నారాయణగారూ, మంచి విషయాన్ని ఎన్నుకుని మంచి పోయం రాశారు.సమాజం లో గొప్పగొప్ప పనులు చేస్తూ యితరులకు ప్రేరణగానిలచిన గొప్పవ్యక్తులను తలచుకోవడం,వారిని గురించి ప్రచారం చేయడం కూడా గొప్పవిషయమే, అది మరికొందరికి స్ఫూర్తిదాయకమౌతుంది.
అభినందనలు
మీరన్న అవధారణార్థక ప్రత్యయం ఇక్కడ పొసగదు; (నీవు +అ =నీవ) లాంటి వాడుక కద్దు. పద్యంలో అన్వయ క్లేశమున్నది, కాదనను;దాన్ని దూరం చేసే మార్గాలు లేకపోలేదు. ఊహలు పారిన మేర అర్థాన్ని విస్తరించడం ప్రమాదం. భ్రమప్రమాదాలకు లోనయ్యే సందర్భాల్లో Hermeneutics (అర్థ మీమాంస) ఎంత గానో ఉపకరిస్తుంది.
అర్థము శాశ్వతమన్న భావము ఈ దాన శాసనం వచ్చిన చారిత్రిక సందర్భంలో ఇముడు తుందా ?? ఇమడదు, కావున దేశ్యమైన ప్రత్యయాన్ని తత్సమాలకు వర్తింప చేయడం దురన్వయం కాక తప్పదు. తావో తే చింగ్ అనువాదంలో eternal Tao అనడం తప్పు అంటాడు ఒక పండితుడు, కారణం eternal అని దేన్ని ఆధునికులు భావిస్తున్నారో ఆ ఊహే ఆ కాలానికి లేదు.కావున , ఊహా వృత్తానికి వ్యాసార్ధం చారిత్రిక సందర్భం కాక తప్పదు.
“ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. ” అన్న ప్రసాద్ గారి అభిప్రాయం సబబు :
నా అనుమానమల్లా వ్యర్థమటంచు అన్న పాఠం తప్పు . రత్తి గుఱించి అన్నదే సరయినదని.
ప్రాచీన కాలపు లేఖన పద్ధతుల్లో అత్థ౯ము = అర్థము ; రత్థి౯ =రర్థి ;
(కడప జిల్లా శాసనాలు- మొదటి భాగం ( సం. పరబ్రహ్మ శాస్త్రి )శాసన పాఠం అనుసరించి ) ఇప్పుడు అర్థ బోధకు వచ్చిన చిక్కు లేదు, ఛందో భంగం లేదు
అర్థి =కోరిక , ఆసక్తి ;గుఱించి=ఉద్దేశించి , నిర్ణయించి ; నమ్మక పరాత్థ౯ము
నెన్నణ్డు చేటు లేని ధర్మాత్థ౯మ ( ధర్మాత్థ౯ము + అ ) చేయుణ్డి
(వర్గాక్షరంతో కూడిన వర్గానునాసికం , తేల్చి పలుక వలసినదే , ఇలాంటి రూపాలు అద్దంకి పద్య శాసనం నిండా కనిపిస్తాయి )
————-
కడప జిల్లా శాసనాలు సంస్కృతీ చరిత్ర అన్న పరిశోధనా గ్రంథంలో అవధానం ఉమా మహేశ్వర శాస్త్రి గారి పరిశీలన ఎన్న దగినది
” అనిత్యాని శరీరాణి విభవోనైవశాశ్వతః
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః
శరీరాలు అనిత్యమైనవి , సంపదలు అశాశ్వతమైనవి. మృత్యువు ఎల్లప్పుడు పొంచి వుంది. కాబట్టి, ధర్మసంగ్రహమే కర్తవ్యం. ఈ విధమైన ఆశయం ప్రాచీన కాలంనుండి భారత దేశంలో ధర్మానురక్తులైన వారందరూ పయనించిన ఘంటా పథమైంది.
పైన చెప్పబడిన శ్లోకానికి అనువాదమని చెప్పదగిన పద్యమొకటి క్రీ.శ 9 లేదా 10 వ శతాబ్ది నాటి చిడిపిరాల శాసనంలో వుంది. ”
ఆయన ఉదహరించిన పద్యం మన చర్చలోని ఉత్పలమాల అని వేరే చెప్పాలా??
