నమస్కారం. ఎంతో పరిశ్రమతో ఎన్నో విషయాలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మూడవపేజీలో, “తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని *తిక్కనకు* అంకితము చేసి..” అని ఉంది. Typo అనుకుంటాను.
తట్టిన కొన్ని ఆలోచనలు.
కవి తామరలు విష్ణువు, లక్ష్మీదేవి కన్నులలా ఉన్నాయనడం చాలా అసహజంగా, కృత్రిమంగా ఉంది. తెలియని దానిని, తెలిసిన దానితో పోల్చడం, లేక తెలిసిన దానిని సైతం ఇంకో తెలిసిన దానితో పోల్చడం చూస్తాం. ఇక్కడ కళ్ళకు కనబడే తామర పూలను కనిపించని లక్ష్మీనారాయణుల కళ్ళతో పోల్చడం కవిత్వం కన్నా, పాపము శమించుగాక, పైత్యం లాగా అనిపిస్తుంది.
ఎవరి పద్యం ముందో తెలియదుకాని, పోతన గారి “అడిగెదనని కడువడి జను” పద్యం లక్ష్మి తడబడ అడుగులను ఎంతో సహజంగా, సుందరంగా సర్వ లఘు కందంలో అందంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ముందు “తగుదగదని మనమున” అన్న నన్నెచోడుని పద్యం, కాపీ కొట్టింది కాకపోయినా, వెలవెల పోయినట్లే అనిపిస్తుంది.
పాండిత్యం గురించి కాదు కాని, హృదయాన్ని తాకే భక్తి భావం మాత్రం ఇన్ని పద్యాలను చదివినా ఎందుకో, పోనీ పోతన ధూర్జటి స్థాయిలను అందుకోకపోయినా, ఏ మాత్రం కూడా అనుభవంలోకి రావడం లేదు. కవిరాజశిఖామణికైనా కూడా, కామున్ని స్తుతించిన కలంతోనే కామేశ్వరున్ని గొప్పగా స్తుతించడం కష్టమేనేమో!
ఈ మాటలో వచ్చే కధలూ, కవితలూ, వ్యాసాల పైన వచ్చే అభిప్రాయాల్లో చర్చన్నది (ఒకటీ అరా సందర్భాల్లో తప్ప)లేదనే నా అభిప్రాయం. ఎవరైనా ఒక వ్యాసం పైన అభిప్రాయమో, ప్రశ్నో వేసారనుకోండి. దానికి సమాధానం ఇచ్చే బాధ్యత (తీసుకుంటేనే లెండి) రచయితది. చాలాసార్లు రచయిత మౌన ముద్ర పాటిస్తే, ఆ వాఖ్యలు చదివేవారు ఆవేశ పడిపోడం ఎక్కువగా ఉంటోంది. అందులో “నాకే అన్నీ తెలుసు – నీకేం రాదు – నువ్వు చవట దద్దమ్మవి” అని రుజువు చేయడమే ప్రధానోద్దేశ్యంగా అభిప్రాయాల గొంతుంటోంది. అందువల్ల చర్చకి అవకాశం తగ్గిపోతోంది. చర్చకి ప్రధాన లక్షణం ఎదుటి వారి అభిప్రాయాన్నీ గౌరవించడం. అది కొరవడినప్పుడే అది తప్పుదారిపడుతుంది.
ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే వ్యాసాలపైనా, కథలపైనా ఎవరూ అభిప్రాయాన్ని వ్యక్తీకరించరు. దూరంగా ఉంటారు. పాఠకుడికీ, రచనకీ మధ్య రచయితపై నున్న వ్యక్తిగత అభిప్రాయమొచ్చి కూర్చుంటే ఆ రచన ఎప్పటీకీ నచ్చదు. ఒకవేళ అందులో విషయమున్నా మనసొప్పుకోదు. తెలుగులో సాహితీ విమర్శ లేదని మనకి మనమే బాధ పడుతూ ఉంటాం. చర్చించుకుంటూ వుంటాం. కానీ ఆ విమర్శకీ, చర్చకీ మనమెంత ఆసరా ఇస్తున్నామన్నది ఆలోచించుకోవాలి. తెలుగునాట చర్చకీ, విమర్శకీ అవకాశమే తక్కువ. ఇంటర్నేట్ పత్రికల్లో ఆ అవకాశముంది. అదే ఇలా అభిప్రాయం రాయడానికి దోహదం చేస్తోంది.
“బడే భాయి “కూడా కలుపుకొండి నా వైపు నుండి.అందుకే,నేను ఆయన కథల గూర్చి నేను మాట్లాడలేదు.కొందరు కథలు బాగా రాయగలరు,నవలల విషయం వచ్చేసరికి వీరేనా ఇవి రాసింది అనిపిస్తుంది.నవలలు రాయగలిగిన వారి కథలు చాలా అధ్వానంగా ఉండటం గమనించాను.కథ రాయడం కష్టమంటాడు ,గాబ్రియెల్ గార్సియా మార్కెజ్. రచయిత ఎంత గొప్పవాడు అని గమనించకుండా అతని రచనలను నిర్లిప్తంగా అంచనా వేయాలి అన్న అభిప్రాయం నాది.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట. అలా ఉంది పరుచూరి శ్రీనివాస్ వ్యవహారం.తెలియని విషయాల్లో తలదూర్చడం, అనవసరమైన పెత్తనాలు తలకెత్తుకోవడం తెలుగు సాహిత్యంలో కొత్తకాదు.మన స్థాయి ఏమిటి,మనం తూగగలమా లేమా అని ఆలోచించకుండా అహమహమికతో బయల్దేరితే తలబొప్పికట్టడం మినహా సాధించేది ఏమీలేదు. రుజువుకు, ఋజువుకు తేడా తెలియకుండా భాషా, ఛందస్సాహిత్య చర్చల్లోకి దూకెయ్యటమే??
“అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం” అన్న వాక్యం వెనుక స్వారస్యం తెలియడానికి ఇది చాలదూ?? నేను రాసిన వాక్యం, ఇలాంటి దబాయింపు పాండిత్యాలను ఉద్దేశించినదే. శ్రీనివాస్ గారి నన్నెచోడుని ఉడుకుసోదిలోకి నేను పోను.పుస్తకాల్లో చదివిన విషయాలు వల్లించడం సాహిత్య విమర్శ కాదు.మనం ఎంత స్పష్టంగా ఆలోచిస్తున్నాం అన్నది ముఖ్యం.తెలియనిది తెలియదు అని ఒప్పుకోవడం ఆలోచనల్లో స్పష్టతకు తొలిమెట్టు. ఈ మాట పాఠకులు చదువుకున్న వాళ్ళో తెలివితక్కువ వాళ్ళో చర్చలకు సంబంధం లేని విషయం.పాఠకుల తరపున ఎవరూ వకాల్తా పుచ్చుకోనవసరం లేదు.మన సంగతి మనం చూసుకుంటే మంచిది. స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
[ఈ వ్యాఖ్యాత చేసిన మిగతా వ్యక్తిగత నిందలు ఎడిట్ చేయబడ్డాయి – సం.]
శ్రీనివాస్ గారి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.అభిప్రాయాలు విషయాన్ని మరింత స్పష్టం చేయగలగాలి తప్ప మరింత గందరగోళ పరిచేవి కాకూడదు. అనవసరమైన అంశాలనీ..అఖ్ఖర్లేని ఆవేశాలనీ ప్రదర్శించడం దండగ. మన భావాల వల్ల తెలిసే కొత్త విషయం ఉంటే దాన్ని చదవడంలో ఆసక్తి ఉంటుంది. వాక్యాల్లో సంయమనం అవసరం.మన మాటలు నలుగురూ చదువుతారనీ.. ఆ నలుగురూ కూడా అంత గాఢంగానూ ఆలోచించగల వాళ్ళనీ… అభిప్రాయాలు రాస్తున్నప్పుడు గుర్తుంచుకుంటే… అఖ్ఖర్లేని మాటలు దొర్లవు. యదుకుల భూషణ్ మరోచోట కూడా..మార్క్సిజం..ఫెమినిజం..వల్లకాడిజం అని అన్నది కూడా అనవసరమైన ప్రకటనే. అంతకన్నా సంస్కారంగా విషయంతోనీ.. వ్యక్తులతోనీ.. విభేదించటం తెలియటమే నాగరికత.
రమ.
The author has vividly narrated the new world order created by the internet. Though highly technical, yet, Suresh has made it easy for even a layman to understand and inculcated interest to know more about it. I am awaiting the remaining parts of his article and I hope he would continue to contribute many more such articles.
నన్నెచోడుని మీద జరుగుతున్న చర్చ చూస్తున్నాను. చర్చలో మంచిచెడ్డల గురించి చెప్పబోయేముందు చర్చకు వాడుతున్న భాషను గురించి ఒక మాటచెప్పాలనుకుంటున్నాను. ఆ చర్చల్లోని కొన్ని వాక్యాలలో స్పష్టత కన్నా ఆవేశం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకి భూషణ్ గారి మొదటి వాక్యం: “అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం.” ఈ వాక్యం వల్ల చర్చకు ఏ రకమైన ఉపయోగం జరగదు సరికదా అనవసరమైన ఆవేశం పెరుగుతుంది. మనం ఎవరినీ చెంపదెబ్బలు కొట్టనక్కరలేదు. ఎవరి పాండిత్యాన్నీ ఈసడించుకోనవసరం లేదు. “ఈమాట” చదువుతున్న వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు మంచి అభిప్రాయాలు ఏర్పరుచుకోగలిగినవాళ్ళు. అందువల్ల “ఈమాట”లో చేస్తున్న చర్చల్లో ఆవేశాలు ఎంత తక్కువుంటే అంత మంచిది.
ఇక నన్నెచోడుని మీద మోహనరావుగారు రాసిన వ్యాసం నిజంగా బాగుంది. అయినా ఆ వ్యాసంలో కూడా సమాచారం కొత్తదే కానీ సమన్వయం కొత్తది కాదు. ఆయన ఛందస్సుని వాడుకున్న పద్ధతి అయన వ్యాసానికి చాలా బలానిచ్చింది. కాని ఆయన వేసుకున్న ప్రశ్న; నన్నెచోడుడు, నన్నయ వీరిద్దరిలో ముందెవరు, తరువాతెవరు అనేది. అయనిచ్చిన సమాచారంలో ఏదీ కూడా ఈ ప్రశ్నకు నిష్కర్షగా జవాబివ్వదు. దానికి కారణం ఆయనిచ్చిన సమాచారంలో లోపం కాదు. ఆ సమాచారాన్ని ఆయన విశ్లేషించిన తీరులో లోపం కూడా కాదు. లోపమల్లా ఆ ప్రశ్నలోనే వుంది. అది సమాధానం దొరకడానికి వీల్లేని ప్రశ్న. ఇంకొక మాటల్లో చెప్పాలంటే అది పరిశోధకులు వేసుకోవలసిన ప్రశ్న కాదు.
