హనుమంతరావు గారు చెప్పింది నిజమే, విశ్వనాధ గొప్పదనం చెప్పడానికి ఇంకొకరిని కించపరచాల్సిన పనిలేదు. ఎవరి గొప్ప వారిది. విశ్వనాధ గొప్పదనం చాలాతక్కువ మందికి తెలుసని బాధపదటం వేరే విషయం.
నాకు తెలిసి విశ్వనాధ శ్రీశ్రీ ని గానీ, శ్రీశ్రీ విశ్వనాధను అగౌరవపరచుకొన్నది, ఖండించినదీ లేదు. ఒకరి మహాకవిత్వాన్ని, మరొకరు మౌనంగా అంగీకరించినట్లే కనబడ్డారు. వారి గురించి మనం తగూ పడటం సరికాదు.
Your essay is very anylytical and worthy. This is the most incisive criticism of Telugu cinema I have ever read.
Cinema is not merely an entertainment. It has social role and responsibility. In countries like India, it can become a visual guide in educating people in certain areas. Unless and until the producers come forword to make movies with an understanding of its social impact, we may not have another golden era again. The present trend in film-making is alarming indeed.
చక్కని వ్యాసం… ప్రాచీన, ఆధునిక కవిత్వాల్ని చక్కగా అనుసంధానిస్తూ రచన సాగింది. కవిత్వ మూలాలు భాషాతీతంగానే ఉన్నా, కవిత్వ భాష మీద ఇలాంటి పరిశోధనా వ్యాసాలు కవిత్వాన్ని మరింత లోతుగా అర్ధం చేసుకోడంలోనూ, రూప పరమైన క్లుప్తత సాధించడంలోనూ ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
“కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.”
లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!
మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.
విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.
నోరూరించే ఆహార పదార్థాల గురించి విశ్లేషించి వివరించే విధంగా, కవిత్వ భాష లక్షణ స్వరూపాలను చెప్పడం మాత్రమే కాక, samples గా రుచి చూపే విధంగా సోదాహరణంగా అందించడం చాలా బాగుంది. ఎంతో పరిశీలన, పరిశోధన, పరిశ్రమలతో పలు విషయాలను ఆసక్తికరంగా అందించినందుకు చాలా కృతజ్ఞతలు.
ఇటువంటి కృషి, రచనలు కవిత్వాన్ని అర్థంచేసుకోవడానికీ, మరింతగా ఆనందించడానికీ సాయపడుతాయి నిస్సందేహంగా. అయితే మంచి కవిత్వాన్ని సృష్టించడానికి మాత్రం ఇవి ఎంతగా ఉపయోగపడుతాయో సరిగ్గా తెలియదు, నాకైతే. రసాత్మకమైనదే కవిత్వం, లేదా ‘కదిలించేదే’ మంచి కవిత్వం, అని అనుకుంటే దాని రూపాలు భాషలోనే ఉన్నా, మూలాలు మాత్రం భాషను దాటగలిగే భావగతమైన హృదయస్పందన పరిధిలోనే ఎక్కువుగా ఉంటాయేమోనని అనిపిస్తుంది.
ఏదియేమైనా, ఆలోచింపజేసే పలువిషయాలను అందించిన వ్యాసమిది. ఇంకా ఇటువంటివి ఎన్నో కామేశ్వరరావుగారు మనకు అందించాలని ఆశిస్తూ,
పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమన్నది ఈ వాదులాటకి ఒక catalyst లాంటిది మాత్రమే. నా దృష్టిలో యీ ఉద్యమానికి మూలకారణాలు వేరే చోటున్నాయి (ఒక ముఖ్య కారణం అచ్చుయంత్ర ప్రవేశం). మీరు మొదటి పేరాలో చెప్పిన మిగిలిన విషయాలతో అందరూ (నేనైతే) ఏకీభవిస్తారు (ను). కాకుంటే ఈ కింది వాక్యమెందుకు ప్రస్తావించారో బోధపడలేదు. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి. ఈ రెండు చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో పాల్గొన్న వ్యక్తులు/సంస్థలు (వావిళ్ళ వారినొక్కరిని మినహాయిస్తే!) కూడా వేర్వేరు అని మీకు నేను చెప్పనవసరం లేదు.
కందుకూరి మధ్య మార్గం పాటించిన మనిషిగా ఎలా చెప్తున్నారో అర్థం కాలేదు. వివరించగలరు. గురజాడ “కొత్తపాతల మేలు కలయిక” అన్నప్పుడు ఆశు (/మౌఖిక), లిఖిత సంప్రదాయాల్ని కలుపుకుంటూ అన్న అర్థంలో వాడాడు. భావకవులకు ఆశుకవిత్వం పట్ల, “గ్రాంథికం” పట్ల వున్న అయిష్టత తెలిసినదే.
అలాగే తి.వెం.కవులు గ్రాంథికవాదాన్ని తిరస్కరించారని ఏ ఆధారంతో చెప్తున్నారో కూడా నాకు బోధపడలేదు. తిరుపతిశాస్త్రి గారు జీవించి వున్న కాలంలో వారిద్దరూ “వ్యావహారిక వాదానికి” అనుకూలురు కాదు. నిజానికి చాలకాలం (అంటే జమీందారుల పోషణ పొందినంతకాలం), వారే చాలాచోట్ల చెప్పుకున్నట్లు, తెలుగంటే చిన్నచూపే (చూ: కథలు-గాథలు, మూడు భాగాలూ). వెంకటశాస్త్రి గారు చివరిరోజుల్లో కూడా “వ్యావహారికానికి” అనుకూలుణ్ణని చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ:
“నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యవహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరములు నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను “తుద కబ్బెరా తురక భాష” అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందరు నిందింతురని నక్కు తెలిసిన్నీ, నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ, ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశ్యము.” (చూ: కాశీయాత్ర, 1942)
ఏమయినా, వాళ్ళు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ, ఏ గాటానా కట్టడానికి లొంగని వ్యక్తులు :-). వాళ్ళ Cultural Biography ఎవరైనా రాయవలసిన అవసరం యెంతైనా వుంది.
సంస్కృత ప్రభావంతో “తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నదనే” భావన పండితలోకంలో చాలాకాలం బలంగా వుంది. అది చెళ్ళపిళ్ళవారి అభిప్రాయం మాత్రమే కాదు.
#[…] All Telugu courtly poets proudly proclaimed that they commanded scholarship in Sanskrit, Prakrits of different varieties, Puranas, Sastras and a host of related subjects like meter. While they composed poetry almost entirely in Telugu, they did not have to support their Telugu by texts of grammar or dictionaries: Telugu was a language of poetry, not of scholarship. When challenged, the court poet supported the Sanskrit words he had used in his poem by quoting the great Sanskrit lexicographers of the past, but for his Telugu words, he only needed the approval of past usage by an earlier court poet. There was also a long and sustained effort on the part of grammarians and lexicographers to produce a set of rules and dictionaries for the Telugu used in courtly poems. None of them however had the status of the famous Sanskrit grammarians and lexicographers.[…*] #
నాకు తెలిసి మధ్యేమార్గస్తుడెవరైనా వుంటే అది గురజాడ మాత్రమే.
చివరిగా మీరు ముగింపులో ప్రస్తావించిన రెండు విషయాలపై మాత్రం యెంతైనా చర్చ జరగవలసిన అవసరం వుంది.
— శ్రీనివాస్
* V. Narayanarao, Print and Prose: Pundits, Karanams and the East India Company in the Making of Modern Telugu. In _India’s Literary History: Essays on the Nineteenth Century_, S. Blackburn (Ed). Delhi: Permanent Black. 2004. pp. 146-66.
విప్లవ్ గారు “సనాతనం” అన్న పదాన్ని “సంప్రదాయం” అన్న అర్థంలో వాడినట్టున్నారు. నేనా అర్థంలో అనలేదు, నేను దాని అసలు అర్థంలోనే వాడాను.
విప్లవ్ గారన్నట్టు నేనుదహరించిన భాగం ఏదైనా academic ప్రశ్నకి సమాధానమైతే, దానిగురించి భాషాశాస్త్రవేత్త లెవరైనా వివరిస్తే నాకు కాస్త అర్థమవుతుందేమో.
ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి patnala venkateswararao అభిప్రాయం:
06/19/2008 10:00 am
సరళమైన స్రవంతి లా సాగింది మీ ఈ కథ పూరణం. ధన్యవాదాలు.
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Nanduri Venkata Subbarao. అభిప్రాయం:
06/19/2008 6:43 am
హనుమంతరావు గారు చెప్పింది నిజమే, విశ్వనాధ గొప్పదనం చెప్పడానికి ఇంకొకరిని కించపరచాల్సిన పనిలేదు. ఎవరి గొప్ప వారిది. విశ్వనాధ గొప్పదనం చాలాతక్కువ మందికి తెలుసని బాధపదటం వేరే విషయం.
నాకు తెలిసి విశ్వనాధ శ్రీశ్రీ ని గానీ, శ్రీశ్రీ విశ్వనాధను అగౌరవపరచుకొన్నది, ఖండించినదీ లేదు. ఒకరి మహాకవిత్వాన్ని, మరొకరు మౌనంగా అంగీకరించినట్లే కనబడ్డారు. వారి గురించి మనం తగూ పడటం సరికాదు.
నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి venkat balusupati అభిప్రాయం:
06/19/2008 5:10 am
Dear kameswaRao G,
Your essay is very anylytical and worthy. This is the most incisive criticism of Telugu cinema I have ever read.
Cinema is not merely an entertainment. It has social role and responsibility. In countries like India, it can become a visual guide in educating people in certain areas. Unless and until the producers come forword to make movies with an understanding of its social impact, we may not have another golden era again. The present trend in film-making is alarming indeed.
Thank you,
Venkat
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
06/18/2008 10:55 pm
చక్కని వ్యాసం… ప్రాచీన, ఆధునిక కవిత్వాల్ని చక్కగా అనుసంధానిస్తూ రచన సాగింది. కవిత్వ మూలాలు భాషాతీతంగానే ఉన్నా, కవిత్వ భాష మీద ఇలాంటి పరిశోధనా వ్యాసాలు కవిత్వాన్ని మరింత లోతుగా అర్ధం చేసుకోడంలోనూ, రూప పరమైన క్లుప్తత సాధించడంలోనూ ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
06/18/2008 10:34 pm
లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!
మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.
విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
06/18/2008 7:59 am
నోరూరించే ఆహార పదార్థాల గురించి విశ్లేషించి వివరించే విధంగా, కవిత్వ భాష లక్షణ స్వరూపాలను చెప్పడం మాత్రమే కాక, samples గా రుచి చూపే విధంగా సోదాహరణంగా అందించడం చాలా బాగుంది. ఎంతో పరిశీలన, పరిశోధన, పరిశ్రమలతో పలు విషయాలను ఆసక్తికరంగా అందించినందుకు చాలా కృతజ్ఞతలు.
ఇటువంటి కృషి, రచనలు కవిత్వాన్ని అర్థంచేసుకోవడానికీ, మరింతగా ఆనందించడానికీ సాయపడుతాయి నిస్సందేహంగా. అయితే మంచి కవిత్వాన్ని సృష్టించడానికి మాత్రం ఇవి ఎంతగా ఉపయోగపడుతాయో సరిగ్గా తెలియదు, నాకైతే. రసాత్మకమైనదే కవిత్వం, లేదా ‘కదిలించేదే’ మంచి కవిత్వం, అని అనుకుంటే దాని రూపాలు భాషలోనే ఉన్నా, మూలాలు మాత్రం భాషను దాటగలిగే భావగతమైన హృదయస్పందన పరిధిలోనే ఎక్కువుగా ఉంటాయేమోనని అనిపిస్తుంది.
ఏదియేమైనా, ఆలోచింపజేసే పలువిషయాలను అందించిన వ్యాసమిది. ఇంకా ఇటువంటివి ఎన్నో కామేశ్వరరావుగారు మనకు అందించాలని ఆశిస్తూ,
విధేయుడు
Srinivas
గ్రామ్యాదేశ నిరసన సభ – కందుకూరి వీరేశలింగం పంతులుగారి ప్రసంగము గురించి Indrajit అభిప్రాయం:
06/18/2008 3:55 am
వ్యాసంలో వాడపల్లి శేషతల్పశాయి గారి URL తప్పుగా ఉంది. మీరు ప్రచురించింది http://www.www.andhrabharati.org. కానీ అసలైనది http://www.andhrabharati.com/. ఈ మార్పు చేయగలరు.
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:
06/17/2008 9:33 pm
కామేశ్వరరావు గారు:
ఇది మీరు 06/12/2008 నాడు రాసిన వ్యాఖ్యకు followup.
పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమన్నది ఈ వాదులాటకి ఒక catalyst లాంటిది మాత్రమే. నా దృష్టిలో యీ ఉద్యమానికి మూలకారణాలు వేరే చోటున్నాయి (ఒక ముఖ్య కారణం అచ్చుయంత్ర ప్రవేశం). మీరు మొదటి పేరాలో చెప్పిన మిగిలిన విషయాలతో అందరూ (నేనైతే) ఏకీభవిస్తారు (ను). కాకుంటే ఈ కింది వాక్యమెందుకు ప్రస్తావించారో బోధపడలేదు. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి. ఈ రెండు చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో పాల్గొన్న వ్యక్తులు/సంస్థలు (వావిళ్ళ వారినొక్కరిని మినహాయిస్తే!) కూడా వేర్వేరు అని మీకు నేను చెప్పనవసరం లేదు.
కందుకూరి మధ్య మార్గం పాటించిన మనిషిగా ఎలా చెప్తున్నారో అర్థం కాలేదు. వివరించగలరు. గురజాడ “కొత్తపాతల మేలు కలయిక” అన్నప్పుడు ఆశు (/మౌఖిక), లిఖిత సంప్రదాయాల్ని కలుపుకుంటూ అన్న అర్థంలో వాడాడు. భావకవులకు ఆశుకవిత్వం పట్ల, “గ్రాంథికం” పట్ల వున్న అయిష్టత తెలిసినదే.
అలాగే తి.వెం.కవులు గ్రాంథికవాదాన్ని తిరస్కరించారని ఏ ఆధారంతో చెప్తున్నారో కూడా నాకు బోధపడలేదు. తిరుపతిశాస్త్రి గారు జీవించి వున్న కాలంలో వారిద్దరూ “వ్యావహారిక వాదానికి” అనుకూలురు కాదు. నిజానికి చాలకాలం (అంటే జమీందారుల పోషణ పొందినంతకాలం), వారే చాలాచోట్ల చెప్పుకున్నట్లు, తెలుగంటే చిన్నచూపే (చూ: కథలు-గాథలు, మూడు భాగాలూ). వెంకటశాస్త్రి గారు చివరిరోజుల్లో కూడా “వ్యావహారికానికి” అనుకూలుణ్ణని చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ:
“నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యవహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరములు నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను “తుద కబ్బెరా తురక భాష” అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందరు నిందింతురని నక్కు తెలిసిన్నీ, నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ, ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశ్యము.” (చూ: కాశీయాత్ర, 1942)
ఏమయినా, వాళ్ళు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ, ఏ గాటానా కట్టడానికి లొంగని వ్యక్తులు :-). వాళ్ళ Cultural Biography ఎవరైనా రాయవలసిన అవసరం యెంతైనా వుంది.
సంస్కృత ప్రభావంతో “తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నదనే” భావన పండితలోకంలో చాలాకాలం బలంగా వుంది. అది చెళ్ళపిళ్ళవారి అభిప్రాయం మాత్రమే కాదు.
#[…] All Telugu courtly poets proudly proclaimed that they commanded scholarship in Sanskrit, Prakrits of different varieties, Puranas, Sastras and a host of related subjects like meter. While they composed poetry almost entirely in Telugu, they did not have to support their Telugu by texts of grammar or dictionaries: Telugu was a language of poetry, not of scholarship. When challenged, the court poet supported the Sanskrit words he had used in his poem by quoting the great Sanskrit lexicographers of the past, but for his Telugu words, he only needed the approval of past usage by an earlier court poet. There was also a long and sustained effort on the part of grammarians and lexicographers to produce a set of rules and dictionaries for the Telugu used in courtly poems. None of them however had the status of the famous Sanskrit grammarians and lexicographers.[…*] #
నాకు తెలిసి మధ్యేమార్గస్తుడెవరైనా వుంటే అది గురజాడ మాత్రమే.
చివరిగా మీరు ముగింపులో ప్రస్తావించిన రెండు విషయాలపై మాత్రం యెంతైనా చర్చ జరగవలసిన అవసరం వుంది.
— శ్రీనివాస్
* V. Narayanarao, Print and Prose: Pundits, Karanams and the East India Company in the Making of Modern Telugu. In _India’s Literary History: Essays on the Nineteenth Century_, S. Blackburn (Ed). Delhi: Permanent Black. 2004. pp. 146-66.
అతిథి వ్యయో భవ గురించి v.s.chalam అభిప్రాయం:
06/17/2008 5:29 am
Very refreshing and realistic story. Thanks to the writer.
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Kameswara Rao అభిప్రాయం:
06/17/2008 5:24 am
విప్లవ్ గారు “సనాతనం” అన్న పదాన్ని “సంప్రదాయం” అన్న అర్థంలో వాడినట్టున్నారు. నేనా అర్థంలో అనలేదు, నేను దాని అసలు అర్థంలోనే వాడాను.
విప్లవ్ గారన్నట్టు నేనుదహరించిన భాగం ఏదైనా academic ప్రశ్నకి సమాధానమైతే, దానిగురించి భాషాశాస్త్రవేత్త లెవరైనా వివరిస్తే నాకు కాస్త అర్థమవుతుందేమో.