హెమింగ్వె తన నవల “A farewell to Arms” ముగింపుని బోలెడన్ని సార్లు తిరగ రాసాట్ట 🙂 Fitzgerald మరికొన్ని రకాల ముగింపులని హెమింగ్వెకి సూచన చేసాట్ట. తెలుగులో మరి అలాంటి సంప్రదాయం లేదాయె 🙂
పోనీ మొదలెడితే సరి. యజ్ఞం కధని బూర్జువా పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ?? కమ్యూనిస్టుల పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ? గాంధేయ విధానం లో అయితే ఎలా ఉంటుందీ? దళితుల కోణం లోంచి అయితే ఎలా ఉంటుందీ?? ఇలా ఎవరికి తోచిన రీతి లో వాళ్ళు ఊహించి రాసుకోడమే 🙂
ఒక కధకి ఒకే ముగింపు ఉండాలని సూత్రం ఏమీ లేదు కదా? కాక పోతే నాకు ఓ చిన్న సందేహం , ఏమంటే .. వాస్తవాలనే రాస్తే అది వ్యాసం కదా అవాలీ? కల్పన అంటే దానికి వాస్తవాలతో సంబంధం ఎందుకూ? కధ అంటే కల్పన కదా? కధలో చెప్పదలుచుకున్న విషయం కోసం రచయిత తన కధ ని మలుచుకోడా?? అతడు తన శైలి ని నిర్ణయించుకోడా? ఒకే తరహా మూస కధ మాత్రమే కావాలా దోపిడీ మీద?
ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది. కధలు చదివిన అనుభవం తక్కువగానూ, అభిప్రాయాలు మాత్రం బోలెడూనూ ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆయన వ్యాఖ్యానంలో. అయితే ఇన్నేళ్ళు తెలుగు పాఠకులందరూ ఉత్త వెర్రి వాళ్ళే అయిపోయారన్న మాట ఈ వ్యాఖ్యాత చెప్పేదాకా “యజ్ఞం” కధ లోని ఇలాంటి అసలు కిటుకులని తెలుసుకోలేక.
తెలుగు లో ఇటుపైన రచనలు చేసేవాళ్ళు “మతాతీతం”గానూ, “వర్గాతీతం” గానూ, కుల ప్రస్తావనలు లేకుండానూ, జెండర్ జోలికి వెళ్ళకుండానూ, వాస్తవాలు మాత్రమే ప్రతిఫలించేలాగా రచనలు చేయవలసి ఉంటుంది. బాగానే ఉంది. అయితే వీటికి పాఠకులు ఉంటారా?? వాళ్ళూ ఎవరూ అన్నది మరో చర్చ.
బావుంది, బావుందోచ్! నారాయణస్వామి గారూ నాలాంటి ఈ-బుక్ చదవటం ఇష్టంలేనివాళ్లచేత కూడా చదివించగలిగేలా ఉంది మీ కథానిక….ఈ శైలి కొత్తగానూ చదివించేదిగాను ఉంది…కంగ్రాట్స్
5) కధ ముగింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీతారాముడు లోకం తెలిసిన మనిషి. తన తండ్రి చేసిన పని తనకు నచ్చక పోతే, తండ్రిని, గ్రామపెద్దలని ఎదిరించలేని నిస్సహాయతకు లోనయితే, తన బిడ్డని తీసుకుని ఆ గ్రామం విడిచి పెట్టి పోతాడు. లేదు, ఆవేశానికి లోనయితే తనను తాను శిక్షించుకుంటాడు. అంతేగాని తన కొడుకుని ఏ తండ్రి చంపుకోడు. అందులోనా సీతారాముడు అస్సలు అలా చేయలేడు. తన భార్య మరొకరితో పోయినా తన బిడ్డ కోసమే మరో పెళ్ళి కూడా చేసుకోలేదు (చేసుకున్నట్టు ఎక్కడా లేదు.) అయినప్పటికీ, ఒక వేళ ఆవేశముతో కూడిన మూర్ఖత్వముతో చేసాడనే అనుకుందాం. కాసేపటి తరువాతనన్నా వాస్తవంలోకి వచ్చి భయపడతాడు. తాను చేసిన పనికి నిష్కృతి లేదని మనోవేదనకు గురి అవుతాడు.
కాని కధలో చాలా భిన్నంగా ఉంటుంది. – ఒక మాఫియా ముఠా వ్యక్తిలాగా, నిరంతరం హత్యలు చేసి కరుడు గట్టిన వ్యక్తిలాగ, తాను చంపిన వ్యక్తితో ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి లాగ, చంపిన శవాన్ని బస్తాకెత్తి దానిని పంచాయితీ వరకు మోసుకు వచ్చి నిబ్బరంగా మాత్లాడుతాడు.
6)సీతారాముడు మూట భుజాన్న తెస్తుంటే జనమంతా అటు వైపు చూస్తారు ఆసక్తిగా. అప్పుడే చేసిన హత్య గదా శవం నుంచి రక్తం కారాలి గదా. అతని చేతులు, బట్టలు రక్తంతో కనపడాలి గదా, కాని అవేమి అక్కడ కనపడవు. (తెలుగు సినిమా హీరో లాగ చేతికి మట్టి అంటకుండా ఎంత చక్కగా చేస్తాడో హత్య!)
7)కధకు యజ్ఞం అని పేరు. ఆకధ ఒక బలితో పూర్తవుతుంది, అని ఆలోచించినపుడు హిందూ మత భావనలు పాఠకుడి మనసులోనికి రావా?
యిలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. కానీ యిక్కడికి ఆపేస్తున్నాను.
3) సుందరం పాలెం గ్రామ రైతుల స్థితిగతులను చెప్పేటప్పుడు విరుద్ధభావాలు కనిపిస్తాయి రచయిత చెప్పినదానికి మరొకచోట పాత్ర చెప్పినదానికి చాలా వ్యత్యాసాలుంటాయి. ఎక్కడా నిర్దిష్టత ఉండదు. (అవన్ని పేరాలు పేరాలుగా ఉటంకిచాల్సి ఉంటుంది. నాకు టైపింగ్ సరిగా రాని కారణం చేత రాయటం లేదు.) అయితే రైతుల నష్టాలు కొంతవరకు ఎలా తీరాయంటే ఇళ్ళ జాగాలకి కల్లాలు అమ్మడం ద్వారా అంటాడు అప్పలరాముడు. ఇది ఎంతవరకు వాస్తవమో ఆలొచిద్దాం. కధాకాలం 1963 లేదా 1966. ఆనాటికి సుందరపాలెం అనే 400 ఇళ్ళు గల గ్రామంలో ఇళ్ళ జాగాల వ్యాపారం జరుగుతుందా. అదీ కేవలం ఒక హైస్కూలు వచ్చిన కారణంగా? 1982, 84 ప్రాంతానికి విశాఖపట్నం లోనే రియల్ ఎస్టేటు వ్యాపారం అంతగా లేదు. నేటి గురుద్వార జంక్షన్లో గల బాలయ్య శాస్త్రి లే అవుట్ లో గజం 4 రూ అంటే ఆలోచించవల్సి వచ్చేది అని స్థానికులు చెప్తారు.అలాంటిది ఎంత జాగా ను ఎంతమందికి ఏ రేటు చొప్పున అమ్మితే రైతుల అప్పులు తీరిపొయాయో అర్ధం కాదు.
4) రచయితలు, ముఖ్యంగా ప్రగతి శీల భావజాలం గల రచయితలు, ఆశా వాద దృక్పధం కలిగి ఉంటారు. తమ రచనలలొ దానినే ప్రతి ఫలింప జేస్తారు. అలా చెయాలి కూడా. కాని ఈ కధలో ఎక్కడా ఆశ అనేది మచ్చుకి కనబడదు.
