ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
08/28/2008 11:32 am
It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.
శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!
“తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.
అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.
గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.
ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.
రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.
నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/27/2008 11:30 pm
నమ్మకాలు – బ్రతుకుతెరువు
సాయి గారికి,
చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.
రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.
శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?
“తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”
అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:
“మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)
కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను – కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
08/27/2008 2:17 pm
ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.
మంచిది నీతిమంతులారా, మహా ప్రస్థానాన్ని విశాఖ సముద్రంలోకి విసిరెయ్యండి, గుయెర్నికాని కాల్చెయ్యండి. అక్కడతో ఆగకండి, ప్రాచీన కళా కారులు, సాహితీకారులేం మడి కట్టుకోని కూర్చోలేదు వారి చిత్రాల్ని, రచనల్ని సైతం సమిధలు చేసెయ్యండి. ఐతే వొక మనవి ఆ మంట వెలుగులో మీవెనక భాగాలు మాత్రం ఎవరికీ కనపడకుండా కప్పి పెట్టుకోండి, లేకపోతే ఎవరో మిమ్మల్ని కూడా ఆ మంటల్లోకి దోశెయ్యగలరు.
నీతులు చెప్పడం సాహిత్యం కాదు. బ్రతుకుని చిత్రించడం సాహిత్యం. ఆ జీవిత చిత్రణ ఎవరి కలంనుంచొస్తేనెవి. అక్ష్రర రూపం తీసుకున్న ఆ అంతరంగ వుప్పెన కి దానికంటూ వొక అస్థిత్వం ఏర్పడుతుంది. రచయితతో సృష్టికర్తతో సంబంధంలేని వ్యక్తిత్వం ఆ రచనకి అబ్బుతుంది. రేఖా మాత్రంగా రచయిత రచనలో కనిపడొచ్చేవో but by itself it will be an independent entity. Like any of us who inherited a few characteristics from our parents. Still we grow up to be independent human beings and we will not and do not want to be judged by personalities of our parents. రచనలు, రచయితల మధ్య కూడా అదేవిధవైన సంబంధం వుందని నా నమ్మకం.
జారుడుబండ మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసీ, పెద్దగా పట్టించుకోని రచయితలు మనకు కావాలని ఎవరైనా కోరుకుంటే ‘చదివే సమాజం’ పరిధి పెరగాలి. మనమున్న బావి, కాదు ఇంకుడు గుంత, లోంచి కనీసం తలైనా పైకెత్తి ప్రపంచాన్ని చూద్దాం అని చదివే వాళ్ళకుండాలి. చదివే వాళ్ళకు అర్హత అవసరం అన్నది కొంతవరకూ కరెక్ట్. అది ఎట్లాంటి అర్హత అనేదగ్గరే కొద్ది పేచీలు. వాటిని తీర్చడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళే రాయాలి. వాటి మీద మళ్ళీ చదవటానికి, రాయటానికి “క్వాలిఫై” అయిన వాళ్ళే కావాలి.
విషయం తీవ్రబడి, చిక్కబడ్డప్పుడు అర్హత అనేది ముఖ్యమవుతుంది. కొడవళ్ళ కోట్ చేసిన, ఆయన ఫేవరైట్ రచయిత మాటలు ఆ దాంట్లోకే వస్తాయి. అది డిఫెండ్ చేయగలిగే మాట.
విషయానికున్న తీవ్రతను రచయితకన్నా అర్హత కలిగిన పాఠకుడే బాగా గ్రహిస్తాడేమో అని నా అనుమానం.
ఇక మళ్ళీ ఒకసారి ముందునించే మొదలు పెడితే:
సరే, మీరన్న రాయటానికి అర్హత అక్కర్లేదు అన్నది “ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి” అయినా కూడా ఆయా విషయాలకు ఉన్న తీవ్రత ఏ అర్హతా లేని వాళ్ళకు తెలవదు, రాయలేరు. (తెలుస్తుందని, రాయగలరని మీకు అనిపిస్తే, “ప్రూఫులు కావాలి” బాబ్జీలు గారూ అంటాన్నేను :)). “తెలవటం” ఒక అర్హత.
ఇది గుడిపాటి అడిగిన “మన కవులు అక్షరాస్యులేనా!” దగ్గరికే తీసుకు రావచ్చు. లేదా “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్న దగ్గరే మొదలు పెట్టొచ్చు. “కవికి కావలసిన కనీస అర్హత గురించి కవులే చెప్పాలి” అని నేనూ ఒక పెద్ద సారును తల్చుకుని ఇప్పటి మటుకు వదిలించుకోవచ్చు. ఇవి రాయటానికి నాకేం అర్హత ఉందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివే వాళ్ళు డిసైడ్ చేయాల”ని చెప్పటం తప్ప మరో మాట లేదు.