నన్నెచోడుడు, నన్నయ రెండు భిన్నమైన సంప్రదాయాలకు చెందినవాళ్ళు. నన్నయది పురాణ సంప్రదాయం, నన్నెచోడుడిది కావ్య సంప్రదాయం. ఇద్దరూ తెలుగులో రాస్తున్నారు అన్నమాట మినహాయిస్తే వీళ్ళిద్దరి మధ్య పోలికలు లేవు. మోహనరావుగారు చేసిన ఉపకారం ఏమిటంటే నన్నెచోడుడు దాదాపుగా నన్నయ కాలానికి చెందినవాడే అని ఛందస్సులో ఋజువులు చూపించి చెప్పగలగడం.
అయితే ఆ కాలంలో నన్నెచోడుని కావ్యంలాంటి కావ్యం ఎలావచ్చిందో చెప్పడానికి కావలసిన సమాచారమేదీ మోహనరావుగారి వ్యాసంలో కనిపించదు. నన్నెచోడుడు ఏ పరిస్థితుల కారణాల వల్ల అలాంటి కావ్యాన్ని తెలుగులో నిర్మించాడో కానీ, ఆ తరువాత అతనికి దరిదాపు అయిదు వందలేళ్ళపాటు ఆయనకు అనూయాయులెవ్వరూ లేకపోయారు. ఎంతగా లేకపోయారంటే తరువాత వచ్చిన కవులెవ్వరూ ఆయన పేరుకూడా చెప్పలేదు. ఆయన రాసిన పుస్తకానికి ఒక్కటే ప్రతి దొరికింది. అంటే ఆ పుస్తకానికి ప్రతులు రాసుకున్నవాళ్ళు కూడా తక్కువేనన్నమాట. దీనితో పోల్చి చూస్తే నన్నయ భారతానికి ప్రతి తరంలోను కొన్ని వందల ప్రతులు రాసుకున్నారు. నన్నయ సంప్రదాయాన్నీ, దానికి తిరుగుబాటుగా వచ్చిన శివకవుల మార్గాన్నీ కలుపుకొని తిక్కన “ఉభయకవిమిత్రుడు” అనే పేరుతో నన్నయకే ఎక్కువ మిత్రుడై తెలుగులో పురాణ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆ తరువాత ప్రబంధం అని ఆధునిక విమర్శకులు అనే కావ్య సంప్రదాయం పెద్దన నాటికి కాని నిక్కచ్చయిన రూపు కట్టుకోలేదు. నన్నెచోడుడు ఆయనకు సుమారు 500 ఏళ్ళ ముందే కావ్యసంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టాడని తనకి తెలియకుండానే పెద్దన ప్రబంధ సంప్రదాయాన్ని మొదలు పెట్టి “ఆంధ్రకవితాపితామహుడ”యినాడు.
ఇంతగా తెలుగు సాహిత్య సంప్రదాయంతో సంబంధం లేకుండా ఏకాకిగా నన్నెచోడుడు మిగిలిపోయాడు. నన్నెచోడుడిమీద చర్చంతా మానవల్లి రామకృష్ణకవిగారు కుమారసంభవాన్ని బయటకు తెచ్చిన తరవాతే మొదలయ్యింది. నన్నెచోడుడి భాషలో చాలా మాటలకి అర్థాలు అందుకే ఇప్పటికీ మనకు తెలియవు. ఉదా: వస్తుకవిత, జానుతెలుగు అనే రెండు మాటలు చూడండి. వాటికి తెలుగులో వాడుక లేకపోబట్టి ఆయన ఏ అర్థంలో ఈ మాటలు వాడాడో స్పష్టంగా చెప్పడం కష్టం అవుతుంది. ఈమాటలకు అర్థాలు మోహనరావుగారి వ్యాసం చదివిన తర్వాత కూడా అస్పష్టంగానే మిగిలిపోతాయి.
నన్నెచోడుడు, నన్నయ దాదాపు ఒక కాలం వారయినప్పటికీ భిన్న సంప్రదాయాల వాళ్ళు అనేమాట గుర్తిస్తే ఈ యిద్దరిలో ఎవరు ముందు, ఎవరు తరువాత అనే ప్రశ్న తప్పేది. తారీఖులు మాత్రమే సాహిత్యచరిత్ర అని మనం 19వ శతాబ్దం చివరిలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మనకు కావలసింది ఋజురేఖలాగా నడిచే తారీఖుల సాహిత్యచరిత్ర కాదు, సంప్రదాయాల చరిత్ర కావాలి.
ఇకపోతే ఈ చర్చలోకి Caldwellని, Brownని తీసుకురావడం స్పష్టత తీసుకురాదు సరికదా ఇంకా గజిబిజికి కారణమవుతుంది. ఈ చర్చకు సంబంధించిన విషయం కాదు కాబట్టి Caldwell, Brown తెలుగు సాహిత్య చరిత్రకు కానీ, తెలుగు భాషకు కానీ చేసిన ఉపకారమేమిటి, అపకారమేమిటి అన్న విషయాలు వేరేగా చర్చించాలి.
