పర్స్పెక్టివ్స్, హైద్రాబాదు వారు ప్రచురించిన ‘త్రిపుర కధలు’ మూడో ముద్రణ లోని ‘హోటల్లో’ అనే కధ అది. కినిగే సంస్థ వారి క్రింద ఇచ్చిన లింకు ద్వారా ప్రింటు కాపీ కాని, e-పుస్తకం కాని చెప్పించుకునే సౌకర్యం కలదు. http://kinige.com/book/tripura+kathalu+print+book.
ప్రతిభావంతురాలైన కవయిత్రి, రచయిత్రి, త్రిపుర గారి వీరాభిమాని అయిన స్వాతికుమారి గారు కధా విషయం, విషయ పరిధి మీద ఇంకొంచం శ్రద్ద పెట్టలేదేమో అనే దుగ్ధతో; త్రిపుర గారి ‘హోటల్లో’ కధలోని అంతర్వాహిని లాంటి మానవత్వపు తడిచెమ్మ ( ‘గుడిసెలోని తన కొడుకు సివంచెలంకి మందెవరు తెస్తారు’ అని ఖాళీ కళ్లతో చూస్తున్న రాములు గురించిన సృహ; ‘వెధవ కమ్యూనిస్టులతో చేరి జండాలు అవీ పట్టుకు తిరుగుతూ అల్లరి పెడుతున్నాడు ధర్డ్ ఫెలో’ ఆకాలమే వేరు అంటున్న తండ్రి గురించిన సృహ ) యీ కధలో కనబడక కసితో అలా అవాకులూ చవాకులూ రాసాను. రచయిత్రి మన్నింపు దృష్ఠితో మిన్నకున్నారు. యీ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
రామాయణముగూర్చి రచన చాలా బాగుంది సామాన్యులకు తెలియని అనేక సాంఘిక, రాజకీయ,సాహిత్య కోణాల గూర్చి తెలుసుకునె అవకాశం కలిగించారు
నాకు ఉన్న మరొక్క సందేహం తీర్చగలరు: శ్రీరాముని ఏకపత్నీవ్రతునిగా చూపించడానికి సాధికారమైన రుజువులున్నాయా ఉంటె రామాయణకాలం నాటి ఏ సాంఘిక పరిస్థితులు ఏకపత్నీవ్రతమన్నది ఒక వాంఛ నీయ ప్రవర్తనగా చూడబడింది తెలియచేయగలరు.
రామునికాక రామాయణకాలములోను తదనంతర కాలములలోను ఏకపత్నీవ్రతాన్ని పెద్దగా పాటించిన వివరాలు కానరాలేదు తిరిగి పాశ్చ్చాత్య విలువలు ఆపాదించుకున్నంతవరకు ఏకపత్నీవ్రతమన్నది తెరమీదకు రాలెదు.
కొందరనేది వాల్మీకి కూడా ఎక్కడా రాముని ఏకపత్నీవ్రతాన్ని ఉటంకించలేదు అంటారు. అది నిజమేనా?
చక్కని ఊహకు రెక్కలనిచ్చి రచనను అద్భుతంగా నిర్వహించారు. శర్మ గార్కి అభినందనలు. భారతం లో శకునికి కూడా ఇప్పుడు మంధరకిచ్చినట్లే benefit of doubt ఇచ్చి తెలుగు సినిమా పండితులు తమ ప్రయోగ శీలతను చాటుకున్నారు. ఇదొక అందమైన అవాల్మీకం!
శర్మగారు, కధ చాలా బాగుందండి. రామాయణం కూలంకషంగా చదవని నాలాంటి పామరులకు ఇది చాలా బాగుంటుంది. నిజంగా మంధర, కైక లను పూర్తిగా కొత్త మనుషులుగా చూపించారు. ఇలాంటివి సాధారణంగా స్వర్గీయ అన్నగారు పరిశోధించి తన సినిమాలలో చూపించేవారు. ఇన్ని రామయణ సినిమాలలో ఇంతమంది దర్సకులు (బాపుగారుతో సహా) ఎవరూ చూపలేదేమి?
ఎమైనా ఈ కధ బాగుంది.
చూడామణి.
మాన్యమిత్రులు శ్రీ ఏల్చూరి మురశీధరరావుగారు సమకాలీన సాహితీ సమాజంలో సమధిక పాండిత్య దీధితీ విరాజితులు. సాహిత్యశాస్త్రంలో కావ్యహేతువుగా నిరూపించబడిన ప్రతిభా,వ్యుత్పత్తి,అభ్యాసములను పుష్కలంగా గలిగిన మహా పండితుడు. సంస్కృత సాహిత్యంలో అలంకారశాస్త్రం మాహార్ణవము. దానిని అవుపాసన పట్టిన అగస్త్యుడాయన. “ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణం”లో కూడా సారాలంకారమును గూర్చి ఇంత చర్చజరగలేదు. ఇంత నిశితమైన పరిశోధనతో ఈ పద్యంలో అలంకారవిశేష చర్చ సారభూతమైనది. పోతన కూడా బహుగ్రంధ, శాస్త్రపరిజ్ఞానముతో వ్రాసిన భాగవతము కాబట్టి శ్రీ కృష్ణపరమాత్మ వలె తానొకడైనా తలకొక రూపై అన్నట్లుగా పద్యమొకటే అయినా తలకొక భావనయై పరిమళిస్తుంది. నాకైతే పోతన గారి ఉపనిషద్విద్యా వైభవం ప్రత్యక్షమోతోంది-అణోరణీయాన్ మహతో మహీయన్-అని. అణిమ్యాది అష్టసిద్దుల జ్ఞానము కూడా ద్యోతకమగుచుతన్నది. అబ్బయామాత్యుల వారన్నట్లుగా “చతుర కవిత్వతత్త్వ పటుసంపద యొక్కరిసొమ్ము గాదు భారతి దయ సౌధవార్ది కవిరాజులమానసముల్ ఘటంబులాయతముకొలంది లబ్దమగు నయ్యమృతంబు……”. శ్రీ మురళీధరరావుగారు ఆ అమృతాన్నిమనతో పంచుకోవడం ఎంతైనా ముదావహం. వారికి నా ధన్యవాదములు.
అగమును = వింధ్యపర్వతాన్ని, స్త్యాయతి = స్తంభింపజేయువాడు అన్న వ్యుత్పత్త్యర్థంలో అగస్త్యుడు, అగస్తి అని ఏర్పడినవి మీరన్నట్లు కాలాంతరసంక్రాంతములైన పేర్లై ఉండవచ్చును. కుంభమునందు జన్మించినవాడు కాబట్టి కుంభసంభవుడు, కుంభయోని, కుంభోద్భవుడు, కలశజుడు, కలశీసూనుడు; మిత్రావరుణుల సంతతి కనుక మైత్రావరుణి; ఊర్వశీపుత్త్రుడు కాబట్టి ఔర్వశేయుడు అన్నవి నిఘంటుపఠితాలు. “మిత్రావరుణయోః సూను రౌర్వశేయశ్చ వారుణిః” అని వ్యాడికోశం. అదే, అణ్ ప్రత్యయాంతమైనప్పుడు “వారుణః” అని నామలింగానుశాసనానికి భానుజీ దీక్షితుల సుధా వ్యాఖ్య. అందువల్ల ‘వారుణి’ అన్నది అగస్త్యునికి తొలి సంజ్ఞ యేమో అనిపిస్తున్నది. వింధ్యగర్వభంగానికి మునుపే అగస్త్యుడు భగవద్గీతను చదువుకొన్నాడని శ్రీనాథుని కాశీఖండం. అది పూర్వకల్పంలోని కథ కాబట్టి తదనంతరీయములైన పురాణేతిహాసాలలో అగస్త్య నామమే రూఢికెక్కిందని ఊహించాలి.
అగస్త్యభ్రాత పేరు సుతీక్ష్ణుడని మలయాళకోశాలలో ఉన్నది. అలాగని అక్కడి రామాయణాలలో ఉన్నదేమో నాకు తెలియదు. అగస్త్యభ్రాత, సుతీక్ష్ణుడు వేర్వేరని “శరభంగం, సుతీక్ష్ణకమ్, అగస్త్యభ్రాతరం నత్వా అగస్త్యం” అని పద్మపురాణం (7-1) చెప్పింది. ఆ “అగస్త్యభ్రాత” మహాముని అని, అగస్త్యునికంటె మునుపు ఆయన ఆశ్రమాన్ని దర్శించి, ఆ తర్వాత అగస్త్యాశ్రమానికి వెళ్ళండని శ్రీమద్రామాయణం అరణ్యకాండ 11-వ సర్గలో సుతీక్ష్ణమహాముని సీతారాములకు చెప్పిన సన్నివేశం ఉన్నది. ఆయన పేరు సుదర్శనుడని వ్యాఖ్యాతలు వ్రాశారు. వావిళ్ళ వారు ప్రకటించిన శ్రీ చదలవాడ సుందరరామశాస్త్రి గారి తాత్పర్యంలో సుదర్శనుడనే ఉన్నది. పంచవటికి మునుపు అగస్త్యకూటానికి ఉత్తరాన సుదర్శనుని ఆశ్రమం ఉన్నదట.
