‘శార్ఙ్గధరపద్ధతి’ క్రీ.శ. 1363 నాటిది. 14-వ శతాబ్ది ఉత్తరార్ధం అన్నమాట. పీటర్ పీటర్సన్ ప్రకటించిన ప్రతిని సమీక్షిస్తూ శార్ఙ్గధరుని అవతారికలోని మూడవ హమ్మీర భూపతి చారిత్రిక విషయాలను బట్టి ఆ రోజుల్లో బ్యూలర్ గారు ప్రామాణికమైన కాలనిర్ణయం చేయగలిగారు. శార్ఙ్గధరపద్ధతి దేశవ్యాప్తం కావటానికి కనీసం అర్ధశతాబ్ది కాలం పట్టినదనుకొన్నా, 15-వ శతాబ్దికి పూర్వార్ధానికి గాని అది తెలుగువారికి లభించి ఉండదు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు ఆ సంధానగ్రంథం అవతారికలో చెప్పబడిన కృతికర్తను పోషించిన హమ్మీర భూపతి నామధేయులు చరిత్రలో ముగ్గురుండటం వల్ల అతను మొదటి హమ్మీరుడనుకొని కాలనిర్ణయంలో పొరబడ్డారు. వారు “శార్ఙ్గధరపద్ధతి భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ” అని చెప్పినది కూడా సరికాదు. (ఆ చర్చ ఇప్పుడు సంగతం కాదు.)
మీరిచ్చిన ఆ శార్ఙ్గధరపద్ధతిలోని పాఠమూ, ఆ ప్రశ్నార్థకాలూ ఎప్పటి ముద్రణ లోనివో నాకు తెలియరాలేదు. మీరిచ్చిన ఆ పాఠంలో ఇంకా దోషాలనేకం ఉన్నాయి. నా దగ్గరున్నది 1987 నాటి పునర్ముద్రణ ప్రతి. అందులో శ్లోకం సరిగానే ఉన్నది:
అని. ఇది కళావిలాస కర్తకు మూలం కాదని దీనిని, ఇటువంటివే మఱికొన్నింటిని నేను ఉదాహరింపలేదు. మీరిచ్చిన రెండవ శ్లోకం కూడా సరిగా లేదు. బహుశః ఈ ప్రకారంగా ఉండి ఉంటుంది:
ఇది శ్లోకంలోని “సఖే” అన్న సంబోధనార్థం వల్ల తెలుగు పద్యానికి మూలం కాలేదు. అందులో చెప్పబడిన పదకొండు లక్షణాలకు యథాయథంగా సన్నిహితమైన మూలం ఇప్పటి వరకు నేను చూచిన 15-వ శతాబ్దికి మునుపటి సంధానగ్రంథాలలో లేనందువల్ల, తదనంతరం వెలసిన ఆయుర్వేదగ్రంథాలలో మాత్రమే కానవస్తున్నందువల్ల – పద్యపు కాలనిర్ణయం ఆ విధంగా చేయవలసివచ్చింది.
సాహిత్యచరిత్రలో విద్యార్థిత్వం కలవారికి తుదిమాట అనేది ఉండదు. నూతనాంశాల గవేషణతో వివిదిషువుల వ్యాసంగం అవ్యాహతంగా కొనసాగుతూనే ఉంటుంది. నా వ్యాసంలో ప్రతిపాదితమైనదానికి సుప్రమాతమైన విరుద్ధాంశం ఏది కనబడినా వ్యాసతాత్పర్యాన్ని మార్చుకోవటం నాకెప్పుడూ ఆనందదాయకమే. సత్యనిరూపణార్థమే తప్ప ఈ చర్చలో వినోదంకరణమన్నది నిర్నిమిత్తమని పెద్దలకు మనవి చేస్తున్నాను.
బహుశా దీన్ని మీరు చూచి ఉంటారు. భోజరాజు చారుచర్య కు దగ్గరగా ఉంది, పైగా తెలుగు అనువాదం దీన్ని అనుసరించలేదు కాబట్టి అనవసరం అని విడిచి ఉండవచ్చు. కానీ సార్ఞదేవుని సార్ఞధరపద్ధతి కావ్యానికి పాఠాలు అనేకం ఉన్నట్టు కనబడుతుంది. (ఈ మాటనే సార్ఙధరపద్ధతిని పరిష్కరించిన ఆంగ్లేయులు పీటర్సన్ ఆ పుస్తక పీఠికలో అన్నారు.) మరొక పాఠం క్రింద. (ఇది జాలంలో దేవనాగరిలిపిలో శోధిస్తే దొరికింది. దీని ప్రామాణికత ఎంతో నాకు తెలీదు.)
పైని తాంబూలవర్ణన మీరు ఉటంకించిన వాటితో కాస్త భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇక్కడ సఖే! అని సంబోధన ఉన్నది కాబట్టి తెలుగు అనువాదానికి ఇదే మూలం అయ్యే అవకాశం తోసిపుచ్చలేనిది. ఒకవేళ ఇది సార్ఞధరపద్ధతిలోనిదయితే ఆ కావ్యం ౧౩ వ శతాబ్దానికి చెందినది. (మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు, సంస్కృత వాఞ్మయచరిత్ర, ద్వితీయభాగం, పుట ౩౩౯).
పైగా ఈ కావ్యం భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ కాబట్టి, ఇందులో అంతకు పూర్వం ఇతర కవులు రచించిన పద్యాలను ఇందులో గ్రహించి ఉండే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ తాంబూల వర్ణనను బట్టి తెలుగు అనువాదాన్ని 15 వ శతాబ్దపు తర్వాత కాలానికి ఈవలగా నిర్ణయించడానికి లేదేమోనని శంకా, ౧౩ వ శతాబ్దానికి పూర్వమే అయి ఉండవచ్చునన్న సందేహమూ కలుగుతున్నాయి.
(నేనే బ్రహ్మను) అని అనేందుకు దేహాభిమానాన్ని వీడాలని శ్రీ రామకృష్ణపరమహంస శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.దేహంపై చింతన ఉన్నంత కాలం మనలో ఉన్న బ్రహ్మను గుర్తించలేం.సర్వం బ్రహ్మమయం,నేనే ఆత్మను అనే భావాలు కలిగేందుకు దేహాభిమానం పూర్తిగా నశించాలని ఆయన అన్నారు.
సుదీర్ఘమైన వ్యాసాన్ని ఆసాంతం చదివి దయతో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ‘ఈమాట’ లోని వ్యాసాలు సమసామయికతకు అతీతంగా చిరకాలం విద్వత్పఠన సద్విమర్శలకు పాత్రమవుతుంటాయని తెలిసి ఎంతో సంతోషమైంది.
వ్యాసాన్ని ఒక పగలంతా కూర్చొని కళావిలాసాన్ని అధికరించి నాకేర్పడిన భావజాతమంతటినీ గుదిగ్రుచ్చి రాత్రికి అక్షరదోషాలను సవరించి పంపించాను. ఉపన్యాసధోరణిలో నేను వ్రాసిన పాఠాన్ని మీరు పిడియఫ్ రూపంలో చూసే ఉంటారు. వేదం వారన్నట్లు అది “క్రంప బలిసి” ఉన్నందువల్ల సంపాదకులు శ్రీ మాధవ్ గారు ఎంతో సహృదయంతో దానిని మరెంతో శ్రమకోర్చి విషయానుసారం విభజించి “వ్యాస”త్వాన్ని కల్పించారు. విషయసంగ్రహం విషయవివేచనను అధిగమించటం మంచిదే. అతిగమిస్తే మాత్రం ఆ దోషపు బాధ్యత నాదే.
మీ మొదటి ప్రశ్నకు సమాధానం: సంస్కృతంలోని కలావిలాసంతో పోల్చినప్పుడు అది తెలుగు కావ్యానికి మూలమని “ఖచ్చితమైన మూలాలతో” ప్రత్యక్షప్రమాణమేదీ లేనందువల్లనే ఇంత సుదీర్ఘమైన చర్చను చేయవలసివచ్చింది. అది వ్రాతప్రతులంటున్నట్లు నిజంగా నన్నెచోడునిదే అయితే, క్రీ.శ. 940లో మరణించాడని విశ్వసింపబడుతున్న ఆయన ముఖ్యరచనమైన కుమారసంభవ కావ్యానికంటె పూర్వతరం – అంటే, 910 (±) నాటి రచన కావాలి. అయితే ఉపలబ్ధాంశాలను బట్టి తెలుగు కళావిలాసం క్షేమేంద్ర రచనాప్రభావితమే కావచ్చునని, ఒకవేళ నన్నెచోడుడు 13వ శతాబ్దిలో ఉండినా, క్షేమేంద్రునికి చాలా తర్వాతి కాలంలో వెలసిన శ్లోకం అనువాదం ఉండటం వల్ల తెలుగు రచన మరింత ఆధునికమని ఊహింపబడింది. అందుకు మరికొన్ని ప్రమాణాలు చూపబడ్డాయి. కుమారసంభవ కర్తకు క్షేమేంద్రుని బహురచనలతో పరిచయం ఉన్న మాట కూడా స్పష్టమే. ఆయన 13వ శతాబ్ది వాడైతే, తాను చదువుకొన్న క్షేమేంద్రుని సుప్రసిద్ధమైన కలావిలాసంతో ఎటువంటి సంబంధం లేని మరొక కళావిలాసాన్ని ఉపకల్పించాలని ఎందుకనుకొన్నాడో వివరింపవలసి వస్తుంది. ఒక నన్నెచోడుడు 10వ శతాబ్దిలోనో, లేక 13వ శతాబ్దిలోనో; మరొక నన్నెచోడుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఉండి, పరస్పరసాజాత్యం కలిగిన రచనను చేసి ఉంటే తప్ప ఈ విరోధం పరిహృతం కాదు. ఇప్పుడున్న ఆధారాలతో దీనికి తుదితీర్పును చెప్పే అవకాశం లేదు. అందువల్ల అనుమానప్రమాణం ఆవశ్యకం అయింది.
ఈ పద్యం కావ్యం అవతారికలోనిది కావచ్చునని ఊఃహ్యం. మన్మథస్తుతి నన్నెచోడునికి ఆభిమానికం కనుక తప్పక అది కళావిలాసం లోనిదే అయివుంటుంది. అవతారికలోనిది కాబట్టి దానికి మూలం క్షేమేంద్రుని రచనలో కనుపింపకపోవటం భావ్యమే.
“ఆ కథ బృహత్కథకు సంబంధించినది కాబట్టి అందులోంచే ఎందుకు స్వీకరించి ఉండకూడదన్న ప్రశ్న వస్తుంది.”
తాంబూలపు లక్షణప్రస్తావన ఉన్న పద్యం తెలుగు కళావిలాసం లోనిదని ఒకదానికొకటి సంబంధం లేని రెండు వ్రాతప్రతులలో ఉన్నది కాబట్టి అది కళావిలాసం లోనిదే అని విశ్వసించాలి. ఆ తెలుగు పద్యానికి మూలమైన శ్లోకం అంత ప్రాచీనం కాకపోవచ్చునని కూడా వ్యాసంలో ప్రతిపాదింపబడింది. తాంబూలప్రస్తావన మాత్రమే ఉన్న క్షేమేంద్రుని శ్లోకాన్ని గ్రహించి తెలుగు కవి స్వతంత్రించి దానిచుట్టూ కొంత పెంపుచేసి ఉండవచ్చును. సముద్రదత్తుని కథకు సంస్కృత కలావిలాసం / బృహత్కథ / కథాసరిత్సాగరం / బృహత్కథామంజరి / భేతాళపంచవిశతి అన్నవాటిలో ఏది మూలమైనప్పటికీ తెలుగు కళావిలాసంలోకి అది ప్రవేశించిన తీరును బట్టి చారిత్రిక కాలనిర్ణయం మాత్రమే ఇక్కడ చర్చనీయాంశం. ఆ మాటకు వస్తే, సంస్కృతకావ్యాల లోనూ, తెలుగు కావ్యాలలోనూ ఇటువంటివే కథలు అనేకం ఉన్నాయి. వాటిని నేను చర్చింపలేదు.
“పతి పత్నిని కౌగిట చేర్చడం కోసం క్షేమేంద్రుని కళావిలాసం వరకూ వెళ్ళే అవసరమేమిటండి? :)”
పతి పత్నిని కౌగిట చేర్చుకోవటమో, పత్ని పతి కౌగిటను చేరటమో చూడటానికి మనము క్షేమేంద్రుని కళావిలాసానికి వెళ్ళటం జరగలేదని మనవి. ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిలో కళావిలాస పద్యానికి దిగువనే ఈ పద్యం ఉన్నందువల్ల, అది సంస్కృత కలావిలాసంలో సంగతమై ఉన్నందువల్ల, సార్థకమైన అనువాదం కావచ్చునని ఊహింపబడింది.
“మానవల్లి వారు ఆ ఉద్దేశ్యంతోనే “అందులో కథాంశములు లేవు” అని చెప్పారని ఎందుకు అనుకోరాదు?”
సంస్కృత కలావిలాసంలో ఎన్ని “కథాంశాలు” ఉన్నాయో, లేవో – అవే తలుగు కళావిలాసానికీ వర్తించినప్పటి మాటేమిటి? తెలుగులోనూ లక్షణలక్షితమైన ఆ కథాంశం లేకపోయి ఉంటేనో? అలబ్ధమైన ఆ కావ్యం అనువాదం కాదని అప్పుడు మాత్రం ఎట్లా నిర్ణయింపగలము? అందుకే ఈ స్థితగతిచింతన.
వ్యాసాన్ని ఇంత సూక్ష్మేక్షికతో చదివి, సహృదయంతో స్పందించినందుకు మరొక్కసారి మీకు నా ధన్యవాదాలు!
(పురుషసంకేతంగా “బ్రాహ్మి” అన్న నామం పుంభావసరస్వతికి పర్యాయమే. మీ లేఖను చదివి నాకెంతో ఆనందం కలిగింది. మందబుద్ధీత్యాదివిశేషణాలు మీకు వర్తింపవు. మీతో పరిచయం నాకు ముదావహం. మైత్ర్యర్థం త్వరలో ఈ కలం పేరు చీకటి తొలగి వాస్తవిక రవితేజం వెల్లివిరుస్తుందని ఆశిస్తుంటాను.) 🙂
మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
సప్రశ్రయంగా,
ఔదార్యపూర్ణమైన మీ స్పందనకు నా మనఃపూర్వక ధన్యవాదాలను తెలియజేసికొంటున్నాను. తత్త్వవిషయసంగ్రహం, పాఠపరిష్కారం మీ అనుమోదాన్ని పొంది ఉండటం నాకెంతో సంతోషాన్ని కూర్చింది. మీరన్నట్లు జడభరతుని కథ ఎన్ని పర్యాయాలు చదువుకొన్నా తనివితీరని గంభీరార్థసంభృతం. విష్ణుచిత్తీయంలోని జడభరతోపాఖ్యానం అన్వయాన్ని కూడా చేర్చాలని అనుకొన్నాను కాని, అప్పటికే సుదీర్ఘమైనందువల్ల విరమించుకోవలసి వచ్చింది. మీ ఆశీర్వచస్సుకు కృతజ్ఞుణ్ణి.
“పార్వతి తపస్సు–నన్నెచోడుని కుమార సంభవము” అనే వ్యాసంలో మహాకవి వర్ణనా వైభవం వెల్లివిరిసింది. శివుని కోసం పార్వతి చేసే తపస్సులో నన్నెచోడుని కవితా తపస్సు ఇంద్రధనస్సు సప్త వర్ణాలను వెదజల్లింది. ‘వర్ణనా నిపుణ: కవి:’ అనే ఆర్యోక్తి నన్నెచోడునికి పూర్తిగా వర్తిస్తుంది. చక్కటి విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సంధర్భంలో కాళిదాసు ‘కుమార సంభవము’లోని శ్లోకాలతో తులనాత్మక పరిశీలన కూడా చేసి ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. ముందుముందు ఇటువంటి సంప్రదాయక సాహిత్య రచనలను ఎన్నో అందిస్తారని ఆశిస్తూ.
అద్భుతవిషయసంగ్రహంతో, నిశితపరిశీలనలతో, పాండిత్యప్రతిభతో అలరారుతున్న వ్యాసం. అయితే విషయసంగ్రహం, విషయవివేచనను అధిగమించింది. ఒక్కొక్క విషయాన్ని అనేక రీతులుగా చర్చించడం వల్ల ఎక్కడ ఏది ప్రాధాన్యమో తెలియకుండా ఉంది. అందువల్ల విద్యార్థులకు, ఈ వ్యాఖ్యాత వంటి మందబుద్ధులకు దిశానిర్దేశం దొరకడం లేదు.
మానవల్లి రామకృష్ణ కవి ఆక్షేపణలకు వచ్చిన సమాధానాలలో కూడా సందేహాలు వస్తున్నాయి.
1. క్షేమేంద్రుని కళావిలాసానికి తెలుగు కళావిలాసం అనువాదం కాదని మానవల్లి కవి గారు అన్నట్టయితే – తెలుగు పద్యాలకు సంస్కృతకళావిలాసంలో ఖచ్చితమైన మూలాలు దొరికితీరాలి. అలా దొరుకుతున్నాయా? అని ప్రశ్న.
పై పద్యానికి సంస్కృతమూలం క్షేమేంద్రుని కావ్యంలో కనబడడం లేదు. (ఆ పద్యం రామకృష్ణకవిని అనుసరించిందా అన్న ప్రస్తావన తర్వాత. )
ii) తలపోయఁగ రుచు లాఱును
గలుగును; వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు; నాఁ
…
తాంబూలంపై చెప్పిన పద్యానికి కళావిలాసం సంస్కృతమూలంలో ఉటంకించిన సముద్రదత్తునికథలో తాంబూల ప్రస్తావనకు ఉన్న లంకె బలహీనమైనది. పైగా మూలంలోని సముద్రదత్తుని కథ కు కథాసరిత్సాగరం/బృహత్కథ లోని భేతాళపంచవిశతి కథలో మూడవకథ మూలంగా కనబడుతుంది, బృహత్కథామంజరిని వ్రాసిన క్షేమేంద్రుడు అందులో ఒక కథను తన కళావిలాసంలో దృష్టాంతంగా ఉపయోగించి ఉంటాడు. కాబట్టి తెలుగు కళావిలాసకర్త ఒకవేళ సముద్రదత్తుని కథనే అనుసరించాడనుకున్నా, ఆ కథ బృహత్కథకు సంబంధించినది కాబట్టి అందులోంచే ఎందుకు స్వీకరించి ఉండకూడదన్న ప్రశ్న వస్తుంది.
ఈ పాదానికి ఇదివరకు సందేహం వర్తిస్తుంది. పతి పత్నిని కౌగిట చేర్చడం కోసం క్షేమేంద్రుని కళావిలాసం వరకూ వెళ్ళే అవసరమేమిటండి? 🙂
2. మానవల్లి కవి గారు ప్రస్తావవశాన “దానిలో కథాంశములు” లేవు. అన్న వాక్యంలో కథ – అన్న శబ్దాన్ని సంజ్ఞార్థకంగా గ్రహించి, క్షేమేంద్రుని కావ్యంలో చివరన ఉన్న ఉన్న ఒక శ్లోకంద్వారా సమాధానం చెప్పారు. నిజంగా క్షేమేంద్రుని కళావిలాసం కథాకావ్యమేనా? అలా కనిపించదు. సంస్కృత కళావిలాసం ధూర్తులు, వంచకుల గురించి ఉపదేశించిన ఉపదేశకావ్యం. ఇందులో ఏడవ సర్గ మొదలుకుని పదవసర్గ వరకూ, కంసాలురు, వేశ్యలు, ధూర్తులు, వీళ్ళ వంచనా వ్యాపారాలు ఉపదేశింపబడినాయి. అంతకు ముందు కూడానూ ఎక్కువ భాగం ఉపదేశాలు, మధ్యమధ్యలో చేస్తున్న ఉపదేశాలను సమర్థించడానికి కొన్ని దృష్టాంతాలు, అవీనూ అదివరకు ప్రముఖమైనవాటిని “ఉపయోగించడం” కనిపిస్తుంది. (భేతాళపంచవింశతి కథ ఒక ఉదాహరణ) ఏతావతా, సంస్కృతకావ్యంలో స్పష్టంగా కవి నిర్మించిన, “కథ” అని వ్యవహారార్థానికి అనువైన, నాయక, నాయికా, ప్రతినాయకాదులు లేదా సన్నివేశంలో నాటకీయతకు అనువైన దృశ్యాలతో, ప్రత్యేకమైన ఇతివృత్తంతో కూర్చిన కథాంశాలు ఇందులో లేవు. (మూలంలోని కళావిలాసంలో వంచకుల ప్రవర్తనలకు పద్మప్రాభృతకం అనే- చతుర్భాణిలో మొదటి భాణకంలోని పాత్రలకు సామ్యం కూడా కనిపిస్తుంది. ఆ భాణకంలోనూ కర్ణీసుతుడు/మూలదేవుడు, అతని అనుచరుడు శశి ప్రధానపాత్రలు) స్థూలంగా చెప్పాలంటే ఈ కావ్యం కథాంశాలకు కాకుండా ఉపదేశాలకు ప్రసిద్ధి అని ఒక సంగ్రహమైన అర్థం పాఠకుడికి కనిపించడంలో విడ్డూరమేదీ లేదు. మానవల్లి వారు ఆ ఉద్దేశ్యంతోనే “అందులో కథాంశములు లేవు” అని చెప్పారని ఎందుకు అనుకోరాదు?
ఈ పద్యానికి రామకృష్ణకవి పద్యం ఆధారం అంటున్నారు. పద్యనిర్మాణం, వర్ణనాసామ్యం, లేదా కవిసమయాల ఉపయోగంలో సారూప్యం కారణంగా ఎవరు ఎవరిని అనుసరించారని నిర్ణయించడం పండితులకు సబబేనా? పెద్దలు ఆలోచించాలి.
పైన విషయాలు ఏవో అల్పపరిజ్ఞానంతో అర్థం చేసుకుందుకు దారి వెతుక్కునే తత్తరలో వ్రాసిన విషయాలే తప్ప, ఇంతటి గొప్ప వ్యాసాన్ని అధిక్షేపించడానికో, అవమానించడానికో వ్రాసినవి కావు. ఇందులో పరుషత్వం ధ్వనిస్తే, వ్యాఖ్యాత క్షమార్హుడు. ఈ వ్యాసాన్ని మరిన్ని సార్లు చదవాల్సి ఉంది.
నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/10/2014 2:28 pm
శ్రీ “బ్రాహ్మి” గారికి
నమస్కారములతో,
‘శార్ఙ్గధరపద్ధతి’ క్రీ.శ. 1363 నాటిది. 14-వ శతాబ్ది ఉత్తరార్ధం అన్నమాట. పీటర్ పీటర్సన్ ప్రకటించిన ప్రతిని సమీక్షిస్తూ శార్ఙ్గధరుని అవతారికలోని మూడవ హమ్మీర భూపతి చారిత్రిక విషయాలను బట్టి ఆ రోజుల్లో బ్యూలర్ గారు ప్రామాణికమైన కాలనిర్ణయం చేయగలిగారు. శార్ఙ్గధరపద్ధతి దేశవ్యాప్తం కావటానికి కనీసం అర్ధశతాబ్ది కాలం పట్టినదనుకొన్నా, 15-వ శతాబ్దికి పూర్వార్ధానికి గాని అది తెలుగువారికి లభించి ఉండదు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు ఆ సంధానగ్రంథం అవతారికలో చెప్పబడిన కృతికర్తను పోషించిన హమ్మీర భూపతి నామధేయులు చరిత్రలో ముగ్గురుండటం వల్ల అతను మొదటి హమ్మీరుడనుకొని కాలనిర్ణయంలో పొరబడ్డారు. వారు “శార్ఙ్గధరపద్ధతి భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ” అని చెప్పినది కూడా సరికాదు. (ఆ చర్చ ఇప్పుడు సంగతం కాదు.)