ప్రసాద్ గారు – మీరన్నది నిజమే అయ్యుండొచ్చు. ద్విపద కావ్యాలమీద నాకున్న వ్యక్తిగతమైన అరుచి కారణంగా హరిశ్చంద్రోపాఖ్యానం పైపై చూడ్డం తప్ప ఎప్పుడూ చదవలేదు. దాని గురించి మీరే రాయవచ్చు కదండీ. ఆ స్ఫూర్తితోనైనా నేను దాన్ని చదువుతానేమో!
బాబ్జీలుగారు – “Classical” అంటే పురాతన గ్రీకు, రోమను దేశాలకి సంబంధించినవి అనే అర్థం ముందుండేదనీ, వాటిని గొప్పగా భావించేవారు కాబట్టి కాలక్రమేణా దానికి గొప్పవైన అనే అర్థం వచ్చిచేరిందనీ ఎవరో చెప్పగా విన్నాను. మనమేమో “ప్రాచీన” అన్న పదానికి “పాతచింతకాయ” అనే అర్థాన్ని రూఢం చేసీసేం! ఇంతకీ అసలు విషయానికొస్తే, కాకువు గురించి తెలియాలంటే శంకరాభరణం శంకరశాస్త్రిగారు సంగీతం మాస్టారు దాసుగారికి వేసిన అక్షంతల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. “ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు. నిద్రలోంచి ఉలిక్కిపడిలేచిన పాపడు అమ్మా అని మరోలా అంటాడు…”. కాకువు కూడా అలాంటిదే. పదాలని ఉచ్చరించే విధానంలో వేరువేరు అర్థాలని కలిగించడం కాకువు. ఉదాహరణకి “అవునా” అన్నది పలికే విధానం బట్టి ప్రశ్నార్థంలోనూ, “అవును కదా” అనే అర్థంలోనూ కూడా పలకవచ్చు. ఇది కాకువు. వ్యాసంలో ఉదహరించిన పద్యంలో “చొప్పగునే” అనడంలో ఒకవైపు ప్రశ్న, మరోవైపు “చొప్పవదు” అని రెండర్థాలు వస్తాయి. కాకువు ఉచ్చారణకి సంబంధించినది కాబట్టి సంభాషణలలోనే వస్తుంది. చదివే కావ్యంలో దీన్ని ధ్వనించడం ఎలా? అంటే సందర్భాన్ని బట్టి, వాక్యవిన్యాసాన్ని బట్టి ధ్వనించవచ్చు. అలా చేస్తే కావ్యంలోని సంభాషణలు సహజత్వానికి మరింత దగ్గరగా ఉంటాయి. ఇంగ్లీషులో కాకువుని “Intonation” అంటారు.
అవును లైలా గారూ! రాత్రి మార్మికంగా ఉంటుంది. ఉద్విగ్నంగా ఉంటుంది, ఊహాతిరేకాల కవ్వింతగా ఉంటుంది. రాత్రి నలుపు సృష్టి రహస్యాల కలగలుపుగా ఉంటుంది. వ్యధకీ విశ్రాంతికీ వ్యాఖ్యానంలా ఉంటుంది. ఎంతైనా రాత్రి రాత్రే!!
మీరు ఉదాహరించిన poem చెప్పలేనంత బాగుంది. పరమ సున్నితమైన తండ్రిని బొమ్మకట్టి చూపింది. భట్టుమూర్తి కాలానికి వర్ణనీయ వస్తువు ఆడదే!మగవాడి మనసుని శృంగార పరంగా మాత్రమే పట్టించుకున్నారు తెలుగు కవులు. అందుకే పాత కావ్యాల్లో ముసలమ్మలూ, పసి బాలికలూ ఉండరు. వయసులో ఉన్న స్త్రీమీదే వారి దృష్టి. అందులో మరీ వేలంవెర్రి రామరాజభూషణునిది. అది అలా ఉంచినా, కొన్ని వర్ణనలు పాత సాహిత్యంలో నిషిధ్ధం, అందునా జనన మరణాలు. అదీకాక తండ్రి ప్రసవాన్ని చూడటం పాశ్చ్యాత్త దేశాల్లో సాధ్యం. మన పాత సమాజంలోనే కాదు..ఇవాళ్టికీ ఇక్కడ తండ్రికి ఆ అవకాశం లేదు. పైగా పాత కాలంలోనూ ఇప్పటి కాలం లోనూ కూడా తెలుగు సమాజం ఒప్పుదల అన్న విషయంలో బహు జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఉటంకించింది అమెరికా తండ్రి స్పందన. ఈ దేశం నించి ఇంకా ఈ సమాజం నించి ఇప్పటప్పట్లో అలాంటి కవిత వచ్చే వీలులేదు. మంచి పోయెమ్ ని ఉదాహరించినందుకు నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను.
కవిరాజశిఖామణి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
03/11/2009 7:42 am
నమస్కారం. ఎంతో పరిశ్రమతో ఎన్నో విషయాలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మూడవపేజీలో, “తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని *తిక్కనకు* అంకితము చేసి..” అని ఉంది. Typo అనుకుంటాను.
తట్టిన కొన్ని ఆలోచనలు.
కవి తామరలు విష్ణువు, లక్ష్మీదేవి కన్నులలా ఉన్నాయనడం చాలా అసహజంగా, కృత్రిమంగా ఉంది. తెలియని దానిని, తెలిసిన దానితో పోల్చడం, లేక తెలిసిన దానిని సైతం ఇంకో తెలిసిన దానితో పోల్చడం చూస్తాం. ఇక్కడ కళ్ళకు కనబడే తామర పూలను కనిపించని లక్ష్మీనారాయణుల కళ్ళతో పోల్చడం కవిత్వం కన్నా, పాపము శమించుగాక, పైత్యం లాగా అనిపిస్తుంది.
ఎవరి పద్యం ముందో తెలియదుకాని, పోతన గారి “అడిగెదనని కడువడి జను” పద్యం లక్ష్మి తడబడ అడుగులను ఎంతో సహజంగా, సుందరంగా సర్వ లఘు కందంలో అందంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ముందు “తగుదగదని మనమున” అన్న నన్నెచోడుని పద్యం, కాపీ కొట్టింది కాకపోయినా, వెలవెల పోయినట్లే అనిపిస్తుంది.
పాండిత్యం గురించి కాదు కాని, హృదయాన్ని తాకే భక్తి భావం మాత్రం ఇన్ని పద్యాలను చదివినా ఎందుకో, పోనీ పోతన ధూర్జటి స్థాయిలను అందుకోకపోయినా, ఏ మాత్రం కూడా అనుభవంలోకి రావడం లేదు. కవిరాజశిఖామణికైనా కూడా, కామున్ని స్తుతించిన కలంతోనే కామేశ్వరున్ని గొప్పగా స్తుతించడం కష్టమేనేమో!
విధేయుడు
-Srinivas
[టైపో సరిదిద్దాము. చూపినందుకు కృతజ్ఞతలు – సం]
నన్నెచోడుని క్రౌంచపదము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/11/2009 7:08 am
ఈ మాటలో వచ్చే కధలూ, కవితలూ, వ్యాసాల పైన వచ్చే అభిప్రాయాల్లో చర్చన్నది (ఒకటీ అరా సందర్భాల్లో తప్ప)లేదనే నా అభిప్రాయం. ఎవరైనా ఒక వ్యాసం పైన అభిప్రాయమో, ప్రశ్నో వేసారనుకోండి. దానికి సమాధానం ఇచ్చే బాధ్యత (తీసుకుంటేనే లెండి) రచయితది. చాలాసార్లు రచయిత మౌన ముద్ర పాటిస్తే, ఆ వాఖ్యలు చదివేవారు ఆవేశ పడిపోడం ఎక్కువగా ఉంటోంది. అందులో “నాకే అన్నీ తెలుసు – నీకేం రాదు – నువ్వు చవట దద్దమ్మవి” అని రుజువు చేయడమే ప్రధానోద్దేశ్యంగా అభిప్రాయాల గొంతుంటోంది. అందువల్ల చర్చకి అవకాశం తగ్గిపోతోంది. చర్చకి ప్రధాన లక్షణం ఎదుటి వారి అభిప్రాయాన్నీ గౌరవించడం. అది కొరవడినప్పుడే అది తప్పుదారిపడుతుంది.
ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే వ్యాసాలపైనా, కథలపైనా ఎవరూ అభిప్రాయాన్ని వ్యక్తీకరించరు. దూరంగా ఉంటారు. పాఠకుడికీ, రచనకీ మధ్య రచయితపై నున్న వ్యక్తిగత అభిప్రాయమొచ్చి కూర్చుంటే ఆ రచన ఎప్పటీకీ నచ్చదు. ఒకవేళ అందులో విషయమున్నా మనసొప్పుకోదు. తెలుగులో సాహితీ విమర్శ లేదని మనకి మనమే బాధ పడుతూ ఉంటాం. చర్చించుకుంటూ వుంటాం. కానీ ఆ విమర్శకీ, చర్చకీ మనమెంత ఆసరా ఇస్తున్నామన్నది ఆలోచించుకోవాలి. తెలుగునాట చర్చకీ, విమర్శకీ అవకాశమే తక్కువ. ఇంటర్నేట్ పత్రికల్లో ఆ అవకాశముంది. అదే ఇలా అభిప్రాయం రాయడానికి దోహదం చేస్తోంది.
కథ దేని గురించి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
03/11/2009 2:20 am
“బడే భాయి “కూడా కలుపుకొండి నా వైపు నుండి.అందుకే,నేను ఆయన కథల గూర్చి నేను మాట్లాడలేదు.కొందరు కథలు బాగా రాయగలరు,నవలల విషయం వచ్చేసరికి వీరేనా ఇవి రాసింది అనిపిస్తుంది.నవలలు రాయగలిగిన వారి కథలు చాలా అధ్వానంగా ఉండటం గమనించాను.కథ రాయడం కష్టమంటాడు ,గాబ్రియెల్ గార్సియా మార్కెజ్. రచయిత ఎంత గొప్పవాడు అని గమనించకుండా అతని రచనలను నిర్లిప్తంగా అంచనా వేయాలి అన్న అభిప్రాయం నాది.
తమ్మినేని యదుకుల భూషణ్
నన్నెచోడుని క్రౌంచపదము గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
03/11/2009 1:46 am
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట. అలా ఉంది పరుచూరి శ్రీనివాస్ వ్యవహారం.తెలియని విషయాల్లో తలదూర్చడం, అనవసరమైన పెత్తనాలు తలకెత్తుకోవడం తెలుగు సాహిత్యంలో కొత్తకాదు.మన స్థాయి ఏమిటి,మనం తూగగలమా లేమా అని ఆలోచించకుండా అహమహమికతో బయల్దేరితే తలబొప్పికట్టడం మినహా సాధించేది ఏమీలేదు. రుజువుకు, ఋజువుకు తేడా తెలియకుండా భాషా, ఛందస్సాహిత్య చర్చల్లోకి దూకెయ్యటమే??
“అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం” అన్న వాక్యం వెనుక స్వారస్యం తెలియడానికి ఇది చాలదూ?? నేను రాసిన వాక్యం, ఇలాంటి దబాయింపు పాండిత్యాలను ఉద్దేశించినదే. శ్రీనివాస్ గారి నన్నెచోడుని ఉడుకుసోదిలోకి నేను పోను.పుస్తకాల్లో చదివిన విషయాలు వల్లించడం సాహిత్య విమర్శ కాదు.మనం ఎంత స్పష్టంగా ఆలోచిస్తున్నాం అన్నది ముఖ్యం.తెలియనిది తెలియదు అని ఒప్పుకోవడం ఆలోచనల్లో స్పష్టతకు తొలిమెట్టు. ఈ మాట పాఠకులు చదువుకున్న వాళ్ళో తెలివితక్కువ వాళ్ళో చర్చలకు సంబంధం లేని విషయం.పాఠకుల తరపున ఎవరూ వకాల్తా పుచ్చుకోనవసరం లేదు.మన సంగతి మనం చూసుకుంటే మంచిది. స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
[ఈ వ్యాఖ్యాత చేసిన మిగతా వ్యక్తిగత నిందలు ఎడిట్ చేయబడ్డాయి – సం.]
నన్నెచోడుని క్రౌంచపదము గురించి rama bharadwaj అభిప్రాయం:
03/11/2009 12:33 am
శ్రీనివాస్ గారి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.అభిప్రాయాలు విషయాన్ని మరింత స్పష్టం చేయగలగాలి తప్ప మరింత గందరగోళ పరిచేవి కాకూడదు. అనవసరమైన అంశాలనీ..అఖ్ఖర్లేని ఆవేశాలనీ ప్రదర్శించడం దండగ. మన భావాల వల్ల తెలిసే కొత్త విషయం ఉంటే దాన్ని చదవడంలో ఆసక్తి ఉంటుంది. వాక్యాల్లో సంయమనం అవసరం.మన మాటలు నలుగురూ చదువుతారనీ.. ఆ నలుగురూ కూడా అంత గాఢంగానూ ఆలోచించగల వాళ్ళనీ… అభిప్రాయాలు రాస్తున్నప్పుడు గుర్తుంచుకుంటే… అఖ్ఖర్లేని మాటలు దొర్లవు. యదుకుల భూషణ్ మరోచోట కూడా..మార్క్సిజం..ఫెమినిజం..వల్లకాడిజం అని అన్నది కూడా అనవసరమైన ప్రకటనే. అంతకన్నా సంస్కారంగా విషయంతోనీ.. వ్యక్తులతోనీ.. విభేదించటం తెలియటమే నాగరికత.
రమ.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి kshareesh kumar అభిప్రాయం:
03/10/2009 10:23 pm
The author has vividly narrated the new world order created by the internet. Though highly technical, yet, Suresh has made it easy for even a layman to understand and inculcated interest to know more about it. I am awaiting the remaining parts of his article and I hope he would continue to contribute many more such articles.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:
03/10/2009 3:27 pm
నన్నెచోడుని మీద జరుగుతున్న చర్చ చూస్తున్నాను. చర్చలో మంచిచెడ్డల గురించి చెప్పబోయేముందు చర్చకు వాడుతున్న భాషను గురించి ఒక మాటచెప్పాలనుకుంటున్నాను. ఆ చర్చల్లోని కొన్ని వాక్యాలలో స్పష్టత కన్నా ఆవేశం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకి భూషణ్ గారి మొదటి వాక్యం: “అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం.” ఈ వాక్యం వల్ల చర్చకు ఏ రకమైన ఉపయోగం జరగదు సరికదా అనవసరమైన ఆవేశం పెరుగుతుంది. మనం ఎవరినీ చెంపదెబ్బలు కొట్టనక్కరలేదు. ఎవరి పాండిత్యాన్నీ ఈసడించుకోనవసరం లేదు. “ఈమాట” చదువుతున్న వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు మంచి అభిప్రాయాలు ఏర్పరుచుకోగలిగినవాళ్ళు. అందువల్ల “ఈమాట”లో చేస్తున్న చర్చల్లో ఆవేశాలు ఎంత తక్కువుంటే అంత మంచిది.
ఇక నన్నెచోడుని మీద మోహనరావుగారు రాసిన వ్యాసం నిజంగా బాగుంది. అయినా ఆ వ్యాసంలో కూడా సమాచారం కొత్తదే కానీ సమన్వయం కొత్తది కాదు. ఆయన ఛందస్సుని వాడుకున్న పద్ధతి అయన వ్యాసానికి చాలా బలానిచ్చింది. కాని ఆయన వేసుకున్న ప్రశ్న; నన్నెచోడుడు, నన్నయ వీరిద్దరిలో ముందెవరు, తరువాతెవరు అనేది. అయనిచ్చిన సమాచారంలో ఏదీ కూడా ఈ ప్రశ్నకు నిష్కర్షగా జవాబివ్వదు. దానికి కారణం ఆయనిచ్చిన సమాచారంలో లోపం కాదు. ఆ సమాచారాన్ని ఆయన విశ్లేషించిన తీరులో లోపం కూడా కాదు. లోపమల్లా ఆ ప్రశ్నలోనే వుంది. అది సమాధానం దొరకడానికి వీల్లేని ప్రశ్న. ఇంకొక మాటల్లో చెప్పాలంటే అది పరిశోధకులు వేసుకోవలసిన ప్రశ్న కాదు.
