పరుచూరి శ్రీనివాస్ గారికి అభివాదములు.శ్రీ T.V .Rao గారు తమ లలితగీతాలు బ్లాగులో “జో హాయి నిదురబో నా తండ్రి ” అనే పాటను శ్రీ మల్లిక్ గారు పాడింది పొందుపరచారు.P.సుశీల గారు మొదట దీనిని పాడినది చాల ఏళ్ళ క్రితం విన్నాను . ఇది మీ వద్ద ఉంటే వినిపించండి.ధన్యవాదములు.
నమస్కారాలు. మీ సహృదయ వ్యాఖ్యకి కృతజ్ఞతలు. ఈ వ్యాసం వ్రాసేటప్పుడే మీరన్న రెండు విషయాలూ – “బాహుదుర్గములు”, “చూడగన్” – నా ఆలోచనాపథంలోకి వచ్చాయి. సాహసించి నాకు బాగుందనిపించిన వివరణని మాత్రమే పొందుపరిచాను.
బాహుదుర్గములు – రాజ్యానికి రక్షణగా నిర్మింపబడేవి దుర్గాలు. కృష్ణుని కౌగిలి (బాహు మధ్యసీమ) సామ్రాజ్యం అనుకొంటే, అందులో రక్షణ పొందే సత్యభామకి రెండు బాహువులూ రెండు దుర్గాలు అనుకోడం సమంజసంగానే నాకు అనిపించింది. బేతవోలువారు కూడా తమ “పద్య కవితా పరిచయం”లో దీనిని బహువచనంగానే వివరించారు.
చూడగన్ – ఇది మీరన్నట్టు తుమున్నర్థకంగా అన్వయించడమే ఉచితంగా అనిపిస్తోంది. ఆ క్రియని తుమున్నర్థకంగా గ్రహించినప్పుడు కూడా, శ్రీకృష్ణుడు బహుమాన పురస్సరదృష్టితో చూసాడు అనేది లక్ష్యమానం అవుతోంది. ఆ రెండు క్రియలనూ విడివిడిగా చెప్పకుండా యిలా ఒకే వాక్యంలో కలిపి చెప్పడంలో వారి మధ్యనున్న అనురాగం ధ్వనితమవుతోందన్నది నా భావన.
నా వ్యాసాలని ఆసక్తితో నిశితంగా చదివి వాటికి వన్నె తెచ్చే యిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది!
తెలుగు కథకుల్లో విశిష్టముద్ర సి.రామచంద్రరావు గారిది. కథలు రాయటంలోనే కాకుండా, ఇంటర్వ్యూలు ఇవ్వటంలో కూడా ఆయన పొదుపరిగానే ఉన్నారు. అందుకే ఆయన ఇలా ఇంటర్వ్యూ ఇవ్వటం అపురూపం. ముఖాముఖి లైవ్లీ గా ఉంది; రాసిన విధానం హాయిగా, ఆసక్తికరంగా ఉంది!
ఇది ప్రచురింప బడ్డ 11 ఏళ్ళ తర్వాతనైనా నా కళ్ళ బడడం నా అదృష్టం.పద్యాలు చాలా ఆర్ద్రంగా ఉన్నాయి.వ్యావహారిక భాషలో పద్యాలింకా రావాలని వాటికి అందరి ప్రోత్సహం కావాలని అప్పుడే పద్యం కనుమరుగై పోకుండా ఉంటుందని నా భావన.
మాన్య మిత్రులు శ్రీ కామేశ్వరరావు గారికి
నమస్కారములతో,
మొదటి పద్యానికి మీ వ్యాఖ్య, పదప్రయోజనాన్ని వివరించిన తీరు – హృద్యంగా ఉన్నాయి. “దేవీసంతతి” అని మీ ప్రతిలో ఉన్నది కాబోలు. అది తప్పు కాదు కాని, ప్రసిద్ధప్రతు లన్నిటిలో దేవీసంహతి, దేవీసంఘము అనే పాఠాలున్నాయి.
