రాజీవ్ మళోత్రా పేరొచ్చినాది గదా అని… ఆయన చెప్పేది చాలా కాలం వినుకున్నోణ్ణి ఓ రెండు ముక్కలు చెప్తా నాకు తోచింది.
రౌడీ మూకలు జేసే గలాటాలకీ, ఉద్యమాలకీ తేడా ఉళ్ళా? ఎందుకుళ్ళే, సుబ్బరంగా ఉన్నాది. ఏందబ్బా ఆ తేడా అంటే సిద్ధాంతం అని గదా. సైద్ధాంతిక నిబద్ధత అని గాన ఊతం ఉంతే చేసే అల్లర్లకి ఒక ప్రిస్టేజి వస్తాది. సమస్య ఒకటున్నాది, అది ఎంది, ఎందుకున్నాది, కారణాలేంది – దాని మీద తిరుగుబాటు జేస్తే అది ఉద్యమం అవుతాది. కానీ, లేని సమస్యను చూపించి గాని, చిన్నది పెద్దది జేసి గాని, కూడ ఉద్యమం లేపచ్చు, కాని అది ఎంతోకలం బతకుతాదా? అట్ల జేసేది స్వార్థం కోసరం గాని నిజం ఉద్యమం కాదు గదా. స్వాతంత్ర్యోద్యమం గానీ, తెలంగాణా ఉద్యమం గానీ, ఇంకోటింకోటి గానీ. ఐతె ఇందులొ ఒక తిరకాసున్నాది. తప్పుడు కూతల మీన, అఘాయిత్యం జేసి, అబద్ధాలు చెప్పి, మైకు పట్టుకుని ఊదరగొట్టి తిమ్మిని బమ్మిని జేస్తే అది లాహికి ఐన పద్ధతి గాదు గదా. పునాది దిట్టంగా ఉండాల. చూడ్డానికి దిట్టంగ కనిపిస్తే చాలదు గాదా.
రాజీవ్ మళోత్రా. ఆయన హిందూ సంస్కృతిని తెల్లొళ్ళ నుంచి వాళ్ళ పుస్తకాల నుంచి రక్షిచేటందుకు కష్టపడుతున్నడు. అదే మాట ఆయన ఆయన భక్తులు చెప్పుకుంటరబ్బా. కానీ ఆయన అంతా నిజమే చెప్తున్నడా లేదా? ఎంత నిజం ఉండాది, ఏది డబ్బా అని అది తెలుస్కోని గదా ఆయన మాటలు నమ్మాల్సింది. అది ల్యా. ఆయన మనోడు గాబట్టి, ఆయన మనం గొప్ప, మనం నష్టపోతున్నం అని చెప్తే అది మనకుళ్ళా చల్లగుంటుంది. మనకు నిజం నమ్మే ఓపిక ఉండాదా? యాడికి, మొన్నటికి మొన్న, మీ దేశంలో ఆడోళ్ళకు రేపులైతున్నై అని పేపర్లు రాస్తె, ఏం, మీ దేశంలో మాత్రం గాటల్లా? అని దబాయించుకున్నోళ్ళం.
రాజీవ్ మళోత్రా అనే ఆయన చేస్తుండదేంది? ఇంటర్నెట్ల, పుస్తకాలల ఇంకెక్కడ బడితె అక్కడ ఊదర మన సంస్కృతిని ఈ తెల్లోల్లు పుస్తకాలు రాసి అవమానం చేస్తున్నారు అని, వాళ్ళు చెప్పేది వినిపించుకోడు.
వింటే ఈయన అఘాయిత్యం మనకు తెలుస్తాది కదా. ఈయన అన్నదానికి క్రిపాల్ అనే ఆయన ఒక ఉత్తరం రాశినాడు. దానికి ఉలుకూ పలుకూ ఉన్నాదీ. లేదు. మీరే చదివి తేల్చుకోండి.
వెండీని నిలదీసి పుస్తకాలల వాక్యాలు మార్చుకుంటదా? అని అడిగేటోళ్ళు రాజీవ్ మార్చుకుంటడా అని అడిగితే ఏంది చెప్పేది? కుంటి సాకులు. మొన్న ఆయనెవరో లండన్ల బాపనాయన, ఆయన టివిలో హిందూ సంస్కృతి తోలూ తొండం అని ఒకటే ఊదర. ఏందిరా అంటే ఆయన చెప్పిన తప్పుడు కూతలన్ని రాజీవ్ మళోత్ర దగ్గర ఇన్నవే. ఆ పెద్దమనిసి ఒక్క పుస్తకం చదివి ఏంది నిజం అని చూసుకున్న పాపాన బోతే ఒట్టు. మనల్ల కొంతమందికి, మన మతం అంటే పూనకం వస్తాది. వాళ్ళకి గావల్సింది నిజం గాదు. వాళ్ళనుకున్నట్టు ఉండేదే నిజం. దబాయించో, బెదిరించో మనమే గెలవాలె. అదీ ముఖ్యం.
క్రిపాల్ రాసినదాంట్లో ఉండ విషయాలకు, ఇక్కడ ఈమాటలో ఏసిన ప్రశ్నలు ఎంత పోలికలున్నయో నేను చెప్పకర్లా. ఇప్పటికి ఇదే రకంగా గొంతు పెంచుకుని అరిచి ఎవడేం చెప్పినా ఇనకుండానే ఉంటుళ్ళా, మనం? ఇయ్యన్ని ఎవడిక్కావల, తప్పుకో ఎహే, అనుకుంటిరా, అదీ సరే. పోయి ఆడపిలకాయలు జీన్స్ యేసుకున్నా, మన పిల్లగాళ్ళు వాళెంటిన్స్ డే జర్పుకున్నా పోయి వాళ్ళను కొట్టి రండి. ఒకప్పుడు బొట్లు పెట్టుకున్న మనోళ్ళని అమెరికాలో ఇట్లనే జేశినారు గాదా, ఖలిస్తానోళ్ళు ఆడోళ్ళని చీరలు కట్టుకోవద్దని కొట్టినారు గదా. ఇప్పుడు మనం గూడా అదే దారిల పోదాం. బొమ్మలు చూడకుండ కాల్చేద్దాం, సినిమాలు జూడకుండనే రాళ్ళేద్దాం, పుస్తకాలు చదవ్కుండనే అరుద్దాం. తిరిగి ఏందిరా అయ్యా ఆ అఘాయిత్యం అంటే, నన్ను తాలిబనంటవా అని ఎనక్కి తిరిగి దబాయిద్దాం. మనం గొప్ప అని ఎవరు చెప్తే వాళ్ళ మాటలే ఇనుకుందాం. నేను చెప్పేది అబద్ధంగా ఉన్నాదీ? ఈమాటోళ్ళు గాన, పుస్తకం చదివినోడే అబిప్రాయాలు రాయాల అని అంటే, 110 గాదు 10 గూడ ఉండేవి గాదు. పైన నేంచెప్పిన లింకు చూడకుండనే దాని మీద ఇక్కడింకో వంద కామెంట్లొస్తే గాన మనకేమి ఆశ్చర్యం అక్కర్లా. పదిమంది పదిసార్లు అరిస్తె అబద్ధం నిజం అవుతాది కదా. తాడును జూపించి పాము పాము అని పదిసారిస్తే అందరూ నమ్ముతుళ్ళా? ఇంటర్నెట్ పుణ్యమా అని ఎరిగి లేవలేని ప్రతోడూ పండితుడే. అందరూ ఫేస్బుక్ మేధావులే. చదువుకోడం ముఖ్యం గాదు, నేను చదువుతున్నా అని ముందు పదిమందికి తెలియాల. అదీ ముఖ్యం. స్పాము రాసేవాడొకడుండాలే గాని, దాన్ని ముందెనకలు చూడకుండా ప్రతోడికి ఫారర్డు చేసేటోళ్ళకేం తక్కువుండాది.
కాని, ఒక్కటి జెప్పేదీ? మనల్ని మనం తగలబెట్టుకోని బూడిద జేస్కునేదానికి ఇంకెవరో తెళ్ళోడొచ్చి చేయెయ్యకర్లా. వాళ్ళొచ్చి పుస్తకాలు రాయక్కర్లా. ఆపని మనకు మనమే మరింత సుబ్బరంగ జేస్కుంటున్నాం. వాదించేదానికేందబ్బా, ఎంతైన పెట్టుకోవచ్చు గడా. దానికి పోంతేది, అంతేది? అసలు నిజం ఎతుక్కుంటే మనందరికీ పొద్దు పోయేదెట్లా? మంచికి గాని, చెడ్డకు గాని విమర్శ తీసుకోడం చాతకాని ఏబ్రాసోళ్ళం మనం. మన అజ్ఞానమె మనకు రక్ష. గురివింద గింజలం గద.
అన్నయగారు,
ఇప్పటికే చాలా చర్చ జరిగింది. రఘొత్తమ రావు,శ్రావ్య,భాను,యోగ మొదలైన వారు వేయవలసిన ప్రశ్నలను వేశారు,మంచి చర్చను కొనసాగించారు. ఇక మీరు రాసినదానికి ఏ వివరణ ఇచ్చిన అది, ఇంతక్రితం జరిగిన చర్చలో భావాన్నే స్పురిస్తూ, రిఫ్రెజ్ చేసి రాయటమౌతుంది. అందువలన నేను రాయటంలేదు. నాకు రచయిత గారు తాలిబన్లతో హిందువులను పోల్చటం అభ్యంతరం ఉంది. దాని వివరిస్తూ రెండు పాయింట్లు పైన వ్యాఖ్యలలో రాశాను. వాస్తవానికి భారత్ పాక్ ల మధ్య గల భేదాలను చూపుతూ ఎంతో రాయవచ్చు. చర్చ పక్క దారిపడుతుంది గనుక క్లుప్తంగా రెండు ముక్కలు రాసి ఊరుకొన్నాను.
____________
యోగ/భాను,
భారత దేశ గతం గురించి మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చ ను చదివాను. బ్రిటిష్ పాలనలో మనదేశానికి సంభందించిన అనేక అంశాలను గాంధేయవాది అయిన కీ.శే. ధర్మపాల్ గారు గ్రంథస్థం చేశారు. భారతదేశానికి సంబందించిన అనేక డాక్యుమేంట్లను, లండన్ లో ని ఆర్కైవ్స్ నుంచి సేకరించి, పుస్తకాలుగా ప్రచూరించారు. ఆయన గురించి మరీని వివరాలకు ఈ క్రింది లింక్లు ఇస్తున్నాను.
అన్నయ్య గారూ మీరు చాలా గంభీరంగా వివరించారు. మీరు చెప్పిన పైన విషయాలలో (మొదటి రెందు పారాలలో) నాకు disagreement లేదు. చాలా చక్కగా క్లుప్తం గా వివరించారు. నేను మీతో ఏకీభవిస్తాను. ఇక్కడ మీ వాదనకి నాకు భేదం లేదు.
ఇక పోతే నాకు, మీకు (రచయిత గారికి) ఆ రెండో విషయమై disagreement. పైన నేను ముందే చెప్పినట్టు, నాగరాజు గారు వివరించినట్టు ఆ ముగింపు కి తగ్గ సాక్ష్యాలు లేవు. హిందుత్వా అంటే ఏమిటో నాకు తెలీదు (సవార్కరు వ్రాసినది నేను చదవలేదు). ఐతే ఆయన హిందుత్వా అంటే మనమేదో ఒకే దేవుడు, ఒకే పుస్తకం అని అన్నాడాని నేను అనుకోను, పైగా అలా అన్నాడాని చెప్పడానికి ఎక్కడా విశ్లేషణలు నాకు తారసపడలేదు. నా వైపు నుంచి అసలు మూల కారణమేమిటో కూడా పైన చెప్పాను.
పోనీ for argument sake బాత్రా గానీ, వెండీని వ్యతిరేకిస్తున్న మిగితా వారు (రాజీవ్ మల్హోత్ర కానీ, లేక ఆవిడ చేసిన అనువాదాల మీద తప్పులు చూపించిన రఘోత్తమ రావు గారు కానీ), వీళ్ళెవరూ కూడా మీరుటంకించినట్టు చెయ్యట్లేదే? పైగా పోనీ సంఘ పరివారే హిందుత్వా వాదులు అని ప్రస్తుతానికి అనుకుందాం. వీళ్ళు కూడా ఒకే దేవుడు, ఒకే పుస్తకం, ఇదే నిజం అని నొక్కి వక్కాడించినట్టు కూడా ఆధారాలు లేవు. ఇలా చేస్తున్నారు అన్నవి అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడే మీకూ మాకూ (శ్రీరాం గారిని కలుపుకుని) disagreement. వీళ్ళెవరూ కూడా హుసైన్ విషయం లో శివసేన మూకలు చేసినట్టు ఆధారాలు లేవు. ఇక్కడ కేసుకు ముందు వాగ్వివాదాలు, సంవాదాలు జరిగాయి. ఒప్పుకోనందుకు కేసు వెయ్యడం జరిగింది. నిజానికి బాత్రా గారి కేసు లో కొన్ని విషయాలు హాస్యాస్పదం గా ఉన్నా ఎక్కడా “చాందస” ధోరణి అగుపడట్లేదే? ఈ ముక్క కూడా నేను పైన చెప్పాను.
నా గొడవంతా ఏమిటంటే (మీరన్నట్టే) సెక్యులారిజం ను, ఇలా “చాందస వాదమును” మనం ఆంగ్లం నుంచి తెచ్చిపెట్టుకున్న భావజాలం. ఇది ఒక గంభీరమైన సమస్య. దీన్ని ఇంకా offline చర్చించుకోవచ్చు. వ్యాసానికి పెద్దగా సంబంధం లేదు.
ఒక thought experiment చేసామనుకోండి. ఆంగ్లం తెలీని వాడు బాత్రా గారి హింది పెటీషను చదివితే ఒక వేళ ఎక్కడా “fundamentalism” అని మనం ఈ మధ్య అర్ధం వచ్చేలా అనుకోడు. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టు ఎక్కడా అది గోచరించట్లేడు.
ఐతే కొందరి సంఘ పరివారు లోనే కాదు కొందరు academicians కూడా మీరన్నట్టు మనది కూడా “Monotheistic” అని ఏదో వారితో సరితూగాలనే ఆత్మన్యూనతతో అనటం వాస్తవం. ఆ ఆత్మన్యూనత ను పోగొట్టుకోవాలంటే వెండీ లాంటి (so far unchallenged academic from insiders) ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. దానికి రోజులు వస్తున్నయనిపిస్తోంది. ఈ ఆత్మ న్యూనత మనకి పేదరికం నుంచి, పరపాలన పీడితులవటం వలన అని నా అభిప్రాయం. దీనికి ఆధారలను పరిశీలిస్తే empirical గా గమనించగలం.
ఈ పుస్తకం పుణ్యమా అని ఇప్పుడు ఒక సామన్యుడు (only in comparison to Wendy’s lofty degrees) కూడా చదివి విశ్లేషించగలడు. అందుకు ఈ పుస్తకానికి వచ్చిన పబ్లిసిటీ మంచిదే అనిపిస్తుంది. నాకు అబధ్ధపు, అసంబధ్ధపు, పక్షపాతపు విస్లేషణలతోనే చిక్కు…
పురాణాల్ని పురాణాలుగా, కథలుగా, సాహిత్యంగా చూసినంతవరకూ ఎవరికీ పేచీ ఉండదు. కానీ, ఎప్పుడైతే కథలు సామాజిక ప్రవర్తనకి కారణభూతాలౌతాయో, విలువల స్థాపనకు మూలాలౌతాయో అప్పుడు కథల్లో ఉన్న ఆలోచనా, ఆపాదించబడుతున్న “నిజం” రెండూ ప్రశ్నింపబడతాయి. ఒకవేళ పురాణాలను చరిత్రగా రుద్దడానికి ప్రయత్నిస్తే తార్కికంగా శాస్త్రీయంగా తిరస్కరించబడతాయని గమనించాలి.
వాస్తవ ప్రపంచంతో సంబంధం తెగిపోయిన మానసికరోగంతో ఛాందసులు బతుకుతున్నారు. ఒక సగం విజ్ఞాన శాస్ర్తానికి నివాళులర్పిస్తూ శాస్త్రీయవిధానాన్ని అనుసరిస్తుంటే, మరో సగం గతంలో వేళ్లూనుకు జీవిస్తూ గతం యొక్క సాంప్రదాయాల సంకెళ్లలో బందీ అయ్యింది. మన సమాజంలోని వివేకవంతులైన మేధావి వర్గం కూడా ఈ ద్వంద ప్రవృత్తి రోగగ్రస్థులై, విజ్ఞానశాస్ర్తాన్ని అంగీకరిస్తూనే, విజ్ఞానాన్ని వ్యతిరేకించే భావాలకు దాసోహమంటున్నారు. పూర్వతరాల వేదాంతులు సాధించాలనుకున్నట్లుగా, పురాతన కాలంలో రుషులు కనుగొనబడినట్లుగా, మరల కనుగొనబడడానికి సిద్ధంగా ఉండి, తరువాతి తరంచే అభిమానించబడుతున్న శుద్ధసత్యం, ప్రామాణికత్వపు కొలబద్దతో మనం దీనిని అర్థం చేసుకోవాలా? వట్టి తర్కవిశ్లేషణలతో మన వర్తమాన తాత్విక లక్ష్యాన్ని నిర్ణయించగలమా? ఇది ఆత్మవంచన అవుతుంది. ఈ పద్ధతి ఔచిత్యరహితంగా, అనవసర పాండిత్యమీమాంసలకు దారితీస్తుంది.భారతీయ ఆలోచనను ఇరుకు చట్రాలలో బంధించి, అడ్డుచెప్పని మూఢనమ్మకాల పనిముట్టుగా మలిచి, ఛాందస భావాలకు బానిసగా మార్చి, దాని యొక్క ఔనత్యాన్ని, చారిత్రిక సామర్య్థాన్ని కొల్లగొట్టే చలన రాహిత్యాన్ని ఎన్నుకోవటమా? మీరే చెప్పండి. ఎవరైనా అజ్ఞానానికి మొగ్గుచూపే మనస్తత్వాన్ని తొలగించుకుంటే సమాజానికి మంచింది. మన పారంపరిక భారతీయ తాత్వికులలోని ఒక వర్గం నుండి వారసత్వంగా లభించినదంతా పూర్తి వంచనా అసత్యాల మూటే అయినా, ఇవే అసత్యాలనూ వంచనాలనూ డానిగర్ గారు తన పుస్తకంలో మన ముందుంచితే వాటినే సురేష్ కొలచాల గారు విశ్లేషించారు.
సురేష్ గారు భయాందోళనలు వ్యక్తం చేసినట్లు ప్రస్తుతం హిందుత్వవాదులనుండే హిందూమతానికి అత్యంతప్రమాదం ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది.ఈ వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలను గమనిస్తే అర్థమవుతుంది. “మూల గ్రంథాలు చదివి భారతీయ సంస్కృతిలోని నిర్మాణ సంక్లిష్టతలను లోతుగా అర్థం చేసుకొనే జఠర పుష్టి లేని ఇప్పటి హిందుత్వవాదుల దృక్పథం నిజానికి పూర్తిగా పాశ్చాత్యవాదం.పాశ్చాత్య మతాలలో లాగా హిందూ మతానికి ఒక దేవుడు, ఒక ప్రబోధకుడు, ఒకే మూల గ్రంథం ఉన్నాయని వాదించడం ఏ మాత్రం భారతీయం కాదు. హిందూ విశ్వాసం ఒక్కడే దేవుడన్నవాడిని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడిని, అసలు దేముడే లేడన్నవాణ్ని కూడా సమానంగా ఆదరిస్తుంది. అలాగే శృంగారాన్ని సంకోచం లేకుండా చర్చించిన హిందూ మతం యొక్క విశిష్టతను గుర్తించుకోకుండా, బ్రిటిష్ వారి ద్వారా సంక్రమించిన విక్టోరియన్ నీతుల పరదాలు కప్పుకొని మన నాగరికతను మనమే చిన్నబుచ్చుకోవడం, విశాల వీథుల్లో పరిఢవిల్లిన హిందూ మతాన్ని ఇరుకు ఛాందస వీథుల్లో బురఖా వేసి నడిపించడం వంటిదే”.
మాయావాదం, నిగూఢత్వం, మత ప్రాతిపదికపు తాత్విక ధోరణీ, ఇతర శిథిల జీర్ణధోరణులు ఉన్నా భారతీయ తత్వశాస్ర్తంలో ఎంతో ముఖ్యమైన ధోరణులు కూడా ఉన్నాయి. భారతీయ తాత్విక పరిస్థితిని అవగాహన చేసుకోవటం, దాన్ని అసాధారణ క్రమంలో పరిశీలించటంలో ఉన్నది.
శ్రీ పప్పు: మీ అభిప్రాయానికి అనుబంధంగా నేను కొంత రాయాలి అని అనుకుంటున్నాను. ఈ లోపల ఒక మాట. నేను నా ఒక అభిప్రాయంలొ ‘అనేకానేక శివుళ్ళు’ ఉన్నారని రాశాను ‘ ఇవల్యూషన్ /ఇంటెగ్రేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ శివ’ ,’శివుడి చరిత్ర’ లాంటివి కుదరనివి అని రాశాను. ఆ దిస గా ఈ పొడవైన ఉట్టంకింపు చూడండి. [రచన ఎంత succinctగా ఉన్నదో ]
‘There are religions, such as Christianity and Islam, based upon teachings which are considered by their followers as the only absolute truth. These teachings are, therefore, supposed to be essentially good for all mankind, and it is the duty of every believer to preach them, by word and by deed, so that every man may accept them and be saved. Such religions style themselves as world-religions. The ideal of their followers is the unification of all mankind, on the basis both of certain moral and spiritual teachings, and of certain metaphysical beliefs, looked upon as absolute truth, expressed once for all at a certain time, in a certain place, by a certain person, and recorded in a certain sacred book to which, naturally, no alteration and no addition can be made.
Uses and customs can easily differ, from place to place, according to geographical, political, and other conditions, provided their existence is not a denial of any of the fundamental beliefs upon which the whole religious structure lies. Culture itself can differ, from nation to nation, as long as these common beliefs remain. What greater difference can there be, for instance, than that between the culture of a Presbyterian Scotchman and of a Catholic Spaniard, or of a Syrian Christian, or of an Abyssinian? Yet, there is, between them, a minimum of common beliefs, sufficient to justify their common claim to be called “Christians.” The same thing could be said about a Mohammadan from Arabia or Iraq, compared to a Mohammadan from Java.
We call “creedal religions” all religions of the type of Christianity or Islam, in which the link among the faithful is necessarily common beliefs, but not necessarily common civilisation or culture.
* * *
But there are religions which do not rest upon any moral or metaphysical “truth,” considered as absolute. Their followers may or may not accept a certain number of common beliefs, and, if they do, still they do not condemn the many possible beliefs, in religions different from theirs, as “false,” nor do they look down upon them as “precious teachings entangled with superstition.” In fact, the followers of each one of such religions generally do differ from one another on the ground of metaphysics, of morals, or of religious discipline. Take the instance of the cultured ancient Greeks, followers of the same national religion but, at the same time, followers of different (and antagonistic) philosophies. There was, in that national religion of theirs, no common metaphysical system, comparable with that which we find in Hellenized Christianity. Take the instance of the cultured modern Hindus, of different sects. There is very little common in their religious outlook, or in the particular discipline they may follow. One worships a personal God; one worships God as impersonal; a third one does not believe in God at all; one practices hate yoga, another practices nothing but bhakti. Still, they are all Hindus, just as the ancient Greeks, in spite of their opposite metaphysical views, or of their personal devotion to entirely different Gods, were the followers of the same “religion.”
It is easy to see that the word “religion,” in this case, bears a totally different meaning from that which it had, while applied to “creedal religions” such as Christianity or Islam.
Here, there is no truth, whether concerning God, soul, salvation, creation, or anything else, which should be considered as absolute by all men. Every truth is relative, being the outcome of man’s experience, which is necessarily limited. And therefore, metaphysics (the common ground of religious thought, in “creedal” religions) are a matter of individual outlook. Spiritual realization is also individual. The knowledge that it gives cannot be transmitted to a crowd. Even the path to realization cannot be shown but to those who have undergone, through previous experience, a sufficient evolution.
In other words, in religions which are not creedal, there can be no conflict between “religion” and “philosophy,” no more than between “religion” and “science,” for a broad spirit of free research — that what is called, in modern language, scientific spirit — is applied there, without restriction, to every sphere of life, including spiritual realization. And there can be no common beliefs commended to men at different stages of evolution. There can be no one-sided outlook on God, soul, etc., “good for all mankind,” to be preached from country to country.
Hinduism is the most perfect type of such “religions” which we shall call, presently, for sake of convenience, “non-creedal,” until further analysis allows us to characterize them more positively.’
From: A WARNING TO THE HINDUS, by Savitri Devi, (Calcutta 1939.)
అలాగే The Hindus: An Alternative History by Wendy Doniger – review. Priyamvada Gopal relishes a riposte to Hindu hardliners. The Guardian, Saturday 23 October 2010 గూడా చదవదగినది.
చాలా నచ్చింది వైదేహి గారు, మీ కవిత. ఎంతో అపురూప భావానికి అందమైన రూపాన్నిచ్చారు.
“మనం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం
ఎప్పుడో ఒక క్షణంలో మాత్రం చందన పుష్పాల్లా
మాటలు మన మధ్య కొత్తగా గుబాళిస్తాయి”
నిజంగా నిజం. రోజువారీ మాటల్లో మనసులో నిలచిపోగలవెన్ని ఉంటాయి? కానీ అరుదుగా వచ్చే కొన్ని క్షణాలుంటాయి…కొత్త ఆలోచనలని రేకిత్తించే మాటలు పుట్టే క్షణాలు, మనం take it for granted అనుకునే వ్యక్తులని, మనసులని, ప్రేమలని, మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలో,మళ్ళీ మరొకసారి కొత్తగా మనకు నేర్పించే సమయాలు, ఆ సమయంలో మొక్కుబడిగా కాక మనసులోతుల్లోనుంచి వచ్చే గుప్పెడు మాటలు, కాసిన్ని నవ్వుల చిలకరింపులు.
“మళ్ళీ మంత్రధూళి రాలే వరకూ” ఆ క్షణాలే కదూ మనల్ని కేవలం బ్రతికించకుండా జీవించగలిగేటట్లు చేసేవి.
@నాగరాజు గారూ: మీ విమర్శ చాలా బావుందండీ…Good writing.
@సతీష్ గారూ: నమస్కారం.
మీరు ఇలా విషయం లేకుండా, ఏవేవో ఊహించేసుకుని, (metaphor అంటే ఏమిటో తెలీకుండా – లేదా తెలీనట్టుగా) రాస్తూ ఉంటే నేను చర్చించలేను…చర్చించను.
వ్యాసానికి సంబంధించినవి, మిగితా కొన్ని చర్చనీయాశమైనవి చెప్పకనే చెప్పాను. మీ ఊహలతో, ఆపోహలతో నాకు సంబంధం లేదు. ధన్యవాదాలు. మన్నించగలరు.
చివరగా ఒక్క మాట: నాకు పేదరికం (దానికి కారణం అర్ధం చేసుకోవడం, ఆ పై నిర్మూలనకి నా వంతు కృషి ఏదో నేను చెయ్యడం) తోనే సంబంధం. పేదరికానికి కులం, జాతి, భాష తో సంబంధం లేడు. అందరినీ ఒకె కర్కశం తో వేధిస్తుంది, అందరినీ ఒకేలా కబళిస్తుంది. ఆ విధం గా పేదరికానికొక్కదానికే అస్మదీయభావాలు ఉండవు. అందుకే పేదరికం తో నే నాకు స్నేహం, శతృత్వం కూడా. కాబట్టీ మీరు ఏవేవో ఊహించుకుని, అనవసర ప్రసంగాలు చెయ్యడం సమయం వృధా చేసుకోవడమే.
యోగా గారి దూకుడు (comment at March 12, 2014 5:39 pm) చూస్తుంటే వారి దృష్టిలో ఎవరైతే “లిబరల్ మహాశయు”లో వారి మీదకు క్రూరమృగాలను ఎప్పుడు ఉసిగొల్పుదామా అని మాంచి ఆత్రుతగా ఎదురుచూస్తునట్టు ఉన్నారు. ఏం యోగా గారు, గుజరాత్ లో జరిగిన “సింహాల వేట” దేశమంతా కూడా జరగాలని కఠోర తపస్సు చేస్తున్నారా? ఈ రకమైన భిన్నభావలను కించిత్తుకూడా ఓర్వలేని హిందుత్వవాదం వల్ల ఒరిగే నష్టాలగురించే కాబోలు సురేష్ గారు ఈ వ్యాసంలో హెచ్చరించింది.
I have not said sorry to you. Why would ‘I’ say sorry to ‘you,’ when it is you have misinterpreted Bhattumurthi’s poem. Generally people say sorry for their own mistakes.:-)
Your generic philosophy aside, the specific poem is misinterpreted.
I don’t buy the పొత్తుల reason you gave, Kamesh! Too flimsy.
There is inherent difficulty in interpreting poets who want to exhibit the art of శ్లేష in their poetry. They tend to make themselves ambiguous.
Also;
Some poets are in the habit of writing poems any time any place, and inserting them later on in different texts to suit their multi purposes. Their credibility value is questionable.:-)
Look at the poetry in కుంతీకుమారి. ఇందులో పాపయ్య శాస్త్రి ,వేర్వేరు చోట్ల — మరులు రేకెత్త, కాంక్ష లల్లాడ, ఆకులోనుండి ముద్దు మూతిపై,లాటి phrases వాడారు. ఐనా ప్రతి పద్యము లోను, తల్లి, ఒక పసి పిల్లవాడు స్పష్టము. భావములు స్పష్టములు. There is never any ambiguity created by the words.
For me such a poetry is best poetry.
కామేశ్వరరావు గారూ! your interpretation of పొత్తులు in this poem is wrong.
So is your understanding of Word కలకంఠి. I am sorry! ఈ పద్యంలో కోయిలలు లేవు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Anand Gudlur అభిప్రాయం:
03/16/2014 8:47 pm
రాజీవ్ మళోత్రా పేరొచ్చినాది గదా అని… ఆయన చెప్పేది చాలా కాలం వినుకున్నోణ్ణి ఓ రెండు ముక్కలు చెప్తా నాకు తోచింది.
రౌడీ మూకలు జేసే గలాటాలకీ, ఉద్యమాలకీ తేడా ఉళ్ళా? ఎందుకుళ్ళే, సుబ్బరంగా ఉన్నాది. ఏందబ్బా ఆ తేడా అంటే సిద్ధాంతం అని గదా. సైద్ధాంతిక నిబద్ధత అని గాన ఊతం ఉంతే చేసే అల్లర్లకి ఒక ప్రిస్టేజి వస్తాది. సమస్య ఒకటున్నాది, అది ఎంది, ఎందుకున్నాది, కారణాలేంది – దాని మీద తిరుగుబాటు జేస్తే అది ఉద్యమం అవుతాది. కానీ, లేని సమస్యను చూపించి గాని, చిన్నది పెద్దది జేసి గాని, కూడ ఉద్యమం లేపచ్చు, కాని అది ఎంతోకలం బతకుతాదా? అట్ల జేసేది స్వార్థం కోసరం గాని నిజం ఉద్యమం కాదు గదా. స్వాతంత్ర్యోద్యమం గానీ, తెలంగాణా ఉద్యమం గానీ, ఇంకోటింకోటి గానీ. ఐతె ఇందులొ ఒక తిరకాసున్నాది. తప్పుడు కూతల మీన, అఘాయిత్యం జేసి, అబద్ధాలు చెప్పి, మైకు పట్టుకుని ఊదరగొట్టి తిమ్మిని బమ్మిని జేస్తే అది లాహికి ఐన పద్ధతి గాదు గదా. పునాది దిట్టంగా ఉండాల. చూడ్డానికి దిట్టంగ కనిపిస్తే చాలదు గాదా.
రాజీవ్ మళోత్రా. ఆయన హిందూ సంస్కృతిని తెల్లొళ్ళ నుంచి వాళ్ళ పుస్తకాల నుంచి రక్షిచేటందుకు కష్టపడుతున్నడు. అదే మాట ఆయన ఆయన భక్తులు చెప్పుకుంటరబ్బా. కానీ ఆయన అంతా నిజమే చెప్తున్నడా లేదా? ఎంత నిజం ఉండాది, ఏది డబ్బా అని అది తెలుస్కోని గదా ఆయన మాటలు నమ్మాల్సింది. అది ల్యా. ఆయన మనోడు గాబట్టి, ఆయన మనం గొప్ప, మనం నష్టపోతున్నం అని చెప్తే అది మనకుళ్ళా చల్లగుంటుంది. మనకు నిజం నమ్మే ఓపిక ఉండాదా? యాడికి, మొన్నటికి మొన్న, మీ దేశంలో ఆడోళ్ళకు రేపులైతున్నై అని పేపర్లు రాస్తె, ఏం, మీ దేశంలో మాత్రం గాటల్లా? అని దబాయించుకున్నోళ్ళం.
రాజీవ్ మళోత్రా అనే ఆయన చేస్తుండదేంది? ఇంటర్నెట్ల, పుస్తకాలల ఇంకెక్కడ బడితె అక్కడ ఊదర మన సంస్కృతిని ఈ తెల్లోల్లు పుస్తకాలు రాసి అవమానం చేస్తున్నారు అని, వాళ్ళు చెప్పేది వినిపించుకోడు.
వింటే ఈయన అఘాయిత్యం మనకు తెలుస్తాది కదా. ఈయన అన్నదానికి క్రిపాల్ అనే ఆయన ఒక ఉత్తరం రాశినాడు. దానికి ఉలుకూ పలుకూ ఉన్నాదీ. లేదు. మీరే చదివి తేల్చుకోండి.
http://www.ruf.rice.edu/~kalischi/tantrictruth.html
వెండీని నిలదీసి పుస్తకాలల వాక్యాలు మార్చుకుంటదా? అని అడిగేటోళ్ళు రాజీవ్ మార్చుకుంటడా అని అడిగితే ఏంది చెప్పేది? కుంటి సాకులు. మొన్న ఆయనెవరో లండన్ల బాపనాయన, ఆయన టివిలో హిందూ సంస్కృతి తోలూ తొండం అని ఒకటే ఊదర. ఏందిరా అంటే ఆయన చెప్పిన తప్పుడు కూతలన్ని రాజీవ్ మళోత్ర దగ్గర ఇన్నవే. ఆ పెద్దమనిసి ఒక్క పుస్తకం చదివి ఏంది నిజం అని చూసుకున్న పాపాన బోతే ఒట్టు. మనల్ల కొంతమందికి, మన మతం అంటే పూనకం వస్తాది. వాళ్ళకి గావల్సింది నిజం గాదు. వాళ్ళనుకున్నట్టు ఉండేదే నిజం. దబాయించో, బెదిరించో మనమే గెలవాలె. అదీ ముఖ్యం.
క్రిపాల్ రాసినదాంట్లో ఉండ విషయాలకు, ఇక్కడ ఈమాటలో ఏసిన ప్రశ్నలు ఎంత పోలికలున్నయో నేను చెప్పకర్లా. ఇప్పటికి ఇదే రకంగా గొంతు పెంచుకుని అరిచి ఎవడేం చెప్పినా ఇనకుండానే ఉంటుళ్ళా, మనం? ఇయ్యన్ని ఎవడిక్కావల, తప్పుకో ఎహే, అనుకుంటిరా, అదీ సరే. పోయి ఆడపిలకాయలు జీన్స్ యేసుకున్నా, మన పిల్లగాళ్ళు వాళెంటిన్స్ డే జర్పుకున్నా పోయి వాళ్ళను కొట్టి రండి. ఒకప్పుడు బొట్లు పెట్టుకున్న మనోళ్ళని అమెరికాలో ఇట్లనే జేశినారు గాదా, ఖలిస్తానోళ్ళు ఆడోళ్ళని చీరలు కట్టుకోవద్దని కొట్టినారు గదా. ఇప్పుడు మనం గూడా అదే దారిల పోదాం. బొమ్మలు చూడకుండ కాల్చేద్దాం, సినిమాలు జూడకుండనే రాళ్ళేద్దాం, పుస్తకాలు చదవ్కుండనే అరుద్దాం. తిరిగి ఏందిరా అయ్యా ఆ అఘాయిత్యం అంటే, నన్ను తాలిబనంటవా అని ఎనక్కి తిరిగి దబాయిద్దాం. మనం గొప్ప అని ఎవరు చెప్తే వాళ్ళ మాటలే ఇనుకుందాం. నేను చెప్పేది అబద్ధంగా ఉన్నాదీ? ఈమాటోళ్ళు గాన, పుస్తకం చదివినోడే అబిప్రాయాలు రాయాల అని అంటే, 110 గాదు 10 గూడ ఉండేవి గాదు. పైన నేంచెప్పిన లింకు చూడకుండనే దాని మీద ఇక్కడింకో వంద కామెంట్లొస్తే గాన మనకేమి ఆశ్చర్యం అక్కర్లా. పదిమంది పదిసార్లు అరిస్తె అబద్ధం నిజం అవుతాది కదా. తాడును జూపించి పాము పాము అని పదిసారిస్తే అందరూ నమ్ముతుళ్ళా? ఇంటర్నెట్ పుణ్యమా అని ఎరిగి లేవలేని ప్రతోడూ పండితుడే. అందరూ ఫేస్బుక్ మేధావులే. చదువుకోడం ముఖ్యం గాదు, నేను చదువుతున్నా అని ముందు పదిమందికి తెలియాల. అదీ ముఖ్యం. స్పాము రాసేవాడొకడుండాలే గాని, దాన్ని ముందెనకలు చూడకుండా ప్రతోడికి ఫారర్డు చేసేటోళ్ళకేం తక్కువుండాది.
కాని, ఒక్కటి జెప్పేదీ? మనల్ని మనం తగలబెట్టుకోని బూడిద జేస్కునేదానికి ఇంకెవరో తెళ్ళోడొచ్చి చేయెయ్యకర్లా. వాళ్ళొచ్చి పుస్తకాలు రాయక్కర్లా. ఆపని మనకు మనమే మరింత సుబ్బరంగ జేస్కుంటున్నాం. వాదించేదానికేందబ్బా, ఎంతైన పెట్టుకోవచ్చు గడా. దానికి పోంతేది, అంతేది? అసలు నిజం ఎతుక్కుంటే మనందరికీ పొద్దు పోయేదెట్లా? మంచికి గాని, చెడ్డకు గాని విమర్శ తీసుకోడం చాతకాని ఏబ్రాసోళ్ళం మనం. మన అజ్ఞానమె మనకు రక్ష. గురివింద గింజలం గద.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/16/2014 2:17 pm
శ్రేరాం గారూ,
ఆ లింకుల కి ధన్యవాదాలు. మీరు నా బ్లాగ్ లింక్ ద్వారా గానీ, లేదా సంపాదకుల ద్వారా గానీ ఈమైలు తీసుకుని వీలుంటే సంప్రదించండి. సంతోషిస్తాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam అభిప్రాయం:
03/16/2014 1:05 pm
అన్నయగారు,
ఇప్పటికే చాలా చర్చ జరిగింది. రఘొత్తమ రావు,శ్రావ్య,భాను,యోగ మొదలైన వారు వేయవలసిన ప్రశ్నలను వేశారు,మంచి చర్చను కొనసాగించారు. ఇక మీరు రాసినదానికి ఏ వివరణ ఇచ్చిన అది, ఇంతక్రితం జరిగిన చర్చలో భావాన్నే స్పురిస్తూ, రిఫ్రెజ్ చేసి రాయటమౌతుంది. అందువలన నేను రాయటంలేదు. నాకు రచయిత గారు తాలిబన్లతో హిందువులను పోల్చటం అభ్యంతరం ఉంది. దాని వివరిస్తూ రెండు పాయింట్లు పైన వ్యాఖ్యలలో రాశాను. వాస్తవానికి భారత్ పాక్ ల మధ్య గల భేదాలను చూపుతూ ఎంతో రాయవచ్చు. చర్చ పక్క దారిపడుతుంది గనుక క్లుప్తంగా రెండు ముక్కలు రాసి ఊరుకొన్నాను.
____________
యోగ/భాను,
భారత దేశ గతం గురించి మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చ ను చదివాను. బ్రిటిష్ పాలనలో మనదేశానికి సంభందించిన అనేక అంశాలను గాంధేయవాది అయిన కీ.శే. ధర్మపాల్ గారు గ్రంథస్థం చేశారు. భారతదేశానికి సంబందించిన అనేక డాక్యుమేంట్లను, లండన్ లో ని ఆర్కైవ్స్ నుంచి సేకరించి, పుస్తకాలుగా ప్రచూరించారు. ఆయన గురించి మరీని వివరాలకు ఈ క్రింది లింక్లు ఇస్తున్నాను.
Introduction to Dharampal’s work http://www.youtube.com/watch?v=CoOUnwPkUAk
http://en.wikipedia.org/wiki/Dharampal
http://www.arvindguptatoys.com/arvindgupta/beautifultree.pdf
https://archive.org/details/DharampalCollectedWritingsIn5Volumes
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/16/2014 10:04 am
అన్నయ్య గారూ మీరు చాలా గంభీరంగా వివరించారు. మీరు చెప్పిన పైన విషయాలలో (మొదటి రెందు పారాలలో) నాకు disagreement లేదు. చాలా చక్కగా క్లుప్తం గా వివరించారు. నేను మీతో ఏకీభవిస్తాను. ఇక్కడ మీ వాదనకి నాకు భేదం లేదు.
ఇక పోతే నాకు, మీకు (రచయిత గారికి) ఆ రెండో విషయమై disagreement. పైన నేను ముందే చెప్పినట్టు, నాగరాజు గారు వివరించినట్టు ఆ ముగింపు కి తగ్గ సాక్ష్యాలు లేవు. హిందుత్వా అంటే ఏమిటో నాకు తెలీదు (సవార్కరు వ్రాసినది నేను చదవలేదు). ఐతే ఆయన హిందుత్వా అంటే మనమేదో ఒకే దేవుడు, ఒకే పుస్తకం అని అన్నాడాని నేను అనుకోను, పైగా అలా అన్నాడాని చెప్పడానికి ఎక్కడా విశ్లేషణలు నాకు తారసపడలేదు. నా వైపు నుంచి అసలు మూల కారణమేమిటో కూడా పైన చెప్పాను.
పోనీ for argument sake బాత్రా గానీ, వెండీని వ్యతిరేకిస్తున్న మిగితా వారు (రాజీవ్ మల్హోత్ర కానీ, లేక ఆవిడ చేసిన అనువాదాల మీద తప్పులు చూపించిన రఘోత్తమ రావు గారు కానీ), వీళ్ళెవరూ కూడా మీరుటంకించినట్టు చెయ్యట్లేదే? పైగా పోనీ సంఘ పరివారే హిందుత్వా వాదులు అని ప్రస్తుతానికి అనుకుందాం. వీళ్ళు కూడా ఒకే దేవుడు, ఒకే పుస్తకం, ఇదే నిజం అని నొక్కి వక్కాడించినట్టు కూడా ఆధారాలు లేవు. ఇలా చేస్తున్నారు అన్నవి అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడే మీకూ మాకూ (శ్రీరాం గారిని కలుపుకుని) disagreement. వీళ్ళెవరూ కూడా హుసైన్ విషయం లో శివసేన మూకలు చేసినట్టు ఆధారాలు లేవు. ఇక్కడ కేసుకు ముందు వాగ్వివాదాలు, సంవాదాలు జరిగాయి. ఒప్పుకోనందుకు కేసు వెయ్యడం జరిగింది. నిజానికి బాత్రా గారి కేసు లో కొన్ని విషయాలు హాస్యాస్పదం గా ఉన్నా ఎక్కడా “చాందస” ధోరణి అగుపడట్లేదే? ఈ ముక్క కూడా నేను పైన చెప్పాను.
నా గొడవంతా ఏమిటంటే (మీరన్నట్టే) సెక్యులారిజం ను, ఇలా “చాందస వాదమును” మనం ఆంగ్లం నుంచి తెచ్చిపెట్టుకున్న భావజాలం. ఇది ఒక గంభీరమైన సమస్య. దీన్ని ఇంకా offline చర్చించుకోవచ్చు. వ్యాసానికి పెద్దగా సంబంధం లేదు.
ఒక thought experiment చేసామనుకోండి. ఆంగ్లం తెలీని వాడు బాత్రా గారి హింది పెటీషను చదివితే ఒక వేళ ఎక్కడా “fundamentalism” అని మనం ఈ మధ్య అర్ధం వచ్చేలా అనుకోడు. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టు ఎక్కడా అది గోచరించట్లేడు.
ఐతే కొందరి సంఘ పరివారు లోనే కాదు కొందరు academicians కూడా మీరన్నట్టు మనది కూడా “Monotheistic” అని ఏదో వారితో సరితూగాలనే ఆత్మన్యూనతతో అనటం వాస్తవం. ఆ ఆత్మన్యూనత ను పోగొట్టుకోవాలంటే వెండీ లాంటి (so far unchallenged academic from insiders) ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. దానికి రోజులు వస్తున్నయనిపిస్తోంది. ఈ ఆత్మ న్యూనత మనకి పేదరికం నుంచి, పరపాలన పీడితులవటం వలన అని నా అభిప్రాయం. దీనికి ఆధారలను పరిశీలిస్తే empirical గా గమనించగలం.
ఈ పుస్తకం పుణ్యమా అని ఇప్పుడు ఒక సామన్యుడు (only in comparison to Wendy’s lofty degrees) కూడా చదివి విశ్లేషించగలడు. అందుకు ఈ పుస్తకానికి వచ్చిన పబ్లిసిటీ మంచిదే అనిపిస్తుంది. నాకు అబధ్ధపు, అసంబధ్ధపు, పక్షపాతపు విస్లేషణలతోనే చిక్కు…
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి annaiah అభిప్రాయం:
03/16/2014 9:10 am
యోగా గారూ, శ్రీరామ్ గారూ….
పురాణాల్ని పురాణాలుగా, కథలుగా, సాహిత్యంగా చూసినంతవరకూ ఎవరికీ పేచీ ఉండదు. కానీ, ఎప్పుడైతే కథలు సామాజిక ప్రవర్తనకి కారణభూతాలౌతాయో, విలువల స్థాపనకు మూలాలౌతాయో అప్పుడు కథల్లో ఉన్న ఆలోచనా, ఆపాదించబడుతున్న “నిజం” రెండూ ప్రశ్నింపబడతాయి. ఒకవేళ పురాణాలను చరిత్రగా రుద్దడానికి ప్రయత్నిస్తే తార్కికంగా శాస్త్రీయంగా తిరస్కరించబడతాయని గమనించాలి.
వాస్తవ ప్రపంచంతో సంబంధం తెగిపోయిన మానసికరోగంతో ఛాందసులు బతుకుతున్నారు. ఒక సగం విజ్ఞాన శాస్ర్తానికి నివాళులర్పిస్తూ శాస్త్రీయవిధానాన్ని అనుసరిస్తుంటే, మరో సగం గతంలో వేళ్లూనుకు జీవిస్తూ గతం యొక్క సాంప్రదాయాల సంకెళ్లలో బందీ అయ్యింది. మన సమాజంలోని వివేకవంతులైన మేధావి వర్గం కూడా ఈ ద్వంద ప్రవృత్తి రోగగ్రస్థులై, విజ్ఞానశాస్ర్తాన్ని అంగీకరిస్తూనే, విజ్ఞానాన్ని వ్యతిరేకించే భావాలకు దాసోహమంటున్నారు. పూర్వతరాల వేదాంతులు సాధించాలనుకున్నట్లుగా, పురాతన కాలంలో రుషులు కనుగొనబడినట్లుగా, మరల కనుగొనబడడానికి సిద్ధంగా ఉండి, తరువాతి తరంచే అభిమానించబడుతున్న శుద్ధసత్యం, ప్రామాణికత్వపు కొలబద్దతో మనం దీనిని అర్థం చేసుకోవాలా? వట్టి తర్కవిశ్లేషణలతో మన వర్తమాన తాత్విక లక్ష్యాన్ని నిర్ణయించగలమా? ఇది ఆత్మవంచన అవుతుంది. ఈ పద్ధతి ఔచిత్యరహితంగా, అనవసర పాండిత్యమీమాంసలకు దారితీస్తుంది.భారతీయ ఆలోచనను ఇరుకు చట్రాలలో బంధించి, అడ్డుచెప్పని మూఢనమ్మకాల పనిముట్టుగా మలిచి, ఛాందస భావాలకు బానిసగా మార్చి, దాని యొక్క ఔనత్యాన్ని, చారిత్రిక సామర్య్థాన్ని కొల్లగొట్టే చలన రాహిత్యాన్ని ఎన్నుకోవటమా? మీరే చెప్పండి. ఎవరైనా అజ్ఞానానికి మొగ్గుచూపే మనస్తత్వాన్ని తొలగించుకుంటే సమాజానికి మంచింది. మన పారంపరిక భారతీయ తాత్వికులలోని ఒక వర్గం నుండి వారసత్వంగా లభించినదంతా పూర్తి వంచనా అసత్యాల మూటే అయినా, ఇవే అసత్యాలనూ వంచనాలనూ డానిగర్ గారు తన పుస్తకంలో మన ముందుంచితే వాటినే సురేష్ కొలచాల గారు విశ్లేషించారు.
సురేష్ గారు భయాందోళనలు వ్యక్తం చేసినట్లు ప్రస్తుతం హిందుత్వవాదులనుండే హిందూమతానికి అత్యంతప్రమాదం ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది.ఈ వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలను గమనిస్తే అర్థమవుతుంది. “మూల గ్రంథాలు చదివి భారతీయ సంస్కృతిలోని నిర్మాణ సంక్లిష్టతలను లోతుగా అర్థం చేసుకొనే జఠర పుష్టి లేని ఇప్పటి హిందుత్వవాదుల దృక్పథం నిజానికి పూర్తిగా పాశ్చాత్యవాదం.పాశ్చాత్య మతాలలో లాగా హిందూ మతానికి ఒక దేవుడు, ఒక ప్రబోధకుడు, ఒకే మూల గ్రంథం ఉన్నాయని వాదించడం ఏ మాత్రం భారతీయం కాదు. హిందూ విశ్వాసం ఒక్కడే దేవుడన్నవాడిని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడిని, అసలు దేముడే లేడన్నవాణ్ని కూడా సమానంగా ఆదరిస్తుంది. అలాగే శృంగారాన్ని సంకోచం లేకుండా చర్చించిన హిందూ మతం యొక్క విశిష్టతను గుర్తించుకోకుండా, బ్రిటిష్ వారి ద్వారా సంక్రమించిన విక్టోరియన్ నీతుల పరదాలు కప్పుకొని మన నాగరికతను మనమే చిన్నబుచ్చుకోవడం, విశాల వీథుల్లో పరిఢవిల్లిన హిందూ మతాన్ని ఇరుకు ఛాందస వీథుల్లో బురఖా వేసి నడిపించడం వంటిదే”.
మాయావాదం, నిగూఢత్వం, మత ప్రాతిపదికపు తాత్విక ధోరణీ, ఇతర శిథిల జీర్ణధోరణులు ఉన్నా భారతీయ తత్వశాస్ర్తంలో ఎంతో ముఖ్యమైన ధోరణులు కూడా ఉన్నాయి. భారతీయ తాత్విక పరిస్థితిని అవగాహన చేసుకోవటం, దాన్ని అసాధారణ క్రమంలో పరిశీలించటంలో ఉన్నది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తఃతః అభిప్రాయం:
03/16/2014 8:24 am
శ్రీ పప్పు: మీ అభిప్రాయానికి అనుబంధంగా నేను కొంత రాయాలి అని అనుకుంటున్నాను. ఈ లోపల ఒక మాట. నేను నా ఒక అభిప్రాయంలొ ‘అనేకానేక శివుళ్ళు’ ఉన్నారని రాశాను ‘ ఇవల్యూషన్ /ఇంటెగ్రేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ శివ’ ,’శివుడి చరిత్ర’ లాంటివి కుదరనివి అని రాశాను. ఆ దిస గా ఈ పొడవైన ఉట్టంకింపు చూడండి. [రచన ఎంత succinctగా ఉన్నదో ]
‘There are religions, such as Christianity and Islam, based upon teachings which are considered by their followers as the only absolute truth. These teachings are, therefore, supposed to be essentially good for all mankind, and it is the duty of every believer to preach them, by word and by deed, so that every man may accept them and be saved. Such religions style themselves as world-religions. The ideal of their followers is the unification of all mankind, on the basis both of certain moral and spiritual teachings, and of certain metaphysical beliefs, looked upon as absolute truth, expressed once for all at a certain time, in a certain place, by a certain person, and recorded in a certain sacred book to which, naturally, no alteration and no addition can be made.
Uses and customs can easily differ, from place to place, according to geographical, political, and other conditions, provided their existence is not a denial of any of the fundamental beliefs upon which the whole religious structure lies. Culture itself can differ, from nation to nation, as long as these common beliefs remain. What greater difference can there be, for instance, than that between the culture of a Presbyterian Scotchman and of a Catholic Spaniard, or of a Syrian Christian, or of an Abyssinian? Yet, there is, between them, a minimum of common beliefs, sufficient to justify their common claim to be called “Christians.” The same thing could be said about a Mohammadan from Arabia or Iraq, compared to a Mohammadan from Java.
We call “creedal religions” all religions of the type of Christianity or Islam, in which the link among the faithful is necessarily common beliefs, but not necessarily common civilisation or culture.
* * *
But there are religions which do not rest upon any moral or metaphysical “truth,” considered as absolute. Their followers may or may not accept a certain number of common beliefs, and, if they do, still they do not condemn the many possible beliefs, in religions different from theirs, as “false,” nor do they look down upon them as “precious teachings entangled with superstition.” In fact, the followers of each one of such religions generally do differ from one another on the ground of metaphysics, of morals, or of religious discipline. Take the instance of the cultured ancient Greeks, followers of the same national religion but, at the same time, followers of different (and antagonistic) philosophies. There was, in that national religion of theirs, no common metaphysical system, comparable with that which we find in Hellenized Christianity. Take the instance of the cultured modern Hindus, of different sects. There is very little common in their religious outlook, or in the particular discipline they may follow. One worships a personal God; one worships God as impersonal; a third one does not believe in God at all; one practices hate yoga, another practices nothing but bhakti. Still, they are all Hindus, just as the ancient Greeks, in spite of their opposite metaphysical views, or of their personal devotion to entirely different Gods, were the followers of the same “religion.”
It is easy to see that the word “religion,” in this case, bears a totally different meaning from that which it had, while applied to “creedal religions” such as Christianity or Islam.
Here, there is no truth, whether concerning God, soul, salvation, creation, or anything else, which should be considered as absolute by all men. Every truth is relative, being the outcome of man’s experience, which is necessarily limited. And therefore, metaphysics (the common ground of religious thought, in “creedal” religions) are a matter of individual outlook. Spiritual realization is also individual. The knowledge that it gives cannot be transmitted to a crowd. Even the path to realization cannot be shown but to those who have undergone, through previous experience, a sufficient evolution.
In other words, in religions which are not creedal, there can be no conflict between “religion” and “philosophy,” no more than between “religion” and “science,” for a broad spirit of free research — that what is called, in modern language, scientific spirit — is applied there, without restriction, to every sphere of life, including spiritual realization. And there can be no common beliefs commended to men at different stages of evolution. There can be no one-sided outlook on God, soul, etc., “good for all mankind,” to be preached from country to country.
Hinduism is the most perfect type of such “religions” which we shall call, presently, for sake of convenience, “non-creedal,” until further analysis allows us to characterize them more positively.’
From: A WARNING TO THE HINDUS, by Savitri Devi, (Calcutta 1939.)
సావిత్రి దేవి ఒక గ్రీక్ జాతీయురాలు. ఇంటర్నెట్లో పుస్తకమంతా దొరుకుతుంది.
అలాగే The Hindus: An Alternative History by Wendy Doniger – review. Priyamvada Gopal relishes a riposte to Hindu hardliners. The Guardian, Saturday 23 October 2010 గూడా చదవదగినది.
నమస్కారాలతో
తఃతః
మాటలు గురించి జ్యోతి అభిప్రాయం:
03/15/2014 3:04 pm
చాలా నచ్చింది వైదేహి గారు, మీ కవిత. ఎంతో అపురూప భావానికి అందమైన రూపాన్నిచ్చారు.
నిజంగా నిజం. రోజువారీ మాటల్లో మనసులో నిలచిపోగలవెన్ని ఉంటాయి? కానీ అరుదుగా వచ్చే కొన్ని క్షణాలుంటాయి…కొత్త ఆలోచనలని రేకిత్తించే మాటలు పుట్టే క్షణాలు, మనం take it for granted అనుకునే వ్యక్తులని, మనసులని, ప్రేమలని, మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలో,మళ్ళీ మరొకసారి కొత్తగా మనకు నేర్పించే సమయాలు, ఆ సమయంలో మొక్కుబడిగా కాక మనసులోతుల్లోనుంచి వచ్చే గుప్పెడు మాటలు, కాసిన్ని నవ్వుల చిలకరింపులు.
“మళ్ళీ మంత్రధూళి రాలే వరకూ” ఆ క్షణాలే కదూ మనల్ని కేవలం బ్రతికించకుండా జీవించగలిగేటట్లు చేసేవి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/15/2014 2:53 pm
@నాగరాజు గారూ: మీ విమర్శ చాలా బావుందండీ…Good writing.
@సతీష్ గారూ: నమస్కారం.
మీరు ఇలా విషయం లేకుండా, ఏవేవో ఊహించేసుకుని, (metaphor అంటే ఏమిటో తెలీకుండా – లేదా తెలీనట్టుగా) రాస్తూ ఉంటే నేను చర్చించలేను…చర్చించను.
వ్యాసానికి సంబంధించినవి, మిగితా కొన్ని చర్చనీయాశమైనవి చెప్పకనే చెప్పాను. మీ ఊహలతో, ఆపోహలతో నాకు సంబంధం లేదు. ధన్యవాదాలు. మన్నించగలరు.
చివరగా ఒక్క మాట: నాకు పేదరికం (దానికి కారణం అర్ధం చేసుకోవడం, ఆ పై నిర్మూలనకి నా వంతు కృషి ఏదో నేను చెయ్యడం) తోనే సంబంధం. పేదరికానికి కులం, జాతి, భాష తో సంబంధం లేడు. అందరినీ ఒకె కర్కశం తో వేధిస్తుంది, అందరినీ ఒకేలా కబళిస్తుంది. ఆ విధం గా పేదరికానికొక్కదానికే అస్మదీయభావాలు ఉండవు. అందుకే పేదరికం తో నే నాకు స్నేహం, శతృత్వం కూడా. కాబట్టీ మీరు ఏవేవో ఊహించుకుని, అనవసర ప్రసంగాలు చెయ్యడం సమయం వృధా చేసుకోవడమే.
సెలవు మరి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సతీష్ అభిప్రాయం:
03/15/2014 1:57 pm
యోగా గారి దూకుడు (comment at March 12, 2014 5:39 pm) చూస్తుంటే వారి దృష్టిలో ఎవరైతే “లిబరల్ మహాశయు”లో వారి మీదకు క్రూరమృగాలను ఎప్పుడు ఉసిగొల్పుదామా అని మాంచి ఆత్రుతగా ఎదురుచూస్తునట్టు ఉన్నారు. ఏం యోగా గారు, గుజరాత్ లో జరిగిన “సింహాల వేట” దేశమంతా కూడా జరగాలని కఠోర తపస్సు చేస్తున్నారా? ఈ రకమైన భిన్నభావలను కించిత్తుకూడా ఓర్వలేని హిందుత్వవాదం వల్ల ఒరిగే నష్టాలగురించే కాబోలు సురేష్ గారు ఈ వ్యాసంలో హెచ్చరించింది.
నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి lyla yerneni అభిప్రాయం:
03/15/2014 1:09 pm
My English sentence is misinterpreted.:-)
I have not said sorry to you. Why would ‘I’ say sorry to ‘you,’ when it is you have misinterpreted Bhattumurthi’s poem. Generally people say sorry for their own mistakes.:-)
Your generic philosophy aside, the specific poem is misinterpreted.
I don’t buy the పొత్తుల reason you gave, Kamesh! Too flimsy.
There is inherent difficulty in interpreting poets who want to exhibit the art of శ్లేష in their poetry. They tend to make themselves ambiguous.
Also;
Some poets are in the habit of writing poems any time any place, and inserting them later on in different texts to suit their multi purposes. Their credibility value is questionable.:-)
Look at the poetry in కుంతీకుమారి. ఇందులో పాపయ్య శాస్త్రి ,వేర్వేరు చోట్ల — మరులు రేకెత్త, కాంక్ష లల్లాడ, ఆకులోనుండి ముద్దు మూతిపై,లాటి phrases వాడారు. ఐనా ప్రతి పద్యము లోను, తల్లి, ఒక పసి పిల్లవాడు స్పష్టము. భావములు స్పష్టములు. There is never any ambiguity created by the words.
For me such a poetry is best poetry.
కామేశ్వరరావు గారూ! your interpretation of పొత్తులు in this poem is wrong.
So is your understanding of Word కలకంఠి. I am sorry! ఈ పద్యంలో కోయిలలు లేవు.
లైలా