A general comment: Though the CMU catalogue is the most complete one (apprly 52000 books), the site does not host all the books anymore. IISc has only about 23000 books hosted on its servers. Now, don’t ask me where the rest of the books are! 🙂
ముందుగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను మోహన్ గారూ, నేను మీస్పందన చదివిన మరునిముషమే నా జవాబు రాసేసాను. భావావేశం ఎక్కువయ్యో లేక నెట్ కనెక్టివిటీ లేకనో అది ఈమాటకు చేరకుండా మధ్యలో ఎగిరిపోయింది. ఇప్పుడే ఆ సంగతి తెలుసుకుని మళ్ళీ రాస్తున్నాను.
మళ్ళీ మీ స్పందన మరో మారు చదుకున్నాను. ఇప్పుడు నేను రాసే దానిలో ఆవేశం తక్కువైనా, భావం అదేనని నమ్మండి. మీరు ఇచ్చిన క్యాండీడ్ ఉదాహరణ వల్ల ఆ స్త్రీల బాధలకు దేశకాల భేదాలు అడ్డురావని మరోమారు రుజువైంది. నిజంగానే పకెట్ గొంతులో మన గొంతులు వినిపిస్తున్నాయి.
చక్రవేణు గారి ‘కువైట్ సావిత్రమ్మ’, నేను చాలా కాలం క్రితం చదివేను,’హింస’లోని సమాజ(బూటకపు)విలువలు సావిత్రమ్మ సమయానికేలా తారుమారయ్యాయో అని కూడా ఆశ్చర్యపోయాను. విస్తారానికి భయపడి ఒకటీ, నాకు అందుబాటులో కథ లేక మరో కారణానా, దాని విశ్లేషణ చేర్చలేదు. కానీ కథ పేరైనా పేరైనా మెన్షన్ చేసి ఉండవలసింది, క్షంతవ్యురాలిని.
So good to be forewarned. For safety – Ajantha, Tripura, Mo – I will be avoiding all three. Under conceited poets I now got to divide them up into -secretly conceited, openly conceited, grandly conceited, humbly conceited, ruly conceited, unruly conceited, conceited for no reason at all, etc.
కురుమెళ్ళ వెంకట్రావుగారు గారి “మా మహారాజుతో దూరతీరాలు” అరుదైన పుస్తకo పరిచయం చేసిన (Jiddu Krishnamurti Foundation School, Rishi Valley, Madanapalle వాస్తవ్యులు)శ్రీ పిడూరి రాజశేఖర్ గారికి,
Universal Digital Library లో యీ పుస్తకం దొరకవచ్చుననే సమాచారం అందించిన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు, నమస్కారములు.
మీకు తెలిసే ఉంటుంది …. అజంతా గారి కవితలని పుస్తకంగా ప్రచురించటానికి త్రిపురని డిస్కవర్ చేసి తెలుగు పాఠకులకి అందించిన విశాఖ డా.అత్తలూరి నరసింహరావు గారు ఎంత ప్రయత్నించినా సాధించ లేక పోయారు కాని,వారి మేనల్లుడు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ ఆ ఘనకార్యం సాదించాడు. అజంతా గారిని ఒప్పించి “స్వప్నలిపి” కవితల పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ‘కవిత్వం ప్రచురణల’ ద్వారా ఎంతో అందంగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997లో సాహిత్య అకాడెమీ కవిత్వ పురస్కారం అందుకుంది.”స్వప్నలిపి” ని అజంతా, త్రిపురల ప్రియనేస్తం ‘మో’ గారు “Dream Script” పేరిట ఇంగ్లీషులోకి ఆనువదించారు.
” అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహాతం అని చెప్ప లేదా నేను చెప్ప లేదా”
“నేను ప్రతి మనిషిలో వుంటాను, నేను ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను, స్వప్న సౌందర్యంలో వుంటాను … అధః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెతుత్తున్న కారుణ్య హస్తాలలో వుంటాను ”
అన్న అజంతా “సజీవ స్వరం” ఈమాట ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రవాసం లోని మీకు, విజయవాడ లోని శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.
చంద్ర (కన్నడములో రుద్ర లేక బాణ) గణములు లేని అక్కర మధ్యాక్కర. ఇందులో వరుసగా ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ. రెండు అర్ధ భాగములకు ఒకే గణములు. ఇవే గణములకు వరుస మార్పు (permutation) కలిగించినప్పుడు మఱొక రెండు “మధ్యాక్కరలు” ఉద్భవిస్తాయి. అవి (1) సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం, (2) ఇం/సూ/ఇం – ఇం/సూ/ఇం. వీటికి నేను ఆద్యరుణ మధ్యాక్కర, మధ్యారుణ మధ్యాక్కర అని పేరు పెట్టాను. ఇందులో సూర్య గణపు స్థానము స్పష్టము. సామాన్య మధ్యాక్కర నిజముగా అంత్యారుణ మధ్యాక్కర. వీటిని కూడ చక్కగా వ్రాసి పాడుకోవచ్చును. క్రింద నా ఉదాహరణములు –
విషయసంపన్నమైన ఈ సుదీర్ఘవ్యాసాన్ని, ప్రస్తుతం మధ్యాక్కర వరకూ చదివాను. ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలపై నా ఆలోచనలు:
1. “…గీతులలో పదములను గణములకు తగ్గట్లు ఎంచుకొంటే ఆ గీతి గానయోగ్యముగా ఉంటుందని”
ఇది పాక్షికసత్యం మాత్రమే అని నా అభిప్రాయం. గణాలకు తగ్గట్టుగా పదాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ గణాలలో “మాత్రా సమత” కూడా ఉండాలి. మచ్చుకి, మోహనగారు ఉదాహరించిన మహాక్కర పాదం పరిశీలిస్తే:
ఈ పాదంలో మొదటి దళం (నీవు లేనిచో జీవమ్ము లేదురా) కన్నా రెండవ దళానికి (నీవెగా నాజీవ రాజీవము) లయబద్ధత (దానివల్ల గానయోగ్యత) అధికంగా ఉన్నదన్న విషయం గమనించవచ్చు. దానికి కారణం రెండవ దళంలోని గణాలలో మాత్రా సమత అధికంగా ఉండటమే. మొదటి దళం “తాన తాననా తానాన తాననా” అయితే, రెండవది “తాననా తానాన తానాన న”. మొదటి దళంలో “తాన తాననా” అనేది లయని కుంటుపరుస్తున్నది. దీన్ని “తాన తానాన” అన్న రీతిలో మారిస్తే కొంత మెరుగైన నడక లభిస్తుంది. “నీవు లేకున్న జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”. మహాక్కర పాదంలో మొదటి దళానికి ఇంకా మెరుగైన నడక నా దృష్టిలో ఇది: “తాననా/(తన తనన) తాననన తాననా తాన”
“నినువిడిచి జీవనము లేదురా నాకు – నీవెగా నాజీవ రాజీవము”
ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది కూడా మహాక్కర పాదమే. కాని పదాలు గణాలకు తగ్గట్టుగా విడలేదు. అయినా ఖండగతిలో పాదం హాయిగా సాగింది.
సారాంశం ఏమిటంటే, అంశగణ ఛందస్సు పూర్తి మాత్రాబద్ధ ఛందస్సు కాదు. కాబట్టి అందులో గణాల సమత ఉన్నా, ఆ గణాలబట్టి పదాలను కూర్చినా, స్ఫుటమైన చక్కని నడక ఏర్పడుతుందని చెప్పడానికి లేదు. ఆ గణాలను అనేక రకాలైన మాత్రాక్రమాలుగా రచించవచ్చు. అందులో కొన్ని మాత్రాక్రమాల పోహళింపులే మంచి నడకని అందిస్తాయి. అంచేత గానయోగ్యంగా రాయాలంటే అలాంటి క్రమాలని గుర్తించి, వాటిని అనుసరించి పదాలను కూర్చాలి.
