Nachana Somana is my favourite poet and you have done justice to the poet.The author must have read the debates between Rallapalli Anathakrishnasarma and Nadakuduti Veeraraju and many others on who is greater, Somana or Errana. Sri Rallapalli compared Somana to Kotha Aavakaya which gives taste only in the beginning.Still, all love Avakaya.
The article is excellent
Palanki Sathya
చిన్న నాటి సంగతులు గుర్తు చేసారు. కృతజ్ఞతలు. తరవాణి అన్నంలో ఆవకాయ వేసుకుని ఎర్రగా కలుపుకుని తినేవాళ్ళం. రోజూ పొద్దుట బడికి వెళ్ళేముందు ఇదే తిని వెళ్ళేవాళ్ళం. ఇపుడు మా పిల్లలకి తరవాణి అంటే ఏంటో తెలియదు. చెప్పినా, నన్ను పల్లెటూరు దాన్ని అని అంటారు. ఆ రుచి వాళ్ళకి తెలియదు కదా! మంచి విషయాలు చెప్పారు.
రోజు మిగిలిన ‘రసం’ ని ఒక కుండలో మూడు, నాలుగు రోజులపాటు చేర్చి తరువాత దాన్ని అన్నంలో కలుపుకుని తమిళ బ్రాహ్మలు తింటారు అని తెలిసినప్పుడు ఒకింత ఆశ్చర్యం వేసింది.
ద్రవ పదార్ధం పేరు తెలియకుండా ఒక రోజు వారింట్లో భోజనం చేస్తున్నప్పుడు దాన్ని అస్వాదించడం జరిగిన తరువాత అది ఆ ‘రసం’ అని తెలిసినప్పుడు “నిజమా, బాగానే ఉందిగా”అని అనుకోక తప్పలేదు.
అది వారి ‘తరవాణి’ నా? ఏమో, పేరు గుర్తులేదు.
మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు భిక్ష ఇవ్వడం ఒక పద్దతి. కాని ఆ మిగిలిన అన్నాన్ని ఎండ బెట్టి, వేయించి, దానికి కొంచెం ఉప్పు కారం జల్లి తింటే రుచిగా ఉంటుందన్నది తెలంగాణ వెళ్ళినప్పుడు తెలిసింది.
బహుశ అదేనేమో cultural preservation లేదా cultural evolution అంటే!
రమగారికి రవిగారికి ధన్యవాదాలు.
రమగారు,
మీరు చెప్పిన “ముక్తాఫల” వ్యాఖ్యలో కొన్ని భాగాలు Digital Libraryలో ఉన్నాయి చూసాను. కాని కొన్ని చోట్ల తప్పులున్నాయి. అంచేత అది ఎంతవరకూ సాధికారికమైనదో తెలీదు. మీరన్న జయప్రభగారి కవిత నేను చదవలేదు. ఆ పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
రవిగారు,
మీరన్న ఆ రెండు పద్యాలు ఇవి:
సోమనది:
ఏది ఎక్కువ భావస్ఫోరకమూ అని చెప్పడం కష్టం (అనవసరం కూడా). దేని ప్రత్యేకత దానికుంది. సోమన పద్యంలోని ప్రత్యేకతంతా “చూచుకములందు మందార కేసరమాలా మకరందపు నీటి బొట్లు స్రవించడం”లో ఉంది. దాన్ని చిత్రించడంలో సోమన ఉద్దేశం ఏమిటన్నది పాఠకులెవరికి వారు ఊహించుకోవలసిందే.
పోతన పద్యం చిత్రాన్ని స్పష్టంగా రూపుకడుతుంది. రోషము – రాగోదయమూ, అవిరత భ్రూకుటి – మందహాసము, కెంపు – సొంపు ఇలా వీర శృంగార రసాలు స్పష్టమైన జంటగా కనిపిస్తాయి. పైగా వాచ్యంగా కూడా కనిపిస్తాయి. సోమన పద్యంలో అది లీలగా మాత్రమే గోచరిస్తుంది. “సరసాలోక సమూహము” కన్నా “దరహాసామృతపూరము” నాకు అందంగా అనిపించింది. సోమన సత్యభామ పయ్యెదని ఒకింత తొలగించాడు, పోతన ఆ పని చెయ్యలేదు. ఈ ఒకింత తొలగిన పయ్యెదని కృష్ణుడా తర్వాత సరిజేస్తాడు. ఆ పద్యం వ్యాసంలో పేర్కొన్నాను. వ్యాసంలో చెప్పినట్టుగా, సోమన ఈ ఘట్టంలో శృంగార రసాన్నే ఎక్కువగా ధ్వనించాడు అని నాకనిపిస్తుంది. పోతన రెంటినీ సమానంగా పోషించాడు.
సత్యభామ యుద్ధానికి లేచి నిలుచున్న తీరుని వర్ణించిన యీ పోతన పద్యం చక్కని చలనచిత్రాన్ని మన కళ్ళకి కట్టిస్తుంది.
పోతన భాగవతంలో సత్యభామ కృష్ణుని యుద్ధానికి తీసుకువెళ్ళమని మురిపెంగా అడుగుతుంది. కృష్ణుడు ముందు వారించినా చివరికి తన మాట చెల్లించుకుంటుంది. అది యీ కథలో పోతన ప్రవేశపెట్టిన అందం.
లక్ష్మన్న గారి కృషి ప్రశంసనీయము. చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. అయితే… ఒక్క విషయం మనవి చేస్తాను. ” శృతి ” అనే పదము ఇక్కడ వాడకూడదు. ” శ్రుతి ” అని నా అభిప్రాయము. ” చతుశ్శ్రుతి ఋషభము ” సరియైనదని నా అభిప్రాయము.
జున్ను తింటున్నట్లుగా ఉంది ఈ వ్యాసం చదువుతుంటే. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టారు.
“అరి జూచున్ హరిజూచు జూచుకములందంద మందారమాలా..” ఈ పద్యం ఉత్తర హరివంశం లోనిదేనా? పోతన భాగవతం పీఠికలో ఓ చోట ఈ పద్యస్ఫూర్తితో పోతన “పరు జూచున్ వరు జూచు..” అన్న పద్యం రాశాడనీ, అయితే మొదటి పద్యానికంటేనూ రెండవ పద్యం భావస్ఫోరకమైనదని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న గుర్తు.
అనవసరమైన sarcasm విమర్శ పరిధిని సంకుచితం చేస్తుంది. అది నాగరిక లక్షణం కాలేదు. బ్రహ్మానందం గారి వ్యాసం మీద మీ వెక్కిరింతలో అభిరుచి లోపించింది. మనకన్నా భిన్నమైన దృష్టికోణం ఉండటంలో ఎదుటివారి విషయంలో అంత అసహనమా !!
బ్రహ్మానందం గారి నించి మీరాశించిన మరిన్ని విషయాలని రాయమని మీరు కోరవచ్చు, అందులో తప్పులేదు. లేదా ఆయన రాసేదాకా మీరు కాస్త ఆగి చూడొచ్చు. అదీకాదూ బ్రహ్మానందం గారు రాయని విషయాల మీద వేరే
మరెవ్వరైనా రాయొచ్చు. అంతేగాని ఆయన రాసిన విషయాలు పస లేనివన్నట్టుగా మీరు వ్యంగ్యాలు రాస్తే అది మరి మీరే చెప్పుకున్న ట్టుగా మీ విద్యార్హతనే సూచిస్తోంది.
అసలు త్యాగరాజు గురించి మనకి ఏపాటి తెలుసు గనక? నా వరకు నాకు త్యాగయ్య గారి వ్యక్తిత్వ విశేషాలని తెలుసుకోగల్గటం ఆసక్తిదాయకమే ! ఇది ఒక అదనపు సమాచారమే ! త్యాగయ్య సంగీతం ఎంత ముఖ్యమో త్యాగయ్య వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యం కాదా?? ఆ రెంటికీ ఏమైనా అవినాభావ సంబంధం ఉందేమో అన్న కుతూహలమే మీకు కలగలేదే ? ఆశ్చర్యం !
జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి sathya అభిప్రాయం:
01/14/2009 5:51 am
Nachana Somana is my favourite poet and you have done justice to the poet.The author must have read the debates between Rallapalli Anathakrishnasarma and Nadakuduti Veeraraju and many others on who is greater, Somana or Errana. Sri Rallapalli compared Somana to Kotha Aavakaya which gives taste only in the beginning.Still, all love Avakaya.
The article is excellent
Palanki Sathya
తరవాణి కేంద్రం గురించి veda అభిప్రాయం:
01/13/2009 9:29 am
చిన్న నాటి సంగతులు గుర్తు చేసారు. కృతజ్ఞతలు. తరవాణి అన్నంలో ఆవకాయ వేసుకుని ఎర్రగా కలుపుకుని తినేవాళ్ళం. రోజూ పొద్దుట బడికి వెళ్ళేముందు ఇదే తిని వెళ్ళేవాళ్ళం. ఇపుడు మా పిల్లలకి తరవాణి అంటే ఏంటో తెలియదు. చెప్పినా, నన్ను పల్లెటూరు దాన్ని అని అంటారు. ఆ రుచి వాళ్ళకి తెలియదు కదా! మంచి విషయాలు చెప్పారు.
తరవాణి కేంద్రం గురించి నెటిజన్ అభిప్రాయం:
01/13/2009 7:03 am
రోజు మిగిలిన ‘రసం’ ని ఒక కుండలో మూడు, నాలుగు రోజులపాటు చేర్చి తరువాత దాన్ని అన్నంలో కలుపుకుని తమిళ బ్రాహ్మలు తింటారు అని తెలిసినప్పుడు ఒకింత ఆశ్చర్యం వేసింది.
ద్రవ పదార్ధం పేరు తెలియకుండా ఒక రోజు వారింట్లో భోజనం చేస్తున్నప్పుడు దాన్ని అస్వాదించడం జరిగిన తరువాత అది ఆ ‘రసం’ అని తెలిసినప్పుడు “నిజమా, బాగానే ఉందిగా”అని అనుకోక తప్పలేదు.
అది వారి ‘తరవాణి’ నా? ఏమో, పేరు గుర్తులేదు.
మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు భిక్ష ఇవ్వడం ఒక పద్దతి. కాని ఆ మిగిలిన అన్నాన్ని ఎండ బెట్టి, వేయించి, దానికి కొంచెం ఉప్పు కారం జల్లి తింటే రుచిగా ఉంటుందన్నది తెలంగాణ వెళ్ళినప్పుడు తెలిసింది.
బహుశ అదేనేమో cultural preservation లేదా cultural evolution అంటే!
జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి Kameswara Rao అభిప్రాయం:
01/13/2009 3:13 am
రమగారికి రవిగారికి ధన్యవాదాలు.
రమగారు,
మీరు చెప్పిన “ముక్తాఫల” వ్యాఖ్యలో కొన్ని భాగాలు Digital Libraryలో ఉన్నాయి చూసాను. కాని కొన్ని చోట్ల తప్పులున్నాయి. అంచేత అది ఎంతవరకూ సాధికారికమైనదో తెలీదు. మీరన్న జయప్రభగారి కవిత నేను చదవలేదు. ఆ పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
రవిగారు,
మీరన్న ఆ రెండు పద్యాలు ఇవి:
సోమనది:
అరిజూచున్ హరిజూచు జూచుకములందందంద మందార కే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై
తొరుగం, బయ్యెదకొం గొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్
పోతనది:
పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్ గన్నుల గెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచున్ జంద్రాస్య హేలాగతిన్
ఏది ఎక్కువ భావస్ఫోరకమూ అని చెప్పడం కష్టం (అనవసరం కూడా). దేని ప్రత్యేకత దానికుంది. సోమన పద్యంలోని ప్రత్యేకతంతా “చూచుకములందు మందార కేసరమాలా మకరందపు నీటి బొట్లు స్రవించడం”లో ఉంది. దాన్ని చిత్రించడంలో సోమన ఉద్దేశం ఏమిటన్నది పాఠకులెవరికి వారు ఊహించుకోవలసిందే.
పోతన పద్యం చిత్రాన్ని స్పష్టంగా రూపుకడుతుంది. రోషము – రాగోదయమూ, అవిరత భ్రూకుటి – మందహాసము, కెంపు – సొంపు ఇలా వీర శృంగార రసాలు స్పష్టమైన జంటగా కనిపిస్తాయి. పైగా వాచ్యంగా కూడా కనిపిస్తాయి. సోమన పద్యంలో అది లీలగా మాత్రమే గోచరిస్తుంది. “సరసాలోక సమూహము” కన్నా “దరహాసామృతపూరము” నాకు అందంగా అనిపించింది. సోమన సత్యభామ పయ్యెదని ఒకింత తొలగించాడు, పోతన ఆ పని చెయ్యలేదు. ఈ ఒకింత తొలగిన పయ్యెదని కృష్ణుడా తర్వాత సరిజేస్తాడు. ఆ పద్యం వ్యాసంలో పేర్కొన్నాను. వ్యాసంలో చెప్పినట్టుగా, సోమన ఈ ఘట్టంలో శృంగార రసాన్నే ఎక్కువగా ధ్వనించాడు అని నాకనిపిస్తుంది. పోతన రెంటినీ సమానంగా పోషించాడు.
సత్యభామ యుద్ధానికి లేచి నిలుచున్న తీరుని వర్ణించిన యీ పోతన పద్యం చక్కని చలనచిత్రాన్ని మన కళ్ళకి కట్టిస్తుంది.
వేణిం జొల్లెము వెట్టి, సంఘటిత నీవీబంధయై, భూషణ
శ్రేణిం దాల్చి, ముఖేందుమండల మరీచీజాలముల్ పర్వగా,
బాణిం బయ్యెద జక్కగా దుఱిమి, శుంభద్వీర సంరంభ యై
యేణీలోచన లేచి నిల్చె దన ప్రాణేశాగ్ర భాగంబునన్
పోతన భాగవతంలో సత్యభామ కృష్ణుని యుద్ధానికి తీసుకువెళ్ళమని మురిపెంగా అడుగుతుంది. కృష్ణుడు ముందు వారించినా చివరికి తన మాట చెల్లించుకుంటుంది. అది యీ కథలో పోతన ప్రవేశపెట్టిన అందం.
రాగలహరి: మోహనం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
01/12/2009 5:05 pm
హరి గారూ:
మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం.
నాకు ఇప్పటకీ ‘శృతి’ ‘శ్రుతి’ ల మధ్య తేడా తెలియదు. నా ముఖ్యలక్ష్యం సంగీతం. పలికేటప్పుడు రెంటినీ ఒకేలా అంటాం కదా!
వ్యాసం నచ్చినందుకు ఆనందంతో,
లక్ష్మన్న
రాగలహరి: మోహనం గురించి Pavan Kumar Hari అభిప్రాయం:
01/12/2009 3:39 am
లక్ష్మన్న గారి కృషి ప్రశంసనీయము. చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. అయితే… ఒక్క విషయం మనవి చేస్తాను. ” శృతి ” అనే పదము ఇక్కడ వాడకూడదు. ” శ్రుతి ” అని నా అభిప్రాయము. ” చతుశ్శ్రుతి ఋషభము ” సరియైనదని నా అభిప్రాయము.
జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి రవి అభిప్రాయం:
01/12/2009 3:16 am
జున్ను తింటున్నట్లుగా ఉంది ఈ వ్యాసం చదువుతుంటే. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టారు.
“అరి జూచున్ హరిజూచు జూచుకములందంద మందారమాలా..” ఈ పద్యం ఉత్తర హరివంశం లోనిదేనా? పోతన భాగవతం పీఠికలో ఓ చోట ఈ పద్యస్ఫూర్తితో పోతన “పరు జూచున్ వరు జూచు..” అన్న పద్యం రాశాడనీ, అయితే మొదటి పద్యానికంటేనూ రెండవ పద్యం భావస్ఫోరకమైనదని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న గుర్తు.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి rama అభిప్రాయం:
01/11/2009 6:19 am
క్రిష్నమోహన్ గారూ !
అనవసరమైన sarcasm విమర్శ పరిధిని సంకుచితం చేస్తుంది. అది నాగరిక లక్షణం కాలేదు. బ్రహ్మానందం గారి వ్యాసం మీద మీ వెక్కిరింతలో అభిరుచి లోపించింది. మనకన్నా భిన్నమైన దృష్టికోణం ఉండటంలో ఎదుటివారి విషయంలో అంత అసహనమా !!
బ్రహ్మానందం గారి నించి మీరాశించిన మరిన్ని విషయాలని రాయమని మీరు కోరవచ్చు, అందులో తప్పులేదు. లేదా ఆయన రాసేదాకా మీరు కాస్త ఆగి చూడొచ్చు. అదీకాదూ బ్రహ్మానందం గారు రాయని విషయాల మీద వేరే
మరెవ్వరైనా రాయొచ్చు. అంతేగాని ఆయన రాసిన విషయాలు పస లేనివన్నట్టుగా మీరు వ్యంగ్యాలు రాస్తే అది మరి మీరే చెప్పుకున్న ట్టుగా మీ విద్యార్హతనే సూచిస్తోంది.
అసలు త్యాగరాజు గురించి మనకి ఏపాటి తెలుసు గనక? నా వరకు నాకు త్యాగయ్య గారి వ్యక్తిత్వ విశేషాలని తెలుసుకోగల్గటం ఆసక్తిదాయకమే ! ఇది ఒక అదనపు సమాచారమే ! త్యాగయ్య సంగీతం ఎంత ముఖ్యమో త్యాగయ్య వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యం కాదా?? ఆ రెంటికీ ఏమైనా అవినాభావ సంబంధం ఉందేమో అన్న కుతూహలమే మీకు కలగలేదే ? ఆశ్చర్యం !
రమ.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
01/10/2009 10:57 pm
చివుకుల కృష్ణ మోహన్ అని పేరుండాలి. పొరపాటున చంద్ర మోహన్ గా రాసాను. క్షమించాలి.
కొండ నుంచి కడలి దాకా గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:
01/10/2009 10:54 pm
“కృష్ణశ్రీ”గారి సంపాదకత్వంలో 1956లో ప్రచురితమైన “పల్లెపదాలు” నుంచి
వేదమువారి పడవ పాటలు ఎవరివద్దనన్నా ఉంటే తెలుప ప్రార్థన.
శాయి.