తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపధ్యం. ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు. సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు. భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.

తెలుగు సాహిత్యంపై మక్కువతో సరదాగా మొదలెట్టిన సాహితీ సదస్సు ప్రతీయేటా తప్పకుండా చేద్దామన్న స్థాయికొచ్చింది. మార్చి నెల 14వ తేదీ,2009, శనివారం కాలిఫోర్నియాలో మిల్పిటస్ […]

గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం.

ప్రధాన పాత్రలయిన రాజకుమారుని గురించో, రాజకుమార్తె గురించో కొంచెం పొగుడుతారు. రాగాలతో, సరాగాలతో ఆ పాత్ర ఎవరో సభికులకు పరిచయం చేస్తారు. కొద్దిపాటి బూతునూ, సమయానుకూలంగా సంభాషణల్లో చొప్పిస్తారు.

గులక రాళ్ళని తట్టి ఏనాటి ఊసులో తలబోసి
దిగులుపడి వెనుదిరిగిపోతోంది నది
నీటిగాలికి పులకించిపోతోంది నియమగిరి
రెప రెపల రేయింక అలసి నిల్చుంది.

నాటకీయత సాధించే మహత్తర ప్రయోజనం పాత్రలని కళ్ళముందు కదిలించడమే కాకుండా సంభాషణల ద్వారా ఆయా పాత్రల స్వభావాలని, అంతరంగాలని ధ్వనింపజెయ్యడం కూడా.

మన కథల్లో ఎక్కువ భాగం సమకాలిక సామాజిక స్థితిగతుల్ని గురించే ఉంటాయి. కానీ, సామాజిక సమస్యల గురించి రాసినవే మంచి కథలు అని నేను అనుకోను.

ఒక రోజు, అపు నిద్ర లేచిన వెంటనే దిళ్ళ మధ్య తల పిన్ను పడి ఉండటం గమనిస్తూ, అంతలో, ఇంట్లో పనులు చేస్తున్న అపర్ణను తదేకంగా చూస్తూ ఉంటాడు.

నన్నెచోడుడు ఒక చిన్న సామంత రాజు, కాని కవిరాజులకు రారాజు. పరమేశ్వరారాధకుడు మాత్రమే కాదు, ప్రబంధ పరమేశ్వరుడు కూడ. జాను తెలుగులో వస్తుకవితకు మార్గదర్శి.

ఇంత వరకూ లభ్యమైన త్యాగరాజ కృతుల్ని స్థాయిని బట్టీ, సాహిత్యాన్ని బట్టీ మూడు వర్గాలుగా విభజించారు. అవి దివ్య నామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ఘనరాగ పనచరత్నాలూ.

తెల్లారిపోయిందన్న ధైర్యంతొ నెమ్మదిగా లేచివెళ్ళి కిటికీ తలుపు తెరిచి తొంగిచూశా. బయటి వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడా రాత్రి తాలూకు భీభత్సం సూచనలేమీ లేవు.

ఇది సమాజంలో చాలా పెద్ద మార్పు. ఇలాంటి మార్పు అప్పటి మనుషుల్లో వారి స్థితిని బట్టి, అలజడినో, ఆశనో, ఉత్సాహాన్నో, నిర్వేదాన్నో కలిగిస్తూ వుండి వుండాలి. అలాంటి కాలంలో వేంకటాధ్వరి రాసిన పుస్తకం ఈ విశ్వగుణాదర్శం.

దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
సంస్కార్ విచ్చిన్నం సంసార స్వప్నక్రీడితం

విజ్ఞానం ప్రజల సొత్తు. ప్రపంచ ప్రజల సొత్తు. సమాజంలో ఏదోరకమైన ఆధిక్యత ఉన్న ప్రత్యేక వర్గాలు ‘ఇదంతా మాది’ అని గుత్తకి తీసుకోవడం అధర్మం, అన్యాయం. ఇవి అందమైన నినాదాలు. విజ్ఞానం అందరికీ అందుబాటులోకి తేవడం అనే కోరిక అద్భుతమైన కోరిక.

ఈ లోయ సౌందర్యంచూస్తోంటే ఉన్నపళంగా అమాంతం ఇందులోకి దూకేయాలనిపిస్తోంది. కాసేపటికి ఈ ఆకుపచ్చ లోయలోంచే పక్షిలా అలా గాల్లోకి ఎగురుతూ రాగలనేమో అని కూడా అనిపిస్తోంది.

ఈమాట రచయితలకూ, పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం. ప్రముఖ కవి, రచయత శ్రీ స్మైల్ డిసెంబర్ 5వ తేదీ మరణించారు. వారి జ్ఞాపకార్థం ఈ సంచికను స్మైల్ సంచికగా విడుదల చేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము. ఈ ప్రత్యేక సంచిక నిర్మాణంలో సహాయం చేసిన రచయితలు, సమీక్షకులు మొదలైనవారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.