కర్ణ పేయంగా సాగే గౌతమరావు గారి పద్యపఠనం గురించి ఇంతకు ముందు విన్నాను గాని, వారి పద్య పఠనం వినే భాగ్యం ఇప్పుడు ఇక్కడే కలిగింది. ఇందుకు మీకు, శ్రీ రమణ గారికీ ధన్యవాదాలు.
నమస్సుమాంజలి. తెలుగు వారు తెలిసికొనవలసిన యెన్నో విషయాలు తెలియజీసినందుకు కృతజ్ఞతలు. ప్రాచీన భాషగా గుర్తింపబడటానికి యెందుకు అంత అవస్థలు పడవలసి వచ్చిందో కూడా తెలియ జేయగలరని కోరుచున్నాను.
శ్రీశ్రీని వ్యక్తిగా శ్రీశ్రీని కవిగా వేరుచేసి చూడలేని కొంతమంది రచయితలని, విమర్శకులనీ చూస్తే నాకు ‘గురువింద గింజ పగడం కథ’ గుర్తుకొచ్చి పగలబడి నవ్వాలనిపిస్తుంది. –నగేష్
చాలా బాగుంది సార్ మీ కవిత. మీ కవిత చదివిన నాకే ఇంత ఉత్సాహంగా ఉంటే రాసేటపుడు మీ ఉత్సాహం కొలవటానికి కొలమానం ఉంటుందా. కవిత అంటే ఏమిటో తెలియని నా లాంటి వారిని సైతం కదిలించిన మీ కవితా శైలిని పొగడడానికి నాకు పదాలు రావటం లేదు. నా అభిమానం తెలపటానికి ఇంతకన్నా ఏమి రాయాలో ఎలా రాయాలొ అర్ధం కావటం లేదు.
అంతరంగం గూర్చి బాగా చెప్పారు. అక్షయ పాత్ర అంటూ ఆఖరి అక్షరం అయిపోయిందన్నారు. అక్షయానికి అర్థం ఏమిటొ? కాగితం అనేది కలం కళ్ళలో కదలాడే గతం అంటే బాగుండేది. రచయత భావం ప్రస్ఫుటం కాలేదు!
అరటి ఆకు నుంచి రాలిన నీటి బొట్టుల్లాంటి జన్మ తీసుకున్నామని
మట్టి పిడత లో సాంభ్రాణి పొగ లాగా పైకి పోయేవాళ్ళమని
కాలం కట్టే చీరలు తెలుపు నలుపు మనం పడే కష్టసుఖాలని
సముద్రపుటొడ్డున ఇసుకరేణువు జీవితం చిన్నదని
మంచులో తడిసిన పట్టాలు జీవిత గమనాన్ని
ఆకులురాలిన చెట్టుకొమ్మ వృద్దాప్యాన్ని
శ్రీశ్రీ గురించి ఈ పొగడ్తలు చూసినప్పుడల్లా, అదే ఆశ్చర్యం కొత్తగా మళ్ళీ మళ్ళీ కలుగుతూ వుంటుంది.
అక్టోబరు 29, 2012 నాటి ఆంధ్రభూమి సాహితీ పేజీలో, మణి మేఖల గారి, “శ్రీశ్రీని మోసే వీర భక్తులూ…. ఆలోచించండి!” వ్యాసం చూడండి మరి కొన్ని వివరాలకి. ఈ వారం ఎ. రజాహుస్సేన్ రాసిన వ్యాసం కూడా చూడండి ఆంధ్రభూమిలో. శ్రీశ్రీ రాసిన గొప్ప కవిత్వానికి ఎలా మెప్పుదలలు లభిస్తాయో, అలాగే ఆయన రాసిన చెత్తకీ, చేసిన చెత్త పనులకీ విమర్శలు లభిస్తాయి.
శ్రీశ్రీ రాసిన “అనంతం” పుస్తకం విషయంలో రంగనాయకమ్మ గారు రాసిన ఉత్తరం, దానికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన అవక తవక జవాబూ, దానికి రంగనాయకమ్మ గారి స్పందనా – ఈ విషయాలన్నీ, రంగనాయకమ్మ గారు రాసిన, “మానవ సమాజం (నిన్నా – నేడూ – రేపూ)” పుస్తకంలో వున్నాయి (పేజీలు: 231-233). శ్రీశ్రీ, ‘అనంతం’ పేరుతో ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో 1975 నించీ చాలా కాలం పాటు ‘ఆత్మ కధ’ రాశారు. అందులో ఒక వారం శ్రీశ్రీ రాసిన విషయాలు చూసి, రంగనాయకమ్మ గారు ఆ పత్రిక లోనే నవంబరు 1, 1975 సంచికలో ఒక ఉత్తరం రాశారు. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు జనవరి 25, 1976 సంచికలో వచ్చింది. ఆ జవాబు చూసి, రంగనాయకమ్మ గారు మళ్ళీ ఫిబ్రవరి 8, 1976 సంచికలో ఇంకో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాల్లో, శ్రీశ్రీ చేసిన వ్యభిచారం గురించీ, శ్రీరంగ నీతుల గురించీ, మార్క్సిస్టు పేరుతో చేసే మోసాల గురించీ ప్రశ్నలున్నాయి. వాటికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన దొంగ జవాబు ప్రస్తావనా, ఆ జవాబుపై వచ్చే ప్రశ్నలూ, అన్నీ వున్నాయి. “అనంతం” పుస్తకంలో, మణి మేఖలు గారు ప్రస్తావించిన వాటి కన్నా ఘోరమైన విషయాలు వున్నాయి. “పాఠకులందరూ తెలివి తక్కువ వాళ్ళూ, ఏం రాసినా, ఏం చేసినా అడగరూ, పైపెచ్చు భక్తితో గొప్ప భజన చేస్తారూ” అనే ధీమా ఈ పుస్తకంలో అడుగడుగునా కనబడుతుంది.
రాతల్లో మాత్రమే అభ్యుదయాన్ని చూపుతూ, ఆచరణలో దాన్ని పట్టించు కోకుండా వుండే రచయితలకూ, కవులకూ భజనలు దొరుకుతాయేమో గానీ, నిజమైన గౌరవం మాత్రం దొరకదు. వారిని పాఠకులు కల కాలం నమ్మరు. వారు ఎంత గొప్ప గొప్ప విషయాలను చెప్పినా సరే, చెప్పిన విషయాలను వారే పాటించ నప్పుడు, “గొప్ప చెప్పారులే, గొప్ప గొప్ప కవితాత్మక పద్ధతుల్లో, ఎవరూ కని పెట్టని విషయాలని!” అని తీసి పారేయాలనిపిస్తుంది. రాసే వారికి చేతలు ఎంత ముఖ్యమో అర్థం కాకపోతే, ఈ అగౌరవాలు తప్పవు.
రుక్మిణీ కళ్యాణం గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:
11/21/2012 1:52 pm
కర్ణ పేయంగా సాగే గౌతమరావు గారి పద్యపఠనం గురించి ఇంతకు ముందు విన్నాను గాని, వారి పద్య పఠనం వినే భాగ్యం ఇప్పుడు ఇక్కడే కలిగింది. ఇందుకు మీకు, శ్రీ రమణ గారికీ ధన్యవాదాలు.
తెలుగు భాష వయస్సెంత? గురించి Raghavulu Regandla అభిప్రాయం:
11/20/2012 9:48 am
నమస్సుమాంజలి. తెలుగు వారు తెలిసికొనవలసిన యెన్నో విషయాలు తెలియజీసినందుకు కృతజ్ఞతలు. ప్రాచీన భాషగా గుర్తింపబడటానికి యెందుకు అంత అవస్థలు పడవలసి వచ్చిందో కూడా తెలియ జేయగలరని కోరుచున్నాను.
శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి p. nagesh అభిప్రాయం:
11/19/2012 11:44 am
శ్రీశ్రీని వ్యక్తిగా శ్రీశ్రీని కవిగా వేరుచేసి చూడలేని కొంతమంది రచయితలని, విమర్శకులనీ చూస్తే నాకు ‘గురువింద గింజ పగడం కథ’ గుర్తుకొచ్చి పగలబడి నవ్వాలనిపిస్తుంది. –నగేష్
నువ్వూ – కాలం గురించి satish అభిప్రాయం:
11/19/2012 7:00 am
చాలా బాగుంది సార్ మీ కవిత. మీ కవిత చదివిన నాకే ఇంత ఉత్సాహంగా ఉంటే రాసేటపుడు మీ ఉత్సాహం కొలవటానికి కొలమానం ఉంటుందా. కవిత అంటే ఏమిటో తెలియని నా లాంటి వారిని సైతం కదిలించిన మీ కవితా శైలిని పొగడడానికి నాకు పదాలు రావటం లేదు. నా అభిమానం తెలపటానికి ఇంతకన్నా ఏమి రాయాలో ఎలా రాయాలొ అర్ధం కావటం లేదు.
స్వప్నభంగం గురించి raavooji అభిప్రాయం:
11/18/2012 10:53 am
అంతరంగం గూర్చి బాగా చెప్పారు. అక్షయ పాత్ర అంటూ ఆఖరి అక్షరం అయిపోయిందన్నారు. అక్షయానికి అర్థం ఏమిటొ? కాగితం అనేది కలం కళ్ళలో కదలాడే గతం అంటే బాగుండేది. రచయత భావం ప్రస్ఫుటం కాలేదు!
రావూజి, అమలాపురం.
నువ్వూ – కాలం గురించి raavooji అభిప్రాయం:
11/18/2012 10:18 am
అరటి ఆకు నుంచి రాలిన నీటి బొట్టుల్లాంటి జన్మ తీసుకున్నామని
మట్టి పిడత లో సాంభ్రాణి పొగ లాగా పైకి పోయేవాళ్ళమని
కాలం కట్టే చీరలు తెలుపు నలుపు మనం పడే కష్టసుఖాలని
సముద్రపుటొడ్డున ఇసుకరేణువు జీవితం చిన్నదని
మంచులో తడిసిన పట్టాలు జీవిత గమనాన్ని
ఆకులురాలిన చెట్టుకొమ్మ వృద్దాప్యాన్ని
చాలా హృద్యంగా చెప్పారు మూలా వారు ధన్యవాదములు.
రావూజీ, అమలాపురం
టి. జి. కమలాదేవి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
11/15/2012 2:32 am
“కలగన్నానే తీయని కలగన్నానే” అన్న మరొక పాట జోడింపబడింది.
శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి ప్రసాద్ అభిప్రాయం:
11/14/2012 5:52 pm
శ్రీశ్రీ గురించి ఈ పొగడ్తలు చూసినప్పుడల్లా, అదే ఆశ్చర్యం కొత్తగా మళ్ళీ మళ్ళీ కలుగుతూ వుంటుంది.
అక్టోబరు 29, 2012 నాటి ఆంధ్రభూమి సాహితీ పేజీలో, మణి మేఖల గారి, “శ్రీశ్రీని మోసే వీర భక్తులూ…. ఆలోచించండి!” వ్యాసం చూడండి మరి కొన్ని వివరాలకి. ఈ వారం ఎ. రజాహుస్సేన్ రాసిన వ్యాసం కూడా చూడండి ఆంధ్రభూమిలో. శ్రీశ్రీ రాసిన గొప్ప కవిత్వానికి ఎలా మెప్పుదలలు లభిస్తాయో, అలాగే ఆయన రాసిన చెత్తకీ, చేసిన చెత్త పనులకీ విమర్శలు లభిస్తాయి.
శ్రీశ్రీ రాసిన “అనంతం” పుస్తకం విషయంలో రంగనాయకమ్మ గారు రాసిన ఉత్తరం, దానికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన అవక తవక జవాబూ, దానికి రంగనాయకమ్మ గారి స్పందనా – ఈ విషయాలన్నీ, రంగనాయకమ్మ గారు రాసిన, “మానవ సమాజం (నిన్నా – నేడూ – రేపూ)” పుస్తకంలో వున్నాయి (పేజీలు: 231-233). శ్రీశ్రీ, ‘అనంతం’ పేరుతో ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో 1975 నించీ చాలా కాలం పాటు ‘ఆత్మ కధ’ రాశారు. అందులో ఒక వారం శ్రీశ్రీ రాసిన విషయాలు చూసి, రంగనాయకమ్మ గారు ఆ పత్రిక లోనే నవంబరు 1, 1975 సంచికలో ఒక ఉత్తరం రాశారు. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు జనవరి 25, 1976 సంచికలో వచ్చింది. ఆ జవాబు చూసి, రంగనాయకమ్మ గారు మళ్ళీ ఫిబ్రవరి 8, 1976 సంచికలో ఇంకో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాల్లో, శ్రీశ్రీ చేసిన వ్యభిచారం గురించీ, శ్రీరంగ నీతుల గురించీ, మార్క్సిస్టు పేరుతో చేసే మోసాల గురించీ ప్రశ్నలున్నాయి. వాటికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన దొంగ జవాబు ప్రస్తావనా, ఆ జవాబుపై వచ్చే ప్రశ్నలూ, అన్నీ వున్నాయి. “అనంతం” పుస్తకంలో, మణి మేఖలు గారు ప్రస్తావించిన వాటి కన్నా ఘోరమైన విషయాలు వున్నాయి. “పాఠకులందరూ తెలివి తక్కువ వాళ్ళూ, ఏం రాసినా, ఏం చేసినా అడగరూ, పైపెచ్చు భక్తితో గొప్ప భజన చేస్తారూ” అనే ధీమా ఈ పుస్తకంలో అడుగడుగునా కనబడుతుంది.
రాతల్లో మాత్రమే అభ్యుదయాన్ని చూపుతూ, ఆచరణలో దాన్ని పట్టించు కోకుండా వుండే రచయితలకూ, కవులకూ భజనలు దొరుకుతాయేమో గానీ, నిజమైన గౌరవం మాత్రం దొరకదు. వారిని పాఠకులు కల కాలం నమ్మరు. వారు ఎంత గొప్ప గొప్ప విషయాలను చెప్పినా సరే, చెప్పిన విషయాలను వారే పాటించ నప్పుడు, “గొప్ప చెప్పారులే, గొప్ప గొప్ప కవితాత్మక పద్ధతుల్లో, ఎవరూ కని పెట్టని విషయాలని!” అని తీసి పారేయాలనిపిస్తుంది. రాసే వారికి చేతలు ఎంత ముఖ్యమో అర్థం కాకపోతే, ఈ అగౌరవాలు తప్పవు.
జె. యు. బి. వి. ప్రసాద్
కిటికీ గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
11/14/2012 12:27 pm
Twitst in the tail!!
నువ్వే నేననీ… గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
11/14/2012 12:13 pm
heart-wrenchingly beautiful; but, why are beautiful stories often impractical?