కె. ఎన్. వై. పతంజలి
జీవిత విశేషాలు
రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడు కె. ఎన్. వై. పతంజలి (1952-2009) గారిది అనన్య సామాన్యమైన రచనా ప్రతిభ. 1975 నుంచీ ఈనాడు పత్రికలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ఖాకీవనం, పెంపుడు జంతువులు నవలలు రాశారు. రావిశాస్త్రి రచనా పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, కృష్ణవంశీ ‘సింధూరం’ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు అందుకున్నారు.