I don’t understand why this story is accepted for print. I regret that I could not call ‘this’ any thing but a story. What did the writer want to say? Is he trying to showcase the difference between what people wish for, and what they have in reality? If so, I have no hesitation saying that the writer chose a wrong story line. If he wanted a comedy story, he missed those lines right from the beginning.
To have an interest to write is appreciated, but as “Bharago” the famous writer said once, you need to read Five Hundred books before you attempt to write one.
However, I don’t intend to discourage the writer, he can continue his effort, and one day, there will be light at the end of the tunnel. It is upto the editor(s) to read the story before printing. If they don’t have content, it is worth reprinting some good old stories rather than printing junk
మీ పద్యం అంటే వున్న “సుముఖత” గురించిన విచికిత్స చదివాను. అన్ని రకాల కారణాలని గురించి సుహృద్బావంగా విశ్లేషణ చెయ్యాలన్న ఒక తపన కనిపించింది. కానీ అసలు విషయం ఏమిటంటే మా కాళోజీ చెప్పిన జవాబే నేనూ చెబుతాను వినండి (ఈ మాట మీద కాపీరైట్ కాళోజీదీ సుమా!).
ఒకసారి ఆయన్ని నేను అడిగాను పద్యాలు ఎందుకు రాయలేదు మీరు అని. ఆయన అన్నాడు కదా “నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే. “పద్యవిద్య” అని అనేవారు కదా — అంటే అది ఒక skill అన్నమాట. దానిలో శిక్షణ పొందాలి. ఛందస్సు క్షుణ్ణంగా చదువుకుని వుండాలి. ముక్కున పట్టిన నాలుగు అవసరార్థపు “గణ” పరిజ్ఞానంతోనే ఈ కాలం వాళ్ళు పద్యాలు ఎట్లా రాసేయగలరండీ? అత్యాశ అలా ఎవరైనా ఆశిస్తే, అవునా?
ఇంకా వచన పద్యం (ఇక్కడ పద్యాన్ని కవిత్వానికి పర్యాయంగా అంటున్నాను) రాయటం కూడా సుళువేమీ కాదు. వచనంలో నిట్ట నిలువుగా రాసేదంతా కవిత్వం అని ఎవరూ అనలేరు. మంచి పద్యానికి వుండే లక్షణం మంచి prose poem కి కూడా వర్తిస్తుంది. ఒక లయ, తూగు అంతర్లీనంగా వుండాలి. “కంఠగత లక్షణం” మంచి పోయెమ్ కి వుండాల్సిన లక్షణం కూడా, వచన కవిత్వం అయినా సరే. బాగున్న పద్యం, అది యే రూపంలో వున్నా, కాళిదాసు చెప్పినట్టుగా, “రసనగర నర్తకి” గా వుండాల్సిందే. దీనికి తిరుగు లేదు. వచన కవిత్వం లో కూడా మంచి పద్యం కోట్ చెయ్యగలిగినది నోటిమీద వుండగలిగినదై వుండటం దాని ప్రభావానికి గుర్తే.
అయితే, అలాగే ఛందోబద్ధమైన పద్యాలన్నీ కూడా గొప్పవి కావు. మీరు వుదాహరించిన తిక్కన గారి పద్యం, రామాభ్యుదయంలోని తిక్కన గారి పద్యాన్ని అనుకరిస్తూ రాసిన పద్యం — వీటిని వుదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే బాగున్న poem ఎందుకు బాగుందో చెప్పటం తేలిక. బాగాలేనిది ఎందుకు బాగాలేదో చెప్పటం — ముఖ్యంగా సమకాలంలో — చాలా కష్టం. అంచేత మాట్లాడకుండా వూరుకుంటారు (లేదా బాబ్జీలు గారి లాంటి అవతారం ఎత్తవలసి వుంటుంది మరి నిజాలు చెప్పడానికి).
ఇంకా మళ్ళీ వెనక్కి అంటే ఛందోబద్ధమైన పద్యం రాయటం దగ్గరికి వస్తాను. మంచి లయతో, ధారాశుద్ధితో చక్కని ఉపమానంతో, పుష్టిగా వున్న భాషతో (భాషాడంబరం కాకుండా) ఎవరైనా రాస్తే, పద్యం అయినా చెలామణీ అవుతుందనే నేననుకుంటాను, ఇవ్వాళకూడా!
విషయం ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఛందస్సును స్వాధీన పరుచుకొని పరిపుష్టిగా పద్యాలు చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గటం వల్ల పద్యం వెనకబడింది తప్ప, వచన కవిత్వం వల్ల కాదు. ఔననిపించుకునే పద్యాలు రాసేవారి సంఖ్య పద్యంలోనూ, వచన పద్యంలోనూ కూడా ఇవ్వాళ తక్కువే సుమా.
“వస్తువు” ముఖ్యమే ఎప్పుడైనా కవిత్వంలో. కానీ దాని వ్యక్తీకరణ ఎట్లా వున్నదన్నదాని మీదనే ఒక మామూలు కవికి, ఒక మహాకవికి మధ్యనుండే భేదం బోధపడుతుంది.
కవి నామధేయులు ఉంటారు అన్ని కళల్లోనూ. కవులు కొందరే వుంటారు అన్ని కలాల్లోనూ. రూపం ఏది అన్నదానికన్నా సారం ఎంత అన్నది చూడవలసిన విషయం కవిత్వంలో. ఎందులోనైనా బాగున్నవి నిలబడగలిగినవీ నిలబడతాయి. మిగితాయి పోతాయి. అది కాల మహిమ. అదంతే. మంచి కవిత్వానికి, మంచి సంగీతానికి సూర్య చంద్రులు కాపలా వుంటారు. నిశ్చింతగా వుండండి. అస్తు!
హిందోళంగురించి శ్రీ కొడవటిగంటి వ్రాసిన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉన్నది.
1) జేసుదాసు ‘మనసులోని మర్మము (త్యాగరాజకీర్తన)ను’ చతుశ్శ్రుతి రిషభంతో పాడగా (రికార్డు) మొదట విని ఆశ్చర్యపోయాను. అతడు చెంబై శిష్యపరంపరవాడట. అంతకు ముందు శ్రీరంగం గోపాలరత్నం, మరికొందరు శుద్ధరిషభంతోనే పాడారు. నాకు తెలిసిన ఒక విద్వాంసుడు త్యాగయ్య కీర్తనలు రెండిటిలోనూ ఒకటి ఇలాగ అయిపోయిందని బాధపడ్డాడు
2) ‘మామవతు శ్రీ సరస్వతీ’ కూడా ఇస్తే బాగుండేదనిపించింది. అయినా దీనికి అంతమెక్కడ?
ఎంతో శ్రమతో చక్కటి వ్యాసం ఇచ్చిన శ్రీ కొడవటిగంటివారికి అభివాదాలు.
కామేశ్వరరావుగారి లాటి వాళ్ళని, మీలాటి వారు “కమాండ్” చెయ్యగలరు. ఆయన మంచి సలహా అని, మనస్ఫూర్తిగా వుపక్రమించగలరు.
ఎందుకంటే; పరిమితి, పరిధీ తెలిసి, విపులీకరించి,విశ్లేషించగల నేర్పూ, ఓర్పూ వున్న”వ్యాసుడు” కామేశ్వరరావుగారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. (సిరికిం… పద్యాన్ని గురించి నాలాటి వాడికి అంత సంయమనంతో, చక్కగా వివరించేరు)
నేను మీరిచ్చిన “లింక్” తో “అటజని..” పద్యం గురించి ఇంకా తెలుసుకుని మురిసిపోయేను. అయితే పద్యాన్ని చదవడానికీ, ఛందస్సుకీ “లింక్” వుందా, లేదా? దీనిగురించి మీరు “విపులీకరించి, విశ్లేషించాలి”. దానికి అభిప్రాయవేదిక సరిపోదు అని మీరు వొప్పుకోవాలి. వొప్పుకుంటారు.
కామేశ్వరరావుగారూ, బాగుందండీ మీ బ్లాగు.. సాహిత్యంలో మీ
ఆసక్తికి ఇది ఒక నిదర్శనమే.
1) చంపకమాలలో పాదం మధ్యలో మూడు విధాలుగా
ఒక గతిని కల్పించవచ్చును. మొదటిది స-స-స
విరియై, సిరియై, ఝరియై లాటిది ఇది.
ప్రగడ రాణ్ణరసా విరసా తుసా బుసా ఇట్టిదే.
రెందవది మూడు జ-గణాలతో, అభంగ మృదంగ తరంగ లాటిది.
మూడవది మనం మామూలుగా వాడేది భ-భ-ర.
ఇక్కడ అల్లసానివారు మూడు జ-గణాలను వాడినా అది
నా ఉద్దేశంలో యాదృచ్ఛికమే. అన్ని పాదాలలో అలా వాడితేనే
ఒక కొత్త గతి వస్తుంది అని నా నమ్మకం.
2) నాకు ఎన్నో సంవత్సరాలుగా ఈ సందేహం. అసలు
ప్రవరాఖ్యుడు నిజంగా హిమాలయాలకు వెళ్లాడా అనేదే ఇది.
ఎందుకంటే మంచుమలలలో కరేణువులు ఎక్కడుంటాయి?
కలాపి జాలాలు ఎక్కడుంటాయి? పాపం వాటికి చలి వేయదా?
జలపాతాలు కూడా అరుదే.
బహుశా అతడు ఇప్పటి నేపాళ లేక ఉత్తరప్రదేశ, లేక
హిమాచలప్రదేశపు లోయలకు వెళ్లి ఉండవచ్చు. అక్కడి
అడవులలో ఏనుగులు, నెమళ్లు, వానాకాలపు ఉరుములు,
మెరుపులు, మృదంగపు మ్రోతలా జలపాతాలు ఉండి
ఉంటాయి. పర్వతాలలో చాలా చల్లగా ఉన్నా ఈ లోయలలో
ఎండ ఒక్కొక్కప్పుడు ఎక్కువే. అందువల్ల అతని పాదలేపం
కూడా కరిగిపోవడానికి అవకాసశం ఉంది. దూరంనుండి
హిమవత్పర్వతాలను చూసి ఉంటాడు. సియాటుల్ నగరంనుండి
మవుంట్ రెనియెర్ను చూచినట్లు. ఇట్టి సందేహం
కాళిదాసు మేఘదూతం విషయంలో కూడ ఉంది.
త్యాగరాజ స్వామి కీర్తనలకు కూడా ఈ బెడద తప్పలేదు!
నేనొక పుస్తకాన్ని వ్రాస్తూ ఒక పెద్దాయనవద్దకు వెళ్ళగా ఆయన ఈ క్రింది విషయాలను చెప్పి, దిగ్భ్రాంతపరచాడు – ఏతావాతా తేలినదేమిటంటే క్రింది కృతులు త్యాగరాజకృతులు కావు!
1) వెడలెను కోడండపాణి (తోడి)
2) నీదు చరణములే (సింహేంద్రమధ్యమం)
3) పరాంగ్ముఖ .. (సురటి)
4) వినతాసుతవాహనుడై (హరికాంభోజి)
చాలా సంతోషం. మరోమాట: మీరిచ్చిన లింకు లోకి వెళ్ళి “మనుచరిత్ర” లోని “అటజనికాంచె” పద్యం మీద వ్యాఖ్యానం కూడా ఇప్పుడే చూసాను. మీకు మనుచరిత్రలో “సహసానఖంపచ …” పద్యం నచ్చలేదా? దాన్ని అందంగా వ్యాఖ్యానించవచ్చునే? బహుశా కావాలనే మీరంతా ఆ పద్యాల జోలికి పోవడం లేదు కాబోలు (సంశయించి), ఔనా? కానీ నేనేమనుకుంటానంటే ఇంతమంది సాహితీ ప్రియులుండి మంచి పద్యాన్ని మళ్ళీ మరోసారి పాఠకులకు పరిచయం చేయకపోతే ఎట్లా అని. సరసులైన పాఠకులున్నారు; చాలా సంయమనంతో మాట్లాడగలిగిన వాళ్ళు వున్నారు; స్వారస్యం తెలుసుకుని రసాస్వాదన చేయగలరు వాళ్ళు. చూడండి. పెద్దన గారి గాంధర్వం అంతా ఆ పద్యంలో వుంది.
ఏమండీ, బాబ్జీలు గారు మీరేమంటారు? ఎంతసేపూ “అటజనికాంచె” గురించేనా? కాస్తా ముందుకి వెళ్ళండి మనుచరిత్రలో. పోనీ “చలిగాలి బొండుమల్లెల పరాగము వైచి నిబిడంబు చేసే వెన్నెల రసంబు” దాకానైనా. నాకు తెలిసి చాలామంది మీ చర్చలు ఆనందిస్తారని. ముఖ్యంగా పెద్దన గారి కవిత్వాన్ని మరింత ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. శృంగారాన్ని మాట్లాడటం లో మీ విశ్లేషణలు వెనకపడితే, పాపం, ఆ పద్యాలని రాసిన పెద్దన గారేమనుకోవాలి? ఈ తెలుగు వాళ్ళకి సరసత లేదన్నీనూ, విజయనగర కాలం దగ్గరే శృంగారం కూడా ఆగిపోయిందనీన్నూ అనుకోడా? ఈ తరం వాళ్ళకి పాత (I mean, “భూస్వామ్య వాద”) తెలుగు కవిత్వంలోని మధురిమలని సైతం కాస్త రుచి చూపించండి. నేను చెప్పేదాన్నే గానీ, నేను పీక లోతు దాకా అన్నమయ్య శృంగార సంకీర్తనల వ్యాఖ్యానంలో కూరుకుపోయి వున్నానిప్పుడు, గనుక దారి మళ్ళలేను.
పలాయనం గురించి Seetharama అభిప్రాయం:
08/20/2008 3:35 am
I don’t understand why this story is accepted for print. I regret that I could not call ‘this’ any thing but a story. What did the writer want to say? Is he trying to showcase the difference between what people wish for, and what they have in reality? If so, I have no hesitation saying that the writer chose a wrong story line. If he wanted a comedy story, he missed those lines right from the beginning.
To have an interest to write is appreciated, but as “Bharago” the famous writer said once, you need to read Five Hundred books before you attempt to write one.
However, I don’t intend to discourage the writer, he can continue his effort, and one day, there will be light at the end of the tunnel. It is upto the editor(s) to read the story before printing. If they don’t have content, it is worth reprinting some good old stories rather than printing junk
Regds
Ram
పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి jayaprabha అభిప్రాయం:
08/20/2008 2:49 am
కామేశ్వర రావు గారు,
మీ పద్యం అంటే వున్న “సుముఖత” గురించిన విచికిత్స చదివాను. అన్ని రకాల కారణాలని గురించి సుహృద్బావంగా విశ్లేషణ చెయ్యాలన్న ఒక తపన కనిపించింది. కానీ అసలు విషయం ఏమిటంటే మా కాళోజీ చెప్పిన జవాబే నేనూ చెబుతాను వినండి (ఈ మాట మీద కాపీరైట్ కాళోజీదీ సుమా!).
ఒకసారి ఆయన్ని నేను అడిగాను పద్యాలు ఎందుకు రాయలేదు మీరు అని. ఆయన అన్నాడు కదా “నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే. “పద్యవిద్య” అని అనేవారు కదా — అంటే అది ఒక skill అన్నమాట. దానిలో శిక్షణ పొందాలి. ఛందస్సు క్షుణ్ణంగా చదువుకుని వుండాలి. ముక్కున పట్టిన నాలుగు అవసరార్థపు “గణ” పరిజ్ఞానంతోనే ఈ కాలం వాళ్ళు పద్యాలు ఎట్లా రాసేయగలరండీ? అత్యాశ అలా ఎవరైనా ఆశిస్తే, అవునా?
ఇంకా వచన పద్యం (ఇక్కడ పద్యాన్ని కవిత్వానికి పర్యాయంగా అంటున్నాను) రాయటం కూడా సుళువేమీ కాదు. వచనంలో నిట్ట నిలువుగా రాసేదంతా కవిత్వం అని ఎవరూ అనలేరు. మంచి పద్యానికి వుండే లక్షణం మంచి prose poem కి కూడా వర్తిస్తుంది. ఒక లయ, తూగు అంతర్లీనంగా వుండాలి. “కంఠగత లక్షణం” మంచి పోయెమ్ కి వుండాల్సిన లక్షణం కూడా, వచన కవిత్వం అయినా సరే. బాగున్న పద్యం, అది యే రూపంలో వున్నా, కాళిదాసు చెప్పినట్టుగా, “రసనగర నర్తకి” గా వుండాల్సిందే. దీనికి తిరుగు లేదు. వచన కవిత్వం లో కూడా మంచి పద్యం కోట్ చెయ్యగలిగినది నోటిమీద వుండగలిగినదై వుండటం దాని ప్రభావానికి గుర్తే.
అయితే, అలాగే ఛందోబద్ధమైన పద్యాలన్నీ కూడా గొప్పవి కావు. మీరు వుదాహరించిన తిక్కన గారి పద్యం, రామాభ్యుదయంలోని తిక్కన గారి పద్యాన్ని అనుకరిస్తూ రాసిన పద్యం — వీటిని వుదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే బాగున్న poem ఎందుకు బాగుందో చెప్పటం తేలిక. బాగాలేనిది ఎందుకు బాగాలేదో చెప్పటం — ముఖ్యంగా సమకాలంలో — చాలా కష్టం. అంచేత మాట్లాడకుండా వూరుకుంటారు (లేదా బాబ్జీలు గారి లాంటి అవతారం ఎత్తవలసి వుంటుంది మరి నిజాలు చెప్పడానికి).
ఇంకా మళ్ళీ వెనక్కి అంటే ఛందోబద్ధమైన పద్యం రాయటం దగ్గరికి వస్తాను. మంచి లయతో, ధారాశుద్ధితో చక్కని ఉపమానంతో, పుష్టిగా వున్న భాషతో (భాషాడంబరం కాకుండా) ఎవరైనా రాస్తే, పద్యం అయినా చెలామణీ అవుతుందనే నేననుకుంటాను, ఇవ్వాళకూడా!
విషయం ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఛందస్సును స్వాధీన పరుచుకొని పరిపుష్టిగా పద్యాలు చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గటం వల్ల పద్యం వెనకబడింది తప్ప, వచన కవిత్వం వల్ల కాదు. ఔననిపించుకునే పద్యాలు రాసేవారి సంఖ్య పద్యంలోనూ, వచన పద్యంలోనూ కూడా ఇవ్వాళ తక్కువే సుమా.
“వస్తువు” ముఖ్యమే ఎప్పుడైనా కవిత్వంలో. కానీ దాని వ్యక్తీకరణ ఎట్లా వున్నదన్నదాని మీదనే ఒక మామూలు కవికి, ఒక మహాకవికి మధ్యనుండే భేదం బోధపడుతుంది.
కవి నామధేయులు ఉంటారు అన్ని కళల్లోనూ. కవులు కొందరే వుంటారు అన్ని కలాల్లోనూ. రూపం ఏది అన్నదానికన్నా సారం ఎంత అన్నది చూడవలసిన విషయం కవిత్వంలో. ఎందులోనైనా బాగున్నవి నిలబడగలిగినవీ నిలబడతాయి. మిగితాయి పోతాయి. అది కాల మహిమ. అదంతే. మంచి కవిత్వానికి, మంచి సంగీతానికి సూర్య చంద్రులు కాపలా వుంటారు. నిశ్చింతగా వుండండి. అస్తు!
జయప్రభ.
88 ఏళ్ళ యువకులు గురించి Illaiyaraja అభిప్రాయం:
08/19/2008 12:33 pm
Thank you so much for the info.
హిందోళ రాగం – అనుబంధం గురించి satya rama prasad kalluri అభిప్రాయం:
08/19/2008 10:40 am
హిందోళంగురించి శ్రీ కొడవటిగంటి వ్రాసిన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉన్నది.
1) జేసుదాసు ‘మనసులోని మర్మము (త్యాగరాజకీర్తన)ను’ చతుశ్శ్రుతి రిషభంతో పాడగా (రికార్డు) మొదట విని ఆశ్చర్యపోయాను. అతడు చెంబై శిష్యపరంపరవాడట. అంతకు ముందు శ్రీరంగం గోపాలరత్నం, మరికొందరు శుద్ధరిషభంతోనే పాడారు. నాకు తెలిసిన ఒక విద్వాంసుడు త్యాగయ్య కీర్తనలు రెండిటిలోనూ ఒకటి ఇలాగ అయిపోయిందని బాధపడ్డాడు
2) ‘మామవతు శ్రీ సరస్వతీ’ కూడా ఇస్తే బాగుండేదనిపించింది. అయినా దీనికి అంతమెక్కడ?
ఎంతో శ్రమతో చక్కటి వ్యాసం ఇచ్చిన శ్రీ కొడవటిగంటివారికి అభివాదాలు.
సత్యరామ ప్రసాదు కల్లూరి
kalluriprasad@hotmail.com
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి krishna అభిప్రాయం:
08/19/2008 9:42 am
ఇంత చక్కటి తెలుగు వాక్యాలు/హృదయాలు చదివి ఎన్నాళైందో!
పద్య శిల్పం గురించి baabjeelu అభిప్రాయం:
08/19/2008 6:49 am
“మావేటంతావమ్మా? మీరేటంతే మావూ అదేఅంతావు.”
కామేశ్వరరావుగారి లాటి వాళ్ళని, మీలాటి వారు “కమాండ్” చెయ్యగలరు. ఆయన మంచి సలహా అని, మనస్ఫూర్తిగా వుపక్రమించగలరు.
ఎందుకంటే; పరిమితి, పరిధీ తెలిసి, విపులీకరించి,విశ్లేషించగల నేర్పూ, ఓర్పూ వున్న”వ్యాసుడు” కామేశ్వరరావుగారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. (సిరికిం… పద్యాన్ని గురించి నాలాటి వాడికి అంత సంయమనంతో, చక్కగా వివరించేరు)
“అంచేతేటంటే, కావేస్వొర్రావుబావూ, ఆయమ్మ సెప్పినట్టు కానీండి. మరికేటీ సూడొద్దు. కాదంటే ఆయమ్మొప్పదు.”
నేను మీరిచ్చిన “లింక్” తో “అటజని..” పద్యం గురించి ఇంకా తెలుసుకుని మురిసిపోయేను. అయితే పద్యాన్ని చదవడానికీ, ఛందస్సుకీ “లింక్” వుందా, లేదా? దీనిగురించి మీరు “విపులీకరించి, విశ్లేషించాలి”. దానికి అభిప్రాయవేదిక సరిపోదు అని మీరు వొప్పుకోవాలి. వొప్పుకుంటారు.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి mOhana అభిప్రాయం:
08/19/2008 5:32 am
కామేశ్వరరావుగారూ, బాగుందండీ మీ బ్లాగు.. సాహిత్యంలో మీ
ఆసక్తికి ఇది ఒక నిదర్శనమే.
1) చంపకమాలలో పాదం మధ్యలో మూడు విధాలుగా
ఒక గతిని కల్పించవచ్చును. మొదటిది స-స-స
విరియై, సిరియై, ఝరియై లాటిది ఇది.
ప్రగడ రాణ్ణరసా విరసా తుసా బుసా ఇట్టిదే.
రెందవది మూడు జ-గణాలతో, అభంగ మృదంగ తరంగ లాటిది.
మూడవది మనం మామూలుగా వాడేది భ-భ-ర.
ఇక్కడ అల్లసానివారు మూడు జ-గణాలను వాడినా అది
నా ఉద్దేశంలో యాదృచ్ఛికమే. అన్ని పాదాలలో అలా వాడితేనే
ఒక కొత్త గతి వస్తుంది అని నా నమ్మకం.
2) నాకు ఎన్నో సంవత్సరాలుగా ఈ సందేహం. అసలు
ప్రవరాఖ్యుడు నిజంగా హిమాలయాలకు వెళ్లాడా అనేదే ఇది.
ఎందుకంటే మంచుమలలలో కరేణువులు ఎక్కడుంటాయి?
కలాపి జాలాలు ఎక్కడుంటాయి? పాపం వాటికి చలి వేయదా?
జలపాతాలు కూడా అరుదే.
బహుశా అతడు ఇప్పటి నేపాళ లేక ఉత్తరప్రదేశ, లేక
హిమాచలప్రదేశపు లోయలకు వెళ్లి ఉండవచ్చు. అక్కడి
అడవులలో ఏనుగులు, నెమళ్లు, వానాకాలపు ఉరుములు,
మెరుపులు, మృదంగపు మ్రోతలా జలపాతాలు ఉండి
ఉంటాయి. పర్వతాలలో చాలా చల్లగా ఉన్నా ఈ లోయలలో
ఎండ ఒక్కొక్కప్పుడు ఎక్కువే. అందువల్ల అతని పాదలేపం
కూడా కరిగిపోవడానికి అవకాసశం ఉంది. దూరంనుండి
హిమవత్పర్వతాలను చూసి ఉంటాడు. సియాటుల్ నగరంనుండి
మవుంట్ రెనియెర్ను చూచినట్లు. ఇట్టి సందేహం
కాళిదాసు మేఘదూతం విషయంలో కూడ ఉంది.
విధేయుడు – మోహన
గ్రంథచౌర్యం గురించి … గురించి satya rama prasad kalluri అభిప్రాయం:
08/19/2008 4:06 am
త్యాగరాజ స్వామి కీర్తనలకు కూడా ఈ బెడద తప్పలేదు!
నేనొక పుస్తకాన్ని వ్రాస్తూ ఒక పెద్దాయనవద్దకు వెళ్ళగా ఆయన ఈ క్రింది విషయాలను చెప్పి, దిగ్భ్రాంతపరచాడు – ఏతావాతా తేలినదేమిటంటే క్రింది కృతులు త్యాగరాజకృతులు కావు!
1) వెడలెను కోడండపాణి (తోడి)
2) నీదు చరణములే (సింహేంద్రమధ్యమం)
3) పరాంగ్ముఖ .. (సురటి)
4) వినతాసుతవాహనుడై (హరికాంభోజి)
కల్లూరి సత్యరామ ప్రసాదు
kalluriprasaad@hotmail.com
పద్య శిల్పం గురించి jayaprabha అభిప్రాయం:
08/19/2008 1:59 am
కామేశ్వర రావు గారు,
చాలా సంతోషం. మరోమాట: మీరిచ్చిన లింకు లోకి వెళ్ళి “మనుచరిత్ర” లోని “అటజనికాంచె” పద్యం మీద వ్యాఖ్యానం కూడా ఇప్పుడే చూసాను. మీకు మనుచరిత్రలో “సహసానఖంపచ …” పద్యం నచ్చలేదా? దాన్ని అందంగా వ్యాఖ్యానించవచ్చునే? బహుశా కావాలనే మీరంతా ఆ పద్యాల జోలికి పోవడం లేదు కాబోలు (సంశయించి), ఔనా? కానీ నేనేమనుకుంటానంటే ఇంతమంది సాహితీ ప్రియులుండి మంచి పద్యాన్ని మళ్ళీ మరోసారి పాఠకులకు పరిచయం చేయకపోతే ఎట్లా అని. సరసులైన పాఠకులున్నారు; చాలా సంయమనంతో మాట్లాడగలిగిన వాళ్ళు వున్నారు; స్వారస్యం తెలుసుకుని రసాస్వాదన చేయగలరు వాళ్ళు. చూడండి. పెద్దన గారి గాంధర్వం అంతా ఆ పద్యంలో వుంది.
ఏమండీ, బాబ్జీలు గారు మీరేమంటారు? ఎంతసేపూ “అటజనికాంచె” గురించేనా? కాస్తా ముందుకి వెళ్ళండి మనుచరిత్రలో. పోనీ “చలిగాలి బొండుమల్లెల పరాగము వైచి నిబిడంబు చేసే వెన్నెల రసంబు” దాకానైనా. నాకు తెలిసి చాలామంది మీ చర్చలు ఆనందిస్తారని. ముఖ్యంగా పెద్దన గారి కవిత్వాన్ని మరింత ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. శృంగారాన్ని మాట్లాడటం లో మీ విశ్లేషణలు వెనకపడితే, పాపం, ఆ పద్యాలని రాసిన పెద్దన గారేమనుకోవాలి? ఈ తెలుగు వాళ్ళకి సరసత లేదన్నీనూ, విజయనగర కాలం దగ్గరే శృంగారం కూడా ఆగిపోయిందనీన్నూ అనుకోడా? ఈ తరం వాళ్ళకి పాత (I mean, “భూస్వామ్య వాద”) తెలుగు కవిత్వంలోని మధురిమలని సైతం కాస్త రుచి చూపించండి. నేను చెప్పేదాన్నే గానీ, నేను పీక లోతు దాకా అన్నమయ్య శృంగార సంకీర్తనల వ్యాఖ్యానంలో కూరుకుపోయి వున్నానిప్పుడు, గనుక దారి మళ్ళలేను.
జయప్రభ
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Kameswara Rao అభిప్రాయం:
08/18/2008 8:03 pm
“అటజని గాంచె” పద్యం గురించి నా వివరణ ఇక్కడ రాసాను:
అటజని కాంచె…
అదేమైనా ఉపయోగ్యమైనదే అనుకుంటే , దాని బట్టి మీకు తోచినట్టు చదువుకోండి!
(నా, యీ సొంత ప్రోపగాండాని ఈమాట సంపాదకులు క్షమిస్తారని ఆశిస్తున్నాను 🙂