‘అపరాజితొ’ విశ్లేషణ బాగుంది. ‘పథేర్ పాంచాలి’ డి.వి.డి. కొనుక్కున్నతర్వాత, ‘అపరాజితొ’, ‘అపూర్ సన్సార్’ చిత్రాల డివిడిలు కూడా నేను తెప్పించుకున్నాను. మీ ‘రాయ్’ సినిమాల విశ్లేషణలన్నీ ఒక పుస్తకంగా వేస్తే చాలా బాగుంటుంది. ‘సర్బజయ’ అని బెంగాలీ ఉచ్చారణను అనుకరిస్తూ రాసేబదులు ‘సర్వజయ’ అని రాసుకోవచ్చు. మద్దిపట్ల సూరి గారు తన అనువాదంలో అలానే రాశారు. బెంగాలీలో ‘బ’ వచ్చినచోటల్లా మనం ‘వ’ వాడటం సహజమే. బెంగాలీ ఉచ్చారణ ప్రకారం రాస్తే ‘సత్యజిత్’ పదాన్ని కూడా ‘షొత్తెజిత్’ అనే పలకాలి (బెంగాలీలు ‘స’ ను ‘ష’ అనే పలుకుతారు కాబట్టి). ఈ విషయాలన్నీ పక్కన పెడితే, మీ సమీక్షలు ‘అక్షరలక్షలు’ చేస్తాయి.
– మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ.
మోహన రావుగారూ,
నాకు తెలుసున్నంత వరకూ, కొన్ని త్యాగరాజు కృతులు తెలుగు ని “తమిళం” లో రాసినట్లుగా కొన్ని తాళపత్ర గ్రంధాలున్నాయి. నేను ప్రత్యక్షంగా చూసాను. అలాగే అచ్చ తెలుగులో వున్నవి కూడా “సరస్వతి మహల్” గ్రంధాలయంలో చూసాను. ఇలా ఒక్కక్షరం తేడాతో ఉన్న పదాలని నిర్ధారించడం కష్టం.
మనకందు బాటులో ఉన్న త్యాగరాజు కృతుల మూల ప్రతులేవీ ఆయన స్వదస్తూరీవి కావు. కాబట్టి “వట్టి” యా లేక “పట్టి” యా అన్నది నిర్ధారించడం కష్టం. రెండూ అర్థం చెడకుండా నప్పాయి కనుక ఎవరికి నచ్చింది వారు పాడుకున్నారనుకోవాలి. మీ అభిప్రాయాలు చూసాక రెండు మూడు పుస్తకాలు తిరగేసాను.
Dr.వి. రాఘవన్ గారి “The Spiritual Heritage of Tyagaraja” లో వట్టి యనే ఉంది. అలాగే టి. పార్థసారధీ, మంచాల జగన్నాధ రావు గార్ల పుస్తకాల్లో “వట్టి” అనే వుంది. ఈ మధ్యనే వచ్చిన టి. కె. గోవిందరావు గారి “ Compositions of Tyagaraja” ఓ మాత్రం “పట్టి” అనుంది. Dr.వి. రాఘవన్ పుస్తకం కొన్ని మూల ప్రతులనుండి సంగ్రహించినట్లుగా ముందుమాటలో వుంది. ఈ ఒక్క “పట్టి” లేక “వట్టి” అన్నది మినహాయించి ఇంకేమయినా పరభాషా పదాలుంటే తెలియజేయండి. అందరికీ తెలుస్తాయి.
“కథకుడుగా కొండలరావు” అనే శీర్షికన నండూరి రామ్మోహన రావుగారు ర్రవి కొండలరావు గారి ద్విశత చిత్రోత్సవ అభినందన సంచికలో (1983) ఒక వ్యాసం రాసేరు. అందులో రావి కొండలరావు గారి “ముమూర్ష”, “దిదృక్ష”, “చంద్రశేఖరుని కథ” మరియూ “స్నేహం” కథల గురించి క్లుప్తంగా సమీక్షించేరు రామ్మోహన రావు గారు.
రావి కొండల రావు గారి “టెక్నిక్” గురించి చెబ్తూ “కొండల రావు తన కథలను ముగిస్తూ ముగింపు తరవాత జరిగేదాన్ని వాచ్యంగా చెప్పడు. పాఠకుల ఊహకు వదిలెయ్యడం అతని “టెక్నిక్” అంటారు.
“ఇలాగే కొండలరావు రాసిన నిరుద్యోగపర్వం, మాయమైనపర్సు,తప్పిపోయినాడు లాంటి కథలు లబ్జుగానూ, రంజుగానూ వుండి పాఠకుల్ని గిలిగింతలు పెడతాయి” అంటారు నం.రా.రావు గారు.
వ్యాసం చివర్లో “…కథలు రాయని భాస్కరుడు (జూ) గా కొండలరావు పై ఆయన స్నేహితుడు ముళ్ళపూడి పరోక్ష ప్రభావం ఎంతైనా వుంది (సీనియరు ముళ్ళపూడా? ఎక్కడ చదివేనో గుర్తు రావటం లేదు కృ.శాస్త్రి గారితో ఎలాగొలాగ కష్టపడి రాయించొచ్చుగానీ, ము.వెం.రవఁణ గారి చేత మరీ కష్టవఁని). ఆ ప్రభావంలో నుంచి బయటపడి కథకుడిగా కొండలరావు మళ్ళీ విజృంభిస్తే బావుంటుందనే దిదృక్ష కలవారిలో నేనొకడిని” అని ముగిస్తారు నండూరి రామ్మోహన రావు గారు.
చూద్దాం. ఈమాట కోసం రా.కొండలరావు గారి చేత కథో, నాటికో ఏదో ఒకటి రాయించగలనేమో? అది మన “పీర్స్” కి “పర్లేదు” అనిపిస్తుందేమో?
ఇరువురిలో ఏ వొక్కరినీ తక్కువ చేసి చూపడం అనే ఉద్దేశం నన్నయకు ఉండి వుండదు. అయినా కొద్ది పాటి అర్జున పక్షపాతం పైపద్యాల్లో కనిపించక పోదు. -చీమలమర్రి బృందావనరావు
అప్పటికే పలుమార్లు ప్రదర్శించబడిన విజయుని విద్యాసక్తి, వీరగుణం గురువు ద్రోణుడినే కాకుండా, మహాభారత కథ మనకు చెపుతున్న నన్నయ కవిని కూడా మెప్పించిందేమో!
“విద్యలెల్ల నభ్యాస వశంబునన్ బడయ భారము లేదని నిశ్చితాత్ముడై” చీకటిలో కూడా విలువిద్య ప్రాక్టీసు చేశాడట అర్జునుడు. అతని పట్టుదల చూసి గురువుకు ఇంకా ఎక్కువ కష్టమైన విద్యలు నేర్పబుద్దయ్యింది. మరి విద్యలు పరీక్షకు వస్తే:
చెట్టుకొమ్మ మీది పక్షి తలను కూల్చమంటే, మరి ఆ పక్షితల తప్ప కంటికి ఇంకే కనిపించని ఏకాగ్రత కలవాడు. అందుకనే అర్జునుని గురి తప్పదు. ఐనా అది కృత్రిమపక్షితల. కల్పించిన పరీక్ష. అందులో అంత గొప్ప ఏముంది. :)తర్వాత గంగా స్నానాలు చేస్తున్నప్పుడు, ఒక మొసలి, ద్రోణుని తొడ పట్టుకుంటే శిష్యులంతా స్తంభించి పోయి ఉన్నప్పుడు, అర్జునుడు మొసలిని చంపి ద్రోణుని కాపాడాడు. ఇది నిజమైన మొసలి. నిజమైన ఆపద. గురి తప్పరాని సమయము. ఇదీ విద్యకు అసలు పరీక్ష. శ్రద్ధతో చదువు నేర్చి, ఆ చదువునే వాడి, గురువునే ఆపత్తి నుంచి రక్షించగలిగిన సమర్ధుల మీద ఎక్కువ అభిమానం చూపించకుండా, ఎవరైనా ఎలా ఉండగలరు?
సంతోషమ్ము లభించె చాల, సదయున్ సందీప్తివంతున్, భళా!
కుంతీపుత్రుని ఆ వదాన్యు నళినాక్షుం గర్ణునిన్, పిమ్మటా
కుంతీపుత్రుని, ఆ విశేష విజయాఖ్యుం జూచి సంతోషమెం
తెంతో! సత్కవితా నిధానము సదా నింపేను గాదా ఖుదా!
