సిద్ధాంతం కోసం జీవితాన్ని కళలో వక్రీకరించరాదని నమ్మినవాడు కుటుంబరావు. ఇలా నమ్మినపుడు రచయితకు దృష్టినిచ్చేది సిద్ధాంతమే అన్న విషయాన్ని ఆయన విస్మరించాడనుకుంటాను. ఐతే తన సిద్ధంతాలను రచయిత బలవంతంగా పాఠకుల మీద రుద్దరాదని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. కమ్యూనిజంలాంటి సిద్ధాంతంతో నిబద్ధత లేకుండా రాసి గొప్పగా జీవితాన్ని విమర్శించిన గురజాడ లాంటి కళాకారుల దృష్టివెనుక కూడా ఒక సిద్ధాంతం వుంటుంది, అదేమిటో ఒకోసారి ఆ రచయితకు కూడా తెలియకపోవచ్చు. రచనలోని దృష్టికోణాన్ని పట్టుకుని ఆ సిద్ధాంతాన్ని, దాని ఉపయోగాన్ని, పరిమితులను బయల్పరచవలసిన బాధ్యత సాహిత్యవిమర్శకులకు ఉంటుంది. ఏ సిద్ధాంతానికీ సార్వకాలీనత ఆపాదించలేం. అలాగే ఒక సిద్ధాంతం నుంచి మలి తరాల వారు నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదనీ చెప్పలేం. తన వర్తమాన ప్రపంచానికి మార్గదర్శకమైన దృష్టి ఎప్పటికీ అదే స్థానంలో ఉండాలని పరిణత రచయితలెవరూ కోరుకోరు. అయితే జీవితవిమర్శ పట్ల తాము అవలంబించిన వైఖరి భావి తరాల వారికి ఒక నమూనా కావాలని మాత్రం వారు ఆశిస్తారని నా అనుమానం. గురజాడ అభ్యుదయవాదాన్ని, దార్శనికతని ఆదర్శంగా తీసుకున్న రచయితలెవరైనా గురజాడ అందించిన దృష్టిని, ఆయన వైతాళికతను గౌరవిస్తూనే గురజాడ స్పృశించని జీవితాన్ని, గురజాడకాలానికి ఇంకా తెలుగు జాతికి అందని దృష్టిని తెలుగు సాహిత్యానికి అందించారు. వారి వారి చారిత్రక సందర్భాల్లో కొత్త చూపును ఇచ్చిన కళాకారులను తలచుకోవడం అంటే వారి భావజాలంతో పూర్తిగా ఏకీభవించడం ఎంతమాత్రం కాదు.
రమా భరద్వాజ్ గారు ప్రస్తావించి గురజాడతో పోల్చిన రచయితలు తెలుగు సాహిత్యానికి అందించిన మహత్తర దృష్టి, చారిత్రకదృక్పథంతో చూస్తే, గురజాడ నుంచి ఆశించడం అవివేకం. గురజాడ దూరదృష్టి ఈ రచయితలకు కొరవడిందనడం రమ గారి సంకుచిత దృష్టికి నిదర్శనం. గురజాడనుంచి రమ గారు కోట్ చేసినట్టు కుటుంబరావు నుంచి నాకు తెలిసి కొన్ని వందలు కోట్ చేయవచ్చు. ఆయన రచనలనుంచి సంస్కారం నేర్చుకున్న అనేకమందినుంచి రమ గారు వీటిని సేకరించొచ్చు. తమ సమకాలీన సమాజపు చరిత్రను కళారూపంలో భద్రపరచడానికి నిజాయితీగా కృషి చేసిన కుటుంబరావులాంటి వారి అవసరం మనకు లేదనుకుంటే మనకు చరిత్ర అవసరం గూర్చి ఏమీ తెలియదనుకోవాలి.
అదిగాక, సిద్ధాంతాల పట్ల ఎవరి అభిప్రాయం వారిది అని సాపేక్షవైఖరి అవలంబిస్తే, ఏదో ఒక మహాకధనానికి అందరూ కట్టుబడవలసిన అవసరం లేదు అనుకుంటే, కొ.కు. సరిపడని వారు కొ.కు.పై వ్యాసానికి స్పందించవలసిన అవసరమే లేదు.
అభిప్రాయాలను వార్తలుగా చలామణి చేస్తున్న కొన్ని తెలుగు పత్రికల్లాగ మీ అభిప్రాయాలను ‘సాహిత్యవిదితం’ అంటూ లోకం మీద రుద్దడం మానుకోవాలని రమగారికి నా విన్నపం.
వేరువేరు తరాలకి చెందిన రచయితల మధ్య పోటీని ఊహించుకోవటం అర్థంలేని పని. కుటుంబరావు కథలకీ, శ్రీపాద కథలకీ competition పెట్టడం, కుటుంబరావు కథలకీ, రావిశాస్త్రి కథలకీ పోటీ పెట్టడం వగైరాలన్నీ అనవసరం. గతకాలపు రచనలకు ఇప్పటికీ ఏ రకంగానైనా validity ఉందంటే అది ఆలోచించవలసిన విషయం. ఇండియా అయేది, అమెరికా అయేది, తెలుగువారిలో ఈనాటికీ రామప్ప పంతుళ్ళూ, అగ్నిహోత్రావధాన్లూ, సీతప్పలూ, మందుల భీముళ్ళూ కనబడటంలేదా? వ్యాసరచయిత చెప్పదలుచుకున్నది అదేననుకుంటాను. ఏ తరం సమస్యలు ఆ తరం రచయితలు సమర్థవంతంగా tackle చేస్తే అది ఆహ్వానించదగినదే.
పాఠకులు తీలివైనవాళ్ళు అని గనక గుర్తుంచుకుంటే అభిప్రాయాలురాసేవాళ్ళు పనిగట్టుకుని వక్రీకరించడం చేయరు. అర్ధం కాకపోయినా…సాహిత్య నేపధ్యం సరిగా తెలియకపోయినా తప్పులేదు. కానీ తెలుసుకునే ప్రయత్నం నిజాయితీగా చెయ్యకపోతే..ఏదో ఒకటి అనేద్దాం అనే ఉబలాటంలో వారే మరింత పొరబడే అవకాశం ఉంది. చంద్రశేఖర్ గారి అభిప్రాయం ఇందుకు ఒక ఉదాహరణ.
“థియరీ” అని నేనన్నప్పుడూ..నేను పేర్కొన్న “కొకు” ఇంకా ఇతర కవి రచయితల సిధ్హాంతాలూ..గురజాడా ..గాంధీ ల సిధ్ధాంతాలూ..ఒకటి కావనీ..ఈ రెంటికీ మధ్య ఏమాత్రం సారూప్యం లేదనీ నెను ఎక్కడా నా అభిప్రాయంలో ఇటువంటి అర్ధాన్నిచ్చే మాట వాడలేదనీ నా మాటలని వివరంగా చదివిన వారికి
వివరంగానే తెలిసే వీలుంది. ఇక్కడ సందర్భం కుటుంబరావు గారు. గురజాడ, గాంధీలు కారు. వీళ్ళందరినీ అర్ధం పర్ధం లేకుండా ఒకే గాట కట్టి మాట్లాడేయడం వల్ల చంద్రశేఖర్ గారికి ఈ బేధం తెలియలేదని తెలుస్తుందే తప్ప నా మాటల్లో ఎలాంటి అయోమయం లేదు.
నా అభిప్రాయంలో నేను గురజాడని “ద్రష్ట” అని సంబోధించాను. ఆయన ద్రష్ట
ఎందుకో కూడా వివరించాను. అలాంటి దూరదృష్టి “కొకు” అలాగే ఆ తరహా కమ్యూనిష్టు సిధ్ధాంతాలని నమ్మిన ఇతర రచయితలలో కొరవడిందని ఉదాహరణ పూర్వకంగా అన్నాను..గురజాడా వాక్యాన్ని ఉటంకిస్తూ!!గనక అభిప్రాయం నేను రాసినప్పుడు నాకు ఏమి చెబుతున్నానో..ఎందుకు చెబుతున్నానో స్పష్టత ఉన్నది. పాఠకునిగా చంద్రశేఖర్ లాంటి వాళ్ళకి అటువంటి స్పష్టత కలగాలని ఆశిస్తాను.
రమ.
థియరీ మార్చుకుంటే మార్పులు కనపడతాయని చెప్పి రమా భరద్వాజ్ గారు మాకళ్ళు తెరిపించారు. ఈ విషయం గాంధీ లాంటి పిచ్చివాళ్ళకి, గురజాడలాంటి వెర్రివాళ్ళకి తెలిసుంటే, వాళ్ళ వాళ్ళ థియరీలు మార్చుకుని బ్రిటిషు వారివల్ల మాత్రమే మన అభివృద్ధి సాధ్యమనీ, కన్యాశుల్కం వల్ల ఆడపిల్లలకు, వారి తల్లితండ్రులకు లాభమని నమ్మి సుఖంగా జీవించేవారు. ఎంత దురదృష్టం?
అభిమానానికీ..దురభిమానానికీ..అసలు సాహిత్యం అన్నది రేపటితరాలకి ఎక్కడ మిగలబోతోంది లెండి..మీరేం చింత పడకండి. అలాగే తెలుగు భాషా మిగలబోవడం లేదు. తెలుగు సాహిత్యాన్ని ఇతర విషయాల్ని సైతమ్ రేపటి తరాలకి బోధించే వాళ్ళూ మరి మిగలబోవడం లేదు. ప్రపంచంలో అన్ని భాషల్నీ తొందర తొందర గా అటకెక్కించి..సర్వే సర్వత్రా ఇంగ్లీషే రాజ్యమేలబోతూంది. దాన్ని రారమ్మని మీరంతా రెండు చేతులూ చాచి మరీ మరీ ..
ఆహ్వానిస్తూండగా..తెలుగు ఎందుకు బతుకుతుందీ?? so dont worry…మీ పిల్లలూ..ఆ పిల్లల పిల్లలూ మరింక తెలుగు వారుగా ఉండనఖ్ఖరలేని తీర్మానాలన్నీ మీరంతా ఇలా ముందుకొచ్చి చేస్తూండగా ఇహ తెలుగుకి ఊపిరెక్కడా? సర్వం శ్రీ జగన్నాధంగా
భూమ్మీద ఇటుపై అంతా ఇంగ్లీషే!! రేపు భ్రాహ్మణుడూ ఇంగ్లీషులోనే మంత్రాలు చదువుతాడు..బోయవాడూ ఇంగ్లీషులోనే వలవిసురుతాడు. కోటిపల్లి రేవు లోని సరంగు ఇంగ్లీషులోనే పడవ నడుపుతాడు. అమ్మమ్మలు అందరూ ఇంగ్లీషులోనే జోల పాటలు పాడతారు. చివరికి మీ తెలుగు పల్లెల్లోని పసుల కాపరీ ..కాటికాపరీ కూడా మీ మనసు శాంతించేలా సమస్త తెలుగు విజ్నాన పరిభాషకీ అరువు తెచ్చుకున్నఇంగ్లీషుచొక్కాలే తొడిగించి మరీ ఊరేగిస్తారు.
ముగ్గురు ప్రముఖుల శతజయంతి సభల గురించి విపులంగా రాసిన మీ సమీక్ష, దాని మీద వచ్చిన కొందరి అభిప్రాయాలూ చదివిన తర్వాత, సామాజ స్పృహతో రాసిన ఆముగ్గురు ప్రముఖులపై మీఅందరికీగల ఆదరాభిమానాలూ, గౌరవం చూసి ఇది వ్రాస్తున్నాను. మీఅందరిలా అంతగా చదవడం, రాయడం వచ్చినవాణ్ణి కూడా కాదు. ఈ శతజయంతి సభలూ, సమారాధాలూ వారికి నివాళులు కావచ్చు కానీ, వారికి నిజమైన ఆత్మశాంతిని కూరుస్తుందని మాత్రం అనుకోవడంలేదు. వారు ఏ పవిత్రోద్దేశంతో ఆ రచనలు చేశారో, వాటిలో కొంతైనా కొంత సామాజిక స్పృహతో ఈతరంలోని మనం ఆచరణలో పెడితే, నిజమైన నివాళి ఔతుంది.
మాకు ఇంకా ఏదో జరగలేదని అందరూ ఎవరికి వారే, కులం,మతం,లింగం, ప్రాంతం ఒకటేమిటి అన్నిబేధాలకీ రిజర్వేషన్లు కావాలని అన్నిరకాలుగానూ ఒకరిని ఒకరు ద్వేషించుకొంటున్నాం. మధ్యలో రాజకీయ నాయకులు పబ్బం గడుపుకొంటున్నారు. యన్నారైలు తమవంతు ధనాజ్యం పోస్తున్నారు. అలాకాకుండా, దానికి మనవంతు మేధో సంపత్తిని ఏదైనా అందించగలమా? ఆర్ధిక వికేంద్రీకరణ జరిగితే ఈ విభేధాలు సమసిపోవా? నిజాయితీగా ఒక్కసారి ఆలోచించండి. వీలైతే నడుం కట్టండి!
రమ గారి, జగన్నాథం ఆలపాటి గారి వ్యాఖ్యానాలు చదివితే మనం తెలుగు భాషను అభిమానిస్తున్నామా లేక దురభిమానాన్ని పెంచుకుంటున్నామా అర్థం కావటం లేదు. సాహిత్య పరంగా మేటి ప్రపంప భాషల సరసన నిలువగలిగే సుసంపన్నమైన సాహిత్యం తెలుగు భాషలో ఉంది. ఆ సంపదను కాపాడుకోవడానికి ఈమాట తరహాలో తెలుగు వ్రాయడాన్ని, చదవడాన్ని, సాహిత్యాభిలాషులను ప్రోత్సహించాలే తప్ప శాస్త్ర, సాంకేతిక విద్యను కూడా తెలుగైజ్ చేయ్యలన్న వాదాన చాలా అసంబద్ధమే కాక, భావి తరాల వారికి తీరని అన్యాయం చేయడమే. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని, అవసరాన్ని గుర్తెరిగి, శాస్త్ర, సాంకేతిక విషయాలను ఇంగ్లీష్ భాషకు వదిలేసి, మన భాష, సంస్కృతి, చరిత్రల గురించిన విషయాలను తెలుగులో రాస్తూ, తెలుగును మరింత సుసంపన్నం చేయడం ద్వారా తెలుగు భాష మనుగడకు తోడ్పడగలమని నా అభిప్రాయం.
“సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”
“ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm
ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.
ఈ కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.
గమనిస్తారా?
పొరపాటా? కాదా?
సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి చంద్రశేఖర్ అభిప్రాయం:
12/19/2009 7:03 am
సిద్ధాంతం కోసం జీవితాన్ని కళలో వక్రీకరించరాదని నమ్మినవాడు కుటుంబరావు. ఇలా నమ్మినపుడు రచయితకు దృష్టినిచ్చేది సిద్ధాంతమే అన్న విషయాన్ని ఆయన విస్మరించాడనుకుంటాను. ఐతే తన సిద్ధంతాలను రచయిత బలవంతంగా పాఠకుల మీద రుద్దరాదని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. కమ్యూనిజంలాంటి సిద్ధాంతంతో నిబద్ధత లేకుండా రాసి గొప్పగా జీవితాన్ని విమర్శించిన గురజాడ లాంటి కళాకారుల దృష్టివెనుక కూడా ఒక సిద్ధాంతం వుంటుంది, అదేమిటో ఒకోసారి ఆ రచయితకు కూడా తెలియకపోవచ్చు. రచనలోని దృష్టికోణాన్ని పట్టుకుని ఆ సిద్ధాంతాన్ని, దాని ఉపయోగాన్ని, పరిమితులను బయల్పరచవలసిన బాధ్యత సాహిత్యవిమర్శకులకు ఉంటుంది. ఏ సిద్ధాంతానికీ సార్వకాలీనత ఆపాదించలేం. అలాగే ఒక సిద్ధాంతం నుంచి మలి తరాల వారు నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదనీ చెప్పలేం. తన వర్తమాన ప్రపంచానికి మార్గదర్శకమైన దృష్టి ఎప్పటికీ అదే స్థానంలో ఉండాలని పరిణత రచయితలెవరూ కోరుకోరు. అయితే జీవితవిమర్శ పట్ల తాము అవలంబించిన వైఖరి భావి తరాల వారికి ఒక నమూనా కావాలని మాత్రం వారు ఆశిస్తారని నా అనుమానం. గురజాడ అభ్యుదయవాదాన్ని, దార్శనికతని ఆదర్శంగా తీసుకున్న రచయితలెవరైనా గురజాడ అందించిన దృష్టిని, ఆయన వైతాళికతను గౌరవిస్తూనే గురజాడ స్పృశించని జీవితాన్ని, గురజాడకాలానికి ఇంకా తెలుగు జాతికి అందని దృష్టిని తెలుగు సాహిత్యానికి అందించారు. వారి వారి చారిత్రక సందర్భాల్లో కొత్త చూపును ఇచ్చిన కళాకారులను తలచుకోవడం అంటే వారి భావజాలంతో పూర్తిగా ఏకీభవించడం ఎంతమాత్రం కాదు.
రమా భరద్వాజ్ గారు ప్రస్తావించి గురజాడతో పోల్చిన రచయితలు తెలుగు సాహిత్యానికి అందించిన మహత్తర దృష్టి, చారిత్రకదృక్పథంతో చూస్తే, గురజాడ నుంచి ఆశించడం అవివేకం. గురజాడ దూరదృష్టి ఈ రచయితలకు కొరవడిందనడం రమ గారి సంకుచిత దృష్టికి నిదర్శనం. గురజాడనుంచి రమ గారు కోట్ చేసినట్టు కుటుంబరావు నుంచి నాకు తెలిసి కొన్ని వందలు కోట్ చేయవచ్చు. ఆయన రచనలనుంచి సంస్కారం నేర్చుకున్న అనేకమందినుంచి రమ గారు వీటిని సేకరించొచ్చు. తమ సమకాలీన సమాజపు చరిత్రను కళారూపంలో భద్రపరచడానికి నిజాయితీగా కృషి చేసిన కుటుంబరావులాంటి వారి అవసరం మనకు లేదనుకుంటే మనకు చరిత్ర అవసరం గూర్చి ఏమీ తెలియదనుకోవాలి.
అదిగాక, సిద్ధాంతాల పట్ల ఎవరి అభిప్రాయం వారిది అని సాపేక్షవైఖరి అవలంబిస్తే, ఏదో ఒక మహాకధనానికి అందరూ కట్టుబడవలసిన అవసరం లేదు అనుకుంటే, కొ.కు. సరిపడని వారు కొ.కు.పై వ్యాసానికి స్పందించవలసిన అవసరమే లేదు.
అభిప్రాయాలను వార్తలుగా చలామణి చేస్తున్న కొన్ని తెలుగు పత్రికల్లాగ మీ అభిప్రాయాలను ‘సాహిత్యవిదితం’ అంటూ లోకం మీద రుద్దడం మానుకోవాలని రమగారికి నా విన్నపం.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి Rohiniprasad అభిప్రాయం:
12/18/2009 6:35 pm
వేరువేరు తరాలకి చెందిన రచయితల మధ్య పోటీని ఊహించుకోవటం అర్థంలేని పని. కుటుంబరావు కథలకీ, శ్రీపాద కథలకీ competition పెట్టడం, కుటుంబరావు కథలకీ, రావిశాస్త్రి కథలకీ పోటీ పెట్టడం వగైరాలన్నీ అనవసరం. గతకాలపు రచనలకు ఇప్పటికీ ఏ రకంగానైనా validity ఉందంటే అది ఆలోచించవలసిన విషయం. ఇండియా అయేది, అమెరికా అయేది, తెలుగువారిలో ఈనాటికీ రామప్ప పంతుళ్ళూ, అగ్నిహోత్రావధాన్లూ, సీతప్పలూ, మందుల భీముళ్ళూ కనబడటంలేదా? వ్యాసరచయిత చెప్పదలుచుకున్నది అదేననుకుంటాను. ఏ తరం సమస్యలు ఆ తరం రచయితలు సమర్థవంతంగా tackle చేస్తే అది ఆహ్వానించదగినదే.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj అభిప్రాయం:
12/18/2009 1:06 am
పాఠకులు తీలివైనవాళ్ళు అని గనక గుర్తుంచుకుంటే అభిప్రాయాలురాసేవాళ్ళు పనిగట్టుకుని వక్రీకరించడం చేయరు. అర్ధం కాకపోయినా…సాహిత్య నేపధ్యం సరిగా తెలియకపోయినా తప్పులేదు. కానీ తెలుసుకునే ప్రయత్నం నిజాయితీగా చెయ్యకపోతే..ఏదో ఒకటి అనేద్దాం అనే ఉబలాటంలో వారే మరింత పొరబడే అవకాశం ఉంది. చంద్రశేఖర్ గారి అభిప్రాయం ఇందుకు ఒక ఉదాహరణ.
“థియరీ” అని నేనన్నప్పుడూ..నేను పేర్కొన్న “కొకు” ఇంకా ఇతర కవి రచయితల సిధ్హాంతాలూ..గురజాడా ..గాంధీ ల సిధ్ధాంతాలూ..ఒకటి కావనీ..ఈ రెంటికీ మధ్య ఏమాత్రం సారూప్యం లేదనీ నెను ఎక్కడా నా అభిప్రాయంలో ఇటువంటి అర్ధాన్నిచ్చే మాట వాడలేదనీ నా మాటలని వివరంగా చదివిన వారికి
వివరంగానే తెలిసే వీలుంది. ఇక్కడ సందర్భం కుటుంబరావు గారు. గురజాడ, గాంధీలు కారు. వీళ్ళందరినీ అర్ధం పర్ధం లేకుండా ఒకే గాట కట్టి మాట్లాడేయడం వల్ల చంద్రశేఖర్ గారికి ఈ బేధం తెలియలేదని తెలుస్తుందే తప్ప నా మాటల్లో ఎలాంటి అయోమయం లేదు.
నా అభిప్రాయంలో నేను గురజాడని “ద్రష్ట” అని సంబోధించాను. ఆయన ద్రష్ట
ఎందుకో కూడా వివరించాను. అలాంటి దూరదృష్టి “కొకు” అలాగే ఆ తరహా కమ్యూనిష్టు సిధ్ధాంతాలని నమ్మిన ఇతర రచయితలలో కొరవడిందని ఉదాహరణ పూర్వకంగా అన్నాను..గురజాడా వాక్యాన్ని ఉటంకిస్తూ!!గనక అభిప్రాయం నేను రాసినప్పుడు నాకు ఏమి చెబుతున్నానో..ఎందుకు చెబుతున్నానో స్పష్టత ఉన్నది. పాఠకునిగా చంద్రశేఖర్ లాంటి వాళ్ళకి అటువంటి స్పష్టత కలగాలని ఆశిస్తాను.
రమ.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి చంద్రశేఖర్ అభిప్రాయం:
12/16/2009 12:49 am
థియరీ మార్చుకుంటే మార్పులు కనపడతాయని చెప్పి రమా భరద్వాజ్ గారు మాకళ్ళు తెరిపించారు. ఈ విషయం గాంధీ లాంటి పిచ్చివాళ్ళకి, గురజాడలాంటి వెర్రివాళ్ళకి తెలిసుంటే, వాళ్ళ వాళ్ళ థియరీలు మార్చుకుని బ్రిటిషు వారివల్ల మాత్రమే మన అభివృద్ధి సాధ్యమనీ, కన్యాశుల్కం వల్ల ఆడపిల్లలకు, వారి తల్లితండ్రులకు లాభమని నమ్మి సుఖంగా జీవించేవారు. ఎంత దురదృష్టం?
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj అభిప్రాయం:
12/15/2009 2:58 am
అయ్యా హరీష్ గారూ!!
అభిమానానికీ..దురభిమానానికీ..అసలు సాహిత్యం అన్నది రేపటితరాలకి ఎక్కడ మిగలబోతోంది లెండి..మీరేం చింత పడకండి. అలాగే తెలుగు భాషా మిగలబోవడం లేదు. తెలుగు సాహిత్యాన్ని ఇతర విషయాల్ని సైతమ్ రేపటి తరాలకి బోధించే వాళ్ళూ మరి మిగలబోవడం లేదు. ప్రపంచంలో అన్ని భాషల్నీ తొందర తొందర గా అటకెక్కించి..సర్వే సర్వత్రా ఇంగ్లీషే రాజ్యమేలబోతూంది. దాన్ని రారమ్మని మీరంతా రెండు చేతులూ చాచి మరీ మరీ ..
ఆహ్వానిస్తూండగా..తెలుగు ఎందుకు బతుకుతుందీ?? so dont worry…మీ పిల్లలూ..ఆ పిల్లల పిల్లలూ మరింక తెలుగు వారుగా ఉండనఖ్ఖరలేని తీర్మానాలన్నీ మీరంతా ఇలా ముందుకొచ్చి చేస్తూండగా ఇహ తెలుగుకి ఊపిరెక్కడా? సర్వం శ్రీ జగన్నాధంగా
భూమ్మీద ఇటుపై అంతా ఇంగ్లీషే!! రేపు భ్రాహ్మణుడూ ఇంగ్లీషులోనే మంత్రాలు చదువుతాడు..బోయవాడూ ఇంగ్లీషులోనే వలవిసురుతాడు. కోటిపల్లి రేవు లోని సరంగు ఇంగ్లీషులోనే పడవ నడుపుతాడు. అమ్మమ్మలు అందరూ ఇంగ్లీషులోనే జోల పాటలు పాడతారు. చివరికి మీ తెలుగు పల్లెల్లోని పసుల కాపరీ ..కాటికాపరీ కూడా మీ మనసు శాంతించేలా సమస్త తెలుగు విజ్నాన పరిభాషకీ అరువు తెచ్చుకున్నఇంగ్లీషుచొక్కాలే తొడిగించి మరీ ఊరేగిస్తారు.
రమ.
డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష గురించి Jagannadham Alapati అభిప్రాయం:
12/12/2009 11:00 am
ముగ్గురు ప్రముఖుల శతజయంతి సభల గురించి విపులంగా రాసిన మీ సమీక్ష, దాని మీద వచ్చిన కొందరి అభిప్రాయాలూ చదివిన తర్వాత, సామాజ స్పృహతో రాసిన ఆముగ్గురు ప్రముఖులపై మీఅందరికీగల ఆదరాభిమానాలూ, గౌరవం చూసి ఇది వ్రాస్తున్నాను. మీఅందరిలా అంతగా చదవడం, రాయడం వచ్చినవాణ్ణి కూడా కాదు. ఈ శతజయంతి సభలూ, సమారాధాలూ వారికి నివాళులు కావచ్చు కానీ, వారికి నిజమైన ఆత్మశాంతిని కూరుస్తుందని మాత్రం అనుకోవడంలేదు. వారు ఏ పవిత్రోద్దేశంతో ఆ రచనలు చేశారో, వాటిలో కొంతైనా కొంత సామాజిక స్పృహతో ఈతరంలోని మనం ఆచరణలో పెడితే, నిజమైన నివాళి ఔతుంది.
మాకు ఇంకా ఏదో జరగలేదని అందరూ ఎవరికి వారే, కులం,మతం,లింగం, ప్రాంతం ఒకటేమిటి అన్నిబేధాలకీ రిజర్వేషన్లు కావాలని అన్నిరకాలుగానూ ఒకరిని ఒకరు ద్వేషించుకొంటున్నాం. మధ్యలో రాజకీయ నాయకులు పబ్బం గడుపుకొంటున్నారు. యన్నారైలు తమవంతు ధనాజ్యం పోస్తున్నారు. అలాకాకుండా, దానికి మనవంతు మేధో సంపత్తిని ఏదైనా అందించగలమా? ఆర్ధిక వికేంద్రీకరణ జరిగితే ఈ విభేధాలు సమసిపోవా? నిజాయితీగా ఒక్కసారి ఆలోచించండి. వీలైతే నడుం కట్టండి!
ఒక్కతే… మృత్యువు గురించి rama bharadwaj అభిప్రాయం:
12/11/2009 2:37 pm
బొల్లోజు బాబా గారూ!!నెరూడా మృత్యువుకి శ్రీశ్రీ అనువాదం నీరసంగా ఉంది. అంతకన్నా మీది మెరుగు. మీ కన్నా కామేశ్వర్రావు గారిది ఎక్కువ నయం!
రమ
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి hareesh అభిప్రాయం:
12/11/2009 1:04 pm
రమ గారి, జగన్నాథం ఆలపాటి గారి వ్యాఖ్యానాలు చదివితే మనం తెలుగు భాషను అభిమానిస్తున్నామా లేక దురభిమానాన్ని పెంచుకుంటున్నామా అర్థం కావటం లేదు. సాహిత్య పరంగా మేటి ప్రపంప భాషల సరసన నిలువగలిగే సుసంపన్నమైన సాహిత్యం తెలుగు భాషలో ఉంది. ఆ సంపదను కాపాడుకోవడానికి ఈమాట తరహాలో తెలుగు వ్రాయడాన్ని, చదవడాన్ని, సాహిత్యాభిలాషులను ప్రోత్సహించాలే తప్ప శాస్త్ర, సాంకేతిక విద్యను కూడా తెలుగైజ్ చేయ్యలన్న వాదాన చాలా అసంబద్ధమే కాక, భావి తరాల వారికి తీరని అన్యాయం చేయడమే. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని, అవసరాన్ని గుర్తెరిగి, శాస్త్ర, సాంకేతిక విషయాలను ఇంగ్లీష్ భాషకు వదిలేసి, మన భాష, సంస్కృతి, చరిత్రల గురించిన విషయాలను తెలుగులో రాస్తూ, తెలుగును మరింత సుసంపన్నం చేయడం ద్వారా తెలుగు భాష మనుగడకు తోడ్పడగలమని నా అభిప్రాయం.
సువర్ణభూమిలో … గురించి lyla yerneni అభిప్రాయం:
12/10/2009 5:20 pm
“సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”
“ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm
ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.
ఈ కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.
గమనిస్తారా?
పొరపాటా? కాదా?
సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.
లైలా.
కెంధూళి గురించి Jagannadham Alapati అభిప్రాయం:
12/10/2009 1:26 am
సౌమ్య గారి అభిప్రాయానికి నా సమాధానం, నా అభిప్రాయంగా బాగా అతుకుతుందని యిలా రాస్తున్నాను.
“రెండూను” !
జగన్నాథం