మా అమ్మమ్మా వాళ్ళు కార్తిక మాసంలో అరటి దొప్పల్లో దీపాల్ని వెలిగించి, నదిలో వదిలే వారు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాల్లాగా, నీళ్ళలో అందరూ వదిలే ఆ దీపాల్ని చూడటానికి అమ్మమ్మ కొంగు పుచ్చుకుని గజగజా వణుకుతూ ఆవిడ వెంట వెళ్ళేవాళ్ళం. ఆ మధ్య వూరువెళ్ళినప్పుడు మా చిన్న మావయ్య కోడలు షాలిని, వుయ్ లీవ్ లైట్స్ ఇన్ ద లేక్. యు వాంట్ టు కమ్ అండ్ సీ? అంది.
ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం!

కవి బిల్హణుడు 11వ శతాబ్దపు కాశ్మీర కవి. చోరపంచాశికా అనే ప్రేమకవిత ద్వారా జగత్ప్రసిద్ధుడు. కావ్యకథనమైన ఈ కవి ప్రణయోదంతాన్ని ఒక చక్కటి పద్యనాటికగా సాహిత్యపునఃసృష్టి చేసిన తిరుమల కృష్ణదేశికాచార్యుల రచన, బిల్హణీయము; తెలుగు పద్యాలలో అన్నిటికన్నా ఎక్కువ భావక్లిష్టత ఉన్న పద్యంగా ఒక పద్యంపై తన నిర్ణయాన్ని వివరిస్తున్న ఏల్చూరి మురళీధరరావు వ్యాసం ఆంధ్రవాఙ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యం!; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం అమ్మా కనకమ్మా; ప్రముఖగాయకుడు, మాధవపెద్ది సత్యం ప్రత్యేక జనరంజని కార్యక్రమం, లలితగీతాల ఆడియోలు, ఈ సంచికలో…
ఇంకా: ఇంద్రాణి, సమవర్తి, మానస, శ్రీవల్లీరాధిక, కనకప్రసాద్, బివివి ప్రసాద్, మోహనరావుల కవితలు; సాయి బ్రహ్మానందం, ఆర్ శర్మ, శ్యామలాదేవిల కథలు; రమాసుందరి నవలాసమీక్ష; వేంకటేశ్వరరావు, మోహనరావుల వ్యాసాలు; ఛందం సాఫ్ట్వేర్ గురించి పరిచయం; కామేశ్వరరావు ధారావాహిక నాకు నచ్చిన పద్యం.
మీకు తెలిసే ఉంటుంది. రాజు నిన్న మధ్యాన్నం మద్రాసు హాస్పిటల్లో పోయారట. ఈయన చెప్పారు! పాపం అంత పేరూ, డబ్బూ ఉండి చివర్లో కేన్సరు బారిన పడటం తలుచుకుంటే బాధేస్తుంది. మరీ అరవయ్యో పడిలో పడకుండానే పిట్టలా రాలిపోవడం అన్యాయం. కూతురి పెళ్ళయినా అయ్యింది. కొడుకులిద్దరికీ పెళ్ళీ అవీ ఇంకా కాలేదు. సంబంధాలు కుదిరాయనీ ఈయన చెప్పారు. పాపం!
“మీరు జ్ఞాన సంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”
వ్యవసాయ భూమి రియల్ ఎస్టేట్గా మారే ముందు దశను రచయిత మధురాంతకం నరేంద్ర జాగ్రత్తగా పట్టుకొని వస్తారు. భూముల స్థలీకరణకు మానవ ప్రతిఘటన బలహీనమైన ఈ అవస్థలో రోసిరెడ్డి ఒక ప్రశ్న వేస్తాడు. “మడుసులంతా ఈ మాదిరి కొంపలు గట్టుకొనేదానికి కయ్యలు, కాలువలు గావాలంటే కుదిరితిందా? నేలుండేది దున్నిపంట చేసేదానికా? కడగాలేసి గోడల్లేపే దానికా?”
రాజకుమారి యామిని ఉంది చూడు. ఆ అమ్మాయి ఒక కాశ్మీరకవీంద్రుని వద్ద సంస్కృతం నేర్చుకుంటున్నదని నీకింతకు ముందు చెప్పినాను కదా! ఆయనను నేను చూచినాను. ఆయన మహాపండితుడు, గొప్పకవి అంటే విన్నాను. అంతే కాదు. ఆయనంతటి స్ఫురద్రూపిని నేనెన్నడూ చూడలేదు. నీలవర్ణం బదులు బంగారు రంగుతో మెఱిసే శ్రీకృష్ణమూర్తిలాగ ఆయనుంటాడు. అంతేకాక ఆయన యువకుడు గూడ.
చీకటి మరింత చిక్కబడింది. మన్మథుడు వచ్చాడు కాబట్టి వారవనితలూ జారవనితలూ కూడా వచ్చి చేరారు! కవిగారి చమత్కారం చూడండి. ‘వృద్ధ వారవిలాసినీ విసరమునకు అపలితంకరణ ఔషధంబు అనగ’ ఉందట చీకటి. పలితకేశం అంటే నెరిసిన జుట్టు. పలితంకరణం అంటే జుట్టు పండిపోవడం. అపలితంకరణం అంటే కేశాలకు నల్లదనం రావడం. అపలితంకరణ ఔషధం అంటే, అలా నల్లబడేందుకు వాడే మందు, అంటే ఇప్పటి భాషలో hair dye.
ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో –-
కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.
— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట.
వివిధ దైవ స్తోత్రములలో అక్షరమాలా స్తోత్రము ఒకటి. మృత్యుంజయ స్తోత్రములో ప్రతి పంక్తి అ, ఆ, ఇ, ఈ ఇత్యాదులైన అక్షరములతో ప్రారంభమై క్ష-కారముతో అంతమవుతుంది. అక్షరములతో ప్రారంభించు పంక్తులకు బదులు అకారాది అక్షరములతో ప్రారంభమగు వృత్తములతో పద్యములను వ్రాయవలయుననే ఒక ఆలోచన ఫలితమే ఈ ప్రయత్నము.
తల్లియందంపు టద్దమై దనరు తెలుఁగు
సొబగు దెలియక కష్టమం చోకిలించు
నేటియువతకు గురువులౌ మేటివారి
పాటవంబున పాడయ్యె భాష బ్రదుకు!
ఆరున్నరైపోవొచ్చింది
స్నానాల దగ్గిరా జట్టీలు?
నాన్న విన్నారంటే తంతారు!
కాఫీ టిఫినూ ఏవండీ ఇవుగోటి
ఫేంటూ లాల్చీ మంచమ్మీద పెట్టేను
కేరేజీ చురుకుతుంది జాగర్త!
కొండదారిలో రాలిపడ్డ పూలగుత్తుల్నీ
కుబుసాలు విడుచుకుంటోన్న
జంటసర్పాలనీ
జాగ్రత్తగానే దాటుకు ఇల్లు చేరతాను కానీ,
ఆ గాలిలో నలిగిన పూలపరిమళమేదో
ఊపిరిలో చేరి వెంటాడటమాపదు.
ఈ క్షణంలో మనం ఒకటి కావటంలోనే
పురాతనకాలాల విశ్రాంతి కొలువు తీరింది
ఈ విశ్రాంతిలోనే సమస్తసృష్టీ
నదిలో ప్రతిఫలించే ఆకాశంలా తేలుతూ వుంది
పగటి ఎండ
పసిడి తాచు
పడగ దించి
పాకుతుంటే
తాడి తలపై
వారు చూసేదాన్ని వద్దనకు
నమ్మేదాన్ని మిథ్య అనకు
ఆకాశమా! నువు నీలంగా వున్నావని
పదే పదే నినదిస్తే
కాదు కాదంటూ ఉరమకు
రెండు దక్షిణ భాషల సాహిత్య సంపద ఈ శార్దూలవిక్రీడితములో ఒక కవి చేసిన ఒక చిన్న మార్పుతో ముడివేయబడినది. పడమటి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి సత్యాశ్రయుని కాలములో రవికీర్తి అనే ఒక కవి ఆ రాజును పొగడుతూ వ్రాసిన పద్యములు ఐహొళె శిలాశాసనములలో ఉన్నాయి. ఇది క్రీస్తుశకము 634 కాలము నాటిది.
దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉంటే బాగుంటుంది కాని దేశంలో ఉన్న కులాలు అన్నీ, ‘ఎవరి కులం వారి ప్రధాన మంత్రి వారికే’ అంటూ, కులానికొక ప్రధాన మంత్రి కావాలంటే ఏమి సబబు? అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ద్యోతకమయే దృగ్విషయాలని అన్నిటిని ఒకే ఒక సిద్ధాంతంతో అభివర్ణించగలిగితే బాగుంటుందనేది శాస్త్రవేత్తల చిరకాల వాంఛ.
అమ్మా కనకమ్మా
అది ఏమని అనకమ్మా
దిన దినము ఒక తెరుపమ్మా
అమ్మా కనకమ్మా
ప్రఖ్యాత గాయకుడు, రంగస్థల నటుడు శ్రీ మాధవపెద్ది సత్యం సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని, రేడియో కోసం వారు పాడిన ఐదు లలితగీతాలను మీతో పంచుకుంటున్నాను.
ఏ సాంకేతిక సాధనం లేదా యంత్రం, మానవ విచక్షణకు సాటిరావు. ఇవి కొన్ని పరిథులకు లోబడి మనకు సహాయకారిగా ఉంటాయి. పద్య రచననను చేయడానికి భాషపై పట్టు సాధించడంతో పాటుగా, ఛందో నియమాల ధారణ, అధ్యయన, అభ్యాసనాలు కొంతవరకూ చేయవలసిందే. కానీ ఈ ప్రత్యేక సాహిత్య ప్రక్రియను తరువాతి తరానికి అందించడానికి సాంకేతిక సాధనాల అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అటువంటి సాంకేతిక సాధనం ఈ ఛందం©.