2. మధ్యాక్కర యతి గురించి
దీనిపై చాలా చర్చే జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా చాలావరకూ అందరూ అయిదవ గణం దగ్గర యతి సరి కాదనీ, నాల్గవ గణం దగ్గరదే సరైనదనీ భావించారు. త్రిపురనేని రామస్వామిగారైతే ఏకంగా “అప్పటి బహుళ ప్రచారములో నున్న యక్కరలను నన్నయ వాడినాడు కాని వాని తత్త్వమెరుగజాలక మధురగతి నంతయు మంటపాలు చేసి కుంటినడక యంటించినాడు” అని నన్నయపై విరుచుకుపడ్డారు. నన్నయ మధ్యాక్కరది కుంటినడకే అయినా, అది చేసినది నన్నయ కాదనీ, అంతకుముందు శాసనాలలో కూడా అదే నడక ఉన్నదనీ త్రిపురనేనివారు గమనించకపోవడం దురదృష్టం. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొనో ఏమో కోవెల సంపత్కుమారాచర్యగారు నన్నయ మధ్యాక్కరలలో కొన్ని చోట్ల నాల్గవ గణంపై కూడా యతి ఉన్నదనీ అందువల్ల నన్నయకి నాల్గవ గణంపై యతి ఆమోదమేననీ సమర్థించడానికి ప్రయత్నించారు. కాని అది అంత సమంజసం కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించి సంగనభట్ల నరసయ్యగారు తన “తెలుగులో దేశిచ్ఛందస్సు ప్రారంభ దశలు” అనే పుస్తకంలో దాన్ని సహేతుకంగా ఖండించారు.
“ఆ కాలములో ఈ కాలములో మధ్యాక్కరను నడిపించే విధానములో భేదమున్నదని అనుకొందును. మొదటి నాలుగు గణములు ఒక పట్టుగా ద్విపదవలె నడిపించి శేషించిన రెండు గణములను రెండవ పట్టుగా చదివిన యెడల వినసొంపుగానే యుండును”, అన్న గిడుగు సీతాపతిగారి అభిప్రాయమే నాకు మిగతావారి వాదనలకన్నా సమంజసంగా తోస్తోంది. నరసయ్యగారు కూడా దీనిని తన పుస్తకంలో సమర్థించారు. గిడుగువారు ఇచ్చిన బొబ్బిలిపాట ఉదాహరణతోబాటు, వారు బతుకమ్మపాట ఉదాహరణకూడా ఇచ్చారు:
శ్రీరామభూపాలుడూ పట్టాభి
షేకుడై కొలువుండగా
ఇక్కడ “పట్టాభి” అనేది అధికంగా వచ్చిన గణం. ఇలా ఒకే రకమైన మాత్రాగణాల మధ్యలో అదనంగా మరొక మాత్రాగణం చేరడం మరికొన్ని పాటలలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు
“కస్తూరి రంగరంగా మాయన్న
కావేటి రంగరంగా”
అన్న పాటలో కూడా “మాయన్న” అనేది “తానాన తాననానా” అనే రెండు సమ మాత్రాగణాల మధ్యలో వచ్చిన గణం.
అయితే, గిడుగువారు కానీ నరసయ్యగారు కానీ యిచ్చిన ఉదాహరణలు ద్విపద – మధ్యాక్కర ఉదాహరణలు కాదు. మధ్యాక్కరను ద్విపదలాగా నడిపించిన ఉదాహరణలు వారు ఇవ్వలేదు. వారు పైన సూచించిన అంశంకన్నా కూడా విశేషమైన మరొక ప్రత్యేకత మధ్యాక్కర – ద్విపద మధ్య నాకు కనిపించింది. అదేమిటంటే, “తననాన తానాన తాననా నాన” అనే దివపదలోని నాలుగు దళాలలో చివరి రెండు దళాలూ మళ్ళీ ఆవృత్తి అయితే అది మధ్యాక్కర అవుతుంది! మోహనగారు ఉదాహరించిన మధ్యాక్కర పాదం చూస్తే అది స్పష్టం అవుతుంది:
మనసెందుకో నేఁడు మైన-మై మారె – మౌనమై జారె
ఇక్కడ “మైనమై మారె”, “మౌనమై జారె” అనే రెంటి గణస్వరూపం సరిగ్గా ఒకటే.