మీరిచ్చిన ఆ శార్ఙ్గధరపద్ధతిలోని పాఠమూ, ఆ ప్రశ్నార్థకాలూ ఎప్పటి ముద్రణ లోనివో నాకు తెలియరాలేదు. మీరిచ్చిన ఆ పాఠంలో ఇంకా దోషాలనేకం ఉన్నాయి. నా దగ్గరున్నది 1987 నాటి పునర్ముద్రణ ప్రతి. అందులో శ్లోకం సరిగానే ఉన్నది:
తామ్బూలం ముఖరోగనాశనిపుణం సంవర్ధనం తేజసో
నిత్యం జాఠరవహ్నివృద్ధిజననం దుర్గన్ధదోషాపహమ్
వక్త్రాలఙ్కరణం ప్రహర్షజననం విద్వన్నృపాగ్రే రణే
కామస్యాయతనం సముద్భవకరం లక్ష్మ్యాః సుఖస్యాస్పదమ్.
అని. ఇది కళావిలాస కర్తకు మూలం కాదని దీనిని, ఇటువంటివే మఱికొన్నింటిని నేను ఉదాహరింపలేదు. మీరిచ్చిన రెండవ శ్లోకం కూడా సరిగా లేదు. బహుశః ఈ ప్రకారంగా ఉండి ఉంటుంది:
తాంబూలం కటుతిక్తముష్ణమధురం క్షారం కషాయాన్వితం
వాతఘ్నం కఫనాశనం కృమిహరం దౌర్గంధ్యదోషాపహమ్
వక్త్రస్యాభరణం మలాపహరణం కామాగ్నిసన్దీపనం
తాంబూలస్య సఖే! త్రయోదశగుణాః స్వర్గేఽప్యమీ దుర్లభాః.
అని.
ఇది శ్లోకంలోని “సఖే” అన్న సంబోధనార్థం వల్ల తెలుగు పద్యానికి మూలం కాలేదు. అందులో చెప్పబడిన పదకొండు లక్షణాలకు యథాయథంగా సన్నిహితమైన మూలం ఇప్పటి వరకు నేను చూచిన 15-వ శతాబ్దికి మునుపటి సంధానగ్రంథాలలో లేనందువల్ల, తదనంతరం వెలసిన ఆయుర్వేదగ్రంథాలలో మాత్రమే కానవస్తున్నందువల్ల – పద్యపు కాలనిర్ణయం ఆ విధంగా చేయవలసివచ్చింది.
సాహిత్యచరిత్రలో విద్యార్థిత్వం కలవారికి తుదిమాట అనేది ఉండదు. నూతనాంశాల గవేషణతో వివిదిషువుల వ్యాసంగం అవ్యాహతంగా కొనసాగుతూనే ఉంటుంది. నా వ్యాసంలో ప్రతిపాదితమైనదానికి సుప్రమాతమైన విరుద్ధాంశం ఏది కనబడినా వ్యాసతాత్పర్యాన్ని మార్చుకోవటం నాకెప్పుడూ ఆనందదాయకమే. సత్యనిరూపణార్థమే తప్ప ఈ చర్చలో వినోదంకరణమన్నది నిర్నిమిత్తమని పెద్దలకు మనవి చేస్తున్నాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి బ్రాహ్మి అభిప్రాయం:
09/10/2014 12:13 pm
మీరేమీ అనుకోనంటే, తాంబూలమీమాంసను మరికొంత పొడిగిస్తున్నాను. (వినోదభాజనం మరొకకారణం. 🙂
మీరు ఉటంకించిన తాంబూల వర్ణన లలో లేని, సార్ఞదేవుడు అన్న కవి వ్రాసిన సార్ఞధరపద్ధతి కావ్యానికి చెందిన ఈ క్రింది వర్ణన ఇదీ.
తాంబూలం ముఖరోగనాశనిపుణం సంవర్ధనం తేజసః
నిత్యం జాఠరవహ్నిజనకం దుర్గంధదోషావహమ్ |
వదనాలంకరణం ప్రహర్షజనకం విద్వన్నృపాగ్నే (?) రణే
కామస్యాయతనం సముద్దవకరం (?) లక్ష్మ్యాః సుఖస్యాస్పదమ్ ||
(౧౪౧౬)
బహుశా దీన్ని మీరు చూచి ఉంటారు. భోజరాజు చారుచర్య కు దగ్గరగా ఉంది, పైగా తెలుగు అనువాదం దీన్ని అనుసరించలేదు కాబట్టి అనవసరం అని విడిచి ఉండవచ్చు. కానీ సార్ఞదేవుని సార్ఞధరపద్ధతి కావ్యానికి పాఠాలు అనేకం ఉన్నట్టు కనబడుతుంది. (ఈ మాటనే సార్ఙధరపద్ధతిని పరిష్కరించిన ఆంగ్లేయులు పీటర్సన్ ఆ పుస్తక పీఠికలో అన్నారు.) మరొక పాఠం క్రింద. (ఇది జాలంలో దేవనాగరిలిపిలో శోధిస్తే దొరికింది. దీని ప్రామాణికత ఎంతో నాకు తెలీదు.)
తాంబూలం కటుతిక్త మిశ్రమధురం క్షారం కాషాయాన్వితం
వాతఘ్నం కఫనాశనం కృమిహరం దౌర్గంధ్య దోషాపహమ్ |
వక్త్రస్యాభరణం మలాపహరణం కామాగ్ని సన్దీపనం
తాంబూలస్య సఖే! త్రయోదశగుణాః స్వర్గైపి అమీ దుర్లభః ||
(౧౪౧౬)
పైని తాంబూలవర్ణన మీరు ఉటంకించిన వాటితో కాస్త భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇక్కడ సఖే! అని సంబోధన ఉన్నది కాబట్టి తెలుగు అనువాదానికి ఇదే మూలం అయ్యే అవకాశం తోసిపుచ్చలేనిది. ఒకవేళ ఇది సార్ఞధరపద్ధతిలోనిదయితే ఆ కావ్యం ౧౩ వ శతాబ్దానికి చెందినది. (మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు, సంస్కృత వాఞ్మయచరిత్ర, ద్వితీయభాగం, పుట ౩౩౯).
