలం జ్ఞాపకాల జాతర లో తప్పిపోయిన ఆలోచనా ప్రవాహానికి, అనుభూతికి రూపం ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే ఉంది.

అలాంటి ఇళ్ళని సినిమాల్లో తప్పాచూడని మంగ ఒక్క మాట కూడా మాట్లాడ కుండా చూస్తోంది. ఇళ్ళనీ, ఇళ్ళలో ఉన్న కార్లనీ, రక రకాల మొక్కల్నీ. ఇరుకు అపార్ట్ మెంట్లోంచి వచ్చిన మంగకి, వేరే ఏదో దేశం వెళ్ళినట్టుగా ఉంది.

మీ అందరి మాటలూ వింటూంటే, నేనిక్కడకి రావడంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. కొత్త మూలాన తికమకగా ఉందనుకున్నానుగానీ, ఎప్పటికీ ఇక్కడ ఇమడననీ, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాననీ తల్చుకుంటే చాలా భయంగా ఉంది.

అసలు ఆయనే కాదు ఆయింట్లో ఎవరికీ నార్మల్ వాయిస్ వున్నట్టు లేదు. అందరివీ కాకలీ స్వనాలే! 90 డెసిబెల్స్‌కి పైమాటే!

నేను ఎన్ని సంవత్సరాలు కస్టపడి ఈ కంపెనీకి పని చేశాను. ఈ స్థాయికి చేరుకున్నాను. మా వంటి వాళ్ళ వల్లే గదా కంపెనీ ఇంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఊరికి కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ తో కొంచెం కూడా సంబంధం లేని ఎవరో ఒకతను — వెధవ , వేరే ఊరి నుండి వచ్చి, ఈ ఊరిలో ఇన్నాళ్ళుగా పని చేసి పేరు తెచ్చుకున్న నన్ను ఉద్యోగం నుండి తీసి వేశాడు. ఎంత ధైర్యం!

అన్నపూర్ణమ్మ గారు మా అమ్మకి చిన్ననాటి స్నేహితురాలు. ఓ చిన్న జమీందారు కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటినుంచే వంటిమీద ఓ మణుగు బంగారం ఉన్న మనిషి. ఓ సారి నా చిన్నతనంలో వాళ్ళ యింటికి పెళ్ళికి వెళ్ళినపుడు చూశాను. సూర్యుడు, చంద్రుడు, పెద్ద బంగారు జడ, మెడలో కాసులపేరు, వరహాలపేరు, ఇంకా ఇంకా ఏవో సత్తరకాయలపేర్లు, ఎన్నో ఎన్నెన్నో. వాటితో పాటు మెడకు హత్తుకుని కంటె, సరే నడుముకు వెడల్పుగా పచ్చలు, కెంపులు, వజ్రాలు పొదిగిన లక్ష్మిబిళ్ళతో వఢ్డాణం. ఆవిడని ఎరగని వారుండరు మా కుటుంబాల్లో.

కంపార్ట్‌మెంట్‌ గోడమీద మొదటిసారిగా హిందీయో, మరాఠీయో తెలియదు కానీ ‘సంకట్‌ కాల్‌ మే బాహర్‌ జానే కా మార్గ్‌’ అని పేద్ధ అక్షరాలతో వ్రాసి ఉన్న సందేశం చదివాను. ఈ సంకట కాలం అంటే ఏమిటి, అది అక్కడ ఎందుకు రాశారూ అని కాస్త పరిశోధించగానే అక్కడే ఇంగ్లీషులో ‘ఎమర్జెన్సీ ఎక్సిట్‌’ అనికూడా కనపడింది. అప్పుడు నాకు స్పష్టంగా సంకట కాలం అంటే ఎమర్జెన్సీ అనియూ, బాహర్‌ జానే కా మార్గ్‌ అనగా కొంప ములిగే టైములో బయటికి పారిపోయే గుమ్మం అనియూ అర్ధం అయింది.

ఆరువారాల క్రితం మెయిల్‌ బాక్స్‌లో ఓ కాగితం చూశాడతను. దాన్లో ఇలా వుంది -‘‘డియర్‌ నైబర్‌! ఇది మీకు ఆందోళన కలిగించటానికి రాయటం లేదు. అప్రమత్తంగా ఉండమని చెప్పటానికే. ఈ మధ్య కొందరు దొంగలు కేవలం ఇండియన్ల ఇళ్ళ మీద నిఘా వేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి విలువైన వస్తువుల్ని తీసుకుపోతున్న సంఘటనలు చాలా జరిగాయి. ఉదాహరణకి దగ్గర్లోనే వున్న లివింగ్‌వుడ్స్‌ వీధిలో పదిమంది ఇండియన్లు వుంటే ఒకే వారంలో వాళ్ళలో ముగ్గురి ఇళ్ళలో ఇలాటి దొంగతనాలు జరిగాయి. ఇలాటి వాటిలో పోలీసులు చెయ్యగలిగింది ఏమీ లేదు. కనుక మన జాగ్రత్తలో మనం వుండటం ముఖ్యం. ఇట్లు – మీ శ్రేయోభిలాషి, గురుచరణ్‌ సింగ్‌,’’