దీనిబట్టి, నా ఊహ (లేదా అంచనా) ఏమిటంటే – పూర్వం ద్విపద పాటని ఒకరు పాడి, చివరి రెండు దళాలనూ వంత పాడేవాళ్ళు తిరిగి పాడే సంప్రదాయం ఉండేది. ఉదాహరణకు:
“అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు” అని ఒకరు పాడితే, మిగతావాళ్ళు “తమ్మిపూవుల్లు” అని వంతపాడేవారు. అది అంతా కలిసి ఒక వాక్యంగా రాస్తే సరిగ్గా మధ్యాక్కర పాదం అవుతుంది:
అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు తమ్మిపూవుల్లు
అందువల్ల దీనికి అయిదవ గణం మొదట యతి (పదవిచ్ఛేదం) తప్పనిసరి!
నా ఊహకి సమర్థింపుగా, “లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లొ మేసె – లంకల్లొ మేసె” అంటూ ద్విపద నడకలో సాగే జానపదగేయం ఆంధ్రభారతి సైటులో కనిపించింది (లింకు).
ఇది ఇంచుమించుగా మధ్యాక్కర ఛందస్సే (లాలమ్మ గుఱ్ఱాలు లంకలో మేసె – లంకలో మేసె – అని మార్చుకొంటే)!
చివరిగా, వేలూరివారు ఉదాహరించిన విశ్వనాథ మధ్యాక్కరని ఎలా “పాడూకో”వచ్చునో వారినోట కాని, మరెవరి నోటనైనా కాని వినాలనుంది! 🙂
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/11/2016 3:14 pm
రామయ్య గారు, Here is the correct DLI link: Maa Maharajutho Duratheeralu,2040100047159 K.Venkatarau 1966 telugu 218pgs
http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0047/164&first=1&last=218&barcode=2040100047159
A general comment: Though the CMU catalogue is the most complete one (apprly 52000 books), the site does not host all the books anymore. IISc has only about 23000 books hosted on its servers. Now, don’t ask me where the rest of the books are! 🙂
సాహిత్యంలో వేశ్యా వృత్తి గురించి Kalyani అభిప్రాయం:
01/11/2016 8:39 am
ముందుగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను మోహన్ గారూ, నేను మీస్పందన చదివిన మరునిముషమే నా జవాబు రాసేసాను. భావావేశం ఎక్కువయ్యో లేక నెట్ కనెక్టివిటీ లేకనో అది ఈమాటకు చేరకుండా మధ్యలో ఎగిరిపోయింది. ఇప్పుడే ఆ సంగతి తెలుసుకుని మళ్ళీ రాస్తున్నాను.
మళ్ళీ మీ స్పందన మరో మారు చదుకున్నాను. ఇప్పుడు నేను రాసే దానిలో ఆవేశం తక్కువైనా, భావం అదేనని నమ్మండి. మీరు ఇచ్చిన క్యాండీడ్ ఉదాహరణ వల్ల ఆ స్త్రీల బాధలకు దేశకాల భేదాలు అడ్డురావని మరోమారు రుజువైంది. నిజంగానే పకెట్ గొంతులో మన గొంతులు వినిపిస్తున్నాయి.
చక్రవేణు గారి ‘కువైట్ సావిత్రమ్మ’, నేను చాలా కాలం క్రితం చదివేను,’హింస’లోని సమాజ(బూటకపు)విలువలు సావిత్రమ్మ సమయానికేలా తారుమారయ్యాయో అని కూడా ఆశ్చర్యపోయాను. విస్తారానికి భయపడి ఒకటీ, నాకు అందుబాటులో కథ లేక మరో కారణానా, దాని విశ్లేషణ చేర్చలేదు. కానీ కథ పేరైనా పేరైనా మెన్షన్ చేసి ఉండవలసింది, క్షంతవ్యురాలిని.