పైగా ఈ కావ్యం భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ కాబట్టి, ఇందులో అంతకు పూర్వం ఇతర కవులు రచించిన పద్యాలను ఇందులో గ్రహించి ఉండే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ తాంబూల వర్ణనను బట్టి తెలుగు అనువాదాన్ని 15 వ శతాబ్దపు తర్వాత కాలానికి ఈవలగా నిర్ణయించడానికి లేదేమోనని శంకా, ౧౩ వ శతాబ్దానికి పూర్వమే అయి ఉండవచ్చునన్న సందేహమూ కలుగుతున్నాయి.
అదే నేను గురించి rathnamsjcc అభిప్రాయం:
09/10/2014 1:13 am
(నేనే బ్రహ్మను) అని అనేందుకు దేహాభిమానాన్ని వీడాలని శ్రీ రామకృష్ణపరమహంస శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.దేహంపై చింతన ఉన్నంత కాలం మనలో ఉన్న బ్రహ్మను గుర్తించలేం.సర్వం బ్రహ్మమయం,నేనే ఆత్మను అనే భావాలు కలిగేందుకు దేహాభిమానం పూర్తిగా నశించాలని ఆయన అన్నారు.
నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/09/2014 2:54 pm
ఆత్మీయులు శ్రీ “బ్రాహ్మి” గారికి
నమస్కారములతో,
సుదీర్ఘమైన వ్యాసాన్ని ఆసాంతం చదివి దయతో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ‘ఈమాట’ లోని వ్యాసాలు సమసామయికతకు అతీతంగా చిరకాలం విద్వత్పఠన సద్విమర్శలకు పాత్రమవుతుంటాయని తెలిసి ఎంతో సంతోషమైంది.
వ్యాసాన్ని ఒక పగలంతా కూర్చొని కళావిలాసాన్ని అధికరించి నాకేర్పడిన భావజాతమంతటినీ గుదిగ్రుచ్చి రాత్రికి అక్షరదోషాలను సవరించి పంపించాను. ఉపన్యాసధోరణిలో నేను వ్రాసిన పాఠాన్ని మీరు పిడియఫ్ రూపంలో చూసే ఉంటారు. వేదం వారన్నట్లు అది “క్రంప బలిసి” ఉన్నందువల్ల సంపాదకులు శ్రీ మాధవ్ గారు ఎంతో సహృదయంతో దానిని మరెంతో శ్రమకోర్చి విషయానుసారం విభజించి “వ్యాస”త్వాన్ని కల్పించారు. విషయసంగ్రహం విషయవివేచనను అధిగమించటం మంచిదే. అతిగమిస్తే మాత్రం ఆ దోషపు బాధ్యత నాదే.
మీ మొదటి ప్రశ్నకు సమాధానం: సంస్కృతంలోని కలావిలాసంతో పోల్చినప్పుడు అది తెలుగు కావ్యానికి మూలమని “ఖచ్చితమైన మూలాలతో” ప్రత్యక్షప్రమాణమేదీ లేనందువల్లనే ఇంత సుదీర్ఘమైన చర్చను చేయవలసివచ్చింది. అది వ్రాతప్రతులంటున్నట్లు నిజంగా నన్నెచోడునిదే అయితే, క్రీ.శ. 940లో మరణించాడని విశ్వసింపబడుతున్న ఆయన ముఖ్యరచనమైన కుమారసంభవ కావ్యానికంటె పూర్వతరం – అంటే, 910 (±) నాటి రచన కావాలి. అయితే ఉపలబ్ధాంశాలను బట్టి తెలుగు కళావిలాసం క్షేమేంద్ర రచనాప్రభావితమే కావచ్చునని, ఒకవేళ నన్నెచోడుడు 13వ శతాబ్దిలో ఉండినా, క్షేమేంద్రునికి చాలా తర్వాతి కాలంలో వెలసిన శ్లోకం అనువాదం ఉండటం వల్ల తెలుగు రచన మరింత ఆధునికమని ఊహింపబడింది. అందుకు మరికొన్ని ప్రమాణాలు చూపబడ్డాయి. కుమారసంభవ కర్తకు క్షేమేంద్రుని బహురచనలతో పరిచయం ఉన్న మాట కూడా స్పష్టమే. ఆయన 13వ శతాబ్ది వాడైతే, తాను చదువుకొన్న క్షేమేంద్రుని సుప్రసిద్ధమైన కలావిలాసంతో ఎటువంటి సంబంధం లేని మరొక కళావిలాసాన్ని ఉపకల్పించాలని ఎందుకనుకొన్నాడో వివరింపవలసి వస్తుంది. ఒక నన్నెచోడుడు 10వ శతాబ్దిలోనో, లేక 13వ శతాబ్దిలోనో; మరొక నన్నెచోడుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఉండి, పరస్పరసాజాత్యం కలిగిన రచనను చేసి ఉంటే తప్ప ఈ విరోధం పరిహృతం కాదు. ఇప్పుడున్న ఆధారాలతో దీనికి తుదితీర్పును చెప్పే అవకాశం లేదు. అందువల్ల అనుమానప్రమాణం ఆవశ్యకం అయింది.
ఈ పద్యం కావ్యం అవతారికలోనిది కావచ్చునని ఊఃహ్యం. మన్మథస్తుతి నన్నెచోడునికి ఆభిమానికం కనుక తప్పక అది కళావిలాసం లోనిదే అయివుంటుంది. అవతారికలోనిది కాబట్టి దానికి మూలం క్షేమేంద్రుని రచనలో కనుపింపకపోవటం భావ్యమే.
తాంబూలపు లక్షణప్రస్తావన ఉన్న పద్యం తెలుగు కళావిలాసం లోనిదని ఒకదానికొకటి సంబంధం లేని రెండు వ్రాతప్రతులలో ఉన్నది కాబట్టి అది కళావిలాసం లోనిదే అని విశ్వసించాలి. ఆ తెలుగు పద్యానికి మూలమైన శ్లోకం అంత ప్రాచీనం కాకపోవచ్చునని కూడా వ్యాసంలో ప్రతిపాదింపబడింది. తాంబూలప్రస్తావన మాత్రమే ఉన్న క్షేమేంద్రుని శ్లోకాన్ని గ్రహించి తెలుగు కవి స్వతంత్రించి దానిచుట్టూ కొంత పెంపుచేసి ఉండవచ్చును. సముద్రదత్తుని కథకు సంస్కృత కలావిలాసం / బృహత్కథ / కథాసరిత్సాగరం / బృహత్కథామంజరి / భేతాళపంచవిశతి అన్నవాటిలో ఏది మూలమైనప్పటికీ తెలుగు కళావిలాసంలోకి అది ప్రవేశించిన తీరును బట్టి చారిత్రిక కాలనిర్ణయం మాత్రమే ఇక్కడ చర్చనీయాంశం. ఆ మాటకు వస్తే, సంస్కృతకావ్యాల లోనూ, తెలుగు కావ్యాలలోనూ ఇటువంటివే కథలు అనేకం ఉన్నాయి. వాటిని నేను చర్చింపలేదు.