రివ్యూ (ప్రచురణకి ముందు ప్రచురణార్హతని నిర్ణయించటం) చెయ్యకుండా ఏ పత్రికా ప్రచురించదు. సంపాదకుడో, మరొక వ్యక్తో కథనో, వ్యాసాన్నో చదివి అది వారికి నచ్చిందో, లేదో తేల్చాలి కదా. వచ్చే చిక్కల్లా అటు పైనే. “బాగులేనివి” చెత్తబుట్ట పాలవుతాయి. రచయిత అదృష్టం బాగుంటే ఆ విషయం తెలియపరచ బడుతుంది. “బాగున్న” వాటిని యధాతథంగా అచ్చు వేస్తారు, లేదా “చిన్న చిన్న సవరణలు” చెయ్యవలసి వస్తే సంపాదక వర్గమే చేసేసి ప్రచురిస్తారు. ఇక్కడ “చిన్న చిన్న సవరణలు” అంటే వర్ణక్రమదోషాలు, రచయితకి భాషలో వెసులుబాటు లేక ఒకే ఒక్క చోట ఇంగ్లీషు మాట ప్రయోగిస్తే దానికి తెలుగు మాట ప్రతిక్షేపించటం, మొదలైనవి (నేను కథలు రాయటం మొదలు పెట్టిన కొత్తలో ఆంద్రపత్రిక వారు ఈ రకం సహాయం చేసిపెట్టేరు, వారికి నా ధన్యవాదాలు). మరికొంచెం “పెద్ద” సవరణలు” చెయ్యవలసివస్తే సంపాదకుడు రచయితకి ఉత్తరం రాయవచ్చు. (ఉ. భారతి సంపాదకుడు రాచకొండ విశ్వనాధశాస్త్రికి కథ పేరు “అల్పజీవి” గా మార్చమని సలహా ఇస్తూ రాసిన ఉత్తరం.) e-mail, Teliphone సౌకర్యాలు ఉన్న ఈ రోజులలో ఇదేమీ కష్టం కాదు. రచయితని ప్రోత్సహించాలనే కోరిక మరీ బలంగా ఉంటే, రచన మాసపత్రికలో “వసుంధర” దంపతులు చేస్తూన్నట్లు, ప్రచురణకి ముందు కథ చదివి, అందులో లోపాలని ఎత్తి చూపి, తిరగ రాయమని సలహా ఇవ్వ వచ్చు. ఇన్ని అంచెలు దాటుకొచ్చినా ప్రచురణార్హతని నిర్ణయించే అంతిమ హక్కు పత్రికా సంపాదకుడిదే. ఇందులో సందేహం లేదు. ఇదే విధంగా రచనాంశం (content) ని స్వయంప్రపత్తితో, రచయితతో సంప్రదించకుండా మార్చే హక్కు ఏ సంపాదకుడికీ లేదు. రచయిత, సంపాదక వర్గమూ పరస్పరమైన గౌరవభావంతో ఉన్నంత కాలమూ ఈ వ్యవహారం సజావుగా సాగుతుంది. పూర్వంలా రచయితలు సంపాదక వర్గపు ఇష్టాఇష్టాలకు పరిపూర్ణంగా బందీలు కారు; అంతర్జాలం ధర్మమా అని.
-వేమూరి వేంకటేశ్వరరావు
నేను ఇంకా వ్యాసాన్ని సంపూర్ణముగా చదవలేదు. కాని ఈ వట్టి – పట్టి గురించి ఒక రెండు మాటలు. పట్టి తమిళ పదము మాత్రమే కాదు, తెలుగు పదం కూడా, పట్టి అంటే బిడ్డ అని అర్థము. పట్టి గొడ్డు అంటే చిన్న గొడ్డు అని కూడా అనుకోవచ్చు. ప అక్షరానికి వ అక్షరానికి యతి చెల్లుతుంది ఎప్పుడూ! త్యాగరాజు మంచి తెలుగు కవి కూడా, యక్షగానాలను రాశారు. పద్యాలను ఎన్నో రాశారు. ఇక పోతే ప అక్షరానికి వ అక్షరానికి తెలుగు వ్రాతలో సరిగా కొమ్మును కలపక పోతే సందేహం కలగవచ్చు. కానీ తమిళంలో వ-కారానికి, ప-కారానికి ఇలాటి సందేహం లేదు. త్యాగరాజుగారి శిష్యులు కీర్తనలను ఏ భాషలో రాసుకొన్నారో అనే విషయం నాకు తెలీదు.
