ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి ఎప్పుడో ముగిసిపోయిన చర్చని మళ్ళీ లేవనెత్తడం అనవసరం, కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప. ఆముక్తమాల్యద కర్త పెద్దన అని చెప్పేందుకు చూపించిన అనేకానేక ఋజువులు సరికావని, సరిపోవని వాటిని ఖండిస్తూ వచ్చిన ప్రతివాదాలు రమ గారికి తెలియవని నేననుకోను. అంచేత కృష్ణరాయలే ఆముక్తమాల్యద రాసాడన్నది వట్టి కట్టుకథ కింద కొట్టిపారెయ్యడం సమంజసం కాదు.
అయితే రామారావుగారు చెప్పిన హైపాతసిస్ పరీక్షలు మన కావ్యాలపై ప్రయోగించే ముందు వాటిని శాస్త్రీయంగా పరీక్షించాల్సి ఉంటుంది. మనకి కర్తృత్వం రూఢిగా తెలిసిన కావ్యాల మీద ప్రయోగించి, వాటి ఫలితాలని బట్టి అది మన కావ్యాలకి ఎంతవరకూ పనికివస్తుందనేది ముందు తేల్చుకోవాలి. తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు మొదలైన బహు గ్రంథ కర్తల కావ్యాలని తీసుకొని ఈ ప్రయోగాలు చెయ్యవచ్చు. We should do some kind of ANOVA to compare intra and inter population variation.
రచనా శైలిని, వస్తు నిర్వహణని బట్టి కవి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం మన విమర్శకి కొత్త కాదు. దాని బట్టి ఆముక్తమాల్యద పెద్దన కన్నా రాయలే రాసి ఉండేందుకు చాలా అవకాశం ఉందని విమర్శకులు భావించారు. అది సమంజసమైనదే. ఈ సంచికలోనే వచ్చిన ఆముక్తమాల్యదలోని రాజనీతి వ్యాసం చదివితే ఇది స్పష్టంగానే తెలుస్తుంది.
ఇదికాక ఈ మధ్య ఆముక్తమాల్యద చదువుతూ ఉంటే నాకనిపించిన మరొక విషయం. ఇందులోని భాష- అంటే వాక్య నిర్మాణం, క్రియా పదాలు మొదలైన వాటిని చూస్తే ఇది తెలుగు మాతృభాష (పోని ఇంటిభాష!) అయినవాడు ఇలా వ్రాయడు, వ్రాయలేడని కచ్చితంగా నిరూపించ వచ్చేమో అని అనిపించింది. ఈ రకమైన విశ్లేషణ ఇది వరకు ఎవరైనా చేసారేమో నాకు తెలియదు. ఆముక్తమాల్యద భాషలోని “తెలుగుదనాన్ని” అంచనా వెయ్యగలిస్తే ఈ విషయం మరింత స్పష్టపడుతుంది.
ఈమాట వ్యాఖ్యల ఆనవాయితీకి తగ్గట్టుగానే ఇదంతా ఈ వ్యాస విషయానికి సంబంధం లేని చర్చే 🙂 అలా నా వ్యాఖ్యని వదిలెయ్యడం ఇష్టం లేక, ఈ వ్యాసానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించి ముగిస్తాను. కన్నడ రాయలుగా పేరుపొందిన కృష్ణరాయలు సంస్కృతాంధ్రాలలో కృతులు రచించి కన్నడంలో మాత్రం రచించకపోవడం నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆ భాషలో రాయలకి అంత పట్టు లేదనుకోవాలా లేక కావ్యం రచించేటంత ప్రీతి లేదనుకోవాలా?
మీ అభిప్రాయవేదో మీరు చెప్పండి. మాకు నచ్చినా నచ్చకపోయినా అది మీ అభిప్రాయంగా దానికొక గౌరవవుంటుంది. మా అభిప్రాయాలు చదివి మా గురించి చిలక జ్యోస్యాలు చెప్పకండి. మా అభిప్రాయం మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఓపికుంటే సహేతుకంగా చెప్పండి, ఓపిక లేకపోతే నచ్చలేదని చెప్పండి. తప్పులెన్నండి, తప్పులేదు. కానీ మీ విమర్శకోసం మా గురించి మీ చిలకజ్యోస్యపు సైకో ఎనాలసిస్ మాత్రం చెయ్యకండి.
