చలివేంద్రం

అద్దాల మేడ కాదు
చెట్టుకింద నీడ.

బంగారు గంగాళమేం కాదు
చిన్న మట్టి కుండ.

సంవత్సరాలు కుళ్ళబెట్టిన
ఖరీదైన మందూ కాదు
బాటిల్లో దాచితెచ్చిన
హిమాలయాల నీరూ కాదు.
మున్సిపాలిటీ కుళాయి నీరు.

నిండు ఎండలో
నీరు కుండే ఆస్తి
కుండ పెట్టినోడే
కుబేరుడు.

గ్రీష్మ ఋతువులో
అమృతం గొంతులో
వాడి దయే.

అతని గొంతులో
అసలైన అమృతం
కోరిక నాకదే.


క్రాంతి కుమార్ మలినేని

రచయిత క్రాంతి కుమార్ మలినేని గురించి:

అనేక తెలుగు సాహిత్య వేదికలపై తన కవితలతో గుర్తింపు పొందిన కవి క్రాంతికుమార్ మలినేని. ఆయన “ఎన్నెన్ని వసంతాలో..”, “ఒంటరి ప్రపంచం”, “తెల్లని కాగితాలు” మొదలుకొని ఎన్నో కవితలు రచించారు. సృజనాత్మక కవిత్వానికి, ప్రశంసలు పొందారు. ‘వాకిలి’ సాహిత్య పత్రికలో ‘జయభేరి రెండవ భాగం’లో గొలుసు కవితలు రాశారు.

 ...