రెండవ పద్యంలో “బాహుదుర్గములు” అన్న సమాసాన్ని మీరు బహువచనంగా గ్రహించి, ‘బాహువులనే కోటలు’ అని అన్వయించారు. అవి ఒకటి కాదు; రెండు దుర్గాలు అని కూడా వివరించారు. అయితే, ‘బాహువులనెడి దుర్గము’ అని రూపణను ఏకవచనంగా పఠించటమే సమంజసం. శ్రీకృష్ణుని బాహుమధ్యసీమ (విశాలమైన వక్షఃస్థలం) దుర్గోపమమై, దైత్యదానవదుష్ప్రాపం కనుక తనకు రక్షాకరమని సత్యభామ అంటున్నది. ఇక్కడ ఒక్కొక్క బాహువు ఒక్కొక్క దుర్గమన్న అర్థానికి అవకాశం ఉండదు. బాహువులు రెండైనా, నాలుగైనా రిపుదుర్గమమైన దుర్గం ఒక్కటే.
“త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ, దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః” అని పంచమ స్కంధంలో (1-19) శ్లోకాన్ని చూడండి: “శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి, యరిషడ్వర్గంబు జయించి” అని గంగనామాత్యుని తెలుగుసేత (5-1-11). అక్కడ ఒక్కొక్క చరణం ఒక్కొక్క దుర్గం కాదు కనుకనే, “చరణారవిందములు అనెడి దుర్గము” – అన్నాడు.
“శ్రీరమణీ కుచదుర్గ విహారే” – శ్రీదేవియొక్క కుచములనెడి దుర్గమునందు (ఎత్తైన రెండు కొండలున్న గిరిదుర్గము వంటి వక్షఃస్థలమునందు) విహరణము కలవాడు – అని భావం. శ్రీదేవియొక్క కుచములనెడు రెండు దుర్గములందు విహరించువాడు అని చెప్పకూడదు. ఇది “మధుకైటభారేః వక్షోవిహారిణి” అన్న ప్రయోగం వంటిదే.
“బాహుదుర్గములు” అన్న అపపాఠం వల్ల ఈ అపార్థానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల పద్యాన్ని –
“దానవు లైన నేమి, మఱి దైత్యసమూహము లైన నేమి? నీ
మానితబాహుదుర్గ మను మాటున నుండఁగ నేమి శంక? నీ
తో నరుదెంతు” నంచుఁ గరతోయజముల్ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని, దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిఁ జూడఁగన్. (దశమ: ఉత్తర భాగం-155)
అని సరిదిద్దుకోవాలి. నీయొక్క బాహుదుర్గసీమ అను మాటునన్ = రక్షణస్థానమున ఉండగా, నాకు ఏమి శంక? అని అన్వయం.
అంతే కాదు. ఆమె మ్రొక్కటమూ, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూడటమూ ఏకకాలంలో జరగలేదు. ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచిన తర్వాత ఆమె మ్రొక్కలేదు. ఆమె మ్రొక్కిన తర్వాత, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచాడని అన్వయించేందుకు వీలులేకుండా, “బహుమానపురస్సరదృష్టిన్ చూడఁగన్” – అన్న వెంటనే, “ఇట్లు మ్రొక్కిన” అన్న వచనం ఉన్నది. అప్పుడు “చూడఁగన్” అన్న అసమాపక క్రియకు ఆమె మ్రొక్కగా, ఆతడు చూడగా అన్న అన్వయమూ సరిపడదు.
వాక్యంలో “మ్రొక్కె” అన్న సమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “చూడఁగన్” అన్న అసమాపక క్రియను అన్వయించే వీలుండదు. “చూడఁగన్” అన్న అసమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “మ్రొక్కెను” అన్న సమాపక క్రియను చివరిదిగా అన్వయించాలి. తనను భర్త బహుమానపురస్సరదృష్టితో వీక్షింపగా, ఆమె కరతోయజములు ముకుళించి మ్రొక్కెను – అని మాత్రమే పద్యంలో వాక్యాన్వయం వ్యాకరణసిద్ధం. అప్పుడు అర్థం పొందుపడదు. నీతో నేను వస్తాను, నీవుండగా నాకేమి భయం? అని ఆమె అడిగినంత మాత్రాన ఆయన బహుమానపురస్సరదృష్టితో చూశాడనటమూ, అప్పుడామె నమస్కరించినదనటమూ కవి చిత్రణ అనుకోలేము. ఆ పక్షాన కవితాత్మకమైన అభివ్యక్తీకరణమే ఉండదు.
అందువల్ల, “చూడఁగన్” అన్న క్రియారూపానికి ఇక్కడ తుమున్నర్థంగా మాత్రమే అన్వయం. భర్త తన పలుకులను విని, బహుమానపురస్సరదృష్టితో చూసేందుకే ఆమె అంజలించినదన్నమాట. అది సత్యభామ స్వభావానికి తగిన చిత్రణమే. సాకూతమైన అంజలిబంధం. ముందు ప్రశంస, ఆ తర్వాత ప్రణమనం – రెండూ ఆయన మెప్పుకోసం మాత్రమే అన్నమాట. అదే కవి మనోగతం. “చూడఁగన్ = చూచుట కొఱకు” అని తుమున్నర్థకం.
ఆ జాణతనాన్ని గుర్తించాడు కనుకనే, ఇట్లు (ఈ విధమైన నేర్పరితనంతో) మ్రొక్కినన్ = ఆమె నమస్కరింపగా, ఆయన భావజ్ఞుడు కదా, దగ్గరికి తీసికొని కౌగలించికొన్నాడని తర్వాత అన్నాడు.
సహృదయత ఉట్టిపడుతున్న అమోఘమైన మీ వ్యాఖ్యకు పరిపూరకంగా మాత్రమే ఈ మాటలను వ్రాశాను. పోతనగారి భాగవతం ఎంత పరిష్కరణ సాపేక్షమో ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి RAVI KRISHNA CHAREPALLI అభిప్రాయం:
09/06/2016 11:54 pm
పరుచూరి శ్రీనివాస్ గారికి అభివాదములు.శ్రీ T.V .Rao గారు తమ లలితగీతాలు బ్లాగులో “జో హాయి నిదురబో నా తండ్రి ” అనే పాటను శ్రీ మల్లిక్ గారు పాడింది పొందుపరచారు.P.సుశీల గారు మొదట దీనిని పాడినది చాల ఏళ్ళ క్రితం విన్నాను . ఇది మీ వద్ద ఉంటే వినిపించండి.ధన్యవాదములు.
గడి నుడి – 1 గురించి Ramulu P C అభిప్రాయం:
09/06/2016 9:17 am
సమాధానం ఇప్పటికీ లేదు …. ఆంటే ..దానర్ధం ..పూరించి.. సరిచూసుకుని .. సంబర పడాల్సిందేనా?? మాస్టారూ!
హృదయం ఇక్కడే వుంది! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
09/05/2016 9:03 pm
వీరన్ గారు! చాలా ధన్యవాదాలండి, కథ బావుందన్న మీ ప్రశంసకు! మీకు ఏ పాత్ర నచ్చిందో చెబితే బావుణ్ణనిపించింది. మీ ఇష్టం మరి.
🙂
శుభాకాంక్షలతో..
నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
09/05/2016 9:19 am
మురళీధరరావుగారు,
నమస్కారాలు. మీ సహృదయ వ్యాఖ్యకి కృతజ్ఞతలు. ఈ వ్యాసం వ్రాసేటప్పుడే మీరన్న రెండు విషయాలూ – “బాహుదుర్గములు”, “చూడగన్” – నా ఆలోచనాపథంలోకి వచ్చాయి. సాహసించి నాకు బాగుందనిపించిన వివరణని మాత్రమే పొందుపరిచాను.
బాహుదుర్గములు – రాజ్యానికి రక్షణగా నిర్మింపబడేవి దుర్గాలు. కృష్ణుని కౌగిలి (బాహు మధ్యసీమ) సామ్రాజ్యం అనుకొంటే, అందులో రక్షణ పొందే సత్యభామకి రెండు బాహువులూ రెండు దుర్గాలు అనుకోడం సమంజసంగానే నాకు అనిపించింది. బేతవోలువారు కూడా తమ “పద్య కవితా పరిచయం”లో దీనిని బహువచనంగానే వివరించారు.
చూడగన్ – ఇది మీరన్నట్టు తుమున్నర్థకంగా అన్వయించడమే ఉచితంగా అనిపిస్తోంది. ఆ క్రియని తుమున్నర్థకంగా గ్రహించినప్పుడు కూడా, శ్రీకృష్ణుడు బహుమాన పురస్సరదృష్టితో చూసాడు అనేది లక్ష్యమానం అవుతోంది. ఆ రెండు క్రియలనూ విడివిడిగా చెప్పకుండా యిలా ఒకే వాక్యంలో కలిపి చెప్పడంలో వారి మధ్యనున్న అనురాగం ధ్వనితమవుతోందన్నది నా భావన.
నా వ్యాసాలని ఆసక్తితో నిశితంగా చదివి వాటికి వన్నె తెచ్చే యిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది!
వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి వేణు అభిప్రాయం:
09/05/2016 12:18 am
తెలుగు కథకుల్లో విశిష్టముద్ర సి.రామచంద్రరావు గారిది. కథలు రాయటంలోనే కాకుండా, ఇంటర్వ్యూలు ఇవ్వటంలో కూడా ఆయన పొదుపరిగానే ఉన్నారు. అందుకే ఆయన ఇలా ఇంటర్వ్యూ ఇవ్వటం అపురూపం. ముఖాముఖి లైవ్లీ గా ఉంది; రాసిన విధానం హాయిగా, ఆసక్తికరంగా ఉంది!
తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి HAREESH అభిప్రాయం:
09/04/2016 12:59 pm
ఆంధ్ర మహభారతానినకి మునుపు తెలుగులొ ఏ కావ్యం లేదని చెప్పటానికి ఆథారం ఏమిటో ఈ వ్యాసకర్త వివరించగలరు.
ద్వితీయ కళత్రం గురించి హంస లేఖ అభిప్రాయం:
09/04/2016 6:36 am
చాల బాగున్నాయ్
నాన్నా తెలుసా గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:
09/03/2016 10:39 pm
ఇది ప్రచురింప బడ్డ 11 ఏళ్ళ తర్వాతనైనా నా కళ్ళ బడడం నా అదృష్టం.పద్యాలు చాలా ఆర్ద్రంగా ఉన్నాయి.వ్యావహారిక భాషలో పద్యాలింకా రావాలని వాటికి అందరి ప్రోత్సహం కావాలని అప్పుడే పద్యం కనుమరుగై పోకుండా ఉంటుందని నా భావన.
తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి Venisha అభిప్రాయం:
09/03/2016 4:36 pm
చాల బాగుంది. its so enriching with good research works!! keep it up.
నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/03/2016 4:22 pm
మాన్య మిత్రులు శ్రీ కామేశ్వరరావు గారికి
నమస్కారములతో,
మొదటి పద్యానికి మీ వ్యాఖ్య, పదప్రయోజనాన్ని వివరించిన తీరు – హృద్యంగా ఉన్నాయి. “దేవీసంతతి” అని మీ ప్రతిలో ఉన్నది కాబోలు. అది తప్పు కాదు కాని, ప్రసిద్ధప్రతు లన్నిటిలో దేవీసంహతి, దేవీసంఘము అనే పాఠాలున్నాయి.
రెండవ పద్యంలో “బాహుదుర్గములు” అన్న సమాసాన్ని మీరు బహువచనంగా గ్రహించి, ‘బాహువులనే కోటలు’ అని అన్వయించారు. అవి ఒకటి కాదు; రెండు దుర్గాలు అని కూడా వివరించారు. అయితే, ‘బాహువులనెడి దుర్గము’ అని రూపణను ఏకవచనంగా పఠించటమే సమంజసం. శ్రీకృష్ణుని బాహుమధ్యసీమ (విశాలమైన వక్షఃస్థలం) దుర్గోపమమై, దైత్యదానవదుష్ప్రాపం కనుక తనకు రక్షాకరమని సత్యభామ అంటున్నది. ఇక్కడ ఒక్కొక్క బాహువు ఒక్కొక్క దుర్గమన్న అర్థానికి అవకాశం ఉండదు. బాహువులు రెండైనా, నాలుగైనా రిపుదుర్గమమైన దుర్గం ఒక్కటే.
“త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ, దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః” అని పంచమ స్కంధంలో (1-19) శ్లోకాన్ని చూడండి: “శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి, యరిషడ్వర్గంబు జయించి” అని గంగనామాత్యుని తెలుగుసేత (5-1-11). అక్కడ ఒక్కొక్క చరణం ఒక్కొక్క దుర్గం కాదు కనుకనే, “చరణారవిందములు అనెడి దుర్గము” – అన్నాడు.
“శ్రీరమణీ కుచదుర్గ విహారే” – శ్రీదేవియొక్క కుచములనెడి దుర్గమునందు (ఎత్తైన రెండు కొండలున్న గిరిదుర్గము వంటి వక్షఃస్థలమునందు) విహరణము కలవాడు – అని భావం. శ్రీదేవియొక్క కుచములనెడు రెండు దుర్గములందు విహరించువాడు అని చెప్పకూడదు. ఇది “మధుకైటభారేః వక్షోవిహారిణి” అన్న ప్రయోగం వంటిదే.
“బాహుదుర్గములు” అన్న అపపాఠం వల్ల ఈ అపార్థానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల పద్యాన్ని –
“దానవు లైన నేమి, మఱి దైత్యసమూహము లైన నేమి? నీ
మానితబాహుదుర్గ మను మాటున నుండఁగ నేమి శంక? నీ
తో నరుదెంతు” నంచుఁ గరతోయజముల్ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని, దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిఁ జూడఁగన్. (దశమ: ఉత్తర భాగం-155)
అని సరిదిద్దుకోవాలి. నీయొక్క బాహుదుర్గసీమ అను మాటునన్ = రక్షణస్థానమున ఉండగా, నాకు ఏమి శంక? అని అన్వయం.
అంతే కాదు. ఆమె మ్రొక్కటమూ, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూడటమూ ఏకకాలంలో జరగలేదు. ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచిన తర్వాత ఆమె మ్రొక్కలేదు. ఆమె మ్రొక్కిన తర్వాత, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచాడని అన్వయించేందుకు వీలులేకుండా, “బహుమానపురస్సరదృష్టిన్ చూడఁగన్” – అన్న వెంటనే, “ఇట్లు మ్రొక్కిన” అన్న వచనం ఉన్నది. అప్పుడు “చూడఁగన్” అన్న అసమాపక క్రియకు ఆమె మ్రొక్కగా, ఆతడు చూడగా అన్న అన్వయమూ సరిపడదు.
వాక్యంలో “మ్రొక్కె” అన్న సమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “చూడఁగన్” అన్న అసమాపక క్రియను అన్వయించే వీలుండదు. “చూడఁగన్” అన్న అసమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “మ్రొక్కెను” అన్న సమాపక క్రియను చివరిదిగా అన్వయించాలి. తనను భర్త బహుమానపురస్సరదృష్టితో వీక్షింపగా, ఆమె కరతోయజములు ముకుళించి మ్రొక్కెను – అని మాత్రమే పద్యంలో వాక్యాన్వయం వ్యాకరణసిద్ధం. అప్పుడు అర్థం పొందుపడదు. నీతో నేను వస్తాను, నీవుండగా నాకేమి భయం? అని ఆమె అడిగినంత మాత్రాన ఆయన బహుమానపురస్సరదృష్టితో చూశాడనటమూ, అప్పుడామె నమస్కరించినదనటమూ కవి చిత్రణ అనుకోలేము. ఆ పక్షాన కవితాత్మకమైన అభివ్యక్తీకరణమే ఉండదు.
అందువల్ల, “చూడఁగన్” అన్న క్రియారూపానికి ఇక్కడ తుమున్నర్థంగా మాత్రమే అన్వయం. భర్త తన పలుకులను విని, బహుమానపురస్సరదృష్టితో చూసేందుకే ఆమె అంజలించినదన్నమాట. అది సత్యభామ స్వభావానికి తగిన చిత్రణమే. సాకూతమైన అంజలిబంధం. ముందు ప్రశంస, ఆ తర్వాత ప్రణమనం – రెండూ ఆయన మెప్పుకోసం మాత్రమే అన్నమాట. అదే కవి మనోగతం. “చూడఁగన్ = చూచుట కొఱకు” అని తుమున్నర్థకం.
ఆ జాణతనాన్ని గుర్తించాడు కనుకనే, ఇట్లు (ఈ విధమైన నేర్పరితనంతో) మ్రొక్కినన్ = ఆమె నమస్కరింపగా, ఆయన భావజ్ఞుడు కదా, దగ్గరికి తీసికొని కౌగలించికొన్నాడని తర్వాత అన్నాడు.
సహృదయత ఉట్టిపడుతున్న అమోఘమైన మీ వ్యాఖ్యకు పరిపూరకంగా మాత్రమే ఈ మాటలను వ్రాశాను. పోతనగారి భాగవతం ఎంత పరిష్కరణ సాపేక్షమో ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు