పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Sowmya అభిప్రాయం:

    07/05/2010 9:24 pm

    మొత్తంగా ఒక్కసారి ఇన్ని విషయాలు బుర్రలోకి వెళ్ళేందుకు మొరాయిస్తున్నాయి కానీ, వ్యాసం వల్ల చాలా విషయాలు తెలిసాయి. శ్రీనివాస్ గారు మరింత తరుచుగా ఈమాటలో రాయాలని ఆశిస్తున్నాను.

  2. 88 ఏళ్ళ యువకులు గురించి విప్లవ్ అభిప్రాయం:

    07/05/2010 2:08 pm

    చాలా గొప్ప వ్యక్తులగురింఛి చెప్పారు. వీ కే మూర్తి గారిని కలిసినప్పుడు ఆయనలోనూ ఇదేలాంటి ఉత్సాహం , యవ్వనం చూసాను. కళను ప్రేమించే వాళ్ళందరూ ఇంతేనేమో , వయసు సోకని అమరేంద్రులలా బ్రతికేస్తారు .

  3. పసిఁడిపల్లకి గురించి గన్నవరపు వరాహ నరసింహ మూర్తి అభిప్రాయం:

    07/05/2010 2:01 pm

    ఈ కవితని మళ్ళా చదువుతూ అంటే నవ్వొచ్చింది. నేనే కాదు,మరల మరల చదివే వాళ్ళుంటారని. వృధ్ధి సంధి ఏదో పద్యంలో తిక్కన వారు కూడా చేయక ఓ కారము గుణ సంధి లాగ చేసారని చదివా. బహుశా కామేశ్వర రావు గారికి తెలుసు. దేశికాచార్యుల వారు గాని, కామేశ్వర రావు గారు గాని వివరిస్తారని ఆశిస్తాను. ముందుగానే వారికి కృతఙ్ఞతలు సమర్పించుతున్నాను.

  4. అ, న్యాయం గురించి Kumar N అభిప్రాయం:

    07/05/2010 12:41 pm

    Story was OK, but I didn’t quite fully understand what the writer was trying to convey. Is there a subtle circasm involved there? If so, it begs one question. Isn’t the system worked exactly how it is supposed to work? That’s how insurance works, is it not? Risk is shared by group of people. And in any given tiem period, if claims go up and end up more than revenues, it then results in increase in premiums. What’s there to get surprised about it?

    Yes, the involvement of lawyers and their takeaway from the pie is something that is unwanted and undeserved. USA would probably be better served without their undue share. But, hey we all love to hate trial lawyers, and most of the times they deserve that hate.

  5. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana అభిప్రాయం:

    07/05/2010 9:00 am

    నేను ఈ వ్యాసం వ్రాయడానికి పూనుకొన్నప్పుడు నాకు కూడా కామేశ్వరరావుగారిలాగే ఊహ జనించింది. కన్నడరాజ్యరమారమణుడు ఎందుకు కన్నడములో వ్రాయలేదని. దానికి నేను ఊహించిన కారణాలను ఇక్కడ ఇస్తున్నాను.

    1) కన్నడ పద్యరచనా సాహిత్యము రాయలనాటికే ఉచ్ఛదశను అందుకొన్నది (It has already peaked). వాళ్లు కీర్తనా సాహిత్య ప్రక్రియను కొనసాగించడానికి ఉద్యుక్తులయ్యారు. తెలుగు సాహిత్యపు ప్రబంధయుగపు ఔన్నత్యానికి కాలము రాయల నాటిది.

    2) కన్నడములో వ్రాయడము తెలుగుకన్నా తేలిక, ఎదుకంటే కన్నడములో అక్షరమైత్రి యతి లేదు. కన్నడములో మొట్టమొదట తెలుగులాగే సంస్కృత వృత్తాలతో నిండిన చంపూ కావ్యాలు నాంది పలికినా, తరువాత వచ్చిన కవులు షట్పదలు, సాంగత్యములాటి దేశి ఛందస్సులో (నా ఉద్దేశములో సరియైన నిర్ణయము, ఇలా తెలుగు కవులు అందరూ ఎందుకు ఉద్యమించలేదో అని ఎప్పుడూ నేను విచారపడుతాను) వ్రాసారు. సంస్కృత సందీర్ఘ సమాసాలతో వృత్తాలలో వ్రాసే రాయలకు ఇలా దేశి ఛందస్సులో వ్రాయడము రుచించలేదేమో? లేక challenging గా తోచలేదేమో?

    3) తెలుగులో బాగుగా వ్రాసి తెలుగువారిని మెప్పిస్తే తన రాజ్యములోని ఎక్కువ పాలైన తెలుగు ప్రాంతాలు అలజడి లేక ఉంటాయనే రాజకీయ కారణాలు కూడా రాయలకు కలిగిందేమో? అందుకే ఆంధ్రవిష్ణువు తన కలలో వచ్చాడంటాడు.

