సినీ పరిశ్రమలో పోస్టర్లు, పాటల పుస్తకాలు, కరపత్రాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినదే. ప్రతి వారికీ వీటి గురించి గొప్ప జ్ఞాపకాలే వుంటాయని అనుకుంటున్నాను.
శీర్షికలు శీర్షికలు
కాలువ నీటి చర్మంపై కూడా
ప్రతిబింబిస్తోన్న
ఆకాశపు నీలిరంగు అర్థాన్ని
అన్వేషిస్తుండగానే…
బండపై మోగేటి చాకళ్ళ దరువులు
నీటిలో ఈదేటి పిలవాండ్ల అరుపులు
నీళ్ళ కొచ్చిన అమ్మలక్కల కబుర్లు
కనులపండగే కాదు వీనులకు విందు!
ఎచటఁ జూచిన విలయంబె మృత్యుముఖమె,
ఎచటఁ జూచిన నార్తులే, ప్రచురశోక
రవములే, వృక్ణదేహసంస్రస్తరక్త
రంజితాధ్వంబులే తోఁచె గ్రామమందు.
అత్తిపట్ కృష్ణస్వామి రామానుజన్ (A. K. Ramanujan, 1929-93) మనం గర్వించదగ్గ ఒక మేధావి, రచయిత, కవి, లాక్షణికుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, బహు భాషావేత్త. షికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉంటూ దక్షిణ భారత భాషల సాహిత్య స్వరూప పరిణామాలని నిశితంగా పరిశీలించిన విద్యాధికుడు. “భారతీయ చింతన అంటూ ఒకటున్నదా?” అనే ఒక ప్రముఖ వ్యాసం ద్వారా భారతీయ చింతనలో సందర్భ గ్రాహ్యత (Context sensitivity) గురించి విశ్లేషించాడు. భారతీయ సాహిత్యంలో మౌఖిక, లిఖిత పార్శ్వాల అనుబంధంపై విశేషమైన పరిశోధనలు చేశాడు.
చర్చ, విమర్శ, తర్క మీమాంసలకు దోహదం చేస్తూ విద్యార్థుల వివేచనకు పదును పెట్టవలసిన విశ్వవిద్యాలయాలే అతివాదశక్తుల ఒత్తిడికి లోనై తమ గురుతర బాధ్యతను, భావ స్వతంత్రతను విస్మరించి పుస్తకాలని, వ్యాసాలని నిషేధించడం గర్హణీయం. ఈమధ్యనే ముంబయి విశ్వవిద్యాలయం రోహింటన్ మిస్త్రీ వ్రాసిన పుస్తకాన్ని పాఠ్యక్రమం నుండి తొలగించింది. ఇప్పుడు రామాయణాన్ని దూషిస్తున్నదన్న అకారణంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎ. కె. రామానుజన్ వ్రాసిన మూడువందల రామాయణాలు అన్న వ్యాసాన్ని చరిత్ర విద్యార్థుల పాఠ్యక్రమం నుంచి తొలగించింది. నిజానిజాలు మనం తెలుసుకోవడం కోసం ఆ తొలగించిన వ్యాసాన్ని సురేశ్ కొలిచాల తెలుగులోకి అనువాదం చేసి ఈ సంచికలో అందిస్తున్నాడు.
ఈ సంచికలో: దేవులపల్లి కృష్ణశాస్త్రి నాటికలనుంచి ఆనాటి పాటలు; మెలికముగ్గులపై కృష్ణ మోహనరావు శాస్త్రవ్యాసం; రోహిణీప్రసాద్, సాయి బ్రహ్మానందం, కనకప్రసాద్ వ్యాసాలు. కొత్త రచయిత చంద్రశేఖర్ కథ అనుభవం, ఇతర కథలు; భగవంతం, నారాయణ, రవిశంకర్ తదితరుల కవితలు; పద్యం, పలుకు, పాట, కథ ఇతరత్రా శీర్షికలు, మీకోసం.
దాశరథి రాసిన నిండుపున్నమి పండువెన్నెల అనే పాట ఏడక్షరాల లయమీద కష్టపడి అమర్చడం జరిగిందనీ బాలసరస్వతి చెప్పింది.
వేగుంట మోహన ప్రసాద్ (05జనవరి 1942 – 03ఆగస్ట్ 2011): మో’ గా సుప్రసిద్ధుడైన అపరిచితుడు కవి వేగుంట మోహనప్రసాద్. ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు. మొట్టమొదట ప్రచురించబడ్డ కవిత హిమానీహృది, 1960 మే నెల భారతిలో. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్టెయిల్ ‘చితి-చింత’ (1969) మో’కి తెలుగు కవుల్లో ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. ‘రహస్తంత్రి’, ‘సాంధ్యభాష’, ‘పునరపి’, ‘నిషాదం’, ఇలా ఎన్నో ‘నీడలూ జాడ’ల్లో ఆయన ‘బతికిన క్షణా’ల్లో ఆయన ‘కరచాలనాల’ నుంచి వెలువడినై. తెలుగు కవిత్వపు కాన్వాసు మీద అరాచకంగా ఒలికి అద్భుతమైన ప్రశ్నగా పరిణమించిన రంగు పదం మో’.
