అపారమైన తెలుగు సాహిత్య చరిత్రలో కొద్దిమంది కవులు ,బహుశా ఒక కవయిత్రి పేరు మాత్రమే ప్రసిద్ధి కెక్కాయి. కవిత్రయము,పోతన,శ్రీనాధుడు,అష్టదిగ్గజములు,మొల్ల పూర్వకవులలో ఆ అదృష్టమునకు నోచుకొన్నారు. వైయాకరుణులు పోతన కవిత్వంలో కూడా బోలెడు దోషాలు పట్టారు. నన్నయ, తిక్కనల భాషలో కూడా తప్పులు పట్టి ‘ఆర్యదోషంబు గ్రాహ్యంబు’ అని ఓ వ్యాకరణ సూత్రము తగిలించారు. అందుచేత కవయిత్రి మొల్లను స్త్రీ అనో అగ్రకులమునకు చెందక ఫొవటము వలననో ఆ కాలపు పెద్దలు గౌరవించ లేదని చెప్పడము భావ్యము కాదేమో. అది నిజమయితే అగ్రకులస్థులే ఎక్కువగా సాహిత్య పఠనం చేస్తున్న కాలంలో ఆవిడకు ఆ ఖ్యాతి ఎలా వచ్చింది?
మొల్ల సహజ కవయిత్రి. భాషాధ్యయనము చేయలేదని, ఈశ్వర ప్రసాదముచే కవిత్వము వచ్చినదని ఆవిడ చెప్పారు. నిఘంటువు అవసరము ఎక్కువగా లేని రీతిలో తేనెసోకునటుల తియ్యని మాటలతో కవిత్వము వ్రాసారు. రాజుల వర్ణన బాగుంది. కాని నన్ను ఆకట్టుకొన్న పద్యము
శ్రీరాముడు శివధనస్సు ఎత్తుతుంటే భూకంపము రాకుండా చూడమని లక్ష్మణుడు చెప్పిన పద్యము నాకు నచ్చినది. (మూడవ పాదములో యతి కలసి నట్లు లేదు. పెద్దలు వివరించ గలరు. మనకు నచ్చినప్పుడు యతి కలవక పోతే యేమి ? )
వేలూరి వారికి నమస్కారాలు
తిలక్ తో మీకు ఉండిన పరిచయం గురించి మీరు రాసింది చదివి ఆనందించాను . ఆంద్ర విశ్వ కళా పరిషత్ రూపు రేఖలు మారి పోయి చాలా కాలమయ్యింది యూనివెర్సిటీ ల సంఖ్య పెరిగి ఒకప్పటి ఆంద్ర విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్ర విశ్వవిద్యాలయమయి ఉత్తరాంధ్ర లో మరో యూనివెర్సిటీ రావడం తో ఉత్త ఆంద్ర విశ్వ విద్యాలయం అయింది
. తః తః
‘శ్రీరంగం శ్రీనివాసరావు’ అనే పెద్ద కొండని చిన్న అద్దంలో చూపించడమే ‘శ్రీశ్రీ’ అంటే- అని రచన పత్రికలో అన్నాను. అలా అలరించిన పేర్లే వపా ,కొకు, పాప, సినారె, చాసో, భకారా, భరాగో లాంటివి. మరో రకం- గోరా శాస్త్రి, ద్వానా శాస్త్రి, కవన శర్మ వగైరా. ఇక భాగవతుల శంకర శాస్త్రి, కిళాంబి నరసింహాచార్యులు, సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే అసలు పేర్ల కంటే కలం పేర్లే బాగా వర్ధిల్లాయి. సినిమా హిట్టయితే కొత్త ఇంటి పేర్లు వస్తాయి, సిరివెన్నెల, అల్లరి- వంటివి. బిరుదులు వస్తే ఇక అసలు పేర్లతో పనే లేదు, కవి సామ్రాట్, నట సామ్రాట్, నట రత్న అటువంటివి. విష్ణువుకి వేయి నామాలు కదా, మనుషులు ముచ్చటగా మరో పేరు పెట్టుకొని ఆనందిస్తే –పోనీ లెండి.