అర్హత కలిగిని చదివే వాళ్ళు, రాసే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తారు అని మరోవిధంగా చెప్పొచ్చేమో, మన ఆంజనేయ స్వామి గుడిమెట్ల మీద — చెప్పుకునే విషయంగా. “రచ్చబండ” అయితే మాత్రం ఇంకా స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.
అసలు నేను రాసింది వెనక్కు తీసుకుందామనుకున్నాను. కానీ కాలు పెట్టింతర్వాత అది తీయటం కష్టం అనిపించి మాట్లాడలేదు. ఒక కాలే కదా అని ఊరుకుంటే ఇప్పుడు రెండోది కూడా పెట్టి చూడమన్నందుకు మీకు ధన్యవాదాలు.
ఇక ముందుకెళ్ళి, మిగతావి కూడా చూద్దాం:
(వీటిని పెద్దగా కాంటెక్స్ట్ లో పెట్టి, అంటే వెనక్కెళ్ళి, భూతద్దం అప్పుతెచ్చుకుని, చూడకండి, దేనికదే అన్నట్టు చదవండి, వీలైతే)
“రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.” కాదు, చదివే వాడి అర్హత ఇక్కడ ప్రశ్నార్ధకం.
“నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.” వొల్లకుంతానికి నానేవన్నా పెండ్లి సేసుకున్న సీతాల్నా! అవుసరవైతే అయిదారుగురికి ఒక్క సారే గురెట్టి, ఒకల సిగలొకలకు ముడివెట్టి కొత్త భారతవేదైనా పుట్టి చస్తుందేవో అని సూసే వోడికి ఇదేం లెక్క?
నీతులు చెప్పటానికే కాని వినటానికి బాగుండవు అని ఎవరో పెద్దతలకాయ అనగా విన్నాను. నిజాయితీ అనే అర్హత మాత్రం ఏది రాయాలన్నా కావాలి.
వేమన గురించి “అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి?” అని అడిగినందుకు: కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి ‘నీతి’ మారుతుంది. ‘నిజాయితీ’ మారదు. ఇవాల్టి నీతి రేపుండక పోవచ్చు. నేను రాసిన ఒక బేవార్స్ ఎక్సాంపుల్ ‘నిజాయితీ’ గురించి, నీతి గురించి కాదు. మన దగ్గర (ఇప్పటికీ) పది పదమూడు ఏండ్ల పిల్లలను పెండ్లీలు చేసుకునే వాళ్ళున్నరు, వాళ్ళంతా ఛైల్డ్ మాలెస్టర్సే మరో ప్రాంతపు నీతిని బట్టి చూస్తే. అట్లాంటి క్వాలిఫికేషన్స్ కాకుండా, నిజాయితీ గురించి మాత్రమే నేను రాసింది.
రవీంద్ర బాబు గారూ,
ఈ వ్యాసం రెండో భాగం కామెంట్లలో విష్ణుభొట్ల లక్ష్మన్న గారితో నేను చేసిన చర్చ చూడండి. అలాగే నాలుగో భాగం (సెప్టెంబరు 1 న వెలువడుతుంది)లో కూడా దీనిమీద కొంత చర్చ ఉంటుంది.
నమస్కారాలతో,
నాగమురళి.
ఛందోధర్మము గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
08/27/2008 10:33 am
హనుమంతరావు గారికి,
వ్యక్తిగత విషయాలూ,వ్యక్తిత్వాలూ రెండూ వేర్వేరు. మీరు ఈనవల మీ ప్రేయసి పోయినప్పుడు రాసారట కదా అన్నది వ్యక్తిగత విషయం. కులం గురించి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తూ కాస్ట్ ఫీలింగ్ చూపడం వ్యక్తిత్వం. ఏ రచనయినా బాగుందనిపిస్తే ఆయా రచయితలగురించి ఆరా తీయడం సహజం. అప్పుడప్పుడు ఈ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిత్వాలు కూడా వద్దన్నా బయటకొస్తాయి. వాటితోనే
( రచయితలతోనూ, వారి రచనలతోనూ) పాఠకులకి పేచీ!
నేను నాకు నచ్చింది రాస్తానూ, నా జీవితం నా ఇష్టం / నచ్చితే చదువు / లేదా వదిలేయి / రచన్నీ, రచయిత జీవితాన్ని కలిపిచూడద్దు / అని రచయితే చెప్పడం ( ముక్కు సూటి వ్యవహారంలా కనిపించచ్చు ) ఎంతవరకూ సబబు? ఏ రచనయినా రాసేవాళ్ళ దృక్పథాన్ని బట్టే కదా వచ్చేది? సొంత అనుభవాల్లోచో లేదా పక్కవాళ్ళ జీవితాల్లాంచో రచనలు పుడతాయి. వీటిని యథాతథంగా రాయడం వేరు. వేరే దృక్పథంలో చెప్పడం వేరు. రెండూ ఒకటి కాదు. అప్పుడే రచయిత వ్యక్తిత్వం బయల్పడేది. చేతిలో సిగరెట్టు వెలిగించి, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడంలా ఉంటుంది. నాస్తికులు పురాణ కథని చెబితే చెప్పిన దానస్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు పాఠకులకుండదా? నాగురించి కళ్ళు మూసుకో. వస్తువునే చూడు అని చెబితే ఎంతమంది ఒప్పుకుంటారు?
నెను శ్రీ శ్రీ దేవుణ్ణి నమ్మరని విన్నాను. ఆయన అనేక భక్తి డబ్బింగ్ సినిమాలకి రచనలు చేసారు. నేను మూల రచనని యథాతథంగా రాసానంతే – రాయడం నా వృత్తి – నమ్మకం వేరు – జీవనోపాధి వేరు అనని శ్రీ శ్రీయే చెప్పడం డబాయింపులా కనిపిస్తుంది కానీ సంజాయిషీ అవదు. ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.
యిప్లవుబాబూ,
ఒల్లకున్నావేటీ? రాత్రేల రామ్మందిరం కాడ కూకోని కబుర్లాడీవోల్లందర్నీ యీ రొచ్చు లోకి లాగింది నువ్వు కాదేటి? నానా, నువ్వా?
మరయితే, ముచ్చటేటంటే, నాన్రాసిన “వాక్యం” లో నాననుకన్న “టోన్ & టెనర్” నాననుకున్నట్టు “ప్రెహాదు” బాబుకినిపించనేదు. అందుకే అలా బెజ్జరిల్లిపోనాడు.
అదాబాబు తప్పుకాదు. అది నా తప్పే. ఎందుకంటే రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.
“క్రెడిబిలిటీ” ని నువ్వే జారుడుబండంటావు. “అదీ నిజమే” అనికదా నువ్వు రాసింది. నానూ వొప్పేసుకున్నానుగదా?
“క్రెడిబిలిటీ” గురించే, యిప్లవ్ బాబూ, ఇటాలకించు,దీనికేటంటావు?
యేమన పజ్జాలు మనవందరివీ సదువుకున్నాం, మన పిల్లలసేత కంటతా పట్టించెస్తన్నాం. యేమన్నొదిలెద్దావా బాబూ? ఎందుకంటే, ఆ బాబు ఆ పజ్జాలు రాయకముందు మన్లాటోడే గదా? అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి? మాలాటోళ్ళవొప్పినా, నువ్వూ “ప్రెహాదు” బాబూ వొప్పుతారేటి?మన పిల్లల్ని మనం కానుకోవా? యేమనలాటోడికి మన పిల్లల్ని వొప్పగించెస్తావా? యేమన మనకంటా “బేవార్సా”, మనం యేమన కంటా “బేవార్సా?”. ఆ బాబు సేసిన జల్సాలు నువ్వు సేసేవా? నాను సేసేనా? “ప్రెహాదు” బాబు సేసేడా? ఆ వొయిసులో”జల్సాలు” సెయ్యడం “తప్పు గాదెహె” అనంటావా? మరేటి సేస్తే తప్పు. మరెప్పుడు సేస్తే తప్పు. మరోడు సేసింది తప్పా వొప్పా సెప్పడానికి నువ్వెడివెహె?” అనడిగీవోళ్ళకి నువ్వేటంతావు?
నిజాయితీ అంటే ఏటో చరిగ్గా తెలీనోళ్ళందరం మేం. నీతి గురించేటంటాం?
నిజాయితీని దాటి, నీతికాడికెళిపోయినోడు, “ప్రెహాదు” బాబు.
ఇలా వొల్లకుండిపోడం అన్నేయం యిప్లవ్ బాబూ. లేదూ, “అపీసు” పన్లో యీలు దొరక్క ఏటీ అన్లేదంటావా? యీలు దొరికేకే సెప్పు. సెప్పీదేదో సరిగ్గా సెప్పు. నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.
ఎందుకంటే, “ఛందస్సూ” మిగిలిన వాటి గురించి కొట్టుకు ఛస్తున్న మమ్మల్ని ఈ “జారుడుబండ” వ్యవహారంలోకి లాగింది మీరు. పాపం “ప్రెహాదు” గారు, ఆయన్నొగ్గెద్దాం. మీరేటంతారు?
ఒకటి మాత్రం నిజం. మాలాటి కడుపు నిండిన వాళ్ళు, నీతి గురించీ, అవినీతి గురించీ, ‘చండీదాస్” చెప్పినట్లు, ఆంధ్రజ్యోతి లోనే, నిజాయితీని దాటేక కదా సెయ్యాల.
దెయ్యాలు వేదాలు (మంత్రాలు కాదు, యిప్లవ్ బాబూ) వల్లించడవంటే, నువ్వూ, నానూ చేస్తున్నది. ఔనంటావా? కాదంటావా?
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/26/2008 8:49 pm
రచయితలు, శ్రీరంగనీతులు
ఇది జె.యు.బి.వి. ప్రసాద్ గారి అబిప్రాయంపై నా స్పందన. పాతికేళ్ళ క్రితం ఆంద్రజ్యోతిలో అనుక్షణికం సీరియల్ చివరకొస్తుండగా, పాఠకులతో ప్రశ్న-జవాబుల ముచ్చట ముగిస్తూ, వడ్డెర చండీదాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి:
“చాలా మంది పాఠకులు నా గురించి (‘పర్సనల్’ విషయాలు) అడుగుతూ వొచ్చారు. మీరు మీ నవలలో కులాలను కులాలుగా స్పష్టంగా చిత్రించారు కదా. మీది యే కులం. మీ సొంత కులాన్ని మీరు ఏ విధంగా చిత్రించారో తెలుసుకోవాలనుంది / మీ భార్య చనిపోయినప్పుడు “హిమజ్వాల”, ప్రేయసి చనిపోయినప్పుడు “అనుక్షణికం” రాశారట కదా / మీరు కన్వెర్టెడ్ క్రిస్టియన్నట కదా / మీ జీవితంలో కులతత్వాల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వొచ్చారు / మీరు తిరుగుబోతట కదా / మీది కులాంతరమట కదా / మీరు తిక్కమనిషట కదా / మీరు దేవుడిలాంటివారట కదా / మీరు అవివాహితులట కదా / మీకు ఇద్దరు భార్యలట కదా / మీరు బ్రహ్మచారులట కదా, యిలా యెన్నో. వాటికి వేటికీ జవాబు లివ్వలేదు. నచ్చితే నా రచన చదవండి. నా జీవితాన్ని అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ కలిపి పరిశీలించతగిన రచయితనైతే అందుకు యింకా వ్యవధి వుంది….
ఐతే. నా జీవితం – అందులో అల్పత్వాలున్నా మహత్వాలున్నా అసహ్యతలున్నా అభినందనీయాలున్నా అభిశంసనీయాలున్నా నా జీవితం నా జీవితంగా యధాతధంగా పరిశీలించాల్సిన వేళ వొస్తే ఆనాడు తప్పక అలా యధాతధంగా లభ్యమవుతుంది.”
చండీదాస్ లాంటి రచయితలు అరుదు. కాని ఆయనన్నది అందరికీ వర్తిస్తుందనుకుంటాను. యండమూరి, శ్రీశ్రీ, శివారెడ్ది, పసంద్ రెడ్డి (?) – వాళ్ళ రచనలు అసలు ముందర చదవదగ్గవో కావో పరిశీలించండి. చదవదగ్గవి కాకపోతే, వాళ్ళ జీవితం లో కెళ్ళడం వ్యర్థం. చదవదగ్గవే కాక, ఉన్నతమైన రచనలైతే, వాళ్ళ జీవితాల్లో కెళ్ళండి. వారి అల్పత్వాలని బయల్పరచి వాటి మూలంగా ఒకప్పుడు విలువైనవనుకున్న రచనలు ఇప్పుడు పాఠకులు ఎందుకు విసిరి పారెయ్యాలో వివరించండి. వెంటనే పాఠకులలో మార్పు వచ్చి సమాజంలో నీతీ న్యాయం పెరుగుతాయనుకోను గాని, మీ ఆక్రోశానికి మాత్రం సాహితీ గౌరవం లభిస్తుంది.
జ్యొతిష్యము గురించి డిస్కషను బాగుంది కాని జ్యొతిష్యము నమ్మాలి అనే వారికి ఒక్ ప్రశ్న ఒకే రొజు ఒకే time ఒకే place లొ పుటిన వాళు ఒకె రకమయిన జాతకమ్ ఉండదు యెందుకు.
ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
08/28/2008 11:32 am
It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.
శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!
“తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.
అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.
గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.
ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.
రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.
నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.
విధేయుడు
-Srinivas
రచయితలకు సూచనలు గురించి Nirmala Kondepudi గారి అభిప్రాయం:
08/28/2008 8:38 am
మీ పత్రిక బావుంది చాలా చాలా….అభినందనలు.
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/27/2008 11:30 pm
నమ్మకాలు – బ్రతుకుతెరువు
సాయి గారికి,
చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.
రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.
శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?
నాస్తికులు పురాణకథని చెప్తే ప్రశ్నించే హక్కు పాఠకులకుండొచ్చు. కొడవటిగంటి కుటుంబరావుకి నివాళులర్పిస్తూ చలసాని ప్రసాదరావు చందమామ నిర్వాహకులు సమర్పించిన శ్రద్ధాంజలిని ప్రస్తావించారు:
“తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”
అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:
“మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)
కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను – కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
08/27/2008 2:17 pm
మంచిది నీతిమంతులారా, మహా ప్రస్థానాన్ని విశాఖ సముద్రంలోకి విసిరెయ్యండి, గుయెర్నికాని కాల్చెయ్యండి. అక్కడతో ఆగకండి, ప్రాచీన కళా కారులు, సాహితీకారులేం మడి కట్టుకోని కూర్చోలేదు వారి చిత్రాల్ని, రచనల్ని సైతం సమిధలు చేసెయ్యండి. ఐతే వొక మనవి ఆ మంట వెలుగులో మీవెనక భాగాలు మాత్రం ఎవరికీ కనపడకుండా కప్పి పెట్టుకోండి, లేకపోతే ఎవరో మిమ్మల్ని కూడా ఆ మంటల్లోకి దోశెయ్యగలరు.
నీతులు చెప్పడం సాహిత్యం కాదు. బ్రతుకుని చిత్రించడం సాహిత్యం. ఆ జీవిత చిత్రణ ఎవరి కలంనుంచొస్తేనెవి. అక్ష్రర రూపం తీసుకున్న ఆ అంతరంగ వుప్పెన కి దానికంటూ వొక అస్థిత్వం ఏర్పడుతుంది. రచయితతో సృష్టికర్తతో సంబంధంలేని వ్యక్తిత్వం ఆ రచనకి అబ్బుతుంది. రేఖా మాత్రంగా రచయిత రచనలో కనిపడొచ్చేవో but by itself it will be an independent entity. Like any of us who inherited a few characteristics from our parents. Still we grow up to be independent human beings and we will not and do not want to be judged by personalities of our parents. రచనలు, రచయితల మధ్య కూడా అదేవిధవైన సంబంధం వుందని నా నమ్మకం.
ఛందోధర్మము గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
08/27/2008 1:06 pm
మై డియర్ బాబ్జీలు,
జారుడుబండ మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసీ, పెద్దగా పట్టించుకోని రచయితలు మనకు కావాలని ఎవరైనా కోరుకుంటే ‘చదివే సమాజం’ పరిధి పెరగాలి. మనమున్న బావి, కాదు ఇంకుడు గుంత, లోంచి కనీసం తలైనా పైకెత్తి ప్రపంచాన్ని చూద్దాం అని చదివే వాళ్ళకుండాలి. చదివే వాళ్ళకు అర్హత అవసరం అన్నది కొంతవరకూ కరెక్ట్. అది ఎట్లాంటి అర్హత అనేదగ్గరే కొద్ది పేచీలు. వాటిని తీర్చడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళే రాయాలి. వాటి మీద మళ్ళీ చదవటానికి, రాయటానికి “క్వాలిఫై” అయిన వాళ్ళే కావాలి.
విషయం తీవ్రబడి, చిక్కబడ్డప్పుడు అర్హత అనేది ముఖ్యమవుతుంది. కొడవళ్ళ కోట్ చేసిన, ఆయన ఫేవరైట్ రచయిత మాటలు ఆ దాంట్లోకే వస్తాయి. అది డిఫెండ్ చేయగలిగే మాట.
విషయానికున్న తీవ్రతను రచయితకన్నా అర్హత కలిగిన పాఠకుడే బాగా గ్రహిస్తాడేమో అని నా అనుమానం.
ఇక మళ్ళీ ఒకసారి ముందునించే మొదలు పెడితే:
సరే, మీరన్న రాయటానికి అర్హత అక్కర్లేదు అన్నది “ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి” అయినా కూడా ఆయా విషయాలకు ఉన్న తీవ్రత ఏ అర్హతా లేని వాళ్ళకు తెలవదు, రాయలేరు. (తెలుస్తుందని, రాయగలరని మీకు అనిపిస్తే, “ప్రూఫులు కావాలి” బాబ్జీలు గారూ అంటాన్నేను :)). “తెలవటం” ఒక అర్హత.
ఇది గుడిపాటి అడిగిన “మన కవులు అక్షరాస్యులేనా!” దగ్గరికే తీసుకు రావచ్చు. లేదా “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్న దగ్గరే మొదలు పెట్టొచ్చు. “కవికి కావలసిన కనీస అర్హత గురించి కవులే చెప్పాలి” అని నేనూ ఒక పెద్ద సారును తల్చుకుని ఇప్పటి మటుకు వదిలించుకోవచ్చు. ఇవి రాయటానికి నాకేం అర్హత ఉందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివే వాళ్ళు డిసైడ్ చేయాల”ని చెప్పటం తప్ప మరో మాట లేదు.
అర్హత కలిగిని చదివే వాళ్ళు, రాసే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తారు అని మరోవిధంగా చెప్పొచ్చేమో, మన ఆంజనేయ స్వామి గుడిమెట్ల మీద — చెప్పుకునే విషయంగా. “రచ్చబండ” అయితే మాత్రం ఇంకా స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.
అసలు నేను రాసింది వెనక్కు తీసుకుందామనుకున్నాను. కానీ కాలు పెట్టింతర్వాత అది తీయటం కష్టం అనిపించి మాట్లాడలేదు. ఒక కాలే కదా అని ఊరుకుంటే ఇప్పుడు రెండోది కూడా పెట్టి చూడమన్నందుకు మీకు ధన్యవాదాలు.
ఇక ముందుకెళ్ళి, మిగతావి కూడా చూద్దాం:
(వీటిని పెద్దగా కాంటెక్స్ట్ లో పెట్టి, అంటే వెనక్కెళ్ళి, భూతద్దం అప్పుతెచ్చుకుని, చూడకండి, దేనికదే అన్నట్టు చదవండి, వీలైతే)
“రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.” కాదు, చదివే వాడి అర్హత ఇక్కడ ప్రశ్నార్ధకం.
“నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.” వొల్లకుంతానికి నానేవన్నా పెండ్లి సేసుకున్న సీతాల్నా! అవుసరవైతే అయిదారుగురికి ఒక్క సారే గురెట్టి, ఒకల సిగలొకలకు ముడివెట్టి కొత్త భారతవేదైనా పుట్టి చస్తుందేవో అని సూసే వోడికి ఇదేం లెక్క?
నీతులు చెప్పటానికే కాని వినటానికి బాగుండవు అని ఎవరో పెద్దతలకాయ అనగా విన్నాను. నిజాయితీ అనే అర్హత మాత్రం ఏది రాయాలన్నా కావాలి.
వేమన గురించి “అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి?” అని అడిగినందుకు: కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి ‘నీతి’ మారుతుంది. ‘నిజాయితీ’ మారదు. ఇవాల్టి నీతి రేపుండక పోవచ్చు. నేను రాసిన ఒక బేవార్స్ ఎక్సాంపుల్ ‘నిజాయితీ’ గురించి, నీతి గురించి కాదు. మన దగ్గర (ఇప్పటికీ) పది పదమూడు ఏండ్ల పిల్లలను పెండ్లీలు చేసుకునే వాళ్ళున్నరు, వాళ్ళంతా ఛైల్డ్ మాలెస్టర్సే మరో ప్రాంతపు నీతిని బట్టి చూస్తే. అట్లాంటి క్వాలిఫికేషన్స్ కాకుండా, నిజాయితీ గురించి మాత్రమే నేను రాసింది.
నిజాయితీ మరో అర్హత రాయటానికి.
సెలవ్.
విప్లవ్
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగమురళి గారి అభిప్రాయం:
08/27/2008 12:04 pm
రవీంద్ర బాబు గారూ,
ఈ వ్యాసం రెండో భాగం కామెంట్లలో విష్ణుభొట్ల లక్ష్మన్న గారితో నేను చేసిన చర్చ చూడండి. అలాగే నాలుగో భాగం (సెప్టెంబరు 1 న వెలువడుతుంది)లో కూడా దీనిమీద కొంత చర్చ ఉంటుంది.
నమస్కారాలతో,
నాగమురళి.
ఛందోధర్మము గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
08/27/2008 10:33 am
హనుమంతరావు గారికి,
వ్యక్తిగత విషయాలూ,వ్యక్తిత్వాలూ రెండూ వేర్వేరు. మీరు ఈనవల మీ ప్రేయసి పోయినప్పుడు రాసారట కదా అన్నది వ్యక్తిగత విషయం. కులం గురించి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తూ కాస్ట్ ఫీలింగ్ చూపడం వ్యక్తిత్వం. ఏ రచనయినా బాగుందనిపిస్తే ఆయా రచయితలగురించి ఆరా తీయడం సహజం. అప్పుడప్పుడు ఈ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిత్వాలు కూడా వద్దన్నా బయటకొస్తాయి. వాటితోనే
( రచయితలతోనూ, వారి రచనలతోనూ) పాఠకులకి పేచీ!
నేను నాకు నచ్చింది రాస్తానూ, నా జీవితం నా ఇష్టం / నచ్చితే చదువు / లేదా వదిలేయి / రచన్నీ, రచయిత జీవితాన్ని కలిపిచూడద్దు / అని రచయితే చెప్పడం ( ముక్కు సూటి వ్యవహారంలా కనిపించచ్చు ) ఎంతవరకూ సబబు? ఏ రచనయినా రాసేవాళ్ళ దృక్పథాన్ని బట్టే కదా వచ్చేది? సొంత అనుభవాల్లోచో లేదా పక్కవాళ్ళ జీవితాల్లాంచో రచనలు పుడతాయి. వీటిని యథాతథంగా రాయడం వేరు. వేరే దృక్పథంలో చెప్పడం వేరు. రెండూ ఒకటి కాదు. అప్పుడే రచయిత వ్యక్తిత్వం బయల్పడేది. చేతిలో సిగరెట్టు వెలిగించి, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడంలా ఉంటుంది. నాస్తికులు పురాణ కథని చెబితే చెప్పిన దానస్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు పాఠకులకుండదా? నాగురించి కళ్ళు మూసుకో. వస్తువునే చూడు అని చెబితే ఎంతమంది ఒప్పుకుంటారు?
నెను శ్రీ శ్రీ దేవుణ్ణి నమ్మరని విన్నాను. ఆయన అనేక భక్తి డబ్బింగ్ సినిమాలకి రచనలు చేసారు. నేను మూల రచనని యథాతథంగా రాసానంతే – రాయడం నా వృత్తి – నమ్మకం వేరు – జీవనోపాధి వేరు అనని శ్రీ శ్రీయే చెప్పడం డబాయింపులా కనిపిస్తుంది కానీ సంజాయిషీ అవదు. ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.
ఛందోధర్మము గురించి baabjeelu గారి అభిప్రాయం:
08/27/2008 9:50 am
యిప్లవుబాబూ,
ఒల్లకున్నావేటీ? రాత్రేల రామ్మందిరం కాడ కూకోని కబుర్లాడీవోల్లందర్నీ యీ రొచ్చు లోకి లాగింది నువ్వు కాదేటి? నానా, నువ్వా?
మరయితే, ముచ్చటేటంటే, నాన్రాసిన “వాక్యం” లో నాననుకన్న “టోన్ & టెనర్” నాననుకున్నట్టు “ప్రెహాదు” బాబుకినిపించనేదు. అందుకే అలా బెజ్జరిల్లిపోనాడు.
అదాబాబు తప్పుకాదు. అది నా తప్పే. ఎందుకంటే రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.
“క్రెడిబిలిటీ” ని నువ్వే జారుడుబండంటావు. “అదీ నిజమే” అనికదా నువ్వు రాసింది. నానూ వొప్పేసుకున్నానుగదా?
“క్రెడిబిలిటీ” గురించే, యిప్లవ్ బాబూ, ఇటాలకించు,దీనికేటంటావు?
యేమన పజ్జాలు మనవందరివీ సదువుకున్నాం, మన పిల్లలసేత కంటతా పట్టించెస్తన్నాం. యేమన్నొదిలెద్దావా బాబూ? ఎందుకంటే, ఆ బాబు ఆ పజ్జాలు రాయకముందు మన్లాటోడే గదా? అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి? మాలాటోళ్ళవొప్పినా, నువ్వూ “ప్రెహాదు” బాబూ వొప్పుతారేటి?మన పిల్లల్ని మనం కానుకోవా? యేమనలాటోడికి మన పిల్లల్ని వొప్పగించెస్తావా? యేమన మనకంటా “బేవార్సా”, మనం యేమన కంటా “బేవార్సా?”. ఆ బాబు సేసిన జల్సాలు నువ్వు సేసేవా? నాను సేసేనా? “ప్రెహాదు” బాబు సేసేడా? ఆ వొయిసులో”జల్సాలు” సెయ్యడం “తప్పు గాదెహె” అనంటావా? మరేటి సేస్తే తప్పు. మరెప్పుడు సేస్తే తప్పు. మరోడు సేసింది తప్పా వొప్పా సెప్పడానికి నువ్వెడివెహె?” అనడిగీవోళ్ళకి నువ్వేటంతావు?
నిజాయితీ అంటే ఏటో చరిగ్గా తెలీనోళ్ళందరం మేం. నీతి గురించేటంటాం?
నిజాయితీని దాటి, నీతికాడికెళిపోయినోడు, “ప్రెహాదు” బాబు.
ఇలా వొల్లకుండిపోడం అన్నేయం యిప్లవ్ బాబూ. లేదూ, “అపీసు” పన్లో యీలు దొరక్క ఏటీ అన్లేదంటావా? యీలు దొరికేకే సెప్పు. సెప్పీదేదో సరిగ్గా సెప్పు. నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.
ఎందుకంటే, “ఛందస్సూ” మిగిలిన వాటి గురించి కొట్టుకు ఛస్తున్న మమ్మల్ని ఈ “జారుడుబండ” వ్యవహారంలోకి లాగింది మీరు. పాపం “ప్రెహాదు” గారు, ఆయన్నొగ్గెద్దాం. మీరేటంతారు?
ఒకటి మాత్రం నిజం. మాలాటి కడుపు నిండిన వాళ్ళు, నీతి గురించీ, అవినీతి గురించీ, ‘చండీదాస్” చెప్పినట్లు, ఆంధ్రజ్యోతి లోనే, నిజాయితీని దాటేక కదా సెయ్యాల.
దెయ్యాలు వేదాలు (మంత్రాలు కాదు, యిప్లవ్ బాబూ) వల్లించడవంటే, నువ్వూ, నానూ చేస్తున్నది. ఔనంటావా? కాదంటావా?
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/26/2008 8:49 pm
రచయితలు, శ్రీరంగనీతులు
ఇది జె.యు.బి.వి. ప్రసాద్ గారి అబిప్రాయంపై నా స్పందన. పాతికేళ్ళ క్రితం ఆంద్రజ్యోతిలో అనుక్షణికం సీరియల్ చివరకొస్తుండగా, పాఠకులతో ప్రశ్న-జవాబుల ముచ్చట ముగిస్తూ, వడ్డెర చండీదాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి:
“చాలా మంది పాఠకులు నా గురించి (‘పర్సనల్’ విషయాలు) అడుగుతూ వొచ్చారు. మీరు మీ నవలలో కులాలను కులాలుగా స్పష్టంగా చిత్రించారు కదా. మీది యే కులం. మీ సొంత కులాన్ని మీరు ఏ విధంగా చిత్రించారో తెలుసుకోవాలనుంది / మీ భార్య చనిపోయినప్పుడు “హిమజ్వాల”, ప్రేయసి చనిపోయినప్పుడు “అనుక్షణికం” రాశారట కదా / మీరు కన్వెర్టెడ్ క్రిస్టియన్నట కదా / మీ జీవితంలో కులతత్వాల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వొచ్చారు / మీరు తిరుగుబోతట కదా / మీది కులాంతరమట కదా / మీరు తిక్కమనిషట కదా / మీరు దేవుడిలాంటివారట కదా / మీరు అవివాహితులట కదా / మీకు ఇద్దరు భార్యలట కదా / మీరు బ్రహ్మచారులట కదా, యిలా యెన్నో. వాటికి వేటికీ జవాబు లివ్వలేదు. నచ్చితే నా రచన చదవండి. నా జీవితాన్ని అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ కలిపి పరిశీలించతగిన రచయితనైతే అందుకు యింకా వ్యవధి వుంది….
ఐతే. నా జీవితం – అందులో అల్పత్వాలున్నా మహత్వాలున్నా అసహ్యతలున్నా అభినందనీయాలున్నా అభిశంసనీయాలున్నా నా జీవితం నా జీవితంగా యధాతధంగా పరిశీలించాల్సిన వేళ వొస్తే ఆనాడు తప్పక అలా యధాతధంగా లభ్యమవుతుంది.”
చండీదాస్ లాంటి రచయితలు అరుదు. కాని ఆయనన్నది అందరికీ వర్తిస్తుందనుకుంటాను. యండమూరి, శ్రీశ్రీ, శివారెడ్ది, పసంద్ రెడ్డి (?) – వాళ్ళ రచనలు అసలు ముందర చదవదగ్గవో కావో పరిశీలించండి. చదవదగ్గవి కాకపోతే, వాళ్ళ జీవితం లో కెళ్ళడం వ్యర్థం. చదవదగ్గవే కాక, ఉన్నతమైన రచనలైతే, వాళ్ళ జీవితాల్లో కెళ్ళండి. వారి అల్పత్వాలని బయల్పరచి వాటి మూలంగా ఒకప్పుడు విలువైనవనుకున్న రచనలు ఇప్పుడు పాఠకులు ఎందుకు విసిరి పారెయ్యాలో వివరించండి. వెంటనే పాఠకులలో మార్పు వచ్చి సమాజంలో నీతీ న్యాయం పెరుగుతాయనుకోను గాని, మీ ఆక్రోశానికి మాత్రం సాహితీ గౌరవం లభిస్తుంది.
కొడవళ్ళ హనుమంతరావు
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి ravindraBabu గారి అభిప్రాయం:
08/26/2008 7:49 pm
జ్యొతిష్యము గురించి డిస్కషను బాగుంది కాని జ్యొతిష్యము నమ్మాలి అనే వారికి ఒక్ ప్రశ్న ఒకే రొజు ఒకే time ఒకే place లొ పుటిన వాళు ఒకె రకమయిన జాతకమ్ ఉండదు యెందుకు.