మీ వ్యక్తిగత అభిప్రాయం లోనూ మీ గొంతు biased గానే విన్పిస్తోంది. మీరు కవుల విషయంలో “లిఖిత” విమర్శనీ, కవయిత్రుల సమాచారానికైతే మాత్రం వెతుక్కుని ఇవాళ భావకవిత్వం తెలిసిన వారినించీ “మౌఖిక”మైన సంగతులనీ సేకరించుకోవచ్చుననీ సలహా ఇవ్వడం ఆశ్చర్యమే! ఫలానా పుస్తకం అంటే ఎవరైనా సేకరించుకోవచ్చు, కానీ ఫలానా తరం వాళ్ళని కలుసుకుని విషయాలని సేకరించుకోమని అనడం ఏమిటో? ఇక్కడ నేను ప్రస్తావించిన అంశం ఒకటే. స్త్రీల సాహిత్యం మీద విమర్శ చాలా తక్కువ అన్న ది. నేను బంగారమ్మ గారి సాహిత్య విశ్లేషణలో జరిగిన జాప్యాన్ని గురించి మాట్లాడేను. స్త్రీల సాహిత్యం పై విమర్శ లోని అసమగ్రత, నా అభిప్రాయం. వారి వ్యక్తిగతాలు కాదు. శ్రీశ్రీ ఎందుకు ప్రస్తావించ లేదన్నది “మౌఖిక” చరిత్ర ద్వారా సేకరించు కోవడం మీద నాకు సమ్మతీ లేదు. ఆసక్తీ లేదు. అది స్త్రీల సాహిత్య విమర్శని సృష్టించదు. స్త్రీల సాహిత్యాన్ని పక్కకు నెట్టి స్త్రీల జీవితాన్ని gossip గా మాట్లాడుకుందికి బహుశా ఉపయోగపడొచ్చు. దాని వల్ల స్త్రీల సాహిత్యానికి మరింత నష్టం తప్ప మేలు లేదు. కవుల విషయంలో అక్షరాన్నీ, కవయిత్రుల విషయంలో మాత్రం జీవితాన్నీ గుర్తించే ఈ “మౌఖిక” విమర్శ అన్న సూచన వెనక ఉన్న ప్రమాదం ఇదీ! దీని వల్ల ఎవరికి లాభమో నేను వేరే వివరించి చెప్పనఖ్ఖర లేదు.
I don’t want to comment on the alleged bias towards women writers, nor on lack of literary criticism in modern Telugu literature. However I believe that an issue is made, unnecessarily I may add. If any bias were made towards Bangaramma its definitely not because she is woman. Fact is that even in 20th century we have more oral history (and lit. criticism) than written one. There are reasons why Bangaramma’s name is not mentioned even today. If you are curious, go and talk to people who are well acquainted with భావకవిత్వం period, and there are still a few around. It has nothing to do with the quality of her poetry but her personal life. I don’t want to go into details here. On that note we never talk about why ko.ku disliked Chalam, or all those unwritten verses of Devulapalli, or all those literary happenings of 1920s, 30s and 40s.
నాది బాధ మాత్రమే ! అభిశంసన కాదు. మీకు నా ఆరోపణ సవ్యం గానే అర్ధమయింది. thank you. మీ భార్యగారికి వచ్చిన సందేహం ఇన్నేళ్ళలోనూ ఈ తెలుగు సాహిత్యలోకంలో ఒక్క విమర్శకుడికీ రానేలేదే? మరి ఇది ఆలోచించ వలసిన విషయం కాదా? ఒకనాటికి స్త్రీలీ ప్రశ్నలేయగలరని పురుషసాహిత్యలోకం ఊహించలేదు. మీ వివరణ లోనే శ్రీశ్రీ చూపించిన నిర్లక్ష్యం గురించి ఉంది.ఆనాటి వారికే కాదు..ఇవాళ్టికీ చాలా మందికి స్త్రీల గురించి చెప్పాలంటే ఎందుకో మరి మనసు రాదుస్మండీ !! అందునా మంచి సంగతులు చెప్పడానికి అసలే రాదు. కావాలంటే తెలుగు విమర్శ ని ఒకసారి పరికించి చూడండి మీరే! సరి అయిన దృష్టి కోణం తో..స్త్రీల రచనలని ఇంకా బేరీజు వేయగల స్థితి ఈనాటికీ ఇంకా లేదు. సాహిత్య పరంగా చాలా నష్టం ఇది.
మోహనరావు గారూ…ప్రస్తావన చేయడం …విశ్లేషణ చేయడం రెండూవేర్వేరు. రెండో దాని పరంగా మీ వ్యాసం బలమైంది కాదని మీకే తెలియగలదు మరోసారి చదువుకుని చూడండి. మీరు”ముగురమ్మల్ని గురించి ప్రస్తావనే చేసారు…వారి కవితా విశ్లేషణ కాదు. విమర్శ పరిధి వేరు. దాని దిశ వేరు. తెలుగులో సృజనాత్మక సాహత్యం వృధ్ధి పొందింది..కానీ విమర్శ ఏదీ?
నేను మాట్లాడుతున్న అంశం ఇదీ! ఎవరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి…అదీ ముఖ్యం.
మీ అభిమానానికి కృతజ్ఞతలు. భావి తరాల గురించి ప్రస్తావించారు కనుక:
మా ఊరు, రావినూతల, వెళ్ళినపుడల్లా, హైస్కూలు కెళ్ళడం, టీచర్లని కలవడం, పిల్లలనుద్దేశించి ప్రసంగించడం, నా పర్యటనలో ఓ ముఖ్యమైన నాకు చాలా ఇష్టమైన భాగం. నేను ఇండియా వెళ్ళి మొన్ననే తిరిగివచ్చాను. ఆ అనుభవం గురించి, చదువుకి సంబంధించి, ఓ వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.
1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడు” కవితని వేలూరి చవకరకం జిన్ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.
మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]
మీ వ్యాఖ్య చదివి, హమ్మయ్య, ఒక్కరైనా నా వ్యాసం చదివారు, శ్రమ నిరర్థకం కాలేదు, అన్న సంతోషం కలిగింది.
వాస్తవానికి, నేనీ వ్యాసం ముగించి, గత శతాబ్దంలో గణితశాస్త్రంలో వచ్చిన మూడు విపత్తులని సగటు పాఠకునికి వివరించడంలో విఫలమయ్యాననే నాకు నేను బేరీజు వేసుకున్నాను. మరీ మిక్కిలి అమూర్త (abstract) విషయాలని వివరించడంలో కలిగే చిక్కులు నాకెక్కువే ఎదురయ్యాయి. అయినా దీని వలన కొంత మేలు జరిగిందనీ, ముందు ముందు మీలాంటి వారెవరైనా ఇంకా సరళంగా చెప్పగలరనీ ఆశ.
మీరు ప్రస్తావించిన పుస్తకం నేను చదవలేదు కాని చదవదగ్గదిలా ఉంది. అందరూ మీరిచ్చిన లింకులోని పరిచయం అన్నా చదువుతారని ఆశిస్తాను. నేనీ వ్యాసం రాసే సమయంలోనే, గణితంలో నోబెల్ బహుమతి లేదని తెలిసి ఒకరు నా ముందర విస్మయపడితే, ఆమాత్రం తెలియని ఇంజనీర్లు ఉన్నారా అనుకొని అవాక్కయ్యాను.
శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.
రమ గారికి,
మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.
బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.
జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.
[2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.
రమగారూ, అందరూ బంగారమ్మలాటి కవయిత్రులను మరచిపోలేదు. నేను రాసిన జూలై నెల ఈమాటలోని వ్యాసంలో “ముగురమ్మలను” పేర్కొన్నాను. వారు విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని గారలు. వారి కవితలను కూడా ఉదహరించాను. బంగారమ్మ కవితలు శాయిగారి సైటులో కూడా ఉన్నవి.
విధేయుడు – మోహన
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj అభిప్రాయం:
01/27/2009 9:33 pm
శ్రీనివాస్ గారూ,
మీ వ్యక్తిగత అభిప్రాయం లోనూ మీ గొంతు biased గానే విన్పిస్తోంది. మీరు కవుల విషయంలో “లిఖిత” విమర్శనీ, కవయిత్రుల సమాచారానికైతే మాత్రం వెతుక్కుని ఇవాళ భావకవిత్వం తెలిసిన వారినించీ “మౌఖిక”మైన సంగతులనీ సేకరించుకోవచ్చుననీ సలహా ఇవ్వడం ఆశ్చర్యమే! ఫలానా పుస్తకం అంటే ఎవరైనా సేకరించుకోవచ్చు, కానీ ఫలానా తరం వాళ్ళని కలుసుకుని విషయాలని సేకరించుకోమని అనడం ఏమిటో? ఇక్కడ నేను ప్రస్తావించిన అంశం ఒకటే. స్త్రీల సాహిత్యం మీద విమర్శ చాలా తక్కువ అన్న ది. నేను బంగారమ్మ గారి సాహిత్య విశ్లేషణలో జరిగిన జాప్యాన్ని గురించి మాట్లాడేను. స్త్రీల సాహిత్యం పై విమర్శ లోని అసమగ్రత, నా అభిప్రాయం. వారి వ్యక్తిగతాలు కాదు. శ్రీశ్రీ ఎందుకు ప్రస్తావించ లేదన్నది “మౌఖిక” చరిత్ర ద్వారా సేకరించు కోవడం మీద నాకు సమ్మతీ లేదు. ఆసక్తీ లేదు. అది స్త్రీల సాహిత్య విమర్శని సృష్టించదు. స్త్రీల సాహిత్యాన్ని పక్కకు నెట్టి స్త్రీల జీవితాన్ని gossip గా మాట్లాడుకుందికి బహుశా ఉపయోగపడొచ్చు. దాని వల్ల స్త్రీల సాహిత్యానికి మరింత నష్టం తప్ప మేలు లేదు. కవుల విషయంలో అక్షరాన్నీ, కవయిత్రుల విషయంలో మాత్రం జీవితాన్నీ గుర్తించే ఈ “మౌఖిక” విమర్శ అన్న సూచన వెనక ఉన్న ప్రమాదం ఇదీ! దీని వల్ల ఎవరికి లాభమో నేను వేరే వివరించి చెప్పనఖ్ఖర లేదు.
రమ.
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/27/2009 2:17 pm
I don’t want to comment on the alleged bias towards women writers, nor on lack of literary criticism in modern Telugu literature. However I believe that an issue is made, unnecessarily I may add. If any bias were made towards Bangaramma its definitely not because she is woman. Fact is that even in 20th century we have more oral history (and lit. criticism) than written one. There are reasons why Bangaramma’s name is not mentioned even today. If you are curious, go and talk to people who are well acquainted with భావకవిత్వం period, and there are still a few around. It has nothing to do with the quality of her poetry but her personal life. I don’t want to go into details here. On that note we never talk about why ko.ku disliked Chalam, or all those unwritten verses of Devulapalli, or all those literary happenings of 1920s, 30s and 40s.
If I sound cryptic, yes its intentional!
Regards,
Sreenivas
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj అభిప్రాయం:
01/27/2009 10:55 am
హనుమంతరావు గారూ!
నాది బాధ మాత్రమే ! అభిశంసన కాదు. మీకు నా ఆరోపణ సవ్యం గానే అర్ధమయింది. thank you. మీ భార్యగారికి వచ్చిన సందేహం ఇన్నేళ్ళలోనూ ఈ తెలుగు సాహిత్యలోకంలో ఒక్క విమర్శకుడికీ రానేలేదే? మరి ఇది ఆలోచించ వలసిన విషయం కాదా? ఒకనాటికి స్త్రీలీ ప్రశ్నలేయగలరని పురుషసాహిత్యలోకం ఊహించలేదు. మీ వివరణ లోనే శ్రీశ్రీ చూపించిన నిర్లక్ష్యం గురించి ఉంది.ఆనాటి వారికే కాదు..ఇవాళ్టికీ చాలా మందికి స్త్రీల గురించి చెప్పాలంటే ఎందుకో మరి మనసు రాదుస్మండీ !! అందునా మంచి సంగతులు చెప్పడానికి అసలే రాదు. కావాలంటే తెలుగు విమర్శ ని ఒకసారి పరికించి చూడండి మీరే! సరి అయిన దృష్టి కోణం తో..స్త్రీల రచనలని ఇంకా బేరీజు వేయగల స్థితి ఈనాటికీ ఇంకా లేదు. సాహిత్య పరంగా చాలా నష్టం ఇది.
మోహనరావు గారూ…ప్రస్తావన చేయడం …విశ్లేషణ చేయడం రెండూవేర్వేరు. రెండో దాని పరంగా మీ వ్యాసం బలమైంది కాదని మీకే తెలియగలదు మరోసారి చదువుకుని చూడండి. మీరు”ముగురమ్మల్ని గురించి ప్రస్తావనే చేసారు…వారి కవితా విశ్లేషణ కాదు. విమర్శ పరిధి వేరు. దాని దిశ వేరు. తెలుగులో సృజనాత్మక సాహత్యం వృధ్ధి పొందింది..కానీ విమర్శ ఏదీ?
నేను మాట్లాడుతున్న అంశం ఇదీ! ఎవరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి…అదీ ముఖ్యం.
రమ.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 6:58 am
తహ తహ గారికి,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. భావి తరాల గురించి ప్రస్తావించారు కనుక:
మా ఊరు, రావినూతల, వెళ్ళినపుడల్లా, హైస్కూలు కెళ్ళడం, టీచర్లని కలవడం, పిల్లలనుద్దేశించి ప్రసంగించడం, నా పర్యటనలో ఓ ముఖ్యమైన నాకు చాలా ఇష్టమైన భాగం. నేను ఇండియా వెళ్ళి మొన్ననే తిరిగివచ్చాను. ఆ అనుభవం గురించి, చదువుకి సంబంధించి, ఓ వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
స్మైల్ – ఓ జ్ఞాపిక గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 6:44 am
మోహన గారికి,
1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడు” కవితని వేలూరి చవకరకం జిన్ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.
మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]
కొడవళ్ళ హనుమంతరావు
[1] “వ్యాసాలు, ద్వేషాలు,” సౌభాగ్య. 2004.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 6:14 am
సూర్యుడు గారికి,
మీ వ్యాఖ్య చదివి, హమ్మయ్య, ఒక్కరైనా నా వ్యాసం చదివారు, శ్రమ నిరర్థకం కాలేదు, అన్న సంతోషం కలిగింది.
వాస్తవానికి, నేనీ వ్యాసం ముగించి, గత శతాబ్దంలో గణితశాస్త్రంలో వచ్చిన మూడు విపత్తులని సగటు పాఠకునికి వివరించడంలో విఫలమయ్యాననే నాకు నేను బేరీజు వేసుకున్నాను. మరీ మిక్కిలి అమూర్త (abstract) విషయాలని వివరించడంలో కలిగే చిక్కులు నాకెక్కువే ఎదురయ్యాయి. అయినా దీని వలన కొంత మేలు జరిగిందనీ, ముందు ముందు మీలాంటి వారెవరైనా ఇంకా సరళంగా చెప్పగలరనీ ఆశ.
మీరు ప్రస్తావించిన పుస్తకం నేను చదవలేదు కాని చదవదగ్గదిలా ఉంది. అందరూ మీరిచ్చిన లింకులోని పరిచయం అన్నా చదువుతారని ఆశిస్తాను. నేనీ వ్యాసం రాసే సమయంలోనే, గణితంలో నోబెల్ బహుమతి లేదని తెలిసి ఒకరు నా ముందర విస్మయపడితే, ఆమాత్రం తెలియని ఇంజనీర్లు ఉన్నారా అనుకొని అవాక్కయ్యాను.
కొడవళ్ళ హనుమంతరావు
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 5:42 am
అరుణ గారికి,
శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.
రమ గారికి,
మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.
బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.
జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.
[2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి mOhana అభిప్రాయం:
01/26/2009 6:34 am
రమగారూ, అందరూ బంగారమ్మలాటి కవయిత్రులను మరచిపోలేదు. నేను రాసిన జూలై నెల ఈమాటలోని వ్యాసంలో “ముగురమ్మలను” పేర్కొన్నాను. వారు విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని గారలు. వారి కవితలను కూడా ఉదహరించాను. బంగారమ్మ కవితలు శాయిగారి సైటులో కూడా ఉన్నవి.
విధేయుడు – మోహన
ఎంగిలాకులు గురించి యుగంధర్ అభిప్రాయం:
01/25/2009 7:56 am
జిన్హే నాజ్ హై హింద్ పర్ .. వో కహాన్ హై?
ప్యాసా సినిమాలో సాహిర్ లూఢియాన్వీ పద్యాన్ని తలపించారు!
చంద్రుణ్ణి చూపించే వేలు గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:
01/25/2009 7:52 am
ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించినందుకు ధన్యవాదాలు. హైకూ గుఱించి తెలుసుకున్నాను.
ఆఖరి పేరా చదువుతుండగా ఓశో వ్రాసిన “సౌందర్యత అంతర్మార్గంలో నుంది”, అన్న వ్యాసం గుర్తుకువచ్చింది.
– రాకేశ్వర