మీ స్పందనకు అనేకానేక ధన్యవాదాలు.
అజంతా రెండు కవితలు గురించి lyla yerneni అభిప్రాయం:
01/10/2016 3:38 pm
So good to be forewarned. For safety – Ajantha, Tripura, Mo – I will be avoiding all three. Under conceited poets I now got to divide them up into -secretly conceited, openly conceited, grandly conceited, humbly conceited, ruly conceited, unruly conceited, conceited for no reason at all, etc.
స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నో
యతులితమాధురీమహిమ?
హా! తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత కవనాల సార రచనా సమయాల ససేమిరా ఇసిం
త తగని(క) తెల్గు అక్కరల నంటక యుండుట చేతనే సుమీ!
Lyla
(All kinds of Pun is certainly intended.)
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
01/10/2016 1:04 pm
కురుమెళ్ళ వెంకట్రావుగారు గారి “మా మహారాజుతో దూరతీరాలు” అరుదైన పుస్తకo పరిచయం చేసిన (Jiddu Krishnamurti Foundation School, Rishi Valley, Madanapalle వాస్తవ్యులు)శ్రీ పిడూరి రాజశేఖర్ గారికి,
Universal Digital Library లో యీ పుస్తకం దొరకవచ్చుననే సమాచారం అందించిన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
DLI లింకు
అజంతా రెండు కవితలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
01/09/2016 11:57 pm
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు, నమస్కారములు.
మీకు తెలిసే ఉంటుంది …. అజంతా గారి కవితలని పుస్తకంగా ప్రచురించటానికి త్రిపురని డిస్కవర్ చేసి తెలుగు పాఠకులకి అందించిన విశాఖ డా.అత్తలూరి నరసింహరావు గారు ఎంత ప్రయత్నించినా సాధించ లేక పోయారు కాని,వారి మేనల్లుడు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ ఆ ఘనకార్యం సాదించాడు. అజంతా గారిని ఒప్పించి “స్వప్నలిపి” కవితల పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ‘కవిత్వం ప్రచురణల’ ద్వారా ఎంతో అందంగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997లో సాహిత్య అకాడెమీ కవిత్వ పురస్కారం అందుకుంది.”స్వప్నలిపి” ని అజంతా, త్రిపురల ప్రియనేస్తం ‘మో’ గారు “Dream Script” పేరిట ఇంగ్లీషులోకి ఆనువదించారు.
” అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహాతం అని చెప్ప లేదా నేను చెప్ప లేదా”
“నేను ప్రతి మనిషిలో వుంటాను, నేను ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను, స్వప్న సౌందర్యంలో వుంటాను … అధః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెతుత్తున్న కారుణ్య హస్తాలలో వుంటాను ”
అన్న అజంతా “సజీవ స్వరం” ఈమాట ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రవాసం లోని మీకు, విజయవాడ లోని శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.
రెండు కవితలు గురించి S A RAHMAN అభిప్రాయం:
01/07/2016 2:00 pm
రెండు కవితలు కూడా చాలా బాగున్నాయి.
మా ఆవిడ – మంగళసూత్రం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
01/07/2016 3:12 am
జిలేబి గారికి,
ధన్యవాదాలు.
భామినులు కాంచునది పసిడినే కదా….దహా.
రమణి గారికి,
ధన్యవాదాలు.
రెండు FDలు తీసిన తరువాత లాభం ఎవరికి? మంగళ సూత్రం స్ట్రాంగ్ గానే ఉంది ప్రద్యుమ్నుడే వీక్ అయ్యాడు……దహా.
జనవరి 2016 గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
01/06/2016 10:43 am
అభినందనలు. “ఈమాట” మరిన్ని మైలురాళ్ళు తప్పక దాటుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు.
అక్కరలు గురించి మోహన అభిప్రాయం:
01/06/2016 10:25 am
వరుసమార్పు (permutation) మధ్యాక్కరలు –
చంద్ర (కన్నడములో రుద్ర లేక బాణ) గణములు లేని అక్కర మధ్యాక్కర. ఇందులో వరుసగా ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ. రెండు అర్ధ భాగములకు ఒకే గణములు. ఇవే గణములకు వరుస మార్పు (permutation) కలిగించినప్పుడు మఱొక రెండు “మధ్యాక్కరలు” ఉద్భవిస్తాయి. అవి (1) సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం, (2) ఇం/సూ/ఇం – ఇం/సూ/ఇం. వీటికి నేను ఆద్యరుణ మధ్యాక్కర, మధ్యారుణ మధ్యాక్కర అని పేరు పెట్టాను. ఇందులో సూర్య గణపు స్థానము స్పష్టము. సామాన్య మధ్యాక్కర నిజముగా అంత్యారుణ మధ్యాక్కర. వీటిని కూడ చక్కగా వ్రాసి పాడుకోవచ్చును. క్రింద నా ఉదాహరణములు –
“ఆద్యరుణ” మధ్యాక్కర – సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం
రమ్ము నక్తంపు భ్రాంతిలో – రమ్ము నక్షత్ర కాంతిలో
రమ్ము కౌముదీ మాయలో – రమ్ము శృంగంపు ఛాయలో
రమ్ము మృదుగాన పదముగా – రమ్ము రసరాగ నదముగా
రమ్ము రాజీవ లోచనా – రమ్ము నా జీవమోచనా
జలజ మిత్రుండు వెలుఁగగా – జలజ మాలికల్ విరియఁగా
జలజ లోచనున్ లేపఁగా – జలజ లోచనల్ పాడఁగా
జలద వర్ణునిన్ జూడఁగా – జలదమై డెంద మాడఁగా
జలము పొంగెఁగాఁ గంటిలో – జలదరింపులే యొంటిలో
“మధ్యారుణ” మధ్యాక్కర – ఇం/సూ/ఇం – ఇం/సూ/ఇం
ఎందుకే నీకు తొందర – యెందుకో చెప్పు ముందర
చిందులాడంగ వచ్చునే – శ్రీలఁ దా నీకు నిచ్చునే
బంధమో యింక గట్టిదే – బాధ యీ నిన్ను ముట్టదే
తందనా తాన తాననా – తందనా తాన తాననా
శారికా వాని రాకలో – సారమే జీవితమ్ములో
చేరి యీ నన్ను మార్చునే – చింతలన్ వేగ తీర్చునే
కోరికల్ గ్రొత్త పుష్పముల్ – కూర్మి నానంద బాష్పముల్
వేఱుగా జన్మ లేలనే – ప్రేమలో విరియు బాలనే
విధేయుడు – మోహన
అక్కరలు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
01/06/2016 4:58 am
విషయసంపన్నమైన ఈ సుదీర్ఘవ్యాసాన్ని, ప్రస్తుతం మధ్యాక్కర వరకూ చదివాను. ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలపై నా ఆలోచనలు:
1. “…గీతులలో పదములను గణములకు తగ్గట్లు ఎంచుకొంటే ఆ గీతి గానయోగ్యముగా ఉంటుందని”
ఇది పాక్షికసత్యం మాత్రమే అని నా అభిప్రాయం. గణాలకు తగ్గట్టుగా పదాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ గణాలలో “మాత్రా సమత” కూడా ఉండాలి. మచ్చుకి, మోహనగారు ఉదాహరించిన మహాక్కర పాదం పరిశీలిస్తే:
“నీవు లేనిచో జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”
ఈ పాదంలో మొదటి దళం (నీవు లేనిచో జీవమ్ము లేదురా) కన్నా రెండవ దళానికి (నీవెగా నాజీవ రాజీవము) లయబద్ధత (దానివల్ల గానయోగ్యత) అధికంగా ఉన్నదన్న విషయం గమనించవచ్చు. దానికి కారణం రెండవ దళంలోని గణాలలో మాత్రా సమత అధికంగా ఉండటమే. మొదటి దళం “తాన తాననా తానాన తాననా” అయితే, రెండవది “తాననా తానాన తానాన న”. మొదటి దళంలో “తాన తాననా” అనేది లయని కుంటుపరుస్తున్నది. దీన్ని “తాన తానాన” అన్న రీతిలో మారిస్తే కొంత మెరుగైన నడక లభిస్తుంది. “నీవు లేకున్న జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”. మహాక్కర పాదంలో మొదటి దళానికి ఇంకా మెరుగైన నడక నా దృష్టిలో ఇది: “తాననా/(తన తనన) తాననన తాననా తాన”
“నినువిడిచి జీవనము లేదురా నాకు – నీవెగా నాజీవ రాజీవము”
ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది కూడా మహాక్కర పాదమే. కాని పదాలు గణాలకు తగ్గట్టుగా విడలేదు. అయినా ఖండగతిలో పాదం హాయిగా సాగింది.
సారాంశం ఏమిటంటే, అంశగణ ఛందస్సు పూర్తి మాత్రాబద్ధ ఛందస్సు కాదు. కాబట్టి అందులో గణాల సమత ఉన్నా, ఆ గణాలబట్టి పదాలను కూర్చినా, స్ఫుటమైన చక్కని నడక ఏర్పడుతుందని చెప్పడానికి లేదు. ఆ గణాలను అనేక రకాలైన మాత్రాక్రమాలుగా రచించవచ్చు. అందులో కొన్ని మాత్రాక్రమాల పోహళింపులే మంచి నడకని అందిస్తాయి. అంచేత గానయోగ్యంగా రాయాలంటే అలాంటి క్రమాలని గుర్తించి, వాటిని అనుసరించి పదాలను కూర్చాలి.
2. మధ్యాక్కర యతి గురించి
దీనిపై చాలా చర్చే జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా చాలావరకూ అందరూ అయిదవ గణం దగ్గర యతి సరి కాదనీ, నాల్గవ గణం దగ్గరదే సరైనదనీ భావించారు. త్రిపురనేని రామస్వామిగారైతే ఏకంగా “అప్పటి బహుళ ప్రచారములో నున్న యక్కరలను నన్నయ వాడినాడు కాని వాని తత్త్వమెరుగజాలక మధురగతి నంతయు మంటపాలు చేసి కుంటినడక యంటించినాడు” అని నన్నయపై విరుచుకుపడ్డారు. నన్నయ మధ్యాక్కరది కుంటినడకే అయినా, అది చేసినది నన్నయ కాదనీ, అంతకుముందు శాసనాలలో కూడా అదే నడక ఉన్నదనీ త్రిపురనేనివారు గమనించకపోవడం దురదృష్టం. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొనో ఏమో కోవెల సంపత్కుమారాచర్యగారు నన్నయ మధ్యాక్కరలలో కొన్ని చోట్ల నాల్గవ గణంపై కూడా యతి ఉన్నదనీ అందువల్ల నన్నయకి నాల్గవ గణంపై యతి ఆమోదమేననీ సమర్థించడానికి ప్రయత్నించారు. కాని అది అంత సమంజసం కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించి సంగనభట్ల నరసయ్యగారు తన “తెలుగులో దేశిచ్ఛందస్సు ప్రారంభ దశలు” అనే పుస్తకంలో దాన్ని సహేతుకంగా ఖండించారు.
