రెక్కల్ని తాటిస్తూ
నిరంతరం గగన సముద్రంలో ఈదే
పక్షికి
ఖండాంతరాలన్నీ
సుపరిచితాలే గదా!
శీర్షికలు శీర్షికలు
మనోజ్ఞ జలధితరంగ విన్యాసముల వెదకితినెన్నాళ్ళు
మనోహర మాకరంద గాన మాధుర్యము కొరకు
సుందరోద్యాన సుధానికుంజముల వెదకితి నెన్నాళ్ళు
సురుచిర సౌరభశ్రీ సామీప్యము కొరకు
అమ్రికాసుల వేడి, అయినవారిని వీడి
ఏడ్చు తల్లినొదలి, ఏడేర్లు దాటి
పొట్ట చేత పట్టి, పొరుగింట చేరాము
ఇంటింట సిరులన్న ఇంతింత కావాల
నే నిద్దుర లేచినపుడు నాతోనే లేచింది
ఆపై ప్రతి అడుగులోన నావెంటే నడిచింది
ఉద్యోగం దొరికినపుడు ఉద్వాసన కలిగినపుడు
ఉల్లాసం కలిగినపుడు ఉద్వేగం రేగినపుడు
పదే పదేగా
పిలుస్తోంది పిట్ట నా పేరు
తన భాషలో.
కుటుంబీకులతో
కిచకిచలాడుకుంటూ
నేల బంధాన్ని వదలలేక
వలస పక్షులు కాలేక
నిరీక్షణ శ్వాసకోశాలలో ఆక్సిజన్ని తిరిగి నింపి
ఒయాసిస్ ఆశతో
బ్రతుకు విత్తనాన్ని రేగడి క్షేత్రంలో నాటితే
విగత స్వప్నాలు పండుతున్నాయి.
ఆటా నిర్వహించిన కవితల పోటీ కూడా సహజంగానే ఆసక్తిని కలిగించినట్లు కవుల ప్రతిస్పందన తెలియజేస్తుంది. ఆటా వారు నిర్వహించిన పోటీకి 494 కవితలు వచ్చినాయి. 227 మంది కవులు పాల్గొన్నారు. 182 మంది పురుషులు 45 మంది స్త్రీలు. వారిలో ప్రవాసాంధ్రులు 7గురు. 6గురు ఇతరరాష్ట్రాలవారు కాగా ఒక్కరు విదేశీయురాలు. అందునా కువైట్ నుండి పాల్గొనటం విశేషం.
బరిబత్తల తనం బయటపడకుండా,
ఆఖరికి గోసిగుడ్డ మిగిలింది
శెలకల సారం సత్తెనాస్ ఐనంక
శేరిత్తులుసుక దోసిళ్ళ పడ్తలేవు
పేగు తిత్తులు ఎన్నటికి సల్లపడుతలేవు
ఎప్పుడూ
గుండెల మీద రెండు కలువపూల పాదాలు
కదలాడుతున్నట్టుగానే వుంటుంది
రెండు వెన్నపూస పెదాలు
1891లో కోనసీమలో శుద్ధశ్రోత్రియ వైదిక బ్రాహ్మణ పుటక పుట్టి, 1961లో చనిపోయే లోపల చిన్నా పెద్దా నిడివిగల 65 తెలుగుకథలు రాసిన శాస్త్రిగారిని తెలుగు ప్రపంచపు దిగ్దంతులు చాలామంది గొప్ప స్రష్టగానూ, గొప్ప వ్యక్తిగానూ గుర్తించారు. యేటుకూరి బలరామమూర్తిగారు ఈయన్ని ‘కథక చక్రవర్తి’ అన్నారు. పోరంకి దక్షిణామూర్తిగారు ‘జాతి రచయిత’ అని చాటగా, వాకాటి పాండురంగారావుగారు ‘తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయిత’ అన్నారు. ‘కనక్ ప్రవాసి’గారు ఈయన రచనలమీద పి.హెచ్డి.,పరిశోధన గ్రంథం ప్రచురించి వాటికి ‘అకాడమీ’లో స్థానాన్ని ఇచ్చారు.
నా జాడ నేను కోల్పోయాను
నా పరిచయ వాక్యం నన్ను వెతుక్కుంటోంది
పరచుకున్న రస్తాలు
తప్పిపోయిన నా అడుగుల కోసం నిరీక్షిస్తున్నాయి
అనాథగా నా నీడ
ఆకాశంలోకి ఎడారి ప్రాకింది
చెట్లకేకాదు, పుట్లకేకాదు
అనంతపురంలో భూమికే చెదలు పట్టింది
ఈ పుస్తకానికి ‘కబురు’ అనే పేరు పెట్టడానికి కారణం, ఈ పుస్తకంలో మన జాతి మేలుకొని వినవలసిన కబురుంది. హెచ్చరిక వుంది. పిలుపుంది. మనని చుట్టుముట్టిన ‘ఎత్తుటెక్కు’ రణగొణ ధ్వనిని చీల్చుకుని, దేశం మహాబలవంతుల జాబితాలోకి చేరిపోతోందనే నినాదాల హోరుని పెకల్చుకొని మనని చేరడానికి ప్రయత్నించే సన్నని మూల్గులున్నాయి.
కారణమేమిటో తెలియదు, కథలు రావడం కుంటుపడుతున్నది. తెలుగు diaspora అనుభవాలు మరొకరు చెప్పలేరు. ఇక్కడి తెలుగు వారే చెప్పగలరు. అది మన ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఒక కథ బాగా చెప్పగలరు అని నానుడి. ఆ కథ వారి స్వంత కథ, వారి స్వానుభవం.
” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా తెలుగుదేశంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత […]
ఫిడేల్ రాగాల డజన్ ఆనాటి కవిత్వానికి విద్యుత్ చికిత్స అయింది. భావకవిత్వంలో ఏవి సున్నితంగా చెప్పుకుంటారో వాటి నన్నిటినీ హేళన చేసిన “anti-poem” పఠాభి రచన. అయితే శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది.
అర్థాలతో పద్యాలు చెప్పీ చెప్పీ, లోకానికీ నిజానికీ మధ్య దూరం పెరిగిపోతోందన్న దశలో కొందరు కవులు ఆ భాషని బతికించడానికి ఇలాంటి పద్యాలు రాస్తారు. అంటే లోకంలో భాషని వాడడం మానేసి భాషలో మరో లోకాన్ని సృష్టిస్తారు. ఒకరకంగా ఈ పనే చేసారు పఠాభి.
ఈ సంచిక నుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని: ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా […]
ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు.
ఇన్ని అనువాదాలకు నోచుకున్న మూలాలు నాకయితే ఎక్కువగా తెలియవు. ఆ దృష్టితో చూస్తే రవీంద్రుల మూలగీతపు రవికిరణాలు ఇంద్రధనుస్సులోని కొన్ని కొన్ని వర్ణాల కలయికలలా ఆయా అనువాదాల్లో వ్యక్తమయ్యాయి.