నన్నెచోడుడు, నన్నయ రెండు భిన్నమైన సంప్రదాయాలకు చెందినవాళ్ళు. నన్నయది పురాణ సంప్రదాయం, నన్నెచోడుడిది కావ్య సంప్రదాయం. ఇద్దరూ తెలుగులో రాస్తున్నారు అన్నమాట మినహాయిస్తే వీళ్ళిద్దరి మధ్య పోలికలు లేవు. మోహనరావుగారు చేసిన ఉపకారం ఏమిటంటే నన్నెచోడుడు దాదాపుగా నన్నయ కాలానికి చెందినవాడే అని ఛందస్సులో ఋజువులు చూపించి చెప్పగలగడం.
అయితే ఆ కాలంలో నన్నెచోడుని కావ్యంలాంటి కావ్యం ఎలావచ్చిందో చెప్పడానికి కావలసిన సమాచారమేదీ మోహనరావుగారి వ్యాసంలో కనిపించదు. నన్నెచోడుడు ఏ పరిస్థితుల కారణాల వల్ల అలాంటి కావ్యాన్ని తెలుగులో నిర్మించాడో కానీ, ఆ తరువాత అతనికి దరిదాపు అయిదు వందలేళ్ళపాటు ఆయనకు అనూయాయులెవ్వరూ లేకపోయారు. ఎంతగా లేకపోయారంటే తరువాత వచ్చిన కవులెవ్వరూ ఆయన పేరుకూడా చెప్పలేదు. ఆయన రాసిన పుస్తకానికి ఒక్కటే ప్రతి దొరికింది. అంటే ఆ పుస్తకానికి ప్రతులు రాసుకున్నవాళ్ళు కూడా తక్కువేనన్నమాట. దీనితో పోల్చి చూస్తే నన్నయ భారతానికి ప్రతి తరంలోను కొన్ని వందల ప్రతులు రాసుకున్నారు. నన్నయ సంప్రదాయాన్నీ, దానికి తిరుగుబాటుగా వచ్చిన శివకవుల మార్గాన్నీ కలుపుకొని తిక్కన “ఉభయకవిమిత్రుడు” అనే పేరుతో నన్నయకే ఎక్కువ మిత్రుడై తెలుగులో పురాణ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆ తరువాత ప్రబంధం అని ఆధునిక విమర్శకులు అనే కావ్య సంప్రదాయం పెద్దన నాటికి కాని నిక్కచ్చయిన రూపు కట్టుకోలేదు. నన్నెచోడుడు ఆయనకు సుమారు 500 ఏళ్ళ ముందే కావ్యసంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టాడని తనకి తెలియకుండానే పెద్దన ప్రబంధ సంప్రదాయాన్ని మొదలు పెట్టి “ఆంధ్రకవితాపితామహుడ”యినాడు.
ఇంతగా తెలుగు సాహిత్య సంప్రదాయంతో సంబంధం లేకుండా ఏకాకిగా నన్నెచోడుడు మిగిలిపోయాడు. నన్నెచోడుడిమీద చర్చంతా మానవల్లి రామకృష్ణకవిగారు కుమారసంభవాన్ని బయటకు తెచ్చిన తరవాతే మొదలయ్యింది. నన్నెచోడుడి భాషలో చాలా మాటలకి అర్థాలు అందుకే ఇప్పటికీ మనకు తెలియవు. ఉదా: వస్తుకవిత, జానుతెలుగు అనే రెండు మాటలు చూడండి. వాటికి తెలుగులో వాడుక లేకపోబట్టి ఆయన ఏ అర్థంలో ఈ మాటలు వాడాడో స్పష్టంగా చెప్పడం కష్టం అవుతుంది. ఈమాటలకు అర్థాలు మోహనరావుగారి వ్యాసం చదివిన తర్వాత కూడా అస్పష్టంగానే మిగిలిపోతాయి.
నన్నెచోడుడు, నన్నయ దాదాపు ఒక కాలం వారయినప్పటికీ భిన్న సంప్రదాయాల వాళ్ళు అనేమాట గుర్తిస్తే ఈ యిద్దరిలో ఎవరు ముందు, ఎవరు తరువాత అనే ప్రశ్న తప్పేది. తారీఖులు మాత్రమే సాహిత్యచరిత్ర అని మనం 19వ శతాబ్దం చివరిలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మనకు కావలసింది ఋజురేఖలాగా నడిచే తారీఖుల సాహిత్యచరిత్ర కాదు, సంప్రదాయాల చరిత్ర కావాలి.
ఇకపోతే ఈ చర్చలోకి Caldwellని, Brownని తీసుకురావడం స్పష్టత తీసుకురాదు సరికదా ఇంకా గజిబిజికి కారణమవుతుంది. ఈ చర్చకు సంబంధించిన విషయం కాదు కాబట్టి Caldwell, Brown తెలుగు సాహిత్య చరిత్రకు కానీ, తెలుగు భాషకు కానీ చేసిన ఉపకారమేమిటి, అపకారమేమిటి అన్న విషయాలు వేరేగా చర్చించాలి.