“ఆ కాలములో ఈ కాలములో మధ్యాక్కరను నడిపించే విధానములో భేదమున్నదని అనుకొందును. మొదటి నాలుగు గణములు ఒక పట్టుగా ద్విపదవలె నడిపించి శేషించిన రెండు గణములను రెండవ పట్టుగా చదివిన యెడల వినసొంపుగానే యుండును”, అన్న గిడుగు సీతాపతిగారి అభిప్రాయమే నాకు మిగతావారి వాదనలకన్నా సమంజసంగా తోస్తోంది. నరసయ్యగారు కూడా దీనిని తన పుస్తకంలో సమర్థించారు. గిడుగువారు ఇచ్చిన బొబ్బిలిపాట ఉదాహరణతోబాటు, వారు బతుకమ్మపాట ఉదాహరణకూడా ఇచ్చారు:
శ్రీరామభూపాలుడూ పట్టాభి
షేకుడై కొలువుండగా
ఇక్కడ “పట్టాభి” అనేది అధికంగా వచ్చిన గణం. ఇలా ఒకే రకమైన మాత్రాగణాల మధ్యలో అదనంగా మరొక మాత్రాగణం చేరడం మరికొన్ని పాటలలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు
“కస్తూరి రంగరంగా మాయన్న
కావేటి రంగరంగా”
అన్న పాటలో కూడా “మాయన్న” అనేది “తానాన తాననానా” అనే రెండు సమ మాత్రాగణాల మధ్యలో వచ్చిన గణం.
అయితే, గిడుగువారు కానీ నరసయ్యగారు కానీ యిచ్చిన ఉదాహరణలు ద్విపద – మధ్యాక్కర ఉదాహరణలు కాదు. మధ్యాక్కరను ద్విపదలాగా నడిపించిన ఉదాహరణలు వారు ఇవ్వలేదు. వారు పైన సూచించిన అంశంకన్నా కూడా విశేషమైన మరొక ప్రత్యేకత మధ్యాక్కర – ద్విపద మధ్య నాకు కనిపించింది. అదేమిటంటే, “తననాన తానాన తాననా నాన” అనే దివపదలోని నాలుగు దళాలలో చివరి రెండు దళాలూ మళ్ళీ ఆవృత్తి అయితే అది మధ్యాక్కర అవుతుంది! మోహనగారు ఉదాహరించిన మధ్యాక్కర పాదం చూస్తే అది స్పష్టం అవుతుంది:
మనసెందుకో నేఁడు మైన-మై మారె – మౌనమై జారె
ఇక్కడ “మైనమై మారె”, “మౌనమై జారె” అనే రెంటి గణస్వరూపం సరిగ్గా ఒకటే.
దీనిబట్టి, నా ఊహ (లేదా అంచనా) ఏమిటంటే – పూర్వం ద్విపద పాటని ఒకరు పాడి, చివరి రెండు దళాలనూ వంత పాడేవాళ్ళు తిరిగి పాడే సంప్రదాయం ఉండేది. ఉదాహరణకు:
“అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు” అని ఒకరు పాడితే, మిగతావాళ్ళు “తమ్మిపూవుల్లు” అని వంతపాడేవారు. అది అంతా కలిసి ఒక వాక్యంగా రాస్తే సరిగ్గా మధ్యాక్కర పాదం అవుతుంది:
అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు తమ్మిపూవుల్లు
అందువల్ల దీనికి అయిదవ గణం మొదట యతి (పదవిచ్ఛేదం) తప్పనిసరి!
నా ఊహకి సమర్థింపుగా, “లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లొ మేసె – లంకల్లొ మేసె” అంటూ ద్విపద నడకలో సాగే జానపదగేయం ఆంధ్రభారతి సైటులో కనిపించింది (లింకు).
ఇది ఇంచుమించుగా మధ్యాక్కర ఛందస్సే (లాలమ్మ గుఱ్ఱాలు లంకలో మేసె – లంకలో మేసె – అని మార్చుకొంటే)!
చివరిగా, వేలూరివారు ఉదాహరించిన విశ్వనాథ మధ్యాక్కరని ఎలా “పాడూకో”వచ్చునో వారినోట కాని, మరెవరి నోటనైనా కాని వినాలనుంది! 🙂