మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
Category Archive: ప్రకటనలు
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం! కథలు చేరవలసిన ఆఖరుతేదీ: మే 10, 2022.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం!
తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ. సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020), 2021 జనవరి 19, 20 & 21 తేదీలలో జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు.
పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్లైన్లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ఫోన్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం ప్రకటిస్తారు. పోటీకి నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020.
రాబోయే సంక్రాంతి 2021 పండుగ సందర్భంగా శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ నిర్వహిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా కోరుతున్నాం.
స్వర్గీయ కొండసాని నారాయణరెడ్డి స్మరణలో… కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020 కొరకు తెలుగు రాష్ట్రాలలోని కవులు మరియు రాష్ట్రేతర తెలుగు కవుల నుండి కవిత/కథా/నవల సంపుటాలను పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము. ఈ పురస్కారపు 2019 గ్రహితలు కవిత్వం : సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి – బడి; కథ: యమ్.వి రామిరెడ్డి – వెంటవచ్చునది.
తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకోవడమే కాక, వాటిని అమ్ముకోవలసిన కష్టమూ రచయితల మీదే పడుతున్నది. పాఠకులు తమ పుస్తకాలను చదువుతారా, మెచ్చుతారా అన్నది తరువాతి మాట. అసలు తమ పుస్తకం అనేది ఉన్నది అని పాఠకులకు తెలియజెప్పడం మొదటి సమస్య. ఈ సమస్య కొంతైనా తీర్చడం కోసం, ఈమాటలో ఇకనుంచీ కొత్త పుస్తకాల పరిచయాలు మొదలుపెడుతున్నాం.
రాబోయే సంక్రాంతి (2019) సందర్భంగా శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ నిర్వహిస్తుంది. భారతదేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం.
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా సెప్టెంబరు 29-30, 2018న జరుగుతున్న సదస్సులకు సాదర ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.
ఇదిగో అదిగో అంటూనే డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ఇరవై ఏళ్ళ వయసొచ్చేసింది. సాహితీ సమితి సంబరాలకు తోటి సాహిత్యాభిమానులతో కలిసి సదస్సు నిర్వహించుకోవడంకన్నా సబబైనది మరొకటి ఉండబోదు. అందుకే తెలుగు సాహిత్యాభిమానులందరినీ ఈ ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా డిట్రాయిట్కు ఆహ్వానిస్తున్నాం.
కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2017కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలకు ఒక్కొక్కదానికీ రూ. 1500, అత్యుత్తమ కథ (ఒక కథకి) రూ.5000 బహుమానంగా ఇవ్వబడతాయి. చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2017.
అనువాదంలో అవిరళ కృషికి గుర్తింపుగా మన్మధ నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వై. ముకుంద రామారావు గారికి ప్రకటిస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైనారు. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి వీరిని ఎడంగా నిలబెడతాయి.
మార్చ్ 26న అట్లాంటా నగరంలోని ఎమరీ యూనివర్సిటీలో తెలుగు ఆచార్య పదవి నెలకొల్పబడబోతున్న సందర్భంగా ప్రత్యేక ప్రకటన ఈమాట పాఠకులతో పంచుకోడం కోసం.
యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు కె. మమత ఎంపికైంది. ఎగసి పడే భావాలను, నిజాయితీగా – సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు, కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.
కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2015కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీ కథలు మాకు అందవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2015.
రాబోయే 20 వ తానా సమావేశాలలో (జులై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది. స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం.