“…సిలికానాంధ్ర ఇప్పుడు ఒక తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. దీనిని ‘యూనివర్సిటీ ఆఫ్ సిలికానాఅంధ్ర, అని పిలుస్తారు. దీనిలో డిగ్రీ స్థాయిలో తెలుగు బోధన నిర్వహిస్తారు.”
శ్రీ కృష్ణ కుమారు గారు రాసిన పైవాక్యం చదివి, “అయ్య బాబోయ్! మన వాళ్ళు మహా ఘటికులు; తెలుగుకోసం యూనివర్శిటీయే పెట్టేసారు, అమెరికాలో,” అని ఆశ్చర్యపోయే తెలుగు దేశంలో తెలుగు వాళ్ళకి అమెరికాలో యూనివర్శిటీల గురించి కొన్ని విషయాలు గుర్తు చేద్దామనిపించి ఈ రెండు ముక్కలూ రాస్తున్నాను.
ఉత్తర అమెరికాలో (కెనడా మినహాయించి) దగ్గిర దగ్గిర మూడు వేల పైచిలుకు యూనివర్శిటీలున్నాయి. ఇందులో బోలెడు one-room యూనివర్శిటీలు B.A నుండి Ph.D వరకు డిగ్రీలు ఇస్తాయి, దండిగా ఫీజు ఇచ్చుకోగలిగితే చాలు. మీరు అమెరికా రానక్కరలేదు; అమెరికన్ డిగ్రీ మీకు పోస్ట్ లో వచ్చేస్తుంది. మరి కొన్ని two-room యూనివర్శిటీలు I-20లు పంచిపెడతాయి; తగు మాత్రం ఫీజు తీసుకొని!
అమెరికాలో తెలుగులో బి.యే.డిగ్రీ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. ఇక వందలకొద్దీ తెలుగు వాళ్ళు తెలుగు దేశంలో తెలుగు B.A కోసం నానా అవస్థలూ పడనక్కరలేదన్న మాట!
ఒకప్పుడు, గత శతాబ్దంలో, బుర్రా శేషగిరి రావుగారు విజయనగరంలో ఒక విశ్వవిద్యాలయం పెట్టారు. గౌరవ డాక్టరేటు పట్టాలు కూడా ఇచ్చారు. మొట్టమొదటి గౌరవ డాక్టరేటు రవీంద్రనాథ్ టాగూరు గారికి ఇచ్చారని చదివాను! (బుర్రా శేషగిరిరావు గారు యూనివర్శిటీ పెట్టటానికి కారణాలు వేరే ఉన్నాయనుకోండి.) ఈ కొత్త యూనివర్శిటీ విచ్చలవిడిగా I-20లు పంచిపెట్టే సంస్థగా తయారు కాకుండా వుంటే చాలు! అదే పది వేలు!
ఒకటి మాత్రం ఖాయం. బి.యె. స్థాయిలో అమెరికాలో తెలుగులో పాఠాలు చెప్పడానికి తెలుగు దేశంలో తెలుగు ఎం.ఎలు, పి.ఎచ్.డీలు పిలవకండానే అమెరికా వచ్చేయటానికి సిద్ధంగా ఉండే ఉంటారని నా నమ్మకం.
పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఒక మంచి విషయాన్ని ఎన్నుకుని సోదాహరణంగా ఆకట్టుకునే మాటలలో చక్కగా చెప్పారు.ఇటివలే కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు లేని లోటును తలచుకుని నేను ఇలాంటి విషయాలు కొన్ని వ్రాయాలని అనుకుంటున్నంతలో మీ వ్యాసం ఈమాట లో కనిపించి ఆ లోటు కొంత తీర్చినట్టనిపించింది. మనకు అందుతున్న సౌరశక్తిని సద్వినియోగపరచుకోవడం ఇప్పటి రోజులలో చాలా అవసరం. ఈ విషయాన్ని గురించి ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత మంచిది.
1859 నాటి సంఘటన, అది పునరావృతమయ్యే అవకాశం మరియు పర్యవసానాలు చాలా ముఖ్యమైనవి. మొత్తం మీద మిగిలిన సాహితీ శీర్షికల మధ్య మీ శ్రీసూర్యనారాయణా… ఒక మంచి ప్రయోగం.
మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
ఆనందరామ బారువా, నీలకంఠయ్య, నగరాజారావు, రావూరి దొరసామిశర్మ గారల తర్వాత ఛందశ్శాస్త్రంలో ఇంత విస్తృతంగా ప్రయోగాత్మక కృషిని చేస్తున్నవారు ఈ తరంలో మీరు తప్ప వేఱొకరు లేరనుకొంటాను.
మీ వరివస్యకు అభినందనలని చెప్పటం చాలా చిన్నమాట.
చంపకమాల, చంపకమాలిని, చంపకావళి, చిత్రలత, చిత్రలతిక, తుమ్మెదకంటు, ధృతశ్రీ, పంచకావళి, పూలపాన్పు, రుచిర, శశివదన, సరసి, సిద్ధి, సిద్ధక – అని మీరు గుదిగ్రుచ్చిన “చంపకమాల” నామాంతరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో “చంపకమాలిక”, “చంపకావళి”, “పంచకావళి” అని మూడు పేర్లతో దుఃఖభంజనుడు వాగ్వల్లభచ్ఛందస్సులోనూ; “చిత్రలత”ను హేమచంద్రాచార్యుడు తన ఛందోనుశాసనం టీకలోనూ; “చిత్రలతిక”ను శ్రీకృష్ణభట్టు వృత్తముక్తావళిలోనూ; “శశివదన”ను పింగళుడు ఛందస్సూత్రంలోనూ; “సరసి”ని గంగాదాసు ఛందోమంజరిలోనూ; “సిద్ధకము”ను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలోనూ; “సిద్ధి”ని స్వయంభువు స్వయంభూచ్ఛందస్సులోనూ వాడిన విషయం నాకు తెలుసు. తక్కిన పేర్లను ఎవరు ఏ కావ్యంలో వాడారో తెలియరాలేదు. ఇంకా చంపకమాలను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలో “సురతరు రి త్యన్యత్ర” అని ఎవరో “సురతరువు” అన్నారని చెప్పాడు కాని, ఆ అన్యత్ర ఎక్కడో తెలియదు. నారాయణభట్టు వృత్తరత్నాకరం టీక “సలిలము” అని, “శ్రీ” అని పేర్కొనటం కూడా జరిగింది.
రావూరి దొరసామిశర్మ గారు “సలిలనిధి” అని ఉదాహరించారు కాని, అదెక్కడిదో తెలియదు. మీరు పేర్కొన్న “తుమ్మెదకంటు”, “ధృతశ్రీ”, “పూలపాన్పు”లను ఎవరన్నారో తెలియరాలేదు.
మీరు రూపొందిస్తున్న వృత్తవిజ్ఞానసర్వస్వంలో ఈ విశేషాలన్నీ త్వరలో వెలుగు చూస్తాయనుకొంటాను.
ఔకారాన్ని రెండు గణాలకు వాడటం గుఱించి మీరు ప్రస్తావించారు. అది శాస్త్రపరిభాషాకృతం కాదనుకొంటాను. రెండు నగణాలు అని మాత్రమే అర్థం.
ద్వివచనం. సుబంతమైన న (గణాద్యక్షరం) పైని నామప్రత్యయాలేర్పడి నః – నౌ – నాః అని ప్రథమా విభక్తి రూపాలు సిద్ధించాయి. నః = ఒక్క నగణం; నౌ = రెండు నగణాలు అని. “నుర్గౌ” అని న వర్ణంపైని గుణితక్రమానుసారం తక్కిన గణసంఖ్య సూచిత మవుతున్నది మాత్రం నిస్సంశయంగా లాక్షణిక సంకేతితం.
సార్థక నామవృత్తాలన్న మీ అభిధేయకల్పన చాలా ఔచితీమంతంగా ఉన్నది. అందుకు మీరు దశావతార నామాలను సంకేతించి పద్యాలను వ్రాయటం సొగసైన ఆలోచన. మీ పద్యాలూ భావుకసుభగంభావుకంగా ఉన్నాయి. ఒక్క “హయవాహన”ను మాత్రం “వాహిని కాఁగన్ జగమ్ము” ఇత్యాదిగా భవిష్యదర్థకంలోకి మారిస్తే ఇంకా సమంజసంగా ఉంటుంది.
పరిశోధకుడే లక్ష్య-లక్షణ నిర్మాతృకవయిత కావటం అన్న ప్రాక్సంప్రదాయం మీ యందు పునారూఢమై తెలుగు ఛందశ్శాస్త్రచరిత్రలో మీ స్థితిని సుస్థితం చేస్తున్నది!
తెలుగు ప్రపంచభాష కావాలంటే ఆసియాతో పాటు మిగిలిన మూడుఖండాలలో కనీసం నాలుగు కొత్త తెలుగుదేశాలు (అవి ఒక్కొక్కటీ కేరళ, హర్యానా రాష్ట్రాలంత చిన్నవైనా ఫర్వాలేదు) ఏర్పడాలి. ఎక్కడివాళ్ళం అక్కడే “స్థిరో భవ, వరదో భవ” అని కూర్చుంటే ఇది ఎప్పటికీ ప్రపంచభాష అవ్వదు. కేవలం ఒక రాష్ట్రంలో మాట్లాడుతున్నంత మాత్రాన గానీ, ప్రపంచస్థాయి సౌకర్యాలు ఏర్పఱచుకున్నంత మాత్రాన గానీ అవ్వదు. మాకు రాజకీయాలతో సంబంధం లేదని మడిగట్టుకున్నా అవ్వదు. ఈ కార్యక్రమాన్ని ముందు అమెరికాఖండంతో మొదలుపెట్టాలి. ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు సాగించాలి.
ఇంటి మొగుడు గురించి స్ఫురిత అభిప్రాయం:
09/05/2013 12:05 pm
రైల్లో కథలు చెప్పే ఐడియా చాలా బావుంది మాస్టారూ…
కోప పెళ్లి…యదేఛ్చా వంట వాడూ… హ హ
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి భా. సు. రావు అభిప్రాయం:
09/05/2013 2:05 am
శ్రీ కృష్ణ కుమారు గారు రాసిన పైవాక్యం చదివి, “అయ్య బాబోయ్! మన వాళ్ళు మహా ఘటికులు; తెలుగుకోసం యూనివర్శిటీయే పెట్టేసారు, అమెరికాలో,” అని ఆశ్చర్యపోయే తెలుగు దేశంలో తెలుగు వాళ్ళకి అమెరికాలో యూనివర్శిటీల గురించి కొన్ని విషయాలు గుర్తు చేద్దామనిపించి ఈ రెండు ముక్కలూ రాస్తున్నాను.
ఉత్తర అమెరికాలో (కెనడా మినహాయించి) దగ్గిర దగ్గిర మూడు వేల పైచిలుకు యూనివర్శిటీలున్నాయి. ఇందులో బోలెడు one-room యూనివర్శిటీలు B.A నుండి Ph.D వరకు డిగ్రీలు ఇస్తాయి, దండిగా ఫీజు ఇచ్చుకోగలిగితే చాలు. మీరు అమెరికా రానక్కరలేదు; అమెరికన్ డిగ్రీ మీకు పోస్ట్ లో వచ్చేస్తుంది. మరి కొన్ని two-room యూనివర్శిటీలు I-20లు పంచిపెడతాయి; తగు మాత్రం ఫీజు తీసుకొని!
అమెరికాలో తెలుగులో బి.యే.డిగ్రీ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. ఇక వందలకొద్దీ తెలుగు వాళ్ళు తెలుగు దేశంలో తెలుగు B.A కోసం నానా అవస్థలూ పడనక్కరలేదన్న మాట!
ఒకప్పుడు, గత శతాబ్దంలో, బుర్రా శేషగిరి రావుగారు విజయనగరంలో ఒక విశ్వవిద్యాలయం పెట్టారు. గౌరవ డాక్టరేటు పట్టాలు కూడా ఇచ్చారు. మొట్టమొదటి గౌరవ డాక్టరేటు రవీంద్రనాథ్ టాగూరు గారికి ఇచ్చారని చదివాను! (బుర్రా శేషగిరిరావు గారు యూనివర్శిటీ పెట్టటానికి కారణాలు వేరే ఉన్నాయనుకోండి.) ఈ కొత్త యూనివర్శిటీ విచ్చలవిడిగా I-20లు పంచిపెట్టే సంస్థగా తయారు కాకుండా వుంటే చాలు! అదే పది వేలు!
ఒకటి మాత్రం ఖాయం. బి.యె. స్థాయిలో అమెరికాలో తెలుగులో పాఠాలు చెప్పడానికి తెలుగు దేశంలో తెలుగు ఎం.ఎలు, పి.ఎచ్.డీలు పిలవకండానే అమెరికా వచ్చేయటానికి సిద్ధంగా ఉండే ఉంటారని నా నమ్మకం.
విధేయుడు
B.S. రావు
ఈమాట సెప్టెంబర్ 2013 సంచికకు స్వాగతం! గురించి Vinnakota Narasimha Rao అభిప్రాయం:
09/04/2013 9:02 pm
“పాఠకుల అభిప్రాయాలు” లో మొదటి పేజ్ తర్వాత పేజీలకు వెళ్ళటానికి నెంబర్ 2, 3, 4, …….. వగైరాలు నొక్కినా గాని మళ్ళీ మొదటి పేజీనే చూపిస్తోంది.
[ఈ విషయం మీదే పనిచేస్తున్నాం. త్వరలోనే సరిదిద్దుతాం. అసౌకర్యానికి క్షమాపణలు – సం.]
శ్రీ సూర్యనారాయణా… గురించి Narayana అభిప్రాయం:
09/04/2013 4:47 pm
లక్ష్మన్న గారు,
పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఒక మంచి విషయాన్ని ఎన్నుకుని సోదాహరణంగా ఆకట్టుకునే మాటలలో చక్కగా చెప్పారు.ఇటివలే కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు లేని లోటును తలచుకుని నేను ఇలాంటి విషయాలు కొన్ని వ్రాయాలని అనుకుంటున్నంతలో మీ వ్యాసం ఈమాట లో కనిపించి ఆ లోటు కొంత తీర్చినట్టనిపించింది. మనకు అందుతున్న సౌరశక్తిని సద్వినియోగపరచుకోవడం ఇప్పటి రోజులలో చాలా అవసరం. ఈ విషయాన్ని గురించి ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత మంచిది.
1859 నాటి సంఘటన, అది పునరావృతమయ్యే అవకాశం మరియు పర్యవసానాలు చాలా ముఖ్యమైనవి. మొత్తం మీద మిగిలిన సాహితీ శీర్షికల మధ్య మీ శ్రీసూర్యనారాయణా… ఒక మంచి ప్రయోగం.
మరిన్ని మున్ముందు ఆశిస్తూ…
అభినందనలు మరియు కృతజ్ఞతలతో,
నారాయణ గరిమెళ్ళ.
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:
09/04/2013 1:02 pm
పద్యం లోని సొగసుని చక్కగా తేట పరిచారు. ధన్యవాదాలు.
నాకు నచ్చిన పద్యం: తొలికోడి కూత గురించి kanaka Raju Tunga అభిప్రాయం:
09/04/2013 12:22 pm
కుంపటివలెనుండు కుక్కుటరాయుండు కుటిశికరాగ్రమునెక్కి కూయునొకట
సరసఁపిల్లలకొడి యెరువు కుప్పలఁ దొడి పురువుల ముక్కునన్ బొడచునొకట
ముంగాళ్ళపైలేచి మునిపంట దడులాఁచి ప్రాఁకు తీఁగలలాగు మేఁక యొకటఁ
గడుపుబ్బఁ బలు మెక్కి కుడితి గోలెము చక్కి పడుకొని నెమరుచుఁ బాడియావు
వానమామలై వరదాచార్యుల పోతన చరిత్రము లోని ఒక అందమైన పద్యము మదిలోనికి వచ్చింది.
ఇంటి మొగుడు గురించి sasikala అభిప్రాయం:
09/04/2013 12:19 pm
హ… హ… బులుసు గారు మీ శైలి భలే నవ్విస్తూ ఉంటుంది. చాలా బాగా వ్రాసారు.
దశావతారస్తుతి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/04/2013 11:12 am
మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
ఆనందరామ బారువా, నీలకంఠయ్య, నగరాజారావు, రావూరి దొరసామిశర్మ గారల తర్వాత ఛందశ్శాస్త్రంలో ఇంత విస్తృతంగా ప్రయోగాత్మక కృషిని చేస్తున్నవారు ఈ తరంలో మీరు తప్ప వేఱొకరు లేరనుకొంటాను.
మీ వరివస్యకు అభినందనలని చెప్పటం చాలా చిన్నమాట.
చంపకమాల, చంపకమాలిని, చంపకావళి, చిత్రలత, చిత్రలతిక, తుమ్మెదకంటు, ధృతశ్రీ, పంచకావళి, పూలపాన్పు, రుచిర, శశివదన, సరసి, సిద్ధి, సిద్ధక – అని మీరు గుదిగ్రుచ్చిన “చంపకమాల” నామాంతరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో “చంపకమాలిక”, “చంపకావళి”, “పంచకావళి” అని మూడు పేర్లతో దుఃఖభంజనుడు వాగ్వల్లభచ్ఛందస్సులోనూ; “చిత్రలత”ను హేమచంద్రాచార్యుడు తన ఛందోనుశాసనం టీకలోనూ; “చిత్రలతిక”ను శ్రీకృష్ణభట్టు వృత్తముక్తావళిలోనూ; “శశివదన”ను పింగళుడు ఛందస్సూత్రంలోనూ; “సరసి”ని గంగాదాసు ఛందోమంజరిలోనూ; “సిద్ధకము”ను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలోనూ; “సిద్ధి”ని స్వయంభువు స్వయంభూచ్ఛందస్సులోనూ వాడిన విషయం నాకు తెలుసు. తక్కిన పేర్లను ఎవరు ఏ కావ్యంలో వాడారో తెలియరాలేదు. ఇంకా చంపకమాలను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలో “సురతరు రి త్యన్యత్ర” అని ఎవరో “సురతరువు” అన్నారని చెప్పాడు కాని, ఆ అన్యత్ర ఎక్కడో తెలియదు. నారాయణభట్టు వృత్తరత్నాకరం టీక “సలిలము” అని, “శ్రీ” అని పేర్కొనటం కూడా జరిగింది.
రావూరి దొరసామిశర్మ గారు “సలిలనిధి” అని ఉదాహరించారు కాని, అదెక్కడిదో తెలియదు. మీరు పేర్కొన్న “తుమ్మెదకంటు”, “ధృతశ్రీ”, “పూలపాన్పు”లను ఎవరన్నారో తెలియరాలేదు.
మీరు రూపొందిస్తున్న వృత్తవిజ్ఞానసర్వస్వంలో ఈ విశేషాలన్నీ త్వరలో వెలుగు చూస్తాయనుకొంటాను.
ఔకారాన్ని రెండు గణాలకు వాడటం గుఱించి మీరు ప్రస్తావించారు. అది శాస్త్రపరిభాషాకృతం కాదనుకొంటాను. రెండు నగణాలు అని మాత్రమే అర్థం.
ద్వివచనం. సుబంతమైన న (గణాద్యక్షరం) పైని నామప్రత్యయాలేర్పడి నః – నౌ – నాః అని ప్రథమా విభక్తి రూపాలు సిద్ధించాయి. నః = ఒక్క నగణం; నౌ = రెండు నగణాలు అని. “నుర్గౌ” అని న వర్ణంపైని గుణితక్రమానుసారం తక్కిన గణసంఖ్య సూచిత మవుతున్నది మాత్రం నిస్సంశయంగా లాక్షణిక సంకేతితం.
సార్థక నామవృత్తాలన్న మీ అభిధేయకల్పన చాలా ఔచితీమంతంగా ఉన్నది. అందుకు మీరు దశావతార నామాలను సంకేతించి పద్యాలను వ్రాయటం సొగసైన ఆలోచన. మీ పద్యాలూ భావుకసుభగంభావుకంగా ఉన్నాయి. ఒక్క “హయవాహన”ను మాత్రం “వాహిని కాఁగన్ జగమ్ము” ఇత్యాదిగా భవిష్యదర్థకంలోకి మారిస్తే ఇంకా సమంజసంగా ఉంటుంది.
పరిశోధకుడే లక్ష్య-లక్షణ నిర్మాతృకవయిత కావటం అన్న ప్రాక్సంప్రదాయం మీ యందు పునారూఢమై తెలుగు ఛందశ్శాస్త్రచరిత్రలో మీ స్థితిని సుస్థితం చేస్తున్నది!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక గురించి srinivasarao అభిప్రాయం:
09/04/2013 6:02 am
ఈ పత్రిక చాలా బాగుంది
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి శ్రీతెలుగు అభిప్రాయం:
09/04/2013 5:48 am
తెలుగు ప్రపంచభాష కావాలంటే ఆసియాతో పాటు మిగిలిన మూడుఖండాలలో కనీసం నాలుగు కొత్త తెలుగుదేశాలు (అవి ఒక్కొక్కటీ కేరళ, హర్యానా రాష్ట్రాలంత చిన్నవైనా ఫర్వాలేదు) ఏర్పడాలి. ఎక్కడివాళ్ళం అక్కడే “స్థిరో భవ, వరదో భవ” అని కూర్చుంటే ఇది ఎప్పటికీ ప్రపంచభాష అవ్వదు. కేవలం ఒక రాష్ట్రంలో మాట్లాడుతున్నంత మాత్రాన గానీ, ప్రపంచస్థాయి సౌకర్యాలు ఏర్పఱచుకున్నంత మాత్రాన గానీ అవ్వదు. మాకు రాజకీయాలతో సంబంధం లేదని మడిగట్టుకున్నా అవ్వదు. ఈ కార్యక్రమాన్ని ముందు అమెరికాఖండంతో మొదలుపెట్టాలి. ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు సాగించాలి.