ఈ వ్యాసపు ముఖ్య విషయం రాయల కొలువులో తెలుగు కాని ఇతర భాషలలో సాహిత్యం ఎలా వర్ధిల్లిందో అన్న విషయాన్ని వివరించడమే. కాని అభిప్రాయాలు ఆముక్తమాల్యదపైన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కవులు సామాన్యముగా ఆశ్వాసాంతములో ఒక గద్యం వ్రాస్తారు. ఉదాహరణకు పెద్దన ఇలా వ్రాసారు –
(ఇది శ్రీమదాంధ్రకవితాపితామహుడని బిరుదుగలవాడు, సర్వతోముఖాంకుడనే బిరుదుగలవాడు, విష్ణుమూర్తి పాదపద్మాల మకరందాన్ని గ్రోలె తుమ్మెదవలె నుండువాడు, శఠకోపయతిచే ప్రసాదించబడిన శ్రేష్ఠమైన చతుర్విధ కవిత్వములు అభ్యసించినవాడు, అల్లసాని చొక్కయమంత్రి కుమారుడు ఐన పెద్దనార్యుడు వ్రాసిన స్వారోచిషమనుసంభవము అనే మహాకావ్యములో రెండవ ఆశ్వాసము.)
కాని ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంతములు గద్యాలు కావు, పద్యాలు. ఉదాహరణకు –
(ఇది సింహాచలములో ఉండే మాయనరసింహస్వామి పాదాలను కొలువగా సంక్రమించిన పుణ్యఫలమువల్ల పొట్టునూరి జయస్తంభములో పేర్కొనబడిన కృష్ణరాయనృపతి వ్రాసిన ఆముక్తమాల్యద కావ్యములో నాల్గవ ఆశ్వాసము అందరికి ప్రీతిగా విరాజిల్లును.)
సంస్కృతకవులు ఇలాగే వ్రాసేవారు. ఉదాహరణకు నేను వ్యాసములో పేర్కొన్న రుక్మిణీశవిజయమునుండి ఒక సర్గాంత పద్యము –
(రోమాంచితమయ్యేటట్లు సంతోషమిచ్చేది, వినగానే పాపాలను నిర్మూలించేది, విచిత్రమైనది, నిర్మలమైనది, అర్థవంతమయినది అయి వాదిరాజయతిచే వ్రాయబడిన రుక్మిణీశవిజయ కావ్యములో ఏడవ సర్గ సురమండలముచే పొగడదగినదైనది.)
ఆముక్తమాల్యదలో ఉపయోగించబడిన చాల సంస్కృతపదాలకు సామాన్యమైన అర్థాలు ఉండక కొద్దిగా మామూలుగా లేని అర్థాలు ఉంటాయి. రాయలే వ్రాసారో, మరెవరు వ్రాసారో కాని రచయితకు మాత్రం కొబ్బరికాయలంటే ఎంతో ఇష్టమనిపిస్తుంది 🙂
ఈ విషయం మీద నేను చెప్పదల్చుకున్న విషయాలు ఐపోవచ్చాయి. చివరగా అఫ్సర్ గారు అడిగిన “ఊహాపాఠకుల” విషయం కొంత స్పృశించి ముగిస్తాను. నా “అశాస్త్రీయ సర్వే” పద్ధతి ఇది – నేను సామాన్యంగా రెండేళ్లకోసారి ఇండియా వెళ్తాను; అలా వెళ్లినప్పుడు నవోదయ లో గత రెండేళ్లుగా వచ్చిన కవిత్వపుస్తకాలు అన్నీ ఒకో కాపీ కొంటాను; (వాటిలో ఏవీ వెయ్యి కాపీలకు మించి ప్రచురించబడవు); అప్పుడు వాళ్లని ప్రతిసారీ అడుగుతాను – వాటిలో ఏయేవి ఎలా అమ్ముడు పోతున్నాయని. మొదల్లో కొంత మొహమోటపడ్డారు గాని తర్వాత వాళ్లు చెప్పేది NRI లు తప్ప ఎవరూ కొనరూ అని; ఇక చాలా మంది కవులు సొంతంగా ప్రచురించుకుని తెలిసిన వాళ్లకు అంటగట్టటమో ఊరికే ఇవ్వటమో చేస్తారనేది నాకు తెలిసిన కొద్దిమంది కవులు స్వయంగా చెప్పిన విషయం. ఊరికే ఇచ్చినవి చదివేవాళ్లు చాలా కొద్దిమంది అన్నది ఏ సర్వేలూ అక్కర్లేకుండానే చెప్పొచ్చు. కొన్న ఒక్కో ప్రతినీ ఈ కాలంలో ఒకరికి