— శ్రీనివాస్
నాచన సోమన చతుర వచో విలాసం గురించి mOhana అభిప్రాయం:
03/10/2009 11:12 am
శ్రీనాథుని చాటువులలో ఇలాటి కాకువువంటిది ఒకటుంది. ఆ పద్యము –
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే, రావు సింగ జనపాలునకే,
యుర్విం జెల్లునుఁ, దక్కొరు
సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే, రావు సింగ జనపాలున కే
యుర్విం జెల్లునుఁ? దక్కొరు
సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే
విధేయుడు – మోహన
నాచన సోమన చతుర వచో విలాసం గురించి Kameswara Rao అభిప్రాయం:
03/10/2009 9:11 am
ప్రసాద్ గారు – మీరన్నది నిజమే అయ్యుండొచ్చు. ద్విపద కావ్యాలమీద నాకున్న వ్యక్తిగతమైన అరుచి కారణంగా హరిశ్చంద్రోపాఖ్యానం పైపై చూడ్డం తప్ప ఎప్పుడూ చదవలేదు. దాని గురించి మీరే రాయవచ్చు కదండీ. ఆ స్ఫూర్తితోనైనా నేను దాన్ని చదువుతానేమో!
బాబ్జీలుగారు – “Classical” అంటే పురాతన గ్రీకు, రోమను దేశాలకి సంబంధించినవి అనే అర్థం ముందుండేదనీ, వాటిని గొప్పగా భావించేవారు కాబట్టి కాలక్రమేణా దానికి గొప్పవైన అనే అర్థం వచ్చిచేరిందనీ ఎవరో చెప్పగా విన్నాను. మనమేమో “ప్రాచీన” అన్న పదానికి “పాతచింతకాయ” అనే అర్థాన్ని రూఢం చేసీసేం! ఇంతకీ అసలు విషయానికొస్తే, కాకువు గురించి తెలియాలంటే శంకరాభరణం శంకరశాస్త్రిగారు సంగీతం మాస్టారు దాసుగారికి వేసిన అక్షంతల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. “ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు. నిద్రలోంచి ఉలిక్కిపడిలేచిన పాపడు అమ్మా అని మరోలా అంటాడు…”. కాకువు కూడా అలాంటిదే. పదాలని ఉచ్చరించే విధానంలో వేరువేరు అర్థాలని కలిగించడం కాకువు. ఉదాహరణకి “అవునా” అన్నది పలికే విధానం బట్టి ప్రశ్నార్థంలోనూ, “అవును కదా” అనే అర్థంలోనూ కూడా పలకవచ్చు. ఇది కాకువు. వ్యాసంలో ఉదహరించిన పద్యంలో “చొప్పగునే” అనడంలో ఒకవైపు ప్రశ్న, మరోవైపు “చొప్పవదు” అని రెండర్థాలు వస్తాయి. కాకువు ఉచ్చారణకి సంబంధించినది కాబట్టి సంభాషణలలోనే వస్తుంది. చదివే కావ్యంలో దీన్ని ధ్వనించడం ఎలా? అంటే సందర్భాన్ని బట్టి, వాక్యవిన్యాసాన్ని బట్టి ధ్వనించవచ్చు. అలా చేస్తే కావ్యంలోని సంభాషణలు సహజత్వానికి మరింత దగ్గరగా ఉంటాయి. ఇంగ్లీషులో కాకువుని “Intonation” అంటారు.
నాకు నచ్చిన పద్యం: వసుచరిత్రలో చంద్రోదయం గురించి rama bharadwaj అభిప్రాయం:
03/10/2009 6:45 am
అవును లైలా గారూ! రాత్రి మార్మికంగా ఉంటుంది. ఉద్విగ్నంగా ఉంటుంది, ఊహాతిరేకాల కవ్వింతగా ఉంటుంది. రాత్రి నలుపు సృష్టి రహస్యాల కలగలుపుగా ఉంటుంది. వ్యధకీ విశ్రాంతికీ వ్యాఖ్యానంలా ఉంటుంది. ఎంతైనా రాత్రి రాత్రే!!
మీరు ఉదాహరించిన poem చెప్పలేనంత బాగుంది. పరమ సున్నితమైన తండ్రిని బొమ్మకట్టి చూపింది. భట్టుమూర్తి కాలానికి వర్ణనీయ వస్తువు ఆడదే!మగవాడి మనసుని శృంగార పరంగా మాత్రమే పట్టించుకున్నారు తెలుగు కవులు. అందుకే పాత కావ్యాల్లో ముసలమ్మలూ, పసి బాలికలూ ఉండరు. వయసులో ఉన్న స్త్రీమీదే వారి దృష్టి. అందులో మరీ వేలంవెర్రి రామరాజభూషణునిది. అది అలా ఉంచినా, కొన్ని వర్ణనలు పాత సాహిత్యంలో నిషిధ్ధం, అందునా జనన మరణాలు. అదీకాక తండ్రి ప్రసవాన్ని చూడటం పాశ్చ్యాత్త దేశాల్లో సాధ్యం. మన పాత సమాజంలోనే కాదు..ఇవాళ్టికీ ఇక్కడ తండ్రికి ఆ అవకాశం లేదు. పైగా పాత కాలంలోనూ ఇప్పటి కాలం లోనూ కూడా తెలుగు సమాజం ఒప్పుదల అన్న విషయంలో బహు జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఉటంకించింది అమెరికా తండ్రి స్పందన. ఈ దేశం నించి ఇంకా ఈ సమాజం నించి ఇప్పటప్పట్లో అలాంటి కవిత వచ్చే వీలులేదు. మంచి పోయెమ్ ని ఉదాహరించినందుకు నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను.
రమ.