త్యాగ రాజ స్వామి వారి ‘ఎటుల బ్రోతువో తెలియ’ మొదటి చరణం లో ఉన్నది ‘పట్టి గొడ్డు’ కానీ ‘వట్టి గొడ్డు’ కాదనేందుకు నేనెన్నుకున్న ప్రామాణికాలు రెండు:
1) కన్నడంలో వచ్చిన ‘కీర్తన దర్పణ’ -సంపుటి 1 లో 100వ పేజీలో ‘పట్టి గొడ్డు’ అనే ఉంది. (సంగీతానికి ఎల్లలు లేవు)
2) యతి ప్రాసల నియమం బట్టి చూసినా చరణంలో ప్రతి పాదంలోనూ 13 అక్షరాలున్నాయి, 7వ అక్షరం మీద యతి ఉంది. ప-భ, పు-పొ, దు-దు. మొదటి పాదంలో ప్రథమాక్షరం వకారమయితే , 7వది భకారం కాలేదు కదా.
మళ్ళీ ఈ చిత్రాన్ని చూడడానికి ఈ మంచి వ్యాసం ఒక
అవకాశం కలిగించింది. చిత్రంలో ఎక్కడా హరిహర్
పేరు వినబడలేదు. కాని Satyajit Ray – The Inner Eye
పుస్తకంలో అపూ ట్రిలజీ ప్రకరణంలో, అందులో ఇచ్చిన
ఛాయాచిత్రాలలో హరిహర్ అనే రాయబడింది, హరిహరన్
అని కాదు. విధేయుడు – మోహన
ఒకమాట. తెలుగు లోని ‘అచ్చ తెలుగు’ క్రమంగా కనుమరుగమతోంది. అవును సంస్కృతం, ఆంగ్లం ఇవన్నీ తెలుగు భాషకు వన్నెతెచ్చి మెరుగులు దిద్ది ఉండవచ్చు. పదజాలాన్ని పెంచి యుండవచ్చు తద్వారా తెలుగును మరింత ఆధునిక భాషగా రూపొందిచి ఉండవచ్చు. ఐతే తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన ఈ సందర్భంలో మనం అంతా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. అదే తెలుగు లోని ‘తెలుగు’ను కాపాడుకోవడం. నిజం. ఎన్నెన్ని అచ్చతెలుగు పదాలు మన కళ్ళ ముందే అదృశ్యం కావటం… సారీ… కనుమరుగు అవ్వడం లేదూ?
తెలుగంటే సంస్కృతం కాదు, అరవం కాదు ఆంగ్లం కాదు. తెలుగంటే తెలుగే కదా! మెరుగులు మెరుగులుగానే ఉండాలిగాని ‘అసలు’ను మరుగుపరచేదిగా ఉండకూడదుకదా!
ఉదాహరణకు మన ఈ ‘ఈ మాట’ సయిట్లోనే ఈ క్రింది మార్పులు చేయుచ్చుకదా.
ఎలాగంటే, సెర్చ్ అంటే ‘శోధన’ బదులూ ‘వెతకండి’ అనీ అడ్వాస్డ్ సెర్చ్ ‘మరింత వెదకండి’ అనీ .
అలానే హోంపేజ్ ‘ముఖపత్రము’ కాకుండా ‘మా ముంగిలి’ కావచ్చు కదా . అలాగనే ‘పాఠకుల అభిప్రాయాలు’ మారి ‘మీ యడద’ కావచ్చేమో.
చివరిగా ఈ కింది పదాలను ఎన్నాళ్ల క్రితం వాడి ఉంటారూ? ‘సముద్రము’ బదులుగా ‘కడలి’ అనీ ‘మనసు’ కాకుండా ‘మది’ అనీ ‘హృదయము’ బదులూ ‘గుండియ’ అనీ .
ఇంకా ఎన్నో! ప్రారంభిద్దాం, ‘సారీ’, మొదలెడదాం! తెలుగును రక్షించు కుందాం! సరేనా?
బై. వీడుకోలు.
[గమనిక: మీ అభిప్రాయాలు తెలియపర్చడానికి, దయచేసి నాన్-యూనికోడ్ ఫాంట్లు (హేమలత, ఈనాడు, శ్రీ900 వగైరా) వాడకండి. RTS లేదా యూనికోడ్ వాడితే, లేదా నేరుగా మా అభిప్రాయాల పెట్టెలోనే టైపు చేస్తే ప్రచురణకు సులభంగా వుంటుంది – సం.]
‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి మేడేపల్లి శేషు అభిప్రాయం:
01/06/2009 1:49 am
‘అపరాజితొ’ విశ్లేషణ బాగుంది. ‘పథేర్ పాంచాలి’ డి.వి.డి. కొనుక్కున్నతర్వాత, ‘అపరాజితొ’, ‘అపూర్ సన్సార్’ చిత్రాల డివిడిలు కూడా నేను తెప్పించుకున్నాను. మీ ‘రాయ్’ సినిమాల విశ్లేషణలన్నీ ఒక పుస్తకంగా వేస్తే చాలా బాగుంటుంది. ‘సర్బజయ’ అని బెంగాలీ ఉచ్చారణను అనుకరిస్తూ రాసేబదులు ‘సర్వజయ’ అని రాసుకోవచ్చు. మద్దిపట్ల సూరి గారు తన అనువాదంలో అలానే రాశారు. బెంగాలీలో ‘బ’ వచ్చినచోటల్లా మనం ‘వ’ వాడటం సహజమే. బెంగాలీ ఉచ్చారణ ప్రకారం రాస్తే ‘సత్యజిత్’ పదాన్ని కూడా ‘షొత్తెజిత్’ అనే పలకాలి (బెంగాలీలు ‘స’ ను ‘ష’ అనే పలుకుతారు కాబట్టి). ఈ విషయాలన్నీ పక్కన పెడితే, మీ సమీక్షలు ‘అక్షరలక్షలు’ చేస్తాయి.
– మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
01/05/2009 8:50 pm
మోహన రావుగారూ,
నాకు తెలుసున్నంత వరకూ, కొన్ని త్యాగరాజు కృతులు తెలుగు ని “తమిళం” లో రాసినట్లుగా కొన్ని తాళపత్ర గ్రంధాలున్నాయి. నేను ప్రత్యక్షంగా చూసాను. అలాగే అచ్చ తెలుగులో వున్నవి కూడా “సరస్వతి మహల్” గ్రంధాలయంలో చూసాను. ఇలా ఒక్కక్షరం తేడాతో ఉన్న పదాలని నిర్ధారించడం కష్టం.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
01/05/2009 8:33 pm
మనకందు బాటులో ఉన్న త్యాగరాజు కృతుల మూల ప్రతులేవీ ఆయన స్వదస్తూరీవి కావు. కాబట్టి “వట్టి” యా లేక “పట్టి” యా అన్నది నిర్ధారించడం కష్టం. రెండూ అర్థం చెడకుండా నప్పాయి కనుక ఎవరికి నచ్చింది వారు పాడుకున్నారనుకోవాలి. మీ అభిప్రాయాలు చూసాక రెండు మూడు పుస్తకాలు తిరగేసాను.
Dr.వి. రాఘవన్ గారి “The Spiritual Heritage of Tyagaraja” లో వట్టి యనే ఉంది. అలాగే టి. పార్థసారధీ, మంచాల జగన్నాధ రావు గార్ల పుస్తకాల్లో “వట్టి” అనే వుంది. ఈ మధ్యనే వచ్చిన టి. కె. గోవిందరావు గారి “ Compositions of Tyagaraja” ఓ మాత్రం “పట్టి” అనుంది. Dr.వి. రాఘవన్ పుస్తకం కొన్ని మూల ప్రతులనుండి సంగ్రహించినట్లుగా ముందుమాటలో వుంది. ఈ ఒక్క “పట్టి” లేక “వట్టి” అన్నది మినహాయించి ఇంకేమయినా పరభాషా పదాలుంటే తెలియజేయండి. అందరికీ తెలుస్తాయి.
బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి baabjeelu అభిప్రాయం:
01/05/2009 10:37 am
“కథకుడుగా కొండలరావు” అనే శీర్షికన నండూరి రామ్మోహన రావుగారు ర్రవి కొండలరావు గారి ద్విశత చిత్రోత్సవ అభినందన సంచికలో (1983) ఒక వ్యాసం రాసేరు. అందులో రావి కొండలరావు గారి “ముమూర్ష”, “దిదృక్ష”, “చంద్రశేఖరుని కథ” మరియూ “స్నేహం” కథల గురించి క్లుప్తంగా సమీక్షించేరు రామ్మోహన రావు గారు.
రావి కొండల రావు గారి “టెక్నిక్” గురించి చెబ్తూ “కొండల రావు తన కథలను ముగిస్తూ ముగింపు తరవాత జరిగేదాన్ని వాచ్యంగా చెప్పడు. పాఠకుల ఊహకు వదిలెయ్యడం అతని “టెక్నిక్” అంటారు.
“ఇలాగే కొండలరావు రాసిన నిరుద్యోగపర్వం, మాయమైనపర్సు,తప్పిపోయినాడు లాంటి కథలు లబ్జుగానూ, రంజుగానూ వుండి పాఠకుల్ని గిలిగింతలు పెడతాయి” అంటారు నం.రా.రావు గారు.