మించి చదవరు అనేది నా ప్రతిపాదన. కనుక మొత్తం మీద ఓ కవితాసంకలనాన్ని వెయ్యిమందికి మించి చదవరు (మొదటి నుంచి చివరదాకా చదివేవాళ్లు ఇంకా తక్కువ). అంతేకాదు, పై సమాచారాన్నుంచి వీళ్ళు ఎలాటివాళ్లో కూడా derive చెయ్యొచ్చు – వీళ్లు నాలుగు రకాల వాళ్లు: 1) ఇతర కవులు, 2) ఆ సంకలనకర్త బంధువులు, స్నేహితులు, 3) విమర్శకులు, 4) చాలా కొద్దిమంది కవితాసక్తి వున్నవాళ్లు (వీళ్లలో చాలా ఎక్కువభాగం గుప్తకవులు). ఇకపోతే ఆ కవితలు పత్రికల్లో వచ్చివుండొచ్చు. ఆ పాఠకుల మాటేమిటి? నేను చేసుకున్న మరొక ప్రతిపాదన వాళ్లు కూడా పై నాలుగు రకాల వాళ్లేనని. ఏతావాతా తేలేదేమంటే ప్రస్తుత కవిత్వానికి “ముఖ్యమైన” పాఠకులు ఎక్కువభాగం ఇతరకవులే నని.
వీళ్లు కాక ఇంకెవరినైనా ఒక కవి తన పాఠకులుగా భావిస్తే వాళ్ళు ఊహాపాఠకులు. ఇదీ నా definition. ఇతరులు అంగీకరించొచ్చు, రించకపోవచ్చు. అఫ్సర్ గారి శాస్త్రీయ సర్వే ఫలితాల కోసం వేచి చూస్తాను.
I am disturbed by the implication of KVS Ramarao that the reviewer is biased. This amounts to ascribing ulterior non-literary motives to the reviewer and a personal insult. One may disagree with the reviewer, but one can not start by questioning the honesty of the review, but none of the above comments seem to even acknowledge that the reviewer honestly spoke his mind. This is more unfortunate given the stature of people who posted these comments.
వ్రాయటం, వ్రాసిన దానిని ఎడిట్ చేయడ మనకు ఎక్కువగా అలవాటు లేని విషయం. అమెరికాలో రచయితలకు ఎడిటర్లు ఉంటారని తెలిసినప్పుడు.. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆలోచిస్తే 99శాతం రచనల్లో ఎడిటింగ్ అవసరమే అనిపించింది. ప్రఖ్యాతి రాగానే మన రచయితలు ఏమి రాసినా గొప్పే.. అనాల్సి వస్తోంది. అందువల్ల గొప్ప రచనలు రావడం అరుదైపోయింది. కానీ 100లో 1కింటికి ఎడిటర్ల వల్ల రచయిత ఆ రచనలో ప్రాణప్రతిష్ట చేసినా soul కి విఘాతం కలుగుతోంది. Any how, మీ సంపాదకీయం విషయబద్ధంగా ఉంది.
Thank you.
Request…
Memu meku rachanalu ela pampalo thelupagalaru….
V. Praveena Reddy
( writer, journalist)
[మీ అభిప్రాయాలు దయచేసి తెలుగు లేదా ఇంగ్లీషులోనే వ్రాయండి. తెంగ్లీషు వాడకండి. ఈమాటకు రచనలు ఎలాపంపాలో సూచనల పేజీలో చూడగలరు – సం.]
కెవీయస్ రామారావుగారూ!! ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.
ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ – కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.
రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.
చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీషు సాహిత్యలో కీట్సు , షెల్లీ ల కవిత్వాన్ని ప్రచురణకర్తలూ.. సమీక్షకులూ ఎలా నిర్లక్ష్యం చేసారో వారి జీవితకాలంలో ఆయా కవులు ఎలా నిరాదరించబడ్డారో.. వెంకటేశ్వరావుగారికి తెలియదని నేను అనుకోను. అలాంటి రివ్యూదారులు ఒకలాంటి వాళ్ళైతే మరొకరకం ..చెత్తకవిత్వాన్ని పైకెత్తుకునే రివ్యూదారులూ ..అనువాదకులూను. ఉత్తమ కవులని పక్కకు పెట్టి వారి వారి వ్యక్తిగత కారణాలకి గానూ నాసిరకం రచయితలని ముందువరసలో చూపించిన పనిని అన్ని కాలాల్లోనూ పత్రికలూ చేసాయి. విమర్శకులూ చేసారు. అనువాదకులూ చేసారు. చేస్తున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి Kameswara Rao అభిప్రాయం:
07/04/2010 11:55 pm
ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి ఎప్పుడో ముగిసిపోయిన చర్చని మళ్ళీ లేవనెత్తడం అనవసరం, కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప. ఆముక్తమాల్యద కర్త పెద్దన అని చెప్పేందుకు చూపించిన అనేకానేక ఋజువులు సరికావని, సరిపోవని వాటిని ఖండిస్తూ వచ్చిన ప్రతివాదాలు రమ గారికి తెలియవని నేననుకోను. అంచేత కృష్ణరాయలే ఆముక్తమాల్యద రాసాడన్నది వట్టి కట్టుకథ కింద కొట్టిపారెయ్యడం సమంజసం కాదు.
అయితే రామారావుగారు చెప్పిన హైపాతసిస్ పరీక్షలు మన కావ్యాలపై ప్రయోగించే ముందు వాటిని శాస్త్రీయంగా పరీక్షించాల్సి ఉంటుంది. మనకి కర్తృత్వం రూఢిగా తెలిసిన కావ్యాల మీద ప్రయోగించి, వాటి ఫలితాలని బట్టి అది మన కావ్యాలకి ఎంతవరకూ పనికివస్తుందనేది ముందు తేల్చుకోవాలి. తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు మొదలైన బహు గ్రంథ కర్తల కావ్యాలని తీసుకొని ఈ ప్రయోగాలు చెయ్యవచ్చు. We should do some kind of ANOVA to compare intra and inter population variation.
రచనా శైలిని, వస్తు నిర్వహణని బట్టి కవి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం మన విమర్శకి కొత్త కాదు. దాని బట్టి ఆముక్తమాల్యద పెద్దన కన్నా రాయలే రాసి ఉండేందుకు చాలా అవకాశం ఉందని విమర్శకులు భావించారు. అది సమంజసమైనదే. ఈ సంచికలోనే వచ్చిన ఆముక్తమాల్యదలోని రాజనీతి వ్యాసం చదివితే ఇది స్పష్టంగానే తెలుస్తుంది.
ఇదికాక ఈ మధ్య ఆముక్తమాల్యద చదువుతూ ఉంటే నాకనిపించిన మరొక విషయం. ఇందులోని భాష- అంటే వాక్య నిర్మాణం, క్రియా పదాలు మొదలైన వాటిని చూస్తే ఇది తెలుగు మాతృభాష (పోని ఇంటిభాష!) అయినవాడు ఇలా వ్రాయడు, వ్రాయలేడని కచ్చితంగా నిరూపించ వచ్చేమో అని అనిపించింది. ఈ రకమైన విశ్లేషణ ఇది వరకు ఎవరైనా చేసారేమో నాకు తెలియదు. ఆముక్తమాల్యద భాషలోని “తెలుగుదనాన్ని” అంచనా వెయ్యగలిస్తే ఈ విషయం మరింత స్పష్టపడుతుంది.
ఈమాట వ్యాఖ్యల ఆనవాయితీకి తగ్గట్టుగానే ఇదంతా ఈ వ్యాస విషయానికి సంబంధం లేని చర్చే 🙂 అలా నా వ్యాఖ్యని వదిలెయ్యడం ఇష్టం లేక, ఈ వ్యాసానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించి ముగిస్తాను. కన్నడ రాయలుగా పేరుపొందిన కృష్ణరాయలు సంస్కృతాంధ్రాలలో కృతులు రచించి కన్నడంలో మాత్రం రచించకపోవడం నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆ భాషలో రాయలకి అంత పట్టు లేదనుకోవాలా లేక కావ్యం రచించేటంత ప్రీతి లేదనుకోవాలా?
నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి ravikiran timmireddy అభిప్రాయం:
07/04/2010 10:18 pm
రమా గారు,
మీ అభిప్రాయవేదో మీరు చెప్పండి. మాకు నచ్చినా నచ్చకపోయినా అది మీ అభిప్రాయంగా దానికొక గౌరవవుంటుంది. మా అభిప్రాయాలు చదివి మా గురించి చిలక జ్యోస్యాలు చెప్పకండి. మా అభిప్రాయం మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఓపికుంటే సహేతుకంగా చెప్పండి, ఓపిక లేకపోతే నచ్చలేదని చెప్పండి. తప్పులెన్నండి, తప్పులేదు. కానీ మీ విమర్శకోసం మా గురించి మీ చిలకజ్యోస్యపు సైకో ఎనాలసిస్ మాత్రం చెయ్యకండి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhan అభిప్రాయం:
07/04/2010 9:50 pm
ఈ వ్యాసపు ముఖ్య విషయం రాయల కొలువులో తెలుగు కాని ఇతర భాషలలో సాహిత్యం ఎలా వర్ధిల్లిందో అన్న విషయాన్ని వివరించడమే. కాని అభిప్రాయాలు ఆముక్తమాల్యదపైన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కవులు సామాన్యముగా ఆశ్వాసాంతములో ఒక గద్యం వ్రాస్తారు. ఉదాహరణకు పెద్దన ఇలా వ్రాసారు –
ఇది శ్రీమదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీనమానసేందిందిర నందవరపురవంశోత్తంస శఠకోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము
(ఇది శ్రీమదాంధ్రకవితాపితామహుడని బిరుదుగలవాడు, సర్వతోముఖాంకుడనే బిరుదుగలవాడు, విష్ణుమూర్తి పాదపద్మాల మకరందాన్ని గ్రోలె తుమ్మెదవలె నుండువాడు, శఠకోపయతిచే ప్రసాదించబడిన శ్రేష్ఠమైన చతుర్విధ కవిత్వములు అభ్యసించినవాడు, అల్లసాని చొక్కయమంత్రి కుమారుడు ఐన పెద్దనార్యుడు వ్రాసిన స్వారోచిషమనుసంభవము అనే మహాకావ్యములో రెండవ ఆశ్వాసము.)
కాని ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంతములు గద్యాలు కావు, పద్యాలు. ఉదాహరణకు –
ఇది సింహాచలదంభకేసరిపదాభీష్టార్చనాపుణ్యల-
బ్ధదురుట్టంకణ పొట్టునూరివిజయస్తంభోపలోట్టంకితాం-
కదృఢేష్టాక్షర కృష్ణరాయనృపసంజ్ఞాన్మత్కృతాముక్తమా-
ల్యద నాశ్వాసవరంబు నాలవది హృద్యంబై మహిం బొల్పగున్
– శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, 4.289
(ఇది సింహాచలములో ఉండే మాయనరసింహస్వామి పాదాలను కొలువగా సంక్రమించిన పుణ్యఫలమువల్ల పొట్టునూరి జయస్తంభములో పేర్కొనబడిన కృష్ణరాయనృపతి వ్రాసిన ఆముక్తమాల్యద కావ్యములో నాల్గవ ఆశ్వాసము అందరికి ప్రీతిగా విరాజిల్లును.)
సంస్కృతకవులు ఇలాగే వ్రాసేవారు. ఉదాహరణకు నేను వ్యాసములో పేర్కొన్న రుక్మిణీశవిజయమునుండి ఒక సర్గాంత పద్యము –
రోమ్ణాం హర్షణకారిణీ శ్రవణతః పాపౌఘవిధ్వంసినీ
ప్రేమ్ణా చింతయతాం విచిత్రవిమలశ్లాఘార్థసందాయినీ
సంజాతే భువి రుక్మిణీశవిజయే సద్వాదిరాజోదితే
సంజాతః సురమండలీషు మహితః సర్గో ముదాం సప్తమః
(రోమాంచితమయ్యేటట్లు సంతోషమిచ్చేది, వినగానే పాపాలను నిర్మూలించేది, విచిత్రమైనది, నిర్మలమైనది, అర్థవంతమయినది అయి వాదిరాజయతిచే వ్రాయబడిన రుక్మిణీశవిజయ కావ్యములో ఏడవ సర్గ సురమండలముచే పొగడదగినదైనది.)
ఆముక్తమాల్యదలో ఉపయోగించబడిన చాల సంస్కృతపదాలకు సామాన్యమైన అర్థాలు ఉండక కొద్దిగా మామూలుగా లేని అర్థాలు ఉంటాయి. రాయలే వ్రాసారో, మరెవరు వ్రాసారో కాని రచయితకు మాత్రం కొబ్బరికాయలంటే ఎంతో ఇష్టమనిపిస్తుంది 🙂
విధేయుడు – మోహన
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/04/2010 2:26 pm
ఈ విషయం మీద నేను చెప్పదల్చుకున్న విషయాలు ఐపోవచ్చాయి. చివరగా అఫ్సర్ గారు అడిగిన “ఊహాపాఠకుల” విషయం కొంత స్పృశించి ముగిస్తాను. నా “అశాస్త్రీయ సర్వే” పద్ధతి ఇది – నేను సామాన్యంగా రెండేళ్లకోసారి ఇండియా వెళ్తాను; అలా వెళ్లినప్పుడు నవోదయ లో గత రెండేళ్లుగా వచ్చిన కవిత్వపుస్తకాలు అన్నీ ఒకో కాపీ కొంటాను; (వాటిలో ఏవీ వెయ్యి కాపీలకు మించి ప్రచురించబడవు); అప్పుడు వాళ్లని ప్రతిసారీ అడుగుతాను – వాటిలో ఏయేవి ఎలా అమ్ముడు పోతున్నాయని. మొదల్లో కొంత మొహమోటపడ్డారు గాని తర్వాత వాళ్లు చెప్పేది NRI లు తప్ప ఎవరూ కొనరూ అని; ఇక చాలా మంది కవులు సొంతంగా ప్రచురించుకుని తెలిసిన వాళ్లకు అంటగట్టటమో ఊరికే ఇవ్వటమో చేస్తారనేది నాకు తెలిసిన కొద్దిమంది కవులు స్వయంగా చెప్పిన విషయం. ఊరికే ఇచ్చినవి చదివేవాళ్లు చాలా కొద్దిమంది అన్నది ఏ సర్వేలూ అక్కర్లేకుండానే చెప్పొచ్చు. కొన్న ఒక్కో ప్రతినీ ఈ కాలంలో ఒకరికి మించి చదవరు అనేది నా ప్రతిపాదన. కనుక మొత్తం మీద ఓ కవితాసంకలనాన్ని వెయ్యిమందికి మించి చదవరు (మొదటి నుంచి చివరదాకా చదివేవాళ్లు ఇంకా తక్కువ). అంతేకాదు, పై సమాచారాన్నుంచి వీళ్ళు ఎలాటివాళ్లో కూడా derive చెయ్యొచ్చు – వీళ్లు నాలుగు రకాల వాళ్లు: 1) ఇతర కవులు, 2) ఆ సంకలనకర్త బంధువులు, స్నేహితులు, 3) విమర్శకులు, 4) చాలా కొద్దిమంది కవితాసక్తి వున్నవాళ్లు (వీళ్లలో చాలా ఎక్కువభాగం గుప్తకవులు). ఇకపోతే ఆ కవితలు పత్రికల్లో వచ్చివుండొచ్చు. ఆ పాఠకుల మాటేమిటి? నేను చేసుకున్న మరొక ప్రతిపాదన వాళ్లు కూడా పై నాలుగు రకాల వాళ్లేనని. ఏతావాతా తేలేదేమంటే ప్రస్తుత కవిత్వానికి “ముఖ్యమైన” పాఠకులు ఎక్కువభాగం ఇతరకవులే నని.
వీళ్లు కాక ఇంకెవరినైనా ఒక కవి తన పాఠకులుగా భావిస్తే వాళ్ళు ఊహాపాఠకులు. ఇదీ నా definition. ఇతరులు అంగీకరించొచ్చు, రించకపోవచ్చు. అఫ్సర్ గారి శాస్త్రీయ సర్వే ఫలితాల కోసం వేచి చూస్తాను.
నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి సంచారి అభిప్రాయం:
07/04/2010 8:42 am
I am disturbed by the implication of KVS Ramarao that the reviewer is biased. This amounts to ascribing ulterior non-literary motives to the reviewer and a personal insult. One may disagree with the reviewer, but one can not start by questioning the honesty of the review, but none of the above comments seem to even acknowledge that the reviewer honestly spoke his mind. This is more unfortunate given the stature of people who posted these comments.
సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి JAGADEESHWAR అభిప్రాయం:
07/04/2010 4:17 am
very good
ప్రేమ కవితలు గురించి JAGADEESHWAR అభిప్రాయం:
07/04/2010 4:11 am
చాల బాగున్నవి
ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ గురించి V. Praveena Reddy అభిప్రాయం:
07/04/2010 2:29 am
Namasthe
Vrayatam… vrasina dhanni edit cheyyadam manaku ekkuvaga alavatu leni vishayam. Amricalo rachayithalaku edtarlu untarani thelisinappudu….
వ్రాయటం, వ్రాసిన దానిని ఎడిట్ చేయడ మనకు ఎక్కువగా అలవాటు లేని విషయం. అమెరికాలో రచయితలకు ఎడిటర్లు ఉంటారని తెలిసినప్పుడు.. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆలోచిస్తే 99శాతం రచనల్లో ఎడిటింగ్ అవసరమే అనిపించింది. ప్రఖ్యాతి రాగానే మన రచయితలు ఏమి రాసినా గొప్పే.. అనాల్సి వస్తోంది. అందువల్ల గొప్ప రచనలు రావడం అరుదైపోయింది. కానీ 100లో 1కింటికి ఎడిటర్ల వల్ల రచయిత ఆ రచనలో ప్రాణప్రతిష్ట చేసినా soul కి విఘాతం కలుగుతోంది. Any how, మీ సంపాదకీయం విషయబద్ధంగా ఉంది.
Thank you.
Request…
Memu meku rachanalu ela pampalo thelupagalaru….
V. Praveena Reddy
( writer, journalist)
[మీ అభిప్రాయాలు దయచేసి తెలుగు లేదా ఇంగ్లీషులోనే వ్రాయండి. తెంగ్లీషు వాడకండి. ఈమాటకు రచనలు ఎలాపంపాలో సూచనల పేజీలో చూడగలరు – సం.]
నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj అభిప్రాయం:
07/04/2010 2:04 am
కెవీయస్ రామారావుగారూ!! ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.
ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ – కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.
రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.
రమ.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj అభిప్రాయం:
07/04/2010 1:32 am
చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీషు సాహిత్యలో కీట్సు , షెల్లీ ల కవిత్వాన్ని ప్రచురణకర్తలూ.. సమీక్షకులూ ఎలా నిర్లక్ష్యం చేసారో వారి జీవితకాలంలో ఆయా కవులు ఎలా నిరాదరించబడ్డారో.. వెంకటేశ్వరావుగారికి తెలియదని నేను అనుకోను. అలాంటి రివ్యూదారులు ఒకలాంటి వాళ్ళైతే మరొకరకం ..చెత్తకవిత్వాన్ని పైకెత్తుకునే రివ్యూదారులూ ..అనువాదకులూను. ఉత్తమ కవులని పక్కకు పెట్టి వారి వారి వ్యక్తిగత కారణాలకి గానూ నాసిరకం రచయితలని ముందువరసలో చూపించిన పనిని అన్ని కాలాల్లోనూ పత్రికలూ చేసాయి. విమర్శకులూ చేసారు. అనువాదకులూ చేసారు. చేస్తున్నారు.
రమ.