“కాని కవికి గౌరవం చూపాలి, కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు….
“సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు,వాటిని చదివి ఆనందించవచ్చు…”
-mOhana అభిప్రాయం
కవిత్వంలో పొరలు ఉన్నట్లే, ఈ మాటలలో కూడ ‘ధ్వని’ ఉన్నది. An implied meaning. అది మీరు ఏ మాత్రం ఉద్దేశించి ఉండరు. కాని వేరే చెవులకు అలా వినిపిస్తుంది. అది ఏమిటంటే – చర్చలలో – ప్రశ్న అడిగినప్పుడల్లా, కవితో వ్యతిరేకించినప్పుడల్లా, ఇది మాకు నచ్చలేదు -అని ఒక పాఠకుడు వ్యక్త పరిచినపుడల్లా, మరొక పాఠకుడు వచ్చి -కవిని గౌరవించాలనీ, కవి మనకు తెలియని విషయాలు పరిచయం చేస్తున్నందుకు ఋణపడి ఉండాలనీ – ఇలాటి మాటలు మళ్ళీమళ్ళీ రాయటం.
ప్రశ్నలు అడిగిన వారికి కవిమీద గౌరవం లేదు – అన్న ధ్వని ఈ మాటలలో వినిపిస్తుంది. అది మంచిది కాదు. చాలా పాత పద్ధతి. సత్వరం మానివెయ్యాల్సిన పద్ధతి. ఈ పద్ధతి ప్రశ్నలు రాసే వాళ్ళను విముఖులను చేస్తుంది. విషయాలు నేర్చుకోటానికీ, తమ అభిప్రాయాలు వ్యక్త పరచటానికీ ప్రతిబంధకమవుతుంది. మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. ఆ ఆదరానికి నోచుకోటానికి కవులూ, పండితులే కానక్కర్లేదు. కాబట్టి కవితలని గూర్చిన వాదాల్లో- కవులను గౌరవించాలి అని బోధలు అవసర్ల్లేదు.
మనకు అర్థం ఐన కవితలను గురించి అభిప్రాయాలు రాసుకుని, అర్థం కాని వాటిని గురించి మౌనంగా ఉంటే, కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాము? అర్థం కాని వాటిని గురించి ఎందుకు అడగ్గూడదు? చేతనైన వాళ్ళు చెపుతూనే ఉండాలి. చెప్పినందువల్ల ఈ కవిత కొంతైనా అర్థమయిందికదా.ఈ కవి రచనలు మరింత చదివిన కొద్దీ, ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది.
ఐనా, కవులు, పాఠకులు, అని వర్గాలు -అన్ని వేళలా లేవే. పండితులూ, కవులూ సర్వ వేళలా గురువులే కారే. వారు శిష్యులు కూడా. ఒకరి ప్రశ్నలూ, అభిప్రాయాలనుంచి ఇంకొకరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు కాదా.
కవిని గౌరవించక పోతే కవిత్వం మనుషులకు అర్థం కాదా ఏమిటి? ఈ కవి చెప్పిన ప్రకారం ఒక్క ప్రియురాలి మనసు తప్ప అందరికీ అన్నీ అర్థం అయ్యే అవకాశం ఉన్నట్లే ఉంది మరి.
మొన్న డెట్రాయిట్లో జరిగిన సమావేశంలో (నా సమీక్ష చూడండి) కవితల పైన ఒక సదస్సు ఉండింది. అందులో కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి అన్నారు ఒకరు. కాని అలా రాస్తే పాఠకులకు అర్థం అవుతుందా అనే ప్రశ్నకు ఈ చర్చ జవాబు అనుకొంటాను. ఇందులో ఎన్నో పొరలు ఉన్నాయి. ఎవరికి కావలసిన అర్థాలు వారు కల్పించుకోవచ్చు. కొన్ని రచయితకు కూడా తోచిఉండక పోవచ్చు. ఉదాహరణకు బుద్ధుని శిరస్సు, మొండెము. దీనిని చదువగానే నాకు తోచింది ఎప్పుడో చదివిన షెల్లీగారు రాసిన ఓజిమాండియస్ అనే సానెట్. అందులో కూడా విరిగిన ఓజిమాండియస్ శిలావిగ్రహం ఎడారిలో ఉంటుంది.
My name is Ozymandius, King of Kings,
Look on my works, ye Mighty, and despair!
అని అంతమవుతుంది. నిరంకుశుని ఎవరూ తలచుకోరు. ఆ విగ్రహంలోని కళను తప్ప, దాని కారకుడు శిల్పి. బుద్ధుని విగ్రహం విరిగి ఉన్నా, బుద్ధుని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉన్నారు కలువలతో. మనం ఎలా జీవిస్తున్నామో అన్నదే ముఖ్యం అనే ఒక భావన కలుగుతుంది ఈ పంక్తులు చదివిన తరువాత. ఈ ఊహ అందరికీ కలుగకపోవచ్చు. కాని పొరలు పొరలుగా ఉండాలి కవిత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కవిత మంచిదో కాదో అనే దానికి తూనిక రాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పలేము (వేలూరిగారి వ్యాసం చదవండి). కవిత మంచిదైతే కలకాలం నిలుస్తుంది, లేకపోతే తెలుగు సినిమాలా ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని కవికి గౌరవం చూపాలి,
కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు. సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు, వాటిని చదివి ఆనందించవచ్చు. నేను పారిస్ వెళ్లినప్పుడు పోంపెదూ మ్యూసియంకి వెళ్లాను. అది మాడర్న్ ఆర్ట్ పైన. అందులో కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. కాని ఉత్తమ కళాకారులచే సృష్టించబడినవి అవి. దానిని రసాస్వాదన చేయలేకపోవడం నా తప్పే గాని మ్యూసియం వారిది మాత్రం కాదు. విధేయుడు – మోహన
వివిధ అంశాలపై చర్చల సారాన్ని ప్రస్తావిస్తూ సమీక్ష అభినందనీయంగా రాశారు. ఈ సదస్సులోని ప్రసంగాల ఆడియో లేదా వీడియో క్లిప్పింగులను కూడా అందుబాటులో వుంచగలిగితే సంతోషం.
కామేశ్వరరావు గారు
ముందుగా, నచ్చనిది మర్యాదగా, అవహేళన చేయకుండా చెప్పడాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. నేను రాసింది, రాస్తున్నది అది కాదనే ఆశిస్తాను.
ఇక ఈ చర్చ, కవిత ఎంతమందికి అర్థం అవ్వాలి అని opinion poll లో తూచి వెలకట్టడం కాదనుకుంటాను. సొంతంగా ఎంతవరకు కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడానికి వీలవుతున్నది అన్నదే ప్రశ్న అనిపిస్తుంది. కనీసం దేనిగురించో అన్నదైనా తెలియవీలవుతుందా అని కూడా.
కవిత యొక్క శీర్షిక “సువర్ణ భూమిలో…” అన్నారు. థాయలాండ్్ ని “సువర్ణభూమి” అని అంటారని చదవలేదు, వినలేదు. తెలిసిన వారు చెప్ప మనవి. థాయ్లాండ్్ పూర్వనామం సియాం. సియాం కు సంస్కృతంలో ఉన్న “శ్యామ” కు సంబంధం ఉంది. “శ్యామ” అంటే నలుపు, నీలం కాని సువర్ణమని తోచడంలేదు. ఇదంతా ఎందుకంటే, థాయలాండ్్ గురించి ఎక్కువగా తెలియని వారికి, ఈ కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడం కష్టం. మోహనగారు, మీరూ, చెప్పింతర్వాత కొంత background తెలిసి ఇది అసలు దేనిగురించో అన్న చిక్కుముడి వీడింది. అది చాలు పాఠకునికి ఊరటనివ్వడానికి.
కవితను ఆస్వాదించడం పక్కకు పెట్టి, అసలు దేనిగురించి చెబుతున్నారో కూడా తెలియని అయోమయ స్థితిని నివారించడం రచయిత బాధ్యతే కాదు, politeness to readers అనిపిస్తుంది. ఏం చెప్పారో అని కాదు, దేని గురించి చెప్పారో అన్నదే తేలకపోతే గందరగోళం. సమయం వెచ్చించి, కష్టపడి చదివితే, దేనిగురించి చెప్పారో కూడా తెలియని స్థితిలో ఉంటే ఆ రచనను rude to readers అని ఎందుకు అనుకోకూడదో తెలియదు. That is no reason to be rude to writer in turn.
=============
Regards
-Srinivas
ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే మనుషుల్లో ఇంతటి అసహనం ఉంటుందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది, బాధేస్తోంది. ఎందుకంటే,
1. మనకి ఒక కవిత నచ్చకపోతే (అర్థంకాకపోతే) అది నచ్చలేదని (అర్థం కాలేదని) మర్యాదగా చెప్పవచ్చు, అవహేళన చెయ్యాల్సిన అవసరం లేదు.
2. సరే కొంతమందికి అర్థం కాలేదని, మాకు అర్థమయిందేదో నేను, అలానే మోహనగారు చెప్పాం. మేమేమీ కొమ్ములు మొలిచిన పాఠకులం కాదు, మామూలు పాఠకులమే. మేమర్థం చేసుకున్నట్టుగా తక్కిన వాళ్ళు అర్థం చేసుకోవాలని రూలేం లేదు. అయితే దీన్నేదో కవితకి సమర్థింపుగా అనుకోవడంలో అర్థమేముంది? నాకు భూషణ్ గారు చుట్టమేమీ కాదు, అసలు నాకతనితో పరిచయమే లేదు, అతను నా అభిమానకవి అంతకన్నా కాదు. మరి దేనికి ఉట్టినే సమర్థిస్తాను? అసలు అతని కవిత బాగుంది అని కూడా నేననలేదే! మరి సమర్థింపు ఏమిటి?
3. ప్రతికవితా మనకి అర్థం అవుతుందన్న నమ్మకమూ లేదు, అవ్వాల్సిన అవసరమూ లేదు. మనకి అర్థం కాని కవితకి వేరెవరైనా తమకి తోచిన అర్థాన్ని చెపితే, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉచితమైన పని. “నేనలా అర్థం చేసుకోడానికి ప్రయత్నించను, నాకు ప్రతీదీ అప్రయత్నంగానే అర్థమవ్వాలి, అలా అవ్వకపోతే అది కవిత కాదు” అని అనుకోవడం మొండితనమే అవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు?
బాబాగారు, శ్రీనివాస్ గారు, బాబ్జీలు గారు,
కవితని ఒక పాఠకునిగా మనం అర్థం చేసుకొని ఎంతవరకూ ఆస్వాదించేం అన్నది ముఖ్యం కాని, అది ఎంతమందికి అర్థం అవ్వాలి? ఎక్కువమందికి అర్థమయ్యేట్టు కవి రాసాడా? అలా రాయకపోవడం కవి దోషమా ఇత్యాది వాదోపవాదనలు అవసరం అంటారా?
కవుల మనసులో ఏముందో వారు రాసిన కవిత్వం చెప్పాలితప్ప మరొకరు చెప్పజాలరు. చదవగానే ఎలాటి భావం కలగకపోతే లేదా దేనిగురించి ఈ కవిగారు రాసేరూ? అని మామూలు పాఠకుడికి అనిపిస్తే ఇలాగే వుంటుంది. యద్భావం తద్భవతి లాగ, రాసిన ప్రక్రియ వుంటే తప్పు కాదా? క్లుప్తతకి కూడా “లిమిట్” వుండాలేమో? “శుక్లాంబరధరం..” శ్లోకం గాడిద పరంగానూ వ్యాఖ్య చెయ్యొచ్చునని వేదంవారో, తాతావారో నిరూపించినట్టుంటే ఎలా?
కవిగారివల్ల పాఠకుల స్థాయి పెరగాలి. కానీ కవిగారివల్ల పాఠకులు తగ్గిపోతే అది కవిగారి తప్పే. “అర్ధవఁవకపోతే, భాషనేర్చుకుని చదవండి” అని కాబోలు విశ్వనాధ వారి సమాధానం, “జరుక్ శాస్త్రి గారికీ” “శ్రీశ్రీ” కీ. కానీ “బ్రౌణ్యం” పక్కన పెట్టుకున్నా కొరుకుడు పడని కవిత్వం సంగతి?
yadukulabhushan garu ilanTi parody lu rase avakasam ichhinanduku..andarikanna mundu aayanni congrats chestoo, ilanTi manchi rasaheenamaina padyalani.. manchi vinodam kaliginche padhatilO marikonni rayamani ..aBhyardidtoo..parady kartalaki marOsaari na santoshanni teliyajestunnanu.
adisare..vamanamoorti garu..changubhala..Enkimaama..anna oohalO vunna mahaardhamemO! mee vakyanni nenu maravanandOy.
eemaaTa sampadakuloo kaDupaara navvukOnichharu. thank u.
RAMA
[రమ గారు: మీ అభిప్రాయాన్ని ఈ సారికి రోమన్ లిపిలోనే ప్రచురిస్తున్నాము. తెలుగులో టైపుచెయ్యడం కన్నా ఇలా రోమన్ లిపిలో రాసినవి చదవడం ఇంకా కష్టమని గుర్తించగలరు. మీకు ఈమాటలో అభిప్రాయాలు రాసే డబ్బాలో తెలుగులో టైపు చెయ్యడం అలవాటు కాకపోతే తెలుగులో టైపు చెయ్యడానికి Quillpad, Baraha లాంటి సాధనాలు పరిశీలించగలరు. – సం]
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి వర్మ దాట్ల అభిప్రాయం:
11/07/2008 8:03 pm
అవును, ఇప్పుడు కావల్సిందల్లా ’ఆసరా’ అవగలిగినతనం మాత్రమే
కానీ, లోపించింది కుడా అదే అవడంతో…….నే…..
అసమర్థులు గురించి చిలమకూరు విజయమోహన్ అభిప్రాయం:
11/07/2008 7:23 pm
ఒక చట్రంలో బిగించిన స్త్రీ మనసులోని భావాలను ఎంత బాగా ఆవిష్కరించారండి.
సువర్ణభూమిలో … గురించి lyla yerneni అభిప్రాయం:
11/07/2008 4:57 pm
“కాని కవికి గౌరవం చూపాలి, కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు….
“సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు,వాటిని చదివి ఆనందించవచ్చు…”
-mOhana అభిప్రాయం
కవిత్వంలో పొరలు ఉన్నట్లే, ఈ మాటలలో కూడ ‘ధ్వని’ ఉన్నది. An implied meaning. అది మీరు ఏ మాత్రం ఉద్దేశించి ఉండరు. కాని వేరే చెవులకు అలా వినిపిస్తుంది. అది ఏమిటంటే – చర్చలలో – ప్రశ్న అడిగినప్పుడల్లా, కవితో వ్యతిరేకించినప్పుడల్లా, ఇది మాకు నచ్చలేదు -అని ఒక పాఠకుడు వ్యక్త పరిచినపుడల్లా, మరొక పాఠకుడు వచ్చి -కవిని గౌరవించాలనీ, కవి మనకు తెలియని విషయాలు పరిచయం చేస్తున్నందుకు ఋణపడి ఉండాలనీ – ఇలాటి మాటలు మళ్ళీమళ్ళీ రాయటం.
ప్రశ్నలు అడిగిన వారికి కవిమీద గౌరవం లేదు – అన్న ధ్వని ఈ మాటలలో వినిపిస్తుంది. అది మంచిది కాదు. చాలా పాత పద్ధతి. సత్వరం మానివెయ్యాల్సిన పద్ధతి. ఈ పద్ధతి ప్రశ్నలు రాసే వాళ్ళను విముఖులను చేస్తుంది. విషయాలు నేర్చుకోటానికీ, తమ అభిప్రాయాలు వ్యక్త పరచటానికీ ప్రతిబంధకమవుతుంది. మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. ఆ ఆదరానికి నోచుకోటానికి కవులూ, పండితులే కానక్కర్లేదు. కాబట్టి కవితలని గూర్చిన వాదాల్లో- కవులను గౌరవించాలి అని బోధలు అవసర్ల్లేదు.
మనకు అర్థం ఐన కవితలను గురించి అభిప్రాయాలు రాసుకుని, అర్థం కాని వాటిని గురించి మౌనంగా ఉంటే, కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాము? అర్థం కాని వాటిని గురించి ఎందుకు అడగ్గూడదు? చేతనైన వాళ్ళు చెపుతూనే ఉండాలి. చెప్పినందువల్ల ఈ కవిత కొంతైనా అర్థమయిందికదా.ఈ కవి రచనలు మరింత చదివిన కొద్దీ, ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది.
ఐనా, కవులు, పాఠకులు, అని వర్గాలు -అన్ని వేళలా లేవే. పండితులూ, కవులూ సర్వ వేళలా గురువులే కారే. వారు శిష్యులు కూడా. ఒకరి ప్రశ్నలూ, అభిప్రాయాలనుంచి ఇంకొకరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు కాదా.