వ్యాసం చివర్లో “…కథలు రాయని భాస్కరుడు (జూ) గా కొండలరావు పై ఆయన స్నేహితుడు ముళ్ళపూడి పరోక్ష ప్రభావం ఎంతైనా వుంది (సీనియరు ముళ్ళపూడా? ఎక్కడ చదివేనో గుర్తు రావటం లేదు కృ.శాస్త్రి గారితో ఎలాగొలాగ కష్టపడి రాయించొచ్చుగానీ, ము.వెం.రవఁణ గారి చేత మరీ కష్టవఁని). ఆ ప్రభావంలో నుంచి బయటపడి కథకుడిగా కొండలరావు మళ్ళీ విజృంభిస్తే బావుంటుందనే దిదృక్ష కలవారిలో నేనొకడిని” అని ముగిస్తారు నండూరి రామ్మోహన రావు గారు.
చూద్దాం. ఈమాట కోసం రా.కొండలరావు గారి చేత కథో, నాటికో ఏదో ఒకటి రాయించగలనేమో? అది మన “పీర్స్” కి “పర్లేదు” అనిపిస్తుందేమో?
నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి lyla yerneni అభిప్రాయం:
01/05/2009 10:36 am
అప్పటికే పలుమార్లు ప్రదర్శించబడిన విజయుని విద్యాసక్తి, వీరగుణం గురువు ద్రోణుడినే కాకుండా, మహాభారత కథ మనకు చెపుతున్న నన్నయ కవిని కూడా మెప్పించిందేమో!
“విద్యలెల్ల నభ్యాస వశంబునన్ బడయ భారము లేదని నిశ్చితాత్ముడై” చీకటిలో కూడా విలువిద్య ప్రాక్టీసు చేశాడట అర్జునుడు. అతని పట్టుదల చూసి గురువుకు ఇంకా ఎక్కువ కష్టమైన విద్యలు నేర్పబుద్దయ్యింది. మరి విద్యలు పరీక్షకు వస్తే:
చెట్టుకొమ్మ మీది పక్షి తలను కూల్చమంటే, మరి ఆ పక్షితల తప్ప కంటికి ఇంకే కనిపించని ఏకాగ్రత కలవాడు. అందుకనే అర్జునుని గురి తప్పదు. ఐనా అది కృత్రిమపక్షితల. కల్పించిన పరీక్ష. అందులో అంత గొప్ప ఏముంది. :)తర్వాత గంగా స్నానాలు చేస్తున్నప్పుడు, ఒక మొసలి, ద్రోణుని తొడ పట్టుకుంటే శిష్యులంతా స్తంభించి పోయి ఉన్నప్పుడు, అర్జునుడు మొసలిని చంపి ద్రోణుని కాపాడాడు. ఇది నిజమైన మొసలి. నిజమైన ఆపద. గురి తప్పరాని సమయము. ఇదీ విద్యకు అసలు పరీక్ష. శ్రద్ధతో చదువు నేర్చి, ఆ చదువునే వాడి, గురువునే ఆపత్తి నుంచి రక్షించగలిగిన సమర్ధుల మీద ఎక్కువ అభిమానం చూపించకుండా, ఎవరైనా ఎలా ఉండగలరు?
సంతోషమ్ము లభించె చాల, సదయున్ సందీప్తివంతున్, భళా!
కుంతీపుత్రుని ఆ వదాన్యు నళినాక్షుం గర్ణునిన్, పిమ్మటా
కుంతీపుత్రుని, ఆ విశేష విజయాఖ్యుం జూచి సంతోషమెం
తెంతో! సత్కవితా నిధానము సదా నింపేను గాదా ఖుదా!
లైలా
రచయితలు – ఎడిటర్లు గురించి Rao Vemuri అభిప్రాయం:
01/05/2009 10:07 am
రివ్యూ (ప్రచురణకి ముందు ప్రచురణార్హతని నిర్ణయించటం) చెయ్యకుండా ఏ పత్రికా ప్రచురించదు. సంపాదకుడో, మరొక వ్యక్తో కథనో, వ్యాసాన్నో చదివి అది వారికి నచ్చిందో, లేదో తేల్చాలి కదా. వచ్చే చిక్కల్లా అటు పైనే. “బాగులేనివి” చెత్తబుట్ట పాలవుతాయి. రచయిత అదృష్టం బాగుంటే ఆ విషయం తెలియపరచ బడుతుంది. “బాగున్న” వాటిని యధాతథంగా అచ్చు వేస్తారు, లేదా “చిన్న చిన్న సవరణలు” చెయ్యవలసి వస్తే సంపాదక వర్గమే చేసేసి ప్రచురిస్తారు. ఇక్కడ “చిన్న చిన్న సవరణలు” అంటే వర్ణక్రమదోషాలు, రచయితకి భాషలో వెసులుబాటు లేక ఒకే ఒక్క చోట ఇంగ్లీషు మాట ప్రయోగిస్తే దానికి తెలుగు మాట ప్రతిక్షేపించటం, మొదలైనవి (నేను కథలు రాయటం మొదలు పెట్టిన కొత్తలో ఆంద్రపత్రిక వారు ఈ రకం సహాయం చేసిపెట్టేరు, వారికి నా ధన్యవాదాలు). మరికొంచెం “పెద్ద” సవరణలు” చెయ్యవలసివస్తే సంపాదకుడు రచయితకి ఉత్తరం రాయవచ్చు. (ఉ. భారతి సంపాదకుడు రాచకొండ విశ్వనాధశాస్త్రికి కథ పేరు “అల్పజీవి” గా మార్చమని సలహా ఇస్తూ రాసిన ఉత్తరం.) e-mail, Teliphone సౌకర్యాలు ఉన్న ఈ రోజులలో ఇదేమీ కష్టం కాదు. రచయితని ప్రోత్సహించాలనే కోరిక మరీ బలంగా ఉంటే, రచన మాసపత్రికలో “వసుంధర” దంపతులు చేస్తూన్నట్లు, ప్రచురణకి ముందు కథ చదివి, అందులో లోపాలని ఎత్తి చూపి, తిరగ రాయమని సలహా ఇవ్వ వచ్చు. ఇన్ని అంచెలు దాటుకొచ్చినా ప్రచురణార్హతని నిర్ణయించే అంతిమ హక్కు పత్రికా సంపాదకుడిదే. ఇందులో సందేహం లేదు. ఇదే విధంగా రచనాంశం (content) ని స్వయంప్రపత్తితో, రచయితతో సంప్రదించకుండా మార్చే హక్కు ఏ సంపాదకుడికీ లేదు. రచయిత, సంపాదక వర్గమూ పరస్పరమైన గౌరవభావంతో ఉన్నంత కాలమూ ఈ వ్యవహారం సజావుగా సాగుతుంది. పూర్వంలా రచయితలు సంపాదక వర్గపు ఇష్టాఇష్టాలకు పరిపూర్ణంగా బందీలు కారు; అంతర్జాలం ధర్మమా అని.
-వేమూరి వేంకటేశ్వరరావు
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి mOhana అభిప్రాయం:
01/05/2009 10:03 am
నేను ఇంకా వ్యాసాన్ని సంపూర్ణముగా చదవలేదు. కాని ఈ వట్టి – పట్టి గురించి ఒక రెండు మాటలు. పట్టి తమిళ పదము మాత్రమే కాదు, తెలుగు పదం కూడా, పట్టి అంటే బిడ్డ అని అర్థము. పట్టి గొడ్డు అంటే చిన్న గొడ్డు అని కూడా అనుకోవచ్చు. ప అక్షరానికి వ అక్షరానికి యతి చెల్లుతుంది ఎప్పుడూ! త్యాగరాజు మంచి తెలుగు కవి కూడా, యక్షగానాలను రాశారు. పద్యాలను ఎన్నో రాశారు. ఇక పోతే ప అక్షరానికి వ అక్షరానికి తెలుగు వ్రాతలో సరిగా కొమ్మును కలపక పోతే సందేహం కలగవచ్చు. కానీ తమిళంలో వ-కారానికి, ప-కారానికి ఇలాటి సందేహం లేదు. త్యాగరాజుగారి శిష్యులు కీర్తనలను ఏ భాషలో రాసుకొన్నారో అనే విషయం నాకు తెలీదు.