-డా. తాతిరాజు వేణుగోపాల్
తిలక్ లో కృష్ణ శాస్త్రి + శ్రీ శ్రీ ఉన్నారు. వేటూరి సుందర రామ మూర్తి లో అందరూ ఉన్నారు. తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలు’ అని అంటే వేటూరి వారు ‘ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం, అందులోని ప్రతి అక్షరం అందమైన నక్షత్రం’ అనగలిగారు. ఇప్పుడు వీరెవ్వరూ లేరు. వారి మాటలూ,పాటలే ఉన్నాయి.
-డా. తాతిరాజు వేణుగోపాల్
|
వహించడం అంటే మోయడం (to carry, to bear). “శిరసా వహించడం” అన్నది మనకి తెలుసున్న మాటే. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు” అంటే ప్రజాశక్తులను మోసే (తమపైకి ఎత్తకుని ఊరేగించే) విజయ ఐరావతాలని అర్థం చక్కగా ఉంది కదా! ఆవహించడాలు, అధిరోహించడాలు ఎందుకు?
నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:
09/05/2010 7:38 pm
అపారమైన తెలుగు సాహిత్య చరిత్రలో కొద్దిమంది కవులు ,బహుశా ఒక కవయిత్రి పేరు మాత్రమే ప్రసిద్ధి కెక్కాయి. కవిత్రయము,పోతన,శ్రీనాధుడు,అష్టదిగ్గజములు,మొల్ల పూర్వకవులలో ఆ అదృష్టమునకు నోచుకొన్నారు. వైయాకరుణులు పోతన కవిత్వంలో కూడా బోలెడు దోషాలు పట్టారు. నన్నయ, తిక్కనల భాషలో కూడా తప్పులు పట్టి ‘ఆర్యదోషంబు గ్రాహ్యంబు’ అని ఓ వ్యాకరణ సూత్రము తగిలించారు. అందుచేత కవయిత్రి మొల్లను స్త్రీ అనో అగ్రకులమునకు చెందక ఫొవటము వలననో ఆ కాలపు పెద్దలు గౌరవించ లేదని చెప్పడము భావ్యము కాదేమో. అది నిజమయితే అగ్రకులస్థులే ఎక్కువగా సాహిత్య పఠనం చేస్తున్న కాలంలో ఆవిడకు ఆ ఖ్యాతి ఎలా వచ్చింది?
మొల్ల సహజ కవయిత్రి. భాషాధ్యయనము చేయలేదని, ఈశ్వర ప్రసాదముచే కవిత్వము వచ్చినదని ఆవిడ చెప్పారు. నిఘంటువు అవసరము ఎక్కువగా లేని రీతిలో తేనెసోకునటుల తియ్యని మాటలతో కవిత్వము వ్రాసారు. రాజుల వర్ణన బాగుంది. కాని నన్ను ఆకట్టుకొన్న పద్యము
చం. కదలకుమీ ధరాతలమ, కాశ్యపి బట్టు ఫణీంద్ర ,భూవిషా
స్పదులను బట్టు కూర్మమ ,రసాతల,భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి, ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచు బట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కెడిన్ .
శ్రీరాముడు శివధనస్సు ఎత్తుతుంటే భూకంపము రాకుండా చూడమని లక్ష్మణుడు చెప్పిన పద్యము నాకు నచ్చినది. (మూడవ పాదములో యతి కలసి నట్లు లేదు. పెద్దలు వివరించ గలరు. మనకు నచ్చినప్పుడు యతి కలవక పోతే యేమి ? )
శతకందసౌరభము: పరిచయం గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:
09/05/2010 3:15 pm
కందము పద్యము లందున
అందము నెంతైన గలదు నాస్వాదింపన్
ఎందున గని విని యెఱుగము
అందఱి నానంద పఱచు నది మకరందమ్ .
కృష్ణమోహన రావు గారి కంద పద్యాలు బాగున్నాయి.
పూల పల్లకి గురించి రఘువీర్ అభిప్రాయం:
09/05/2010 12:14 pm
చాలా బాగుంది.రచయిత ఆ అమ్మాయిని సృష్టించి ఆమె మనసులోకి దూరి రాశాడా అనిపించింది.
తిలక్ తో నా పరిచయం గురించి tahataha అభిప్రాయం:
09/04/2010 4:56 pm
వేలూరి వారికి నమస్కారాలు
తిలక్ తో మీకు ఉండిన పరిచయం గురించి మీరు రాసింది చదివి ఆనందించాను . ఆంద్ర విశ్వ కళా పరిషత్ రూపు రేఖలు మారి పోయి చాలా కాలమయ్యింది యూనివెర్సిటీ ల సంఖ్య పెరిగి ఒకప్పటి ఆంద్ర విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్ర విశ్వవిద్యాలయమయి ఉత్తరాంధ్ర లో మరో యూనివెర్సిటీ రావడం తో ఉత్త ఆంద్ర విశ్వ విద్యాలయం అయింది
. తః తః
మారుపేర్ల మాయువు గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:
09/04/2010 10:51 am
‘శ్రీరంగం శ్రీనివాసరావు’ అనే పెద్ద కొండని చిన్న అద్దంలో చూపించడమే ‘శ్రీశ్రీ’ అంటే- అని రచన పత్రికలో అన్నాను. అలా అలరించిన పేర్లే వపా ,కొకు, పాప, సినారె, చాసో, భకారా, భరాగో లాంటివి. మరో రకం- గోరా శాస్త్రి, ద్వానా శాస్త్రి, కవన శర్మ వగైరా. ఇక భాగవతుల శంకర శాస్త్రి, కిళాంబి నరసింహాచార్యులు, సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే అసలు పేర్ల కంటే కలం పేర్లే బాగా వర్ధిల్లాయి. సినిమా హిట్టయితే కొత్త ఇంటి పేర్లు వస్తాయి, సిరివెన్నెల, అల్లరి- వంటివి. బిరుదులు వస్తే ఇక అసలు పేర్లతో పనే లేదు, కవి సామ్రాట్, నట సామ్రాట్, నట రత్న అటువంటివి. విష్ణువుకి వేయి నామాలు కదా, మనుషులు ముచ్చటగా మరో పేరు పెట్టుకొని ఆనందిస్తే –పోనీ లెండి.
-డా. తాతిరాజు వేణుగోపాల్
కవితా సుమశరుడు తిలక్ గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:
09/04/2010 10:00 am
సారీ… తిలక్ ‘అమ్మాయిలు’ అన లేదు, ‘ఆడ పిల్లలు’ , అన్నారు.
నా అభిప్రాయం లో ఓ చిన్న సవరణ.
-డా. తాతిరాజు వేణుగోపాల్
కవితా సుమశరుడు తిలక్ గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:
09/03/2010 12:09 pm
తిలక్ లో కృష్ణ శాస్త్రి + శ్రీ శ్రీ ఉన్నారు. వేటూరి సుందర రామ మూర్తి లో అందరూ ఉన్నారు. తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలు’ అని అంటే వేటూరి వారు ‘ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం, అందులోని ప్రతి అక్షరం అందమైన నక్షత్రం’ అనగలిగారు. ఇప్పుడు వీరెవ్వరూ లేరు. వారి మాటలూ,పాటలే ఉన్నాయి.
-డా. తాతిరాజు వేణుగోపాల్
|
బందీ గురించి Jagannatha Rao అభిప్రాయం:
09/03/2010 7:42 am
బందీ కవితలో నింద మిషతో స్తుతించడం బాగుంది. ఇది వ్యాజ స్తుత్యలంకారం.
తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Kameswara Rao అభిప్రాయం:
09/03/2010 4:42 am
వహించడం అంటే మోయడం (to carry, to bear). “శిరసా వహించడం” అన్నది మనకి తెలుసున్న మాటే. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు” అంటే ప్రజాశక్తులను మోసే (తమపైకి ఎత్తకుని ఊరేగించే) విజయ ఐరావతాలని అర్థం చక్కగా ఉంది కదా! ఆవహించడాలు, అధిరోహించడాలు ఎందుకు?
[నిజమే! మియా కల్పా! మీకు కృతజ్ఞతలు – సం]
మారుపేర్ల మాయువు గురించి subbarao అభిప్రాయం:
09/03/2010 1:05 am
చాలా మంచి ఒపినియన్.