చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి


సొంత ఊరు:
మొహిద్దీన్ పురం, ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

చేగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగారు (1945 – 2026) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, హేతువాది, రచయిత. పెన్సిల్ షేడ్, జలవర్ణ, తైలవర్ణ చిత్రకారుడు. బుద్ధుడు, నెహ్రూ, సినారె వంటి ప్రముఖుల చిత్రాలను వేలాదిగా చిత్రించారు. అలాగే సాంఘిక, పౌరాణిక నాటకాలలో నటుడిగా, ఏకపాత్రాభినయంలోనూ రాణించారు. ఇంకొల్లులోని రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ సహాయ కార్యదర్శిగా పనిచేశారు. వివిధ సామాజిక అంశాలపై రచనలు చేశారు.


 

ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో, అసభ్యకర నాగరికతతో, స్వార్థరాజకీయాలతో పెద్దా – చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి. తల్లిదండ్రులు, గురువులపైన వినయ విధేయతలు, భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి. సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. ఈ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై, మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘సమకాలీన తెలుగు గ్రామాలను’’ సింహావలోకనం చేస్తే ….