విధేయుడు – మోహన
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal అభిప్రాయం:
01/05/2009 9:20 am
త్యాగ రాజ స్వామి వారి ‘ఎటుల బ్రోతువో తెలియ’ మొదటి చరణం లో ఉన్నది ‘పట్టి గొడ్డు’ కానీ ‘వట్టి గొడ్డు’ కాదనేందుకు నేనెన్నుకున్న ప్రామాణికాలు రెండు:
1) కన్నడంలో వచ్చిన ‘కీర్తన దర్పణ’ -సంపుటి 1 లో 100వ పేజీలో ‘పట్టి గొడ్డు’ అనే ఉంది. (సంగీతానికి ఎల్లలు లేవు)
2) యతి ప్రాసల నియమం బట్టి చూసినా చరణంలో ప్రతి పాదంలోనూ 13 అక్షరాలున్నాయి, 7వ అక్షరం మీద యతి ఉంది. ప-భ, పు-పొ, దు-దు. మొదటి పాదంలో ప్రథమాక్షరం వకారమయితే , 7వది భకారం కాలేదు కదా.
డా. తాతిరాజు వేణుగోపాల్
‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana అభిప్రాయం:
01/05/2009 5:56 am
మళ్ళీ ఈ చిత్రాన్ని చూడడానికి ఈ మంచి వ్యాసం ఒక
అవకాశం కలిగించింది. చిత్రంలో ఎక్కడా హరిహర్
పేరు వినబడలేదు. కాని Satyajit Ray – The Inner Eye
పుస్తకంలో అపూ ట్రిలజీ ప్రకరణంలో, అందులో ఇచ్చిన
ఛాయాచిత్రాలలో హరిహర్ అనే రాయబడింది, హరిహరన్
అని కాదు. విధేయుడు – మోహన
రచయితలకు సూచనలు గురించి Babu RVB అభిప్రాయం:
01/04/2009 8:18 am
‘ఈమాట’ ప్రచురణ కర్తలకు శుభాభివందనములు. దండాలండీ .
ఒకమాట. తెలుగు లోని ‘అచ్చ తెలుగు’ క్రమంగా కనుమరుగమతోంది. అవును సంస్కృతం, ఆంగ్లం ఇవన్నీ తెలుగు భాషకు వన్నెతెచ్చి మెరుగులు దిద్ది ఉండవచ్చు. పదజాలాన్ని పెంచి యుండవచ్చు తద్వారా తెలుగును మరింత ఆధునిక భాషగా రూపొందిచి ఉండవచ్చు. ఐతే తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన ఈ సందర్భంలో మనం అంతా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. అదే తెలుగు లోని ‘తెలుగు’ను కాపాడుకోవడం. నిజం. ఎన్నెన్ని అచ్చతెలుగు పదాలు మన కళ్ళ ముందే అదృశ్యం కావటం… సారీ… కనుమరుగు అవ్వడం లేదూ?
తెలుగంటే సంస్కృతం కాదు, అరవం కాదు ఆంగ్లం కాదు. తెలుగంటే తెలుగే కదా! మెరుగులు మెరుగులుగానే ఉండాలిగాని ‘అసలు’ను మరుగుపరచేదిగా ఉండకూడదుకదా!
ఉదాహరణకు మన ఈ ‘ఈ మాట’ సయిట్లోనే ఈ క్రింది మార్పులు చేయుచ్చుకదా.
ఎలాగంటే, సెర్చ్ అంటే ‘శోధన’ బదులూ ‘వెతకండి’ అనీ అడ్వాస్డ్ సెర్చ్ ‘మరింత వెదకండి’ అనీ .
అలానే హోంపేజ్ ‘ముఖపత్రము’ కాకుండా ‘మా ముంగిలి’ కావచ్చు కదా . అలాగనే ‘పాఠకుల అభిప్రాయాలు’ మారి ‘మీ యడద’ కావచ్చేమో.
చివరిగా ఈ కింది పదాలను ఎన్నాళ్ల క్రితం వాడి ఉంటారూ? ‘సముద్రము’ బదులుగా ‘కడలి’ అనీ ‘మనసు’ కాకుండా ‘మది’ అనీ ‘హృదయము’ బదులూ ‘గుండియ’ అనీ .
ఇంకా ఎన్నో! ప్రారంభిద్దాం, ‘సారీ’, మొదలెడదాం! తెలుగును రక్షించు కుందాం! సరేనా?
బై. వీడుకోలు.
[గమనిక: మీ అభిప్రాయాలు తెలియపర్చడానికి, దయచేసి నాన్-యూనికోడ్ ఫాంట్లు (హేమలత, ఈనాడు, శ్రీ900 వగైరా) వాడకండి. RTS లేదా యూనికోడ్ వాడితే, లేదా నేరుగా మా అభిప్రాయాల పెట్టెలోనే టైపు చేస్తే ప్రచురణకు సులభంగా వుంటుంది – సం.]