హంసానంది నవ్వులాట కాదు. హంసానంది నదులకు ఎవరూ ‘గోదావరి’ అని పేరైనా పెట్టక మునుపంత పురాతనమైన దు:ఖం. స్వఛ్ఛమైన పశ్చాత్తాపపు నొప్పి. నొప్పి బహుశ: అందరికీ ఉంటుందేమో. పశ్చాత్తాపం తనకి ఉంది. కాని గడ్డకట్టుకుని. రాజాలి సమక్షంలో కాదు, పద్మ గారు చాపమీద మఠం వేసుకుని కూర్చుని శ్రుతి పెట్టె సవరించుకొంటూ ‘ఏదీ అది మళ్ళీ ఒక్కసారి ఆదిత్యాసో…?’అని హెచ్చరించినా రాదు. దొంతరలు దొంతరల కింద సంవత్సరాల కింద అది ఎక్కడో ఘనీభవించి ఉంది. గొంతు దాకా వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. హంసానందిని అందుకోగలిగినంత పశ్చాత్తాపం తనలో? నాగరికత ఏదో అడ్డు. గోదావరిని చూడటానికి అని ‘ప్లెజర్‌ ట్రిప్‌’ కాదు కొత్తపేట. హంస కోసం.

సాయంత్రం అయిదయ్యింది. పద్మ దిగులుగా వుంది. ఏం చెయ్యాలన్నా మనసు కావటం లేదు. రేపు స్వాతి వెళ్ళిపోతుంది. దాన్ని కాలేజీలో దింపి వచ్చాక, ఇక ఈ లంకంత కొంపలోనూ తనొక్కత్తే బిక్కుబిక్కుమంటూ. విశ్వం పొద్దున్నపోతే రాత్రెప్పుడో వస్తాడు.
రెండేళ్ళ క్రితం పెద్దది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదీ వెళ్ళిపోతుంది.గూడు కాళీ అయిపోతోంది.

రాధిక, వంశీ ఇద్దరూ మెడికల్‌ కాలేజీలో క్లాస్‌మేట్స్‌. హౌస్‌సర్జన్సీ కూడా కలిసి చేస్తున్నారు. ఇద్దరూ చాలా క్లోజ్‌ఫ్రండ్స్‌ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. వంశీ కుటుంబం, రాధిక కుటుంబం కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. రెండు కుటుంబాలూ ఒకే ఊరిలో ఉండటం వల్ల, అన్యోన్యంగా ఫంక్షన్స్‌లో కలవటం, చిన్న చిన్న ట్రిప్‌లకు కలిసి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉండేవారు. రాధిక, వంశీ అంత స్నేహంగా ఉండటం రెండు కుటుంబాల వాళ్ళకూ ముచ్చటగా ఉండేది.

ఆయన రిటైర్‌మెంటు గురించి ఆలోచిస్తాను అన్నది ఇదే మొదటిమారు. మరికొంత సేపు అయిన తరువాత ఆయన అన్నారు. నాకు ఒక సెమెస్టరు శెలవు ఉంది. ఆ శెలవు ముందు తీసుకొని, రిటైర్‌మెంటు ఎలాగుంటుందో ఒక ఆరు నెలలు చూసి, లీవు తరువాత రిటైర్‌మెంటుకి అప్లై చేస్తాను ఆన్నారు. ఈ ఆరు నెలలు సెబేటికల్‌ లీవులో డిపార్టుమెంటు చుట్టుపక్కలకి వెళ్ళనని శపథము చేశారు.

చంటోడికి వారం రోజులుగా ఒళ్ళు పెనంలా కాలిపోతోంది. గవర్నమెంటు ఆసుపత్రిలో డాక్టరు చూసి ఏవో మందులిచ్చాడు కానీ జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోతూ ఉంది. మళ్ళీ తీసుకెళితే వేరే మందులేవో రాసిచ్చాడు. డిస్పెన్సరీలో అడిగితే, అవి ఖరీదైన మందులనీ, స్టాకులో లేవు, రెండు రోజులు పోయాక వస్తాయనీ చెప్పారు. కానీ అక్కడ తెలిసిన విషయమేమిటంటే, స్టాకులో కొంత మందు ఉందనీ, నాలుగు డబ్బులు చేతిలో పెడితే కానీ ఆ మందును ఇవ్వరనీను. వెంకటలక్ష్మి వాలకం డబ్బులిచ్చేలా లేకపోవడంతో, డబ్బులివ్వగలిగే పేషెంట్ల కోసం మిగిలిన కొద్ది స్టాకునూ అట్టేపెట్టి వీళ్ళని మళ్ళీ రమ్మన్నారు.