కవిని గౌరవించక పోతే కవిత్వం మనుషులకు అర్థం కాదా ఏమిటి? ఈ కవి చెప్పిన ప్రకారం ఒక్క ప్రియురాలి మనసు తప్ప అందరికీ అన్నీ అర్థం అయ్యే అవకాశం ఉన్నట్లే ఉంది మరి.
లైలా
సువర్ణభూమిలో … గురించి mOhana అభిప్రాయం:
11/07/2008 3:29 pm
మొన్న డెట్రాయిట్లో జరిగిన సమావేశంలో (నా సమీక్ష చూడండి) కవితల పైన ఒక సదస్సు ఉండింది. అందులో కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి అన్నారు ఒకరు. కాని అలా రాస్తే పాఠకులకు అర్థం అవుతుందా అనే ప్రశ్నకు ఈ చర్చ జవాబు అనుకొంటాను. ఇందులో ఎన్నో పొరలు ఉన్నాయి. ఎవరికి కావలసిన అర్థాలు వారు కల్పించుకోవచ్చు. కొన్ని రచయితకు కూడా తోచిఉండక పోవచ్చు. ఉదాహరణకు బుద్ధుని శిరస్సు, మొండెము. దీనిని చదువగానే నాకు తోచింది ఎప్పుడో చదివిన షెల్లీగారు రాసిన ఓజిమాండియస్ అనే సానెట్. అందులో కూడా విరిగిన ఓజిమాండియస్ శిలావిగ్రహం ఎడారిలో ఉంటుంది.
My name is Ozymandius, King of Kings,
Look on my works, ye Mighty, and despair!
అని అంతమవుతుంది. నిరంకుశుని ఎవరూ తలచుకోరు. ఆ విగ్రహంలోని కళను తప్ప, దాని కారకుడు శిల్పి. బుద్ధుని విగ్రహం విరిగి ఉన్నా, బుద్ధుని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉన్నారు కలువలతో. మనం ఎలా జీవిస్తున్నామో అన్నదే ముఖ్యం అనే ఒక భావన కలుగుతుంది ఈ పంక్తులు చదివిన తరువాత. ఈ ఊహ అందరికీ కలుగకపోవచ్చు. కాని పొరలు పొరలుగా ఉండాలి కవిత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కవిత మంచిదో కాదో అనే దానికి తూనిక రాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పలేము (వేలూరిగారి వ్యాసం చదవండి). కవిత మంచిదైతే కలకాలం నిలుస్తుంది, లేకపోతే తెలుగు సినిమాలా ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని కవికి గౌరవం చూపాలి,
కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు. సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు, వాటిని చదివి ఆనందించవచ్చు. నేను పారిస్ వెళ్లినప్పుడు పోంపెదూ మ్యూసియంకి వెళ్లాను. అది మాడర్న్ ఆర్ట్ పైన. అందులో కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. కాని ఉత్తమ కళాకారులచే సృష్టించబడినవి అవి. దానిని రసాస్వాదన చేయలేకపోవడం నా తప్పే గాని మ్యూసియం వారిది మాత్రం కాదు. విధేయుడు – మోహన
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి రానారె అభిప్రాయం:
11/07/2008 1:19 pm
వివిధ అంశాలపై చర్చల సారాన్ని ప్రస్తావిస్తూ సమీక్ష అభినందనీయంగా రాశారు. ఈ సదస్సులోని ప్రసంగాల ఆడియో లేదా వీడియో క్లిప్పింగులను కూడా అందుబాటులో వుంచగలిగితే సంతోషం.
సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
11/07/2008 1:15 pm
కామేశ్వరరావు గారు
ముందుగా, నచ్చనిది మర్యాదగా, అవహేళన చేయకుండా చెప్పడాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. నేను రాసింది, రాస్తున్నది అది కాదనే ఆశిస్తాను.
ఇక ఈ చర్చ, కవిత ఎంతమందికి అర్థం అవ్వాలి అని opinion poll లో తూచి వెలకట్టడం కాదనుకుంటాను. సొంతంగా ఎంతవరకు కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడానికి వీలవుతున్నది అన్నదే ప్రశ్న అనిపిస్తుంది. కనీసం దేనిగురించో అన్నదైనా తెలియవీలవుతుందా అని కూడా.
కవిత యొక్క శీర్షిక “సువర్ణ భూమిలో…” అన్నారు. థాయలాండ్్ ని “సువర్ణభూమి” అని అంటారని చదవలేదు, వినలేదు. తెలిసిన వారు చెప్ప మనవి. థాయ్లాండ్్ పూర్వనామం సియాం. సియాం కు సంస్కృతంలో ఉన్న “శ్యామ” కు సంబంధం ఉంది. “శ్యామ” అంటే నలుపు, నీలం కాని సువర్ణమని తోచడంలేదు. ఇదంతా ఎందుకంటే, థాయలాండ్్ గురించి ఎక్కువగా తెలియని వారికి, ఈ కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడం కష్టం. మోహనగారు, మీరూ, చెప్పింతర్వాత కొంత background తెలిసి ఇది అసలు దేనిగురించో అన్న చిక్కుముడి వీడింది. అది చాలు పాఠకునికి ఊరటనివ్వడానికి.
కవితను ఆస్వాదించడం పక్కకు పెట్టి, అసలు దేనిగురించి చెబుతున్నారో కూడా తెలియని అయోమయ స్థితిని నివారించడం రచయిత బాధ్యతే కాదు, politeness to readers అనిపిస్తుంది. ఏం చెప్పారో అని కాదు, దేని గురించి చెప్పారో అన్నదే తేలకపోతే గందరగోళం. సమయం వెచ్చించి, కష్టపడి చదివితే, దేనిగురించి చెప్పారో కూడా తెలియని స్థితిలో ఉంటే ఆ రచనను rude to readers అని ఎందుకు అనుకోకూడదో తెలియదు. That is no reason to be rude to writer in turn.
=============
Regards
-Srinivas
సువర్ణభూమిలో … గురించి Kameswara Rao అభిప్రాయం:
11/07/2008 12:26 pm
ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే మనుషుల్లో ఇంతటి అసహనం ఉంటుందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది, బాధేస్తోంది. ఎందుకంటే,
1. మనకి ఒక కవిత నచ్చకపోతే (అర్థంకాకపోతే) అది నచ్చలేదని (అర్థం కాలేదని) మర్యాదగా చెప్పవచ్చు, అవహేళన చెయ్యాల్సిన అవసరం లేదు.
2. సరే కొంతమందికి అర్థం కాలేదని, మాకు అర్థమయిందేదో నేను, అలానే మోహనగారు చెప్పాం. మేమేమీ కొమ్ములు మొలిచిన పాఠకులం కాదు, మామూలు పాఠకులమే. మేమర్థం చేసుకున్నట్టుగా తక్కిన వాళ్ళు అర్థం చేసుకోవాలని రూలేం లేదు. అయితే దీన్నేదో కవితకి సమర్థింపుగా అనుకోవడంలో అర్థమేముంది? నాకు భూషణ్ గారు చుట్టమేమీ కాదు, అసలు నాకతనితో పరిచయమే లేదు, అతను నా అభిమానకవి అంతకన్నా కాదు. మరి దేనికి ఉట్టినే సమర్థిస్తాను? అసలు అతని కవిత బాగుంది అని కూడా నేననలేదే! మరి సమర్థింపు ఏమిటి?
3. ప్రతికవితా మనకి అర్థం అవుతుందన్న నమ్మకమూ లేదు, అవ్వాల్సిన అవసరమూ లేదు. మనకి అర్థం కాని కవితకి వేరెవరైనా తమకి తోచిన అర్థాన్ని చెపితే, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉచితమైన పని. “నేనలా అర్థం చేసుకోడానికి ప్రయత్నించను, నాకు ప్రతీదీ అప్రయత్నంగానే అర్థమవ్వాలి, అలా అవ్వకపోతే అది కవిత కాదు” అని అనుకోవడం మొండితనమే అవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు?
బాబాగారు, శ్రీనివాస్ గారు, బాబ్జీలు గారు,
కవితని ఒక పాఠకునిగా మనం అర్థం చేసుకొని ఎంతవరకూ ఆస్వాదించేం అన్నది ముఖ్యం కాని, అది ఎంతమందికి అర్థం అవ్వాలి? ఎక్కువమందికి అర్థమయ్యేట్టు కవి రాసాడా? అలా రాయకపోవడం కవి దోషమా ఇత్యాది వాదోపవాదనలు అవసరం అంటారా?
సువర్ణభూమిలో … గురించి baabjeelu అభిప్రాయం:
11/07/2008 9:51 am
కవుల మనసులో ఏముందో వారు రాసిన కవిత్వం చెప్పాలితప్ప మరొకరు చెప్పజాలరు. చదవగానే ఎలాటి భావం కలగకపోతే లేదా దేనిగురించి ఈ కవిగారు రాసేరూ? అని మామూలు పాఠకుడికి అనిపిస్తే ఇలాగే వుంటుంది. యద్భావం తద్భవతి లాగ, రాసిన ప్రక్రియ వుంటే తప్పు కాదా? క్లుప్తతకి కూడా “లిమిట్” వుండాలేమో? “శుక్లాంబరధరం..” శ్లోకం గాడిద పరంగానూ వ్యాఖ్య చెయ్యొచ్చునని వేదంవారో, తాతావారో నిరూపించినట్టుంటే ఎలా?
కవిగారివల్ల పాఠకుల స్థాయి పెరగాలి. కానీ కవిగారివల్ల పాఠకులు తగ్గిపోతే అది కవిగారి తప్పే. “అర్ధవఁవకపోతే, భాషనేర్చుకుని చదవండి” అని కాబోలు విశ్వనాధ వారి సమాధానం, “జరుక్ శాస్త్రి గారికీ” “శ్రీశ్రీ” కీ. కానీ “బ్రౌణ్యం” పక్కన పెట్టుకున్నా కొరుకుడు పడని కవిత్వం సంగతి?
అసమర్థులు గురించి వికటకవి అభిప్రాయం:
11/07/2008 9:40 am
చాలా బాగుంది, నేరుగా మనసుకి తాకేట్లుగా, నేను వీటిని “కథలు” అని పిలవటానికి ఇష్టపడనన్నది వేరే సంగతి.
సువర్ణభూమిలో … గురించి rama అభిప్రాయం:
11/07/2008 9:37 am
ayya editor loo..namaskaralandee !!
telugulo type chese opika leni nenu mee patrikaki abhiprayalu rase prayatnaanni eppudO viraminchukunnanu. kanee yadukulabhushan raatala meeda vachhina pratispandanalani chadivi chachhela navvi navvi..marinka aagaleka nA spandanani rastunnanu. vamanamoorti gariki..prajapati gariki..suneel gariki na danDaalu.em navvincherandayya meeru..mee vyakyaanaalatO! inka nakaLLalO neeLlu [aanandaBhaspAlu]alagevunnayi. inta vinOdannichhina bhooshangariki kooda na aBhinandanalu.
inka migilina aYYaloo[ante kameswarrao..mOhana garalaki, emanDee manam enta ardham leni ratanainaa samardhinchaDam avasaramanTaaraa?? kavitvam anTe chulakana kalige ilanTi ratalani kooDa samardhinchi..andulO..edo vunDevunTundanna vathhaasu endukO ..okasari alOchinchandi.
parody lu rendu rakalu. okaTi chala bagunna kavitakee parody cheyyochhu. vudaaharaNaki sreesree mahaprastanam loni geyalaki machiraju deviprasad .. inka zaruksastrila parody la lanTivi.alaage parama neerasamaina ardham leni..ardhanni prayatninchinaa sadhinchaleni vaTiki vamanamoortigaru chesina parody la lanTivi.
yadukulabhushan garu ilanTi parody lu rase avakasam ichhinanduku..andarikanna mundu aayanni congrats chestoo, ilanTi manchi rasaheenamaina padyalani.. manchi vinodam kaliginche padhatilO marikonni rayamani ..aBhyardidtoo..parady kartalaki marOsaari na santoshanni teliyajestunnanu.
adisare..vamanamoorti garu..changubhala..Enkimaama..anna oohalO vunna mahaardhamemO! mee vakyanni nenu maravanandOy.
eemaaTa sampadakuloo kaDupaara navvukOnichharu. thank u.
RAMA
[రమ గారు: మీ అభిప్రాయాన్ని ఈ సారికి రోమన్ లిపిలోనే ప్రచురిస్తున్నాము. తెలుగులో టైపుచెయ్యడం కన్నా ఇలా రోమన్ లిపిలో రాసినవి చదవడం ఇంకా కష్టమని గుర్తించగలరు. మీకు ఈమాటలో అభిప్రాయాలు రాసే డబ్బాలో తెలుగులో టైపు చెయ్యడం అలవాటు కాకపోతే తెలుగులో టైపు చెయ్యడానికి Quillpad, Baraha లాంటి సాధనాలు పరిశీలించగలరు. – సం]