అగస్త్యుని నామాంతరం “సత్యాగ్ని” అని తెలుగు పర్యాయపదనిఘంటువులో జి.ఎన్.రెడ్డి గారు వ్రాశారు. అందుకు ఆధారమేమిటో నాకు తెలియరాలేదు. నామనిధాన కోశంలో “మైత్రావరుణా స్త్వాగ్నిమారుతాః” అని ఉన్నదని రామాశ్రమి అంటున్నది. అది ఈ భ్రాంతికి కారణమేమో తెలియదు.
మున్ముందుగా చెప్పవలసిన మాట: శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి హృద్య పద్యవివృతికి హార్దికాభినందనలు!
టూఎయిటీన్ డీ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
09/26/2015 11:06 am
పర్స్పెక్టివ్స్, హైద్రాబాదు వారు ప్రచురించిన ‘త్రిపుర కధలు’ మూడో ముద్రణ లోని ‘హోటల్లో’ అనే కధ అది. కినిగే సంస్థ వారి క్రింద ఇచ్చిన లింకు ద్వారా ప్రింటు కాపీ కాని, e-పుస్తకం కాని చెప్పించుకునే సౌకర్యం కలదు.
http://kinige.com/book/tripura+kathalu+print+book.
ప్రతిభావంతురాలైన కవయిత్రి, రచయిత్రి, త్రిపుర గారి వీరాభిమాని అయిన స్వాతికుమారి గారు కధా విషయం, విషయ పరిధి మీద ఇంకొంచం శ్రద్ద పెట్టలేదేమో అనే దుగ్ధతో; త్రిపుర గారి ‘హోటల్లో’ కధలోని అంతర్వాహిని లాంటి మానవత్వపు తడిచెమ్మ ( ‘గుడిసెలోని తన కొడుకు సివంచెలంకి మందెవరు తెస్తారు’ అని ఖాళీ కళ్లతో చూస్తున్న రాములు గురించిన సృహ; ‘వెధవ కమ్యూనిస్టులతో చేరి జండాలు అవీ పట్టుకు తిరుగుతూ అల్లరి పెడుతున్నాడు ధర్డ్ ఫెలో’ ఆకాలమే వేరు అంటున్న తండ్రి గురించిన సృహ ) యీ కధలో కనబడక కసితో అలా అవాకులూ చవాకులూ రాసాను. రచయిత్రి మన్నింపు దృష్ఠితో మిన్నకున్నారు. యీ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/25/2015 9:14 am
హృదిమై బమ్మెర పోతనార్యు గవితారీతిం బ్రపంచించు న
స్మదపక్వార్థఫలమ్ము నర్చయిడఁగా స్వాదుత్వ మింపారు స్వాం
తదయావ్యక్తినిఁ బ్రీతిదాయ మిడు చింతా రామకృష్ణార్య! శా
రద మీ రూపముగా గ్రహించితి నఖర్వాశీర్హరిద్రాక్షతల్!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి G B Sastry అభిప్రాయం:
09/25/2015 12:59 am
రామాయణముగూర్చి రచన చాలా బాగుంది సామాన్యులకు తెలియని అనేక సాంఘిక, రాజకీయ,సాహిత్య కోణాల గూర్చి తెలుసుకునె అవకాశం కలిగించారు
నాకు ఉన్న మరొక్క సందేహం తీర్చగలరు: శ్రీరాముని ఏకపత్నీవ్రతునిగా చూపించడానికి సాధికారమైన రుజువులున్నాయా ఉంటె రామాయణకాలం నాటి ఏ సాంఘిక పరిస్థితులు ఏకపత్నీవ్రతమన్నది ఒక వాంఛ నీయ ప్రవర్తనగా చూడబడింది తెలియచేయగలరు.
రామునికాక రామాయణకాలములోను తదనంతర కాలములలోను ఏకపత్నీవ్రతాన్ని పెద్దగా పాటించిన వివరాలు కానరాలేదు తిరిగి పాశ్చ్చాత్య విలువలు ఆపాదించుకున్నంతవరకు ఏకపత్నీవ్రతమన్నది తెరమీదకు రాలెదు.
కొందరనేది వాల్మీకి కూడా ఎక్కడా రాముని ఏకపత్నీవ్రతాన్ని ఉటంకించలేదు అంటారు. అది నిజమేనా?