    తెలుగు నేర్చుకోక తెలుగులో కావ్యాలు వ్రాసేటంత జ్ఞానము అబ్బడము సామాన్యము కాదు. కాని రాయలు సామాన్యుడు కాడు. వీరుడు, సాముగరిడీలు, కసరత్తు చేయడములో దిట్ట, రాజనీతిజ్ఞుడు, వీణావాదననైపుణి గలవాడు. సంస్కృతములో అసాధారణ పాండితీ ప్రతిభను ఆర్జించుకొన్నవాడు. In theory, it is possible for SrIkrishnadevaraayalu to excel in Telugu.

    రాయలు కన్నడమును మాత్రమే కాదు, తన మాతృభాష ఐన తుళును కూడా ఉద్ధరించలేదు. రాయలవంటి చక్రవర్తి తుళు భాషకు మద్దతును ఇచ్చి ఉంటే నేడు తుళు భాష కన్నడముతో సమానముగా శోభించి ఉంటుంది. నా ఉద్దేశములో రాయలు వ్రాసిన సంస్కృత కావ్యాల (మనకు లభించినవి) శైలికి ఆముక్తమాల్యద శైలికి మధ్య ఉండే సాన్నిహిత్యము, భేదము గమనించాలి.

    విధేయుడు – మోహన

  6. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    07/05/2010 7:58 am

    “కవిత్వం ‘డెమాక్రటైజ్’ అయ్యింది” అన్నమాటకి నేను “కవితావస్తువు ప్రజల జీవితానికీ, ఆశయాకాంక్షలకీ చేరువయ్యిం”దని అర్థం చెప్పుకున్నాను. కాదా?

    ఆ వ్యాఖ్యా, అంతకు ముందు పారాగ్రాఫూ మీ సమీక్షలో ఇమిడినట్లు నాకనిపించలేదు.

  7. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/05/2010 1:14 am

    మోహనరావు గారూ మీకు కన్నడం బాగా తెలుసును కదా? కన్నడ పదకర్తల రచనలనీ వారికి ఆద్యుడైన అన్నమాచార్యుల రచనలతో పోల్చి తెలుగు పాఠకుల కి ఏమన్నా మీరు చెప్పగలిగితే బాగుంటుందేమో?? ఆ అవసరం ఇవాళ చాలా ఉంది కూడానూ!! ఎందుకంటే ఇది మీలాంటి వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. ఆలోచించండి.

    రమ.

  8. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/05/2010 1:01 am

    కామేశ్వర రావు గారి ముగింపువాక్యాలనే రాయని రచనా కుశలతకి సంబంధించి నేను నా జవాబుగా చెప్పదలుచుకున్నాను.

    రమ.

  9. పసిఁడిపల్లకి గురించి Kameswara Rao అభిప్రాయం:

    07/05/2010 12:44 am

    ఈ కవితని మళ్ళా చదువుతూ ఉంటే రెండు చిన్న అనుమానాలు వచ్చాయి.
    “ధవళపట్టంబరంబు” – ఇక్కడెందుకో “పట్టు” పదం “ధవళ” “అంబర” పదాల మధ్య సరిగా అతికినట్టు లేదు. పట్టు తత్సమ పదం కాదు కదా. అలా సమాసం చెయ్యవచ్చా? అది “పట్ట” అనుకుంటే “పట్టాంబరంబు” అవ్వాలి.

    “కంఠీరవోజస్సె” – ఇక్కడ వృద్ధి జరిగి “కంఠీరవౌజస్సె” అవ్వాలి కదా? ఈ పద్యంలో మొదటి రెండు పాదాల్లోనూ “ఇంద్రుడు”, “బృహస్పతి” ఉపమానాలు సరిగా సరితూగాయి. తర్వాతి రెండు పాదాల్లో ఆ తూకం తప్పింది. పెద్దనని బ్రహ్మతో పోల్చారు కాబట్టి అక్కడ రాయలని విష్ణువుతో పోలిస్తే ఇంకా బాగుండేదనిపించింది.

  10. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/05/2010 12:38 am

    చిలక జోస్యాలు చెప్పడంలో నేను ప్రవీణురాలిని కాను. నేను తప్పులూ ఎన్నడమ్ లేదు. విమర్శని స్వీకరించడం చాలా మందికి కస్టం అని నేనెరుగుదుమను. నేను చెప్పింది సాహిత్య పరిధి విస్తృతం గురించి. దానికి నేను ప్రత్యేకంగా ఋజువులు చూపించడం ఎందుకూ?? కవిత్వం పేరుతో అచ్చవుతున్న అనేకమైన సరుకులు ఉదాహరణలే!! వాదనకోసం ఎంతైనా వాదన చేయవచ్చును . దానికేం?? కానీ ప్రతిభావంతమైన సాహితీ కారులు కావాలీ అంటే మాత్రం వాళ్ళకి వాళ్ళు వ్యక్తీకరించుకున్న ప్రక్రియ మీద మంచి పట్టూ..భాష మీద అధికారమూ సాహిత్యం మీద సాధికారతా అన్నవి తప్పనిసరి. ఇవాళ్టి చాలా మంది కవి నామధేయులకి అవి పూజ్యమన్నది తేటతెల