కాబట్టి, మోహన తాత్పర్యానికి చేటు లేదు
“ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి. ”
* “శైలి అద్భుతం దమయంతీ.” –
🙂 ఎంత గొప్పేస్తోందో! మీ అంత సీనియర్ రచయిత్రి నించి ప్రశంస నందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా – లక్ష్మి అక్కా! నమస్సులతో..
* లతా, చాలా థాంక్స్ రా. మన వూరు ఎంత అందమైన వూరో కదూ? మన వాళ్ళు కూడా! 🙂
* “ఆతయ్య విషయానికొస్తె ఆ పాత్ర సజీవత్వంతొ మనసులొ ముద్ర వేసీంది.”
…లక్ష్మి మాధవ్! నాకు కూడా చాలా ఇష్టం ఆమె అంటే. చాలా దగ్గర్నించి చూశానేమో నా మనసులో ఆమె అలా.. ఒక చిత్రమై పోయింది. చిత్రమే! నాకు ఇప్పటికీ..ఎప్పటికీ అర్ధం కాని ఒక చిత్రమే.థాంక్సండి మీ స్పందన నన్నెంతగానో అలరించింది. చివర్లో ప్రశంస భలే థళుక్కుమందనుకోండి. నిజం. 🙂 థాంక్ యు సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ లక్ష్మి!
శుభాకాంక్షలతో..
“అర్థమ + శాశ్వతమ్ము” అంటే అర్థమే శాశ్వతం – అని భావం. ‘అ’ అన్నది నిశ్చయాన్ని సూచించే అవధారణార్థకమైన ప్రత్యయం.
“నీవు + ఎఱుంగుదు” = నీవు ఎరుగుదువు అని మధ్యమపురుష. “నీవు + అ + ఎఱుంగుదు” = “నీవ యెఱుంగుదు” అంటే “నీవే ఎరుగుదువు”, “నీవు మాత్రమే ఎరుగుదువు” అని నిశ్చయాత్మకమైన అర్థం.
‘అర్థము + అ = అర్థమ’ అని పదచ్ఛేదం. అర్థమ + శాశ్వతమ్ము = అంటే “నిశ్చయంగా అర్థమే శాశ్వతం”, “అర్థమొక్కటే శాశ్వతం” అని భావం.
“కులప్రయుక్త మగుచున్న సనాతనధర్మ మి త్తెఱంగ” అని సూర్యరాయ నిఘంటువు చూపిన భారత ప్రయోగం. “కులప్రయుక్తం అవుతున్న సనాతనధర్మం ఈ తెఱంగు + అ” = సనాతనధర్మం ఈ విధంగానే ఉంటుంది – అని భావం.
అర్థము + అశాశ్వతమ్ము అని పదచ్ఛేదం చేసినందువల్లనే అన్వయం తప్పుదారిని నడిచి పద్యం దుర్బోధం అయింది.
“ఈ శరీరం క్షణభంగురం; ఎప్పుడో ఒకప్పుడు యముడు వచ్చి తీసికొనిపోయేది (కృతాంతక మారకం); జీవితపరమార్థం బ్రహ్మసాక్షాత్కారం, తత్త్వార్థం” అంటుంటారు. అది సరికాదు. అర్థమొక్కటే శాశ్వతం (అర్థమ శాశ్వతమ్ము). “ఈ అర్థం శరీరంతోపాటు వెంట వస్తుందా, ఏమిటి? వట్టి నిష్ప్రయోజకం” అన్న మాటను నమ్మకండి (దీనినిన్ = ఈ అర్థాన్ని, వ్యర్థ మటంచు నమ్మక);
స్వార్థానికి గాక లోకముయొక్క మేలు కోసమూ (ధర్మార్థము), ఆర్తులైనవారిని కాపాడటం కోసమూ (పరార్థము) అమ్మన ప్రెగ్గడ గారి లాగా దానధర్మాలు చేయండి – అని తాత్పర్యం.
దమయంతి గారు …కథ చాలా బాగుంది. ఆ సముద్రం కెరటాల చప్పుదు కథ అయ్యాక కూదా చెవ్వు ల్లో మారుమ్రొగుతూనె ఉంది. ఇక ఆతయ్య విషయానికొస్తె ఆ పాత్ర సజీవత్వం తొ మనసులొ ముద్ర వేసీంది.
ఎదురుగా సముద్రం. నాకు అందులొ అత్తయ్య… అత్తయ్య… కనిపిస్తోంది. నవ్వుతూ, కాదు అది నవ్వు కాదు. తన లోతు తెలియనీయకుండా అలలతో చెప్పిస్తున్న అబద్ధం అది. ఎంతో అందమైన సముద్రం నేననుకున్నంత అందమైనది కాదని మాత్రం తెలుస్తోంది.అబ్బ ఎంత బాగా వ్రాసారొ . మీకు నా అభినందనలు
పర్వతుడా! నీ పాదాలకు నమస్కారం గురించి srinivasarao అభిప్రాయం:
05/23/2015 10:37 pm
Narayana garu good writing. But I think the subject gives the strength to the poem its my opinion thanking you. Keep writing poems.
పర్వతుడా! నీ పాదాలకు నమస్కారం గురించి రెడ్డి రామకృష్ణ అభిప్రాయం:
05/23/2015 8:22 pm
నారాయణగారూ, మంచి విషయాన్ని ఎన్నుకుని మంచి పోయం రాశారు.సమాజం లో గొప్పగొప్ప పనులు చేస్తూ యితరులకు ప్రేరణగానిలచిన గొప్పవ్యక్తులను తలచుకోవడం,వారిని గురించి ప్రచారం చేయడం కూడా గొప్పవిషయమే, అది మరికొందరికి స్ఫూర్తిదాయకమౌతుంది.
అభినందనలు
చంపకోత్పలమాలల కథ గురించి తః తః అభిప్రాయం:
05/23/2015 10:38 am
ఆహా శిలాక్షరాలు !
ఎప్పటివో అయిన శిలా శాసనాల మీద దొరికిన పద్యాలను /విషయాలను సవరించే సాహసం చేయవచ్చా? -తః తః
రెండు కవితలు గురించి balaram tej peyyala అభిప్రాయం:
05/23/2015 5:40 am
చాలా బాగుంది
చంపకోత్పలమాలల కథ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
05/23/2015 3:08 am
మీరన్న అవధారణార్థక ప్రత్యయం ఇక్కడ పొసగదు; (నీవు +అ =నీవ) లాంటి వాడుక కద్దు. పద్యంలో అన్వయ క్లేశమున్నది, కాదనను;దాన్ని దూరం చేసే మార్గాలు లేకపోలేదు. ఊహలు పారిన మేర అర్థాన్ని విస్తరించడం ప్రమాదం. భ్రమప్రమాదాలకు లోనయ్యే సందర్భాల్లో Hermeneutics (అర్థ మీమాంస) ఎంత గానో ఉపకరిస్తుంది.
అర్థము శాశ్వతమన్న భావము ఈ దాన శాసనం వచ్చిన చారిత్రిక సందర్భంలో ఇముడు తుందా ?? ఇమడదు, కావున దేశ్యమైన ప్రత్యయాన్ని తత్సమాలకు వర్తింప చేయడం దురన్వయం కాక తప్పదు. తావో తే చింగ్ అనువాదంలో eternal Tao అనడం తప్పు అంటాడు ఒక పండితుడు, కారణం eternal అని దేన్ని ఆధునికులు భావిస్తున్నారో ఆ ఊహే ఆ కాలానికి లేదు.కావున , ఊహా వృత్తానికి వ్యాసార్ధం చారిత్రిక సందర్భం కాక తప్పదు.
“ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. ” అన్న ప్రసాద్ గారి అభిప్రాయం సబబు :
నా అనుమానమల్లా వ్యర్థమటంచు అన్న పాఠం తప్పు . రత్తి గుఱించి అన్నదే సరయినదని.
ప్రాచీన కాలపు లేఖన పద్ధతుల్లో అత్థ౯ము = అర్థము ; రత్థి౯ =రర్థి ;
లేఖక ప్రమాదం థ వత్తు త వత్తుగా మారడం ( రత్థి౯ –>రత్తి౯ )
కాలక్రమేణా లిపి చెరిగి ౯ జారిపోవడం (రత్తి౯ –>రత్తి )
రత్తిగా మారడంతో అర్థావబోధ !!