తెలియ చేయగలరు
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి చింతా రామ కృష్ణా రావు అభిప్రాయం:
09/25/2015 12:30 am
మొరలాలింపుమ! శారదాంబ! సుగుణోత్పూజ్యాఢ్యు లేల్చూరి స
న్మురళీధారుల సంస్తుతుల్, నతులు, నే మ్రోయంగఁ జాలన్. భవత్
కరుణన్ నన్ గనఁ జేసి తీవె కొనుమా! కారుణ్య వారాశి! నీ
సరియెవ్వారలు మమ్ము నిల్ప! కవితా సౌదామినీ! వాగ్ఘృణీ!
వెడలెను కోదండపాణి గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
09/24/2015 2:38 am
చక్కని ఊహకు రెక్కలనిచ్చి రచనను అద్భుతంగా నిర్వహించారు. శర్మ గార్కి అభినందనలు. భారతం లో శకునికి కూడా ఇప్పుడు మంధరకిచ్చినట్లే benefit of doubt ఇచ్చి తెలుగు సినిమా పండితులు తమ ప్రయోగ శీలతను చాటుకున్నారు. ఇదొక అందమైన అవాల్మీకం!
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి చింతా రామ కృష్ణా రావు అభిప్రాయం:
09/23/2015 1:59 am
మహనీయ పోతనామాత్యుని కల్పనా – నల్పశిల్పంబు ననల్పరీతి
‘సారంబు’లోగల సారంబు వివరించి,- రహిని రుయ్యక, జయరథులఁ జూపి,
రవిబింబముపమింప దివియప్సరాంగనా -‘కిం ఛత్ర’ శ్లోకంబు కేలఁ జూపి,
సహజ పాండిత్యుని సారస్వతాభిజ్ఞ,- సద్గ్రంథ గణన సాక్ష్యముగ తెల్పి,
మీదు సద్గ్రంథ సురభిని మిన్నఁ జేయు
వ్యాసమును వ్రాసి, ‘జాల’ సద్భాస రవిగ
కీర్తినందితిరేల్చూరి! స్ఫూర్తి మీరు.
పండితులు మిమ్ము మెచ్చిరి నిండు మదిని.
వెడలెను కోదండపాణి గురించి Chudamani అభిప్రాయం:
09/22/2015 2:11 am
శర్మగారు, కధ చాలా బాగుందండి. రామాయణం కూలంకషంగా చదవని నాలాంటి పామరులకు ఇది చాలా బాగుంటుంది. నిజంగా మంధర, కైక లను పూర్తిగా కొత్త మనుషులుగా చూపించారు. ఇలాంటివి సాధారణంగా స్వర్గీయ అన్నగారు పరిశోధించి తన సినిమాలలో చూపించేవారు. ఇన్ని రామయణ సినిమాలలో ఇంతమంది దర్సకులు (బాపుగారుతో సహా) ఎవరూ చూపలేదేమి?
ఎమైనా ఈ కధ బాగుంది.
చూడామణి.
టూఎయిటీన్ డీ గురించి Chudamani అభిప్రాయం:
09/22/2015 1:35 am
ఏమిటి ఈ కధ?
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి గంటి లక్ష్మీనారాయణమూర్తి అభిప్రాయం:
09/18/2015 3:21 am
మాన్యమిత్రులు శ్రీ ఏల్చూరి మురశీధరరావుగారు సమకాలీన సాహితీ సమాజంలో సమధిక పాండిత్య దీధితీ విరాజితులు. సాహిత్యశాస్త్రంలో కావ్యహేతువుగా నిరూపించబడిన ప్రతిభా,వ్యుత్పత్తి,అభ్యాసములను పుష్కలంగా గలిగిన మహా పండితుడు. సంస్కృత సాహిత్యంలో అలంకారశాస్త్రం మాహార్ణవము. దానిని అవుపాసన పట్టిన అగస్త్యుడాయన. “ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణం”లో కూడా సారాలంకారమును గూర్చి ఇంత చర్చజరగలేదు. ఇంత నిశితమైన పరిశోధనతో ఈ పద్యంలో అలంకారవిశేష చర్చ సారభూతమైనది. పోతన కూడా బహుగ్రంధ, శాస్త్రపరిజ్ఞానముతో వ్రాసిన భాగవతము కాబట్టి శ్రీ కృష్ణపరమాత్మ వలె తానొకడైనా తలకొక రూపై అన్నట్లుగా పద్యమొకటే అయినా తలకొక భావనయై పరిమళిస్తుంది. నాకైతే పోతన గారి ఉపనిషద్విద్యా వైభవం ప్రత్యక్షమోతోంది-అణోరణీయాన్ మహతో మహీయన్-అని. అణిమ్యాది అష్టసిద్దుల జ్ఞానము కూడా ద్యోతకమగుచుతన్నది. అబ్బయామాత్యుల వారన్నట్లుగా “చతుర కవిత్వతత్త్వ పటుసంపద యొక్కరిసొమ్ము గాదు భారతి దయ సౌధవార్ది కవిరాజులమానసముల్ ఘటంబులాయతముకొలంది లబ్దమగు నయ్యమృతంబు……”. శ్రీ మురళీధరరావుగారు ఆ అమృతాన్నిమనతో పంచుకోవడం ఎంతైనా ముదావహం. వారికి నా ధన్యవాదములు.
నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/17/2015 1:36 pm
శ్రీ ఇంద్రకంటి పినాకపాణి గారికి
నమస్కారములతో,
అగమును = వింధ్యపర్వతాన్ని, స్త్యాయతి = స్తంభింపజేయువాడు అన్న వ్యుత్పత్త్యర్థంలో అగస్త్యుడు, అగస్తి అని ఏర్పడినవి మీరన్నట్లు కాలాంతరసంక్రాంతములైన పేర్లై ఉండవచ్చును. కుంభమునందు జన్మించినవాడు కాబట్టి కుంభసంభవుడు, కుంభయోని, కుంభోద్భవుడు, కలశజుడు, కలశీసూనుడు; మిత్రావరుణుల సంతతి కనుక మైత్రావరుణి; ఊర్వశీపుత్త్రుడు కాబట్టి ఔర్వశేయుడు అన్నవి నిఘంటుపఠితాలు. “మిత్రావరుణయోః సూను రౌర్వశేయశ్చ వారుణిః” అని వ్యాడికోశం. అదే, అణ్ ప్రత్యయాంతమైనప్పుడు “వారుణః” అని నామలింగానుశాసనానికి భానుజీ దీక్షితుల సుధా వ్యాఖ్య. అందువల్ల ‘వారుణి’ అన్నది అగస్త్యునికి తొలి సంజ్ఞ యేమో అనిపిస్తున్నది. వింధ్యగర్వభంగానికి మునుపే అగస్త్యుడు భగవద్గీతను చదువుకొన్నాడని శ్రీనాథుని కాశీఖండం. అది పూర్వకల్పంలోని కథ కాబట్టి తదనంతరీయములైన పురాణేతిహాసాలలో అగస్త్య నామమే రూఢికెక్కిందని ఊహించాలి.
అగస్త్యభ్రాత పేరు సుతీక్ష్ణుడని మలయాళకోశాలలో ఉన్నది. అలాగని అక్కడి రామాయణాలలో ఉన్నదేమో నాకు తెలియదు. అగస్త్యభ్రాత, సుతీక్ష్ణుడు వేర్వేరని “శరభంగం, సుతీక్ష్ణకమ్, అగస్త్యభ్రాతరం నత్వా అగస్త్యం” అని పద్మపురాణం (7-1) చెప్పింది. ఆ “అగస్త్యభ్రాత” మహాముని అని, అగస్త్యునికంటె మునుపు ఆయన ఆశ్రమాన్ని దర్శించి, ఆ తర్వాత అగస్త్యాశ్రమానికి వెళ్ళండని శ్రీమద్రామాయణం అరణ్యకాండ 11-వ సర్గలో సుతీక్ష్ణమహాముని సీతారాములకు చెప్పిన సన్నివేశం ఉన్నది. ఆయన పేరు సుదర్శనుడని వ్యాఖ్యాతలు వ్రాశారు. వావిళ్ళ వారు ప్రకటించిన శ్రీ చదలవాడ సుందరరామశాస్త్రి గారి తాత్పర్యంలో సుదర్శనుడనే ఉన్నది. పంచవటికి మునుపు అగస్త్యకూటానికి ఉత్తరాన సుదర్శనుని ఆశ్రమం ఉన్నదట.
అగస్త్యుని నామాంతరం “సత్యాగ్ని” అని తెలుగు పర్యాయపదనిఘంటువులో జి.ఎన్.రెడ్డి గారు వ్రాశారు. అందుకు ఆధారమేమిటో నాకు తెలియరాలేదు. నామనిధాన కోశంలో “మైత్రావరుణా స్త్వాగ్నిమారుతాః” అని ఉన్నదని రామాశ్రమి అంటున్నది. అది ఈ భ్రాంతికి కారణమేమో తెలియదు.
మున్ముందుగా చెప్పవలసిన మాట: శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి హృద్య పద్యవివృతికి హార్దికాభినందనలు!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు