పరుల తప్పులెంచును నటించును
బిగిసి అయ్యవారై చరించును
విసిగి వెసనకాడై కృశించును
వెదకి చితికితే ఒదవా ఏమి?
శీర్షికలు శబ్ద తరంగాలు
ఇద్దరు లేరని చూపి
ఇరులొరలను దయపడు బట్టికాడు
అరుణగిరి శుకము వీడు
అరుణగిరి శుకము వీడు
ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయ శర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగాన్ని, దానికి అనుబంధంగా ఈ నాటకాన్ని ఇక్కడ జత చేస్తున్నాను.
పూల బాల పూల బాల గాలి లోన తీగె ఝూల లోలితా
జాల మేల ముద్దుగా మధూలి చాల తాగుతా
ఈ సంచికలో వినిపిస్తున్న పాటలు సుమారు 1915-1924 మధ్య కాలంలో రికార్డు కాబడినవి. అంటే రికార్డయిన తొలి ‘తెలుగు’ పాటలు!
నిదుర విడిన మొదలు
చిదురులు పది వేలు
నిలుకడ మూగ వలె
నిలచిన మన్నారు
పట్రాయని సంగీతరావు గారు ఈమాట పాఠకులకు సుపరిచితమే. 1930-40 ప్రాంతంలో, సాంస్కృతిక కేంద్రంగా విజయనగరం గురించిన ఆయన జ్ఞాపకాలను ఈ సంచికలో మీరు వింటారు.
అద్దేపల్లి రామమోహనరావు గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ వీనులవిందుగా చదివి వినిపిస్తున్నారు. దీన్ని “ఈమాట” కు అందించిన శొంఠి రమణ గారికి, […]
ఇది నేను కొన్ని నెలలక్రింద ఈమాటలో ప్రచురించిన ‘వాణి నారాణి’ అను నాటికలో సందర్భానుసారముగా ఐదుపాటలను వివిధరాగములలో వ్రాసితిని. శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు ఆ ఐదుపాటలను పాడిరి. ఆపాటలతో గూడిన పినవీరనవృత్తాంతము నిక్కడ ప్రదర్శించుచున్నాను.
అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదని అంటారు. అలాగే ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు, ప్రసంగాలు చేసినట్లు కనపడటంలేదు. ఆయన కవితలని రెండింటిని ఆయన గొంతులోనే వినిపిస్తాను.
వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం.
ఇన్నేసి మతాలు, ఆచారాలూ , వాటితో పోరాడుతూ నిబ్బరంగా సాగుతూంటారు ఈ చిన్ని గుంపులోని మనుషులు. మత మౌఢ్యం పెద్ద పులి. వేటాడుతుంది వీరిని.
ఇది భాగవతుల త్రిపుర సుందరమ్మగారు (బీనాదేవి) రావిశాస్త్రిగారి కథలపైన 1997లో విజయవాడ కేంద్రంలో చేసిన ప్రసంగం. ఈ ప్రసంగ పాఠం తరువాత వార్త దినపత్రికలోను, పైన పేర్కొన్న సమగ్ర రచనల సంకలనం లోను ప్రచురితమైంది.
రేడియో ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులైన న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుల గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను. ఈ సంచికలో ‘బాలానందం’ బృంద గేయాలుగా వచ్చిన కొన్ని రికార్డులను విందాం.
అనీ వినీ అలసితే అనా హతం
శివం శివం శివం
పదే పదే వెదికి ఆగితే
అహర్దివం శివం శివం
అప్పుడెపుడో చిన్నపుడు గుళ్ళో ఉన్నప్పుడు భోరున వర్షం కురవడం మొదలై అక్కడే కూచుండిపోతే ఆ చీకట్లో దీపపు వెలుగులో ఉన్నట్టుండి మెరుపు మెరిసి ఆ తెల్లటి వెలుతురు తెర వెనుక వెచ్చగా –
ఈ సంచికలో ప్రముఖ గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం వినవచ్చు. ఈ కార్యక్రమం విజయవాడ స్టేషన్ నుండి 1979-1980 ప్రాంతంలో ప్రసారమయ్యిందని జ్ఞాపకం.
స్వరార్చనం కల
రాగ సుధా రసార్ణవం
చెన్నారెడు చెవి తేనియలై కీర్తనలూ
అనశ్వరం
ఎందరో హేమాహేమీలు: మల్లిక్, ఓలేటి, ఎన్.సిహెచ్.వి. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, … పాల్గొన్న ఈ చక్కటి సంగీతనాటిక విజయవాడ స్టేషన్లో, 1970ల చివర్లోనో, 1980ల ప్రారంభంలోనో, ప్రసారితమైంది.
అకారము మొదలు అక్షర మాలకు
ఆది ఆకసము మొదలు అఖిల జగతికిని
పెనవి పెను కడలి నీదను వశమా