శ్రీరాములు నాయుడు హైస్కూల్ కావాలంటాడు. దానికి ఎర్రయ్య అనే పాత్ర చదువుకునే కూలీలు కావాలి గదా అంటాడు. చదువుల పట్ల నిరసన వినిపిస్తాడు. రచయిత ఆపాత్ర ద్వారా తప్ప ఖండించడు. మరో చోట రోడ్డు వస్తుందంటే పాతిక మంది బళ్ళ వాళ్ళ వ్యాపారాలు పోతాయంటాడు. కరెంటు వస్తుందంటే దంపుళ్ళ కూలీలు పొతాయంటాడు. మరొక పాత్ర గాని రచయిత గాని ఖండించక పోవడం వలన కధలో అవే అభిప్రాయాలు పాఠకుడికి అందుతాయి గదా. ఇది పాక్షిక నష్టాలను చూపించి ప్రగతిని లేదా మార్పుని అడ్డుకోవడమేగదా. (యింకావుంది)
అద్భుతవైన కథ. అనువాదం కూడా చాలా బాగుంది. కానీ మీనాక్షి ప్రొద్దున్నే ఆ ఉత్తరాన్ని మెయిల్ చేస్తుందా? సర్దుకపోవటవే బతుకైన మనిషికి, బతుకుకి తిరగబడటం చాతనవుతుందా?
-కిరణ్
ఆఖరి మనిషి
గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
07/08/2012
1:53 pm
మనిషి బ్రతికే ఉన్నాడు
ఆఖరి వరకు బ్రతికే ఉంటాడు
మరణం తప్పని మానవుడు
తన ప్రాణాలను మాత్రమే విడుస్తాడు
జీవితం అనే సంసారవృక్షం సాయంతో
తన రూపాన్ని ఈ భూమిపై
విడచి వెళుతున్నాడు
నిరంతర మనుగడ
సాగిస్తున్నాడు
ఉరుము ఉరిమి… గురించి DVR BHASKAR అభిప్రాయం:
07/11/2012 4:15 am
మీ కథ చాలా బాగుంది. శైలి సహజ సుందరంగా ఉంది. ఇంత చక్కటి కథను అందించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి yasasvi అభిప్రాయం:
07/10/2012 2:52 pm
హెమింగ్వె తన నవల “A farewell to Arms” ముగింపుని బోలెడన్ని సార్లు తిరగ రాసాట్ట 🙂 Fitzgerald మరికొన్ని రకాల ముగింపులని హెమింగ్వెకి సూచన చేసాట్ట. తెలుగులో మరి అలాంటి సంప్రదాయం లేదాయె 🙂
పోనీ మొదలెడితే సరి. యజ్ఞం కధని బూర్జువా పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ?? కమ్యూనిస్టుల పధ్ధతి లో ముగిస్తే ఎలా ఉంటుందీ? గాంధేయ విధానం లో అయితే ఎలా ఉంటుందీ? దళితుల కోణం లోంచి అయితే ఎలా ఉంటుందీ?? ఇలా ఎవరికి తోచిన రీతి లో వాళ్ళు ఊహించి రాసుకోడమే 🙂
ఒక కధకి ఒకే ముగింపు ఉండాలని సూత్రం ఏమీ లేదు కదా? కాక పోతే నాకు ఓ చిన్న సందేహం , ఏమంటే .. వాస్తవాలనే రాస్తే అది వ్యాసం కదా అవాలీ? కల్పన అంటే దానికి వాస్తవాలతో సంబంధం ఎందుకూ? కధ అంటే కల్పన కదా? కధలో చెప్పదలుచుకున్న విషయం కోసం రచయిత తన కధ ని మలుచుకోడా?? అతడు తన శైలి ని నిర్ణయించుకోడా? ఒకే తరహా మూస కధ మాత్రమే కావాలా దోపిడీ మీద?
ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది. కధలు చదివిన అనుభవం తక్కువగానూ, అభిప్రాయాలు మాత్రం బోలెడూనూ ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆయన వ్యాఖ్యానంలో. అయితే ఇన్నేళ్ళు తెలుగు పాఠకులందరూ ఉత్త వెర్రి వాళ్ళే అయిపోయారన్న మాట ఈ వ్యాఖ్యాత చెప్పేదాకా “యజ్ఞం” కధ లోని ఇలాంటి అసలు కిటుకులని తెలుసుకోలేక.
తెలుగు లో ఇటుపైన రచనలు చేసేవాళ్ళు “మతాతీతం”గానూ, “వర్గాతీతం” గానూ, కుల ప్రస్తావనలు లేకుండానూ, జెండర్ జోలికి వెళ్ళకుండానూ, వాస్తవాలు మాత్రమే ప్రతిఫలించేలాగా రచనలు చేయవలసి ఉంటుంది. బాగానే ఉంది. అయితే వీటికి పాఠకులు ఉంటారా?? వాళ్ళూ ఎవరూ అన్నది మరో చర్చ.
సో, ఈమాట వారికి ఇహ బోలెడంత మేటర్ 🙂
యశస్వి
ఒక జనవరి శుక్రవారం, లోకస్ట్ వాక్ కార్నర్లో గురించి వాసుదేవ్ అభిప్రాయం:
07/09/2012 9:15 pm
బావుంది, బావుందోచ్! నారాయణస్వామి గారూ నాలాంటి ఈ-బుక్ చదవటం ఇష్టంలేనివాళ్లచేత కూడా చదివించగలిగేలా ఉంది మీ కథానిక….ఈ శైలి కొత్తగానూ చదివించేదిగాను ఉంది…కంగ్రాట్స్
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi అభిప్రాయం:
07/09/2012 8:15 pm
5) కధ ముగింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీతారాముడు లోకం తెలిసిన మనిషి. తన తండ్రి చేసిన పని తనకు నచ్చక పోతే, తండ్రిని, గ్రామపెద్దలని ఎదిరించలేని నిస్సహాయతకు లోనయితే, తన బిడ్డని తీసుకుని ఆ గ్రామం విడిచి పెట్టి పోతాడు. లేదు, ఆవేశానికి లోనయితే తనను తాను శిక్షించుకుంటాడు. అంతేగాని తన కొడుకుని ఏ తండ్రి చంపుకోడు. అందులోనా సీతారాముడు అస్సలు అలా చేయలేడు. తన భార్య మరొకరితో పోయినా తన బిడ్డ కోసమే మరో పెళ్ళి కూడా చేసుకోలేదు (చేసుకున్నట్టు ఎక్కడా లేదు.) అయినప్పటికీ, ఒక వేళ ఆవేశముతో కూడిన మూర్ఖత్వముతో చేసాడనే అనుకుందాం. కాసేపటి తరువాతనన్నా వాస్తవంలోకి వచ్చి భయపడతాడు. తాను చేసిన పనికి నిష్కృతి లేదని మనోవేదనకు గురి అవుతాడు.
కాని కధలో చాలా భిన్నంగా ఉంటుంది. – ఒక మాఫియా ముఠా వ్యక్తిలాగా, నిరంతరం హత్యలు చేసి కరుడు గట్టిన వ్యక్తిలాగ, తాను చంపిన వ్యక్తితో ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి లాగ, చంపిన శవాన్ని బస్తాకెత్తి దానిని పంచాయితీ వరకు మోసుకు వచ్చి నిబ్బరంగా మాత్లాడుతాడు.
6)సీతారాముడు మూట భుజాన్న తెస్తుంటే జనమంతా అటు వైపు చూస్తారు ఆసక్తిగా. అప్పుడే చేసిన హత్య గదా శవం నుంచి రక్తం కారాలి గదా. అతని చేతులు, బట్టలు రక్తంతో కనపడాలి గదా, కాని అవేమి అక్కడ కనపడవు. (తెలుగు సినిమా హీరో లాగ చేతికి మట్టి అంటకుండా ఎంత చక్కగా చేస్తాడో హత్య!)
7)కధకు యజ్ఞం అని పేరు. ఆకధ ఒక బలితో పూర్తవుతుంది, అని ఆలోచించినపుడు హిందూ మత భావనలు పాఠకుడి మనసులోనికి రావా?
యిలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. కానీ యిక్కడికి ఆపేస్తున్నాను.
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/09/2012 4:16 pm
హేమలత గారూ.. చాలా చాలా థాంక్స్..
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
ఉరుము ఉరిమి… గురించి hemalatha putla అభిప్రాయం:
07/09/2012 7:13 am
🙂 హ హ హ… చాలా సహజంగా వుంది.
ఆఖరి మనిషి గురించి satya అభిప్రాయం:
07/09/2012 3:41 am
నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
బాగుంది
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi అభిప్రాయం:
07/08/2012 8:53 pm
3) సుందరం పాలెం గ్రామ రైతుల స్థితిగతులను చెప్పేటప్పుడు విరుద్ధభావాలు కనిపిస్తాయి రచయిత చెప్పినదానికి మరొకచోట పాత్ర చెప్పినదానికి చాలా వ్యత్యాసాలుంటాయి. ఎక్కడా నిర్దిష్టత ఉండదు. (అవన్ని పేరాలు పేరాలుగా ఉటంకిచాల్సి ఉంటుంది. నాకు టైపింగ్ సరిగా రాని కారణం చేత రాయటం లేదు.) అయితే రైతుల నష్టాలు కొంతవరకు ఎలా తీరాయంటే ఇళ్ళ జాగాలకి కల్లాలు అమ్మడం ద్వారా అంటాడు అప్పలరాముడు. ఇది ఎంతవరకు వాస్తవమో ఆలొచిద్దాం. కధాకాలం 1963 లేదా 1966. ఆనాటికి సుందరపాలెం అనే 400 ఇళ్ళు గల గ్రామంలో ఇళ్ళ జాగాల వ్యాపారం జరుగుతుందా. అదీ కేవలం ఒక హైస్కూలు వచ్చిన కారణంగా? 1982, 84 ప్రాంతానికి విశాఖపట్నం లోనే రియల్ ఎస్టేటు వ్యాపారం అంతగా లేదు. నేటి గురుద్వార జంక్షన్లో గల బాలయ్య శాస్త్రి లే అవుట్ లో గజం 4 రూ అంటే ఆలోచించవల్సి వచ్చేది అని స్థానికులు చెప్తారు.అలాంటిది ఎంత జాగా ను ఎంతమందికి ఏ రేటు చొప్పున అమ్మితే రైతుల అప్పులు తీరిపొయాయో అర్ధం కాదు.
4) రచయితలు, ముఖ్యంగా ప్రగతి శీల భావజాలం గల రచయితలు, ఆశా వాద దృక్పధం కలిగి ఉంటారు. తమ రచనలలొ దానినే ప్రతి ఫలింప జేస్తారు. అలా చెయాలి కూడా. కాని ఈ కధలో ఎక్కడా ఆశ అనేది మచ్చుకి కనబడదు.
శ్రీరాములు నాయుడు హైస్కూల్ కావాలంటాడు. దానికి ఎర్రయ్య అనే పాత్ర చదువుకునే కూలీలు కావాలి గదా అంటాడు. చదువుల పట్ల నిరసన వినిపిస్తాడు. రచయిత ఆపాత్ర ద్వారా తప్ప ఖండించడు. మరో చోట రోడ్డు వస్తుందంటే పాతిక మంది బళ్ళ వాళ్ళ వ్యాపారాలు పోతాయంటాడు. కరెంటు వస్తుందంటే దంపుళ్ళ కూలీలు పొతాయంటాడు. మరొక పాత్ర గాని రచయిత గాని ఖండించక పోవడం వలన కధలో అవే అభిప్రాయాలు పాఠకుడికి అందుతాయి గదా. ఇది పాక్షిక నష్టాలను చూపించి ప్రగతిని లేదా మార్పుని అడ్డుకోవడమేగదా. (యింకావుంది)
బింబం గురించి ravikiran timmireddy అభిప్రాయం:
07/08/2012 4:33 pm
అద్భుతవైన కథ. అనువాదం కూడా చాలా బాగుంది. కానీ మీనాక్షి ప్రొద్దున్నే ఆ ఉత్తరాన్ని మెయిల్ చేస్తుందా? సర్దుకపోవటవే బతుకైన మనిషికి, బతుకుకి తిరగబడటం చాతనవుతుందా?
-కిరణ్
ఆఖరి మనిషి గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
07/08/2012 1:53 pm
మనిషి బ్రతికే ఉన్నాడు
ఆఖరి వరకు బ్రతికే ఉంటాడు
మరణం తప్పని మానవుడు
తన ప్రాణాలను మాత్రమే విడుస్తాడు
జీవితం అనే సంసారవృక్షం సాయంతో
తన రూపాన్ని ఈ భూమిపై
విడచి వెళుతున్నాడు
నిరంతర మనుగడ
సాగిస్తున్నాడు