———-మరో పాఠం —-
అర్థమశాశ్వతమ్ము యొడలన్నది తక్షణ భంగురమ్ము త
త్వార్థముగాదు జీవము కృతాంతక మారక మిట్టి దీని మీ
రర్థి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు చేటులేని ధ
ర్మార్థమ చేయుడీ మనుజులమ్మెన పెగ్గడ యట్లు వేర్మితో
(కడప జిల్లా శాసనాలు- మొదటి భాగం ( సం. పరబ్రహ్మ శాస్త్రి )శాసన పాఠం అనుసరించి ) ఇప్పుడు అర్థ బోధకు వచ్చిన చిక్కు లేదు, ఛందో భంగం లేదు
అర్థి =కోరిక , ఆసక్తి ;గుఱించి=ఉద్దేశించి , నిర్ణయించి ; నమ్మక పరాత్థ౯ము
నెన్నణ్డు చేటు లేని ధర్మాత్థ౯మ ( ధర్మాత్థ౯ము + అ ) చేయుణ్డి
(వర్గాక్షరంతో కూడిన వర్గానునాసికం , తేల్చి పలుక వలసినదే , ఇలాంటి రూపాలు అద్దంకి పద్య శాసనం నిండా కనిపిస్తాయి )
————-
కడప జిల్లా శాసనాలు సంస్కృతీ చరిత్ర అన్న పరిశోధనా గ్రంథంలో అవధానం ఉమా మహేశ్వర శాస్త్రి గారి పరిశీలన ఎన్న దగినది
” అనిత్యాని శరీరాణి విభవోనైవశాశ్వతః
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః
శరీరాలు అనిత్యమైనవి , సంపదలు అశాశ్వతమైనవి. మృత్యువు ఎల్లప్పుడు పొంచి వుంది. కాబట్టి, ధర్మసంగ్రహమే కర్తవ్యం. ఈ విధమైన ఆశయం ప్రాచీన కాలంనుండి భారత దేశంలో ధర్మానురక్తులైన వారందరూ పయనించిన ఘంటా పథమైంది.
పైన చెప్పబడిన శ్లోకానికి అనువాదమని చెప్పదగిన పద్యమొకటి క్రీ.శ 9 లేదా 10 వ శతాబ్ది నాటి చిడిపిరాల శాసనంలో వుంది. ”
ఆయన ఉదహరించిన పద్యం మన చర్చలోని ఉత్పలమాల అని వేరే చెప్పాలా??
కాబట్టి, మోహన తాత్పర్యానికి చేటు లేదు
“ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి. ”
తమ్మినేని యదుకుల భూషణ్
శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/22/2015 11:06 pm
* “శైలి అద్భుతం దమయంతీ.” –
🙂 ఎంత గొప్పేస్తోందో! మీ అంత సీనియర్ రచయిత్రి నించి ప్రశంస నందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా – లక్ష్మి అక్కా! నమస్సులతో..
* లతా, చాలా థాంక్స్ రా. మన వూరు ఎంత అందమైన వూరో కదూ? మన వాళ్ళు కూడా! 🙂
* “ఆతయ్య విషయానికొస్తె ఆ పాత్ర సజీవత్వంతొ మనసులొ ముద్ర వేసీంది.”
…లక్ష్మి మాధవ్! నాకు కూడా చాలా ఇష్టం ఆమె అంటే. చాలా దగ్గర్నించి చూశానేమో నా మనసులో ఆమె అలా.. ఒక చిత్రమై పోయింది. చిత్రమే! నాకు ఇప్పటికీ..ఎప్పటికీ అర్ధం కాని ఒక చిత్రమే.థాంక్సండి మీ స్పందన నన్నెంతగానో అలరించింది. చివర్లో ప్రశంస భలే థళుక్కుమందనుకోండి. నిజం. 🙂 థాంక్ యు సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ లక్ష్మి!
శుభాకాంక్షలతో..
చంపకోత్పలమాలల కథ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
05/22/2015 1:20 pm
“అర్థమ + శాశ్వతమ్ము” అంటే అర్థమే శాశ్వతం – అని భావం. ‘అ’ అన్నది నిశ్చయాన్ని సూచించే అవధారణార్థకమైన ప్రత్యయం.
“నీవు + ఎఱుంగుదు” = నీవు ఎరుగుదువు అని మధ్యమపురుష. “నీవు + అ + ఎఱుంగుదు” = “నీవ యెఱుంగుదు” అంటే “నీవే ఎరుగుదువు”, “నీవు మాత్రమే ఎరుగుదువు” అని నిశ్చయాత్మకమైన అర్థం.
‘అర్థము + అ = అర్థమ’ అని పదచ్ఛేదం. అర్థమ + శాశ్వతమ్ము = అంటే “నిశ్చయంగా అర్థమే శాశ్వతం”, “అర్థమొక్కటే శాశ్వతం” అని భావం.
“కులప్రయుక్త మగుచున్న సనాతనధర్మ మి త్తెఱంగ” అని సూర్యరాయ నిఘంటువు చూపిన భారత ప్రయోగం. “కులప్రయుక్తం అవుతున్న సనాతనధర్మం ఈ తెఱంగు + అ” = సనాతనధర్మం ఈ విధంగానే ఉంటుంది – అని భావం.
అర్థము + అశాశ్వతమ్ము అని పదచ్ఛేదం చేసినందువల్లనే అన్వయం తప్పుదారిని నడిచి పద్యం దుర్బోధం అయింది.
“ఈ శరీరం క్షణభంగురం; ఎప్పుడో ఒకప్పుడు యముడు వచ్చి తీసికొనిపోయేది (కృతాంతక మారకం); జీవితపరమార్థం బ్రహ్మసాక్షాత్కారం, తత్త్వార్థం” అంటుంటారు. అది సరికాదు. అర్థమొక్కటే శాశ్వతం (అర్థమ శాశ్వతమ్ము). “ఈ అర్థం శరీరంతోపాటు వెంట వస్తుందా, ఏమిటి? వట్టి నిష్ప్రయోజకం” అన్న మాటను నమ్మకండి (దీనినిన్ = ఈ అర్థాన్ని, వ్యర్థ మటంచు నమ్మక);
స్వార్థానికి గాక లోకముయొక్క మేలు కోసమూ (ధర్మార్థము), ఆర్తులైనవారిని కాపాడటం కోసమూ (పరార్థము) అమ్మన ప్రెగ్గడ గారి లాగా దానధర్మాలు చేయండి – అని తాత్పర్యం.
చంపకోత్పలమాలల కథ గురించి తఃతః అభిప్రాయం:
05/22/2015 8:47 am
శ్రీ తమ్మినేని : ఇతడనలుడు /ఇతడ నలుడు వలె అని అనుకుంటున్నాను.
నమస్కారాలతో -తఃతః
శేషు మావయ్య గురించి lakshmi madhav అభిప్రాయం:
05/22/2015 5:17 am
దమయంతి గారు …కథ చాలా బాగుంది. ఆ సముద్రం కెరటాల చప్పుదు కథ అయ్యాక కూదా చెవ్వు ల్లో మారుమ్రొగుతూనె ఉంది. ఇక ఆతయ్య విషయానికొస్తె ఆ పాత్ర సజీవత్వం తొ మనసులొ ముద్ర వేసీంది.
ఎదురుగా సముద్రం. నాకు అందులొ అత్తయ్య… అత్తయ్య… కనిపిస్తోంది. నవ్వుతూ, కాదు అది నవ్వు కాదు. తన లోతు తెలియనీయకుండా అలలతో చెప్పిస్తున్న అబద్ధం అది. ఎంతో అందమైన సముద్రం నేననుకున్నంత అందమైనది కాదని మాత్రం తెలుస్తోంది.అబ్బ ఎంత బాగా వ్రాసారొ . మీకు నా అభినందనలు
అదే నేను గురించి Damu ndm అభిప్రాయం:
05/22/2015 4:22 am
రాధా మేడం గారు, నాకు కవితలు గురించి అంతగా తెలియదు, కాని ప్రతిఒక్కరి మనసులో దాగివున్న “నేను” అనే విషయాన్ని ఈ కవిత ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు.
దాము
కురబలకోట రైల్వే స్టేషన్