ఈ సంచికలో – కొత్త రచయిత బులుసు సుబ్రహ్మణ్యం, లైలా యెర్నేని, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి, కె.వి. గిరిధరరావుల కథలు; గౌరి కృపానందన్ అనువాద కథ; కృష్ణదేశికాచార్యులు, పాలపర్తి ఇంద్రాణిల కవితలు; భీమ్సేన్జోషీ రావు బాలసరస్వతీదేవి గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీత వ్యాసాలు; జెజ్జాల కృష్ణ మోహనరావు, కనకప్రసాద్, వేలూరి వేంకటేశ్వరరావు, భద్రిరాజు కృష్ణమూర్తుల వ్యాసాలు; ఒక మో కవిత; తానా 2011 సమావేశపు సాహిత్య ప్రసంగాల చిత్రతరంగాలు, ఇంకా…
నేను ముందు గది అంటే మా ఆవిడ నా కేసి చురచురా చూస్తుంది. దాన్ని డ్రాయింగ్ రూము అని పిలవాలిట. ఒక టీవీ, నాలుగు కుర్చీలు, నా లాప్టాపూ తప్ప మరేమీ లేని ఆ రూముని అలా పిలవాలంటే నాకు మనస్కరించదు.
సమాజపు రీతి రివాజులు చెయ్యకూడని పనులని చేయిస్తాయి. కానీ మానవత్వంతో నడుచుకోవడానికి, సాటి మనిషి పట్ల దయతో వ్యవహరించడానికి స్పందించే మనసు ఉంటే చాలు. మనకి ఉన్న పరిధిలో సమాజ సేవ చేయడానికి ఎటువంటి ఆటంకమూ ఉండదు.
ఆమె ఒక గులాబీ రంగు జరీ పని చేసిన చీర కట్టి, అదే రంగు జాకెట్టు వేసుకుంది. చేతికి ముత్యాలు, రవ్వల గాజులు. ఒక చేతికి వరుస వరసల ముత్యాల బ్రేస్ లెట్. ఆమె ముఖం కోలగా, ఎంతో ముద్దుగా ఉంది. ఇంత వంక పెట్టలేని కనుముక్కు తీరు.
విశ్వనాధం పెద్ద కూతురు సీతాలు. పదోతరగతి ఆడ గజనీ మహమ్మదులా దండెత్తింది. చదువెలాగూ అబ్బలేదని సంగీతం నేర్పిస్తున్నారు. ఆ సంగీతం నేర్పే సుబ్బారావు నాకు స్నేహితుడు. సుబ్బారావు మా అమలాపురంలో పేరున్న సంగీతం మాష్టారు.
‘రావణాసురుడి పది తలలకూ, ఒకే రకం మొహం వుంటుందా? లేక ఒక్కో తలకూ ఒక్కో రకం మొహం వుంటుందా?’ ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న! ఆరో తరగతిలో వున్నప్పుడు టీచర్ని అడిగాను. ఇదే ప్రశ్న ఇంట్లో అన్నయ్య నడిగితే అసలు రావణుడే లేడు పొమ్మన్నాడు. నాన్న నడగాలంటే భయం.
అటునొక చూపూ ఇటునొక చూపూ
అడఁగారదు ఈ తగులాట
అదియొక తీరూ ఇదియొక తీరూ
ముదిగారము నీ తలపోత
నాన్న చెప్పడం ప్రకారం తను పుట్టింది ఇండియాలో చిన్న పల్లెటూర్లో. దాదాపు ఇరవై ఏళ్ళు అదే ఊర్లో ఉన్నాడు, తెలుగు మాత్రం మాట్లాడుతూ. ఇంగ్లీషొచ్చినా మాట్లాడే అవసరం రాలేదుట ఎప్పుడూ. చాలా బీద కుటుంబం. ఏమీ ఉండేది కాదు.
రాజప్ప ఇంట్లోకి వచ్చాడు. హాల్లో అతని తమ్ముడు బెంచి మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో పేపర్. పక్కనే పొగలు చిమ్మే కాఫీ. పేపరు మీద ఉన్న చూపును తిప్పి ఒక్క నిమిషం అన్నని పరిశీలనగా చూశాడు. పొద్దున్న లేవగానే కాఫీ తాగక పోతే అన్నయ్యకి ఎంత కష్టంగా ఉంటుందో అతనికి తెలియని విషయం కాదు.
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి, అక్షకుమారాది దైత్యులను చంపి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి ఐచ్ఛికంగా లొంగిపోయి, రావణుని సభలోనికి తీసుకురాబడి – అక్కడ అవకాశం దొరికే సరికి రావణునికి హితబోధ చేసే సందర్భం లోనిది ఈ పద్యం.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు, విన్నకోట రవిశంకర్ల ప్రసంగాల వీడియోలు.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు కాత్యాయనీ విద్మహే, మృణాళిని, హర్షితా కామత్ల ప్రసంగాల వీడియోలు.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి, చంద్ర కన్నెగంటి, శ్రీపతి, గౌరి కృపానందన్ల ప్రసంగాల వీడియోలు.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు, ఆకెళ్ళ సూర్యనారాయణ, శేఖర్ కమ్ములల ప్రసంగాల వీడియోలు.