రామాయణ భాగవతాది కావ్యాలు ఎందరో పండితులు వారి వారి పాండిత్య పటిమ మేరకు వ్రాసారు. కధావస్తువును మార్చి వ్రాయడానికి ఆస్కారం లేని నేపధ్యంలో ఒకరిని మించి మరొకరు విషయాన్ని విపులీకరించే ప్రయత్నం చేయడం సహజమే గదా.. ఇందులో “అర్ధచౌర్యం” అనే పదానికి ఆస్కారం ఉంటుందా?
శ్రీ శ్యామలరావు గారు తెలుగు సాహిత్యంలో మంచిపట్టు వున్నవారిలా కనిపిస్తున్నారు వారి లేఖల బట్టి. ఐతే వారు ఈ సందర్భంలో నారాయణరావు గారికి వృత్తగణాల గురించి తెలియదని ధ్వనించేలా రాయటం కొంచెం తొందరపాటేమో అనిపిస్తున్నది. వారు ఉదహరించిన పద్యం సందర్భం దాన్ని విశ్వనాథ ఎలా చదివేవారో చెప్పటం. వారు అంతకుముందు వరకున్న పదాల్ని విడివిడిగా విరిచి చదువుతూ చివరిపాదాన్ని మాత్రం మొత్తం ఒకటిగా పదాల్ని దగ్గరగా కుదిస్తూ (బహుశా ఒక గుక్కన) చదివేవారని వ్యాసకర్తలు అనటం. వారి మాటల్లోనే “ఆ పద్యం చివరి పాదం కుంచించుకు పోయి అన్నీ లఘువులతో భయం భయంగా ముడుచుకుపోతుంది. నాలుగు పాదాల్లో అచ్చయిన పద్యం చూస్తే ఈ విషయం బోధపడే అవకాశం లేదు.” ఇక్కడ “అన్నీ లఘువులు” శ్యామలరావు గారికి అభ్యంతరకరమైన పదద్వయం.
ఛందస్సులో అన్ని లఘువులు ఒకేరకంగా ఉంటాయి కాని గురువులు మాత్రం అనేకరకాలని విజ్ఞులకి చెప్పక్కర్లేదు. ఈ పద్యం చివరి చరణంలో గురువులన్నీ చాలా “తేలికైన”వని స్పష్టమే. ఇక్కడ వ్యాసకర్తలు లఘువు అనే పదాన్ని చందస్సుకి సంబంధించిన అర్థంలో వాడారని నేననుకోను. సభాసదులు ఎంత ముడుచుకుపోయారో ( ఇవి లఘువులైన గురువులు) అని చెప్పటానికి ఆ పదం వాడారని నా భావన.
—————————
మన పూర్వులు ముఖ్యంగా చంపకమాలా వృత్తాన్ని చాలా ప్రత్యేకశ్రద్ధతో వాడారని నేననుకుంటాను. ఒక evolving, dynamic situation ని చెప్పటానికి చంపకమాల సారళ్యం, గురువుల నిర్మాణంలో వున్న అనేక శైలుల్ని కొల్లగొట్టి (ఈ పదం సరిగా పడినట్టు లేదు, exploit చేసి అనటం నా ఉద్దేశం) వారు చెప్పదల్చుకున్న విషయానికి శిల్పపరిపుష్టతని సమకూర్చారు వారు. ఉదాహరణకి పెద్దన గారి “అటజని కాంచె” పద్యం తీసుకోండి. అదీ చంపకమాలే. ఐతే మెల్లగా మొదలై ప్రవరుడి విభ్రమాశ్చర్యాల్ని, వేగంగా వెళ్తున్న అతనికి దార్లో కనబడుతున్న అద్భుత ప్రకృతి రామణీయకతని చూపించటానికి గురువులు చాలా బరువెక్కుతాయి. తాపీగా సాగే చంపకమాల శార్దూలంలా పరుగులు తీస్తుంది. మనల్ని మనం ప్రవరుడి స్థానంలో ఊహించుకుంటే చాలా వేగంగా వెళ్తున్నట్టు, ఎదురుగా ఎన్నో వృక్షాలు, ఇతర అడ్డంకులు పక్కనుంచి దూసుకుపోతున్నట్టు అనుభూతి కలక్కమానదు. ఇలాటి దృష్టితో చూస్తే తిక్కన గారు భీముడి కోపాన్ని చూపటానికి “ధారుణి రాజ్యసంపద మదంబున..” అంటూ ఉత్పలమాలని, పోతన గారు “లలితస్కంథము ..” అని చంపకమాలని ఎందుకు ఎంచుకున్నారో తెలుస్తుంది. అదే, మొదటినుంచి చివరివరకు పద్యంలో ఒకే రసాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు శార్దూలం, మత్తేభం వాడారు (“కురువృద్ధుల్ ..”, “సింగంబాకటితో ..”, “దుర్వారోద్యమ బాహువిక్రమ ..” (ఇది ఎర్రన గారిది).
పద్యాలతో పెద్దలు చెక్కిన శిల్పాల గురించి అనంతంగా మాట్టాడుకోవచ్చును కాని ప్రస్తుతం కాదు.
ఈ పద్యం గురించి వ్రాస్తూ మీరు తప్పులో కాలేశారు. “ఆ పద్యం చివరి పాదం కుంచించుకు పోయి అన్నీ లఘువులతో భయం భయంగా ముడుచుకుపోతుంది.” ఈ అభిప్రాయం తప్పు. ది చంపకమాలావృత్తపద్యం. న-జ-భ-జ-జ-జ-ర అనేది దీని పాదంలో గణాల విభజన. చివరి పాదం అంతా లఘువులు ఎలా వస్తాయండీ? ప్రతి జ, భ-గణలలో ఒక గురువూ, ప్రతి ర-గణంలో రెండు గురువులూ ఉంటాయి ఛందస్సు ప్రకారం. గమనించగలరు. ఒక మారు విశ్వనాథగారు ఏమన్నదీ పరిశీలించగలరు. బహుశః ఆయన నడక గురించి చెప్పి ఉంటారు ఈ ఆఖరు పాదం అంతా ఒక ఊపుతో ఉందని.
ఇదేమి నాటకం? వస్తువు అసభ్యమైన వస్తువు. ఒక రాజు భార్య ఆ రాజు తమ్ముడి వ్యామోహంలో పడి అతనితో రహస్య సంసారం చేస్తూ వుంటుంది.
అనేక సంవత్సరాల క్రిందట సరిగ్గా ఇదే సంఘటన జరిగింది. అప్పుడు ఆ మాటలన్నది ఎవరో ఇంగ్లీషు నేర్చిన తెలుగుపండితుడు కాదు.
నేనే! పన్నెండో తరగతిలో ఉన్న నేనే.
ఆ యేడాది స్కూలు వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వక్తృత్వపు పోటీల్లో ఇంగ్లీషులో (మీ కిష్టం వచ్చిన విషయంపై మాట్లాడండీ అని చెప్పి) ఒక పోటీ పెట్టారు. ఆ రోజున నేను అచ్చంగా ఇలాంటి ధోరణిలోనే… ముఖ్యంగా ఈ మాటలు కూడా అంటూ… ఒక పావుగంట పాటు ఆ హేమ్లెట్ నాటకాన్ని చెఱిగి పోగులు పోసాను. ఆ పాఠశాలలో మా నాన్నగారు సీనియర్ టీచర్. ఆయన కూడా నా ధాటికి విస్తుపోయారు. బహుమతి వచ్చిందనుకోండి. అది వేరే సంగతి. ఈ సంఘటన మాత్రం బాగా గుర్తుండి పోయింది.
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి సూరి సీతారాం అభిప్రాయం:
10/06/2014 11:42 am
రామాయణ భాగవతాది కావ్యాలు ఎందరో పండితులు వారి వారి పాండిత్య పటిమ మేరకు వ్రాసారు. కధావస్తువును మార్చి వ్రాయడానికి ఆస్కారం లేని నేపధ్యంలో ఒకరిని మించి మరొకరు విషయాన్ని విపులీకరించే ప్రయత్నం చేయడం సహజమే గదా.. ఇందులో “అర్ధచౌర్యం” అనే పదానికి ఆస్కారం ఉంటుందా?
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
10/05/2014 8:31 pm
శ్రీ శ్యామలరావు గారు తెలుగు సాహిత్యంలో మంచిపట్టు వున్నవారిలా కనిపిస్తున్నారు వారి లేఖల బట్టి. ఐతే వారు ఈ సందర్భంలో నారాయణరావు గారికి వృత్తగణాల గురించి తెలియదని ధ్వనించేలా రాయటం కొంచెం తొందరపాటేమో అనిపిస్తున్నది. వారు ఉదహరించిన పద్యం సందర్భం దాన్ని విశ్వనాథ ఎలా చదివేవారో చెప్పటం. వారు అంతకుముందు వరకున్న పదాల్ని విడివిడిగా విరిచి చదువుతూ చివరిపాదాన్ని మాత్రం మొత్తం ఒకటిగా పదాల్ని దగ్గరగా కుదిస్తూ (బహుశా ఒక గుక్కన) చదివేవారని వ్యాసకర్తలు అనటం. వారి మాటల్లోనే “ఆ పద్యం చివరి పాదం కుంచించుకు పోయి అన్నీ లఘువులతో భయం భయంగా ముడుచుకుపోతుంది. నాలుగు పాదాల్లో అచ్చయిన పద్యం చూస్తే ఈ విషయం బోధపడే అవకాశం లేదు.” ఇక్కడ “అన్నీ లఘువులు” శ్యామలరావు గారికి అభ్యంతరకరమైన పదద్వయం.
ఛందస్సులో అన్ని లఘువులు ఒకేరకంగా ఉంటాయి కాని గురువులు మాత్రం అనేకరకాలని విజ్ఞులకి చెప్పక్కర్లేదు. ఈ పద్యం చివరి చరణంలో గురువులన్నీ చాలా “తేలికైన”వని స్పష్టమే. ఇక్కడ వ్యాసకర్తలు లఘువు అనే పదాన్ని చందస్సుకి సంబంధించిన అర్థంలో వాడారని నేననుకోను. సభాసదులు ఎంత ముడుచుకుపోయారో ( ఇవి లఘువులైన గురువులు) అని చెప్పటానికి ఆ పదం వాడారని నా భావన.
—————————
మన పూర్వులు ముఖ్యంగా చంపకమాలా వృత్తాన్ని చాలా ప్రత్యేకశ్రద్ధతో వాడారని నేననుకుంటాను. ఒక evolving, dynamic situation ని చెప్పటానికి చంపకమాల సారళ్యం, గురువుల నిర్మాణంలో వున్న అనేక శైలుల్ని కొల్లగొట్టి (ఈ పదం సరిగా పడినట్టు లేదు, exploit చేసి అనటం నా ఉద్దేశం) వారు చెప్పదల్చుకున్న విషయానికి శిల్పపరిపుష్టతని సమకూర్చారు వారు. ఉదాహరణకి పెద్దన గారి “అటజని కాంచె” పద్యం తీసుకోండి. అదీ చంపకమాలే. ఐతే మెల్లగా మొదలై ప్రవరుడి విభ్రమాశ్చర్యాల్ని, వేగంగా వెళ్తున్న అతనికి దార్లో కనబడుతున్న అద్భుత ప్రకృతి రామణీయకతని చూపించటానికి గురువులు చాలా బరువెక్కుతాయి. తాపీగా సాగే చంపకమాల శార్దూలంలా పరుగులు తీస్తుంది. మనల్ని మనం ప్రవరుడి స్థానంలో ఊహించుకుంటే చాలా వేగంగా వెళ్తున్నట్టు, ఎదురుగా ఎన్నో వృక్షాలు, ఇతర అడ్డంకులు పక్కనుంచి దూసుకుపోతున్నట్టు అనుభూతి కలక్కమానదు. ఇలాటి దృష్టితో చూస్తే తిక్కన గారు భీముడి కోపాన్ని చూపటానికి “ధారుణి రాజ్యసంపద మదంబున..” అంటూ ఉత్పలమాలని, పోతన గారు “లలితస్కంథము ..” అని చంపకమాలని ఎందుకు ఎంచుకున్నారో తెలుస్తుంది. అదే, మొదటినుంచి చివరివరకు పద్యంలో ఒకే రసాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు శార్దూలం, మత్తేభం వాడారు (“కురువృద్ధుల్ ..”, “సింగంబాకటితో ..”, “దుర్వారోద్యమ బాహువిక్రమ ..” (ఇది ఎర్రన గారిది).
పద్యాలతో పెద్దలు చెక్కిన శిల్పాల గురించి అనంతంగా మాట్టాడుకోవచ్చును కాని ప్రస్తుతం కాదు.
ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం గురించి తఃతః అభిప్రాయం:
10/05/2014 3:34 pm
శ్రీ గారపాటి:
ఈ నాటి తెలుగులో క్రియ గురించి ఒక మాట: ‘చేయు,(చెయ్)’ అన్న ఒక్క క్రియా సూచి ఒకటే ఉన్నది ఇవాల్టి తెలుగులో. [మహామహుల విద్వత్తు ఎవరికీ అక్కరలేదు.]
కట్ చెయ్, పేస్ట్ చెయ్, డౌన్లోడ్ చెయ్, పొస్ట్ చెయ్, (వాటర్)యాడ్ చెయ్, టేస్ట్ చెయ్, పుల్ చెయ్, పుష్ చెయ్, రిజెర్వ్ చెయ్, మానేజ్ చెయ్, అప్ప్లయి చెయ్… ఇలా…
నమస్కారాలతో
తఃతః
ఛందం© – తెలుగు ఛందస్సు సాఫ్ట్వేర్ గురించి Dr. Krishna Subbarao Ponnada అభిప్రాయం:
10/02/2014 11:49 am
నాలాంటి ఔత్యహికులకు చక్కని ఉపకరణం .. ధన్య వాదములు . డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ
విముక్తం గురించి arunkumar అభిప్రాయం:
10/02/2014 6:53 am
కథ ఎంత బాగుందొ దాని మీద అభిప్రాయాలు అంతకంటె బాగున్నాయి. thanks to all.
చాపల్యం గురించి arunkumar అభిప్రాయం:
10/02/2014 6:27 am
నిజమే. చాలా సార్లు అవతలి వారిలొ మనం ఉహించుకొన్న తప్పులు వాల్లతొ మాట్లాడిన తర్వాత తప్పులు గా కనిపించవు. మంచి కథ.
అక్కర లేని సంగతుల గురించి Raja Piduri అభిప్రాయం:
10/01/2014 12:20 am
మనసు యొక్క ద్వైతపు గుబులు ని బాగా వర్ణించిందీ పాట.
కొన్ని పదాల అర్ధం ఇస్తే బాగుంటుందేమో (అంధ్రభారతి డాట్ కాం నిఘంటువు కి కృతజ్ఞతలు)
పాగు = పాకం; అగ్గలం=దుస్సహం
పగ్గెల= ప్రగల్భం; తాలిక=మెలిక
నెగులు=బాధ,ప్రవర్తన
అద్దువ=అస్థిరం(అధ్రువం)
“అద్దువ చూపుకు ఒద్దిక చూపే” అన్న పాదం విడి గా అర్థం కాలేదు. తర్వాత వచ్చిన అణకువ తోటి కూడా సరిపడలేదు.
ఇంత బాగా రమణుడి మీద పాటలు రాస్తున్నందుకు కృతజ్ఞతలు.
రాజా పిడూరి
బాపూ గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
09/30/2014 1:09 pm
పరిచయం అక్కరలేని రెండు తెలుగుపేర్లు బాపు, రమణ.
ఇంక ఏమీ వ్రాయనక్కరలేదు.
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
09/30/2014 11:51 am
ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి మిచ్చిన దీనికిం దొడం
బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై
నిడియెద నంచు దాఁ జరణ మెత్తె సభన్ సహదేవుఁ డట్టిచో
నుడిగి సభాసదుల్ వలుక కుండిరి తద్దయు భీతచిత్తులై. — (సభాపర్వం, ద్వితీయాశ్వాసం, 2.2.30)
ఈ పద్యం గురించి వ్రాస్తూ మీరు తప్పులో కాలేశారు. “ఆ పద్యం చివరి పాదం కుంచించుకు పోయి అన్నీ లఘువులతో భయం భయంగా ముడుచుకుపోతుంది.” ఈ అభిప్రాయం తప్పు. ది చంపకమాలావృత్తపద్యం. న-జ-భ-జ-జ-జ-ర అనేది దీని పాదంలో గణాల విభజన. చివరి పాదం అంతా లఘువులు ఎలా వస్తాయండీ? ప్రతి జ, భ-గణలలో ఒక గురువూ, ప్రతి ర-గణంలో రెండు గురువులూ ఉంటాయి ఛందస్సు ప్రకారం. గమనించగలరు. ఒక మారు విశ్వనాథగారు ఏమన్నదీ పరిశీలించగలరు. బహుశః ఆయన నడక గురించి చెప్పి ఉంటారు ఈ ఆఖరు పాదం అంతా ఒక ఊపుతో ఉందని.
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
09/30/2014 11:22 am
అనేక సంవత్సరాల క్రిందట సరిగ్గా ఇదే సంఘటన జరిగింది. అప్పుడు ఆ మాటలన్నది ఎవరో ఇంగ్లీషు నేర్చిన తెలుగుపండితుడు కాదు.
నేనే! పన్నెండో తరగతిలో ఉన్న నేనే.
ఆ యేడాది స్కూలు వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వక్తృత్వపు పోటీల్లో ఇంగ్లీషులో (మీ కిష్టం వచ్చిన విషయంపై మాట్లాడండీ అని చెప్పి) ఒక పోటీ పెట్టారు. ఆ రోజున నేను అచ్చంగా ఇలాంటి ధోరణిలోనే… ముఖ్యంగా ఈ మాటలు కూడా అంటూ… ఒక పావుగంట పాటు ఆ హేమ్లెట్ నాటకాన్ని చెఱిగి పోగులు పోసాను. ఆ పాఠశాలలో మా నాన్నగారు సీనియర్ టీచర్. ఆయన కూడా నా ధాటికి విస్తుపోయారు. బహుమతి వచ్చిందనుకోండి. అది వేరే సంగతి. ఈ సంఘటన మాత్రం బాగా గుర్తుండి పోయింది.