పతి పత్నిని కౌగిట చేర్చుకోవటమో, పత్ని పతి కౌగిటను చేరటమో చూడటానికి మనము క్షేమేంద్రుని కళావిలాసానికి వెళ్ళటం జరగలేదని మనవి. ప్రబంధరత్నాకరం వ్రాతప్రతిలో కళావిలాస పద్యానికి దిగువనే ఈ పద్యం ఉన్నందువల్ల, అది సంస్కృత కలావిలాసంలో సంగతమై ఉన్నందువల్ల, సార్థకమైన అనువాదం కావచ్చునని ఊహింపబడింది.
సంస్కృత కలావిలాసంలో ఎన్ని “కథాంశాలు” ఉన్నాయో, లేవో – అవే తలుగు కళావిలాసానికీ వర్తించినప్పటి మాటేమిటి? తెలుగులోనూ లక్షణలక్షితమైన ఆ కథాంశం లేకపోయి ఉంటేనో? అలబ్ధమైన ఆ కావ్యం అనువాదం కాదని అప్పుడు మాత్రం ఎట్లా నిర్ణయింపగలము? అందుకే ఈ స్థితగతిచింతన.
వ్యాసాన్ని ఇంత సూక్ష్మేక్షికతో చదివి, సహృదయంతో స్పందించినందుకు మరొక్కసారి మీకు నా ధన్యవాదాలు!
(పురుషసంకేతంగా “బ్రాహ్మి” అన్న నామం పుంభావసరస్వతికి పర్యాయమే. మీ లేఖను చదివి నాకెంతో ఆనందం కలిగింది. మందబుద్ధీత్యాదివిశేషణాలు మీకు వర్తింపవు. మీతో పరిచయం నాకు ముదావహం. మైత్ర్యర్థం త్వరలో ఈ కలం పేరు చీకటి తొలగి వాస్తవిక రవితేజం వెల్లివిరుస్తుందని ఆశిస్తుంటాను.) 🙂
భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/09/2014 2:26 pm
మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
సప్రశ్రయంగా,
ఔదార్యపూర్ణమైన మీ స్పందనకు నా మనఃపూర్వక ధన్యవాదాలను తెలియజేసికొంటున్నాను. తత్త్వవిషయసంగ్రహం, పాఠపరిష్కారం మీ అనుమోదాన్ని పొంది ఉండటం నాకెంతో సంతోషాన్ని కూర్చింది. మీరన్నట్లు జడభరతుని కథ ఎన్ని పర్యాయాలు చదువుకొన్నా తనివితీరని గంభీరార్థసంభృతం. విష్ణుచిత్తీయంలోని జడభరతోపాఖ్యానం అన్వయాన్ని కూడా చేర్చాలని అనుకొన్నాను కాని, అప్పటికే సుదీర్ఘమైనందువల్ల విరమించుకోవలసి వచ్చింది. మీ ఆశీర్వచస్సుకు కృతజ్ఞుణ్ణి.
భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/09/2014 2:25 pm
శ్రీమద్భాగవత గణనాధ్యాయి గారికి
నమస్కారములతో,
వ్యాసాన్ని ఆసాంతం చదివి దయతో మీ స్పందనను తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!
పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము గురించి మంగు శివ రామ ప్రసాద్ అభిప్రాయం:
09/09/2014 1:14 pm
“పార్వతి తపస్సు–నన్నెచోడుని కుమార సంభవము” అనే వ్యాసంలో మహాకవి వర్ణనా వైభవం వెల్లివిరిసింది. శివుని కోసం పార్వతి చేసే తపస్సులో నన్నెచోడుని కవితా తపస్సు ఇంద్రధనస్సు సప్త వర్ణాలను వెదజల్లింది. ‘వర్ణనా నిపుణ: కవి:’ అనే ఆర్యోక్తి నన్నెచోడునికి పూర్తిగా వర్తిస్తుంది. చక్కటి విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సంధర్భంలో కాళిదాసు ‘కుమార సంభవము’లోని శ్లోకాలతో తులనాత్మక పరిశీలన కూడా చేసి ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. ముందుముందు ఇటువంటి సంప్రదాయక సాహిత్య రచనలను ఎన్నో అందిస్తారని ఆశిస్తూ.
శ్రీలలితా సహస్రనామ వైశిష్య్టమ్ గురించి sivalenka ayyavaru అభిప్రాయం:
09/08/2014 4:14 pm
వివరణ బాగుంది. కాని ఈ వ్యాసం లో విషయాలు యధాతధం గా శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రి గారి పీఠికలోంచి స్వీకరించబడినట్లు భవదీయుడు భావన.
జ్ఞాపకాల వాసన గురించి Mohan rao T అభిప్రాయం:
09/08/2014 2:48 pm
Starting Lo baga anipinchindi.Kani end varaku chadivaka idi emitI anipinchindi.
నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి బ్రాహ్మి అభిప్రాయం:
09/08/2014 1:27 pm
అద్భుతవిషయసంగ్రహంతో, నిశితపరిశీలనలతో, పాండిత్యప్రతిభతో అలరారుతున్న వ్యాసం. అయితే విషయసంగ్రహం, విషయవివేచనను అధిగమించింది. ఒక్కొక్క విషయాన్ని అనేక రీతులుగా చర్చించడం వల్ల ఎక్కడ ఏది ప్రాధాన్యమో తెలియకుండా ఉంది. అందువల్ల విద్యార్థులకు, ఈ వ్యాఖ్యాత వంటి మందబుద్ధులకు దిశానిర్దేశం దొరకడం లేదు.
మానవల్లి రామకృష్ణ కవి ఆక్షేపణలకు వచ్చిన సమాధానాలలో కూడా సందేహాలు వస్తున్నాయి.
1. క్షేమేంద్రుని కళావిలాసానికి తెలుగు కళావిలాసం అనువాదం కాదని మానవల్లి కవి గారు అన్నట్టయితే – తెలుగు పద్యాలకు సంస్కృతకళావిలాసంలో ఖచ్చితమైన మూలాలు దొరికితీరాలి. అలా దొరుకుతున్నాయా? అని ప్రశ్న.
i) పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరుఁ
పై పద్యానికి సంస్కృతమూలం క్షేమేంద్రుని కావ్యంలో కనబడడం లేదు. (ఆ పద్యం రామకృష్ణకవిని అనుసరించిందా అన్న ప్రస్తావన తర్వాత. )
ii) తలపోయఁగ రుచు లాఱును
గలుగును; వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు; నాఁ
…
తాంబూలంపై చెప్పిన పద్యానికి కళావిలాసం సంస్కృతమూలంలో ఉటంకించిన సముద్రదత్తునికథలో తాంబూల ప్రస్తావనకు ఉన్న లంకె బలహీనమైనది. పైగా మూలంలోని సముద్రదత్తుని కథ కు కథాసరిత్సాగరం/బృహత్కథ లోని భేతాళపంచవిశతి కథలో మూడవకథ మూలంగా కనబడుతుంది, బృహత్కథామంజరిని వ్రాసిన క్షేమేంద్రుడు అందులో ఒక కథను తన కళావిలాసంలో దృష్టాంతంగా ఉపయోగించి ఉంటాడు. కాబట్టి తెలుగు కళావిలాసకర్త ఒకవేళ సముద్రదత్తుని కథనే అనుసరించాడనుకున్నా, ఆ కథ బృహత్కథకు సంబంధించినది కాబట్టి అందులోంచే ఎందుకు స్వీకరించి ఉండకూడదన్న ప్రశ్న వస్తుంది.
iii) …దడవకయుండ నెప్పటి విధంబని కౌఁగిటఁ జేర్ప నంతటన్
ఈ పాదానికి ఇదివరకు సందేహం వర్తిస్తుంది. పతి పత్నిని కౌగిట చేర్చడం కోసం క్షేమేంద్రుని కళావిలాసం వరకూ వెళ్ళే అవసరమేమిటండి? 🙂
2. మానవల్లి కవి గారు ప్రస్తావవశాన “దానిలో కథాంశములు” లేవు. అన్న వాక్యంలో కథ – అన్న శబ్దాన్ని సంజ్ఞార్థకంగా గ్రహించి, క్షేమేంద్రుని కావ్యంలో చివరన ఉన్న ఉన్న ఒక శ్లోకంద్వారా సమాధానం చెప్పారు. నిజంగా క్షేమేంద్రుని కళావిలాసం కథాకావ్యమేనా? అలా కనిపించదు. సంస్కృత కళావిలాసం ధూర్తులు, వంచకుల గురించి ఉపదేశించిన ఉపదేశకావ్యం. ఇందులో ఏడవ సర్గ మొదలుకుని పదవసర్గ వరకూ, కంసాలురు, వేశ్యలు, ధూర్తులు, వీళ్ళ వంచనా వ్యాపారాలు ఉపదేశింపబడినాయి. అంతకు ముందు కూడానూ ఎక్కువ భాగం ఉపదేశాలు, మధ్యమధ్యలో చేస్తున్న ఉపదేశాలను సమర్థించడానికి కొన్ని దృష్టాంతాలు, అవీనూ అదివరకు ప్రముఖమైనవాటిని “ఉపయోగించడం” కనిపిస్తుంది. (భేతాళపంచవింశతి కథ ఒక ఉదాహరణ) ఏతావతా, సంస్కృతకావ్యంలో స్పష్టంగా కవి నిర్మించిన, “కథ” అని వ్యవహారార్థానికి అనువైన, నాయక, నాయికా, ప్రతినాయకాదులు లేదా సన్నివేశంలో నాటకీయతకు అనువైన దృశ్యాలతో, ప్రత్యేకమైన ఇతివృత్తంతో కూర్చిన కథాంశాలు ఇందులో లేవు. (మూలంలోని కళావిలాసంలో వంచకుల ప్రవర్తనలకు పద్మప్రాభృతకం అనే- చతుర్భాణిలో మొదటి భాణకంలోని పాత్రలకు సామ్యం కూడా కనిపిస్తుంది. ఆ భాణకంలోనూ కర్ణీసుతుడు/మూలదేవుడు, అతని అనుచరుడు శశి ప్రధానపాత్రలు) స్థూలంగా చెప్పాలంటే ఈ కావ్యం కథాంశాలకు కాకుండా ఉపదేశాలకు ప్రసిద్ధి అని ఒక సంగ్రహమైన అర్థం పాఠకుడికి కనిపించడంలో విడ్డూరమేదీ లేదు. మానవల్లి వారు ఆ ఉద్దేశ్యంతోనే “అందులో కథాంశములు లేవు” అని చెప్పారని ఎందుకు అనుకోరాదు?
3. పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరుఁ
ఈ పద్యానికి రామకృష్ణకవి పద్యం ఆధారం అంటున్నారు. పద్యనిర్మాణం, వర్ణనాసామ్యం, లేదా కవిసమయాల ఉపయోగంలో సారూప్యం కారణంగా ఎవరు ఎవరిని అనుసరించారని నిర్ణయించడం పండితులకు సబబేనా? పెద్దలు ఆలోచించాలి.
పైన విషయాలు ఏవో అల్పపరిజ్ఞానంతో అర్థం చేసుకుందుకు దారి వెతుక్కునే తత్తరలో వ్రాసిన విషయాలే తప్ప, ఇంతటి గొప్ప వ్యాసాన్ని అధిక్షేపించడానికో, అవమానించడానికో వ్రాసినవి కావు. ఇందులో పరుషత్వం ధ్వనిస్తే, వ్యాఖ్యాత క్షమార్హుడు. ఈ వ్యాసాన్ని మరిన్ని సార్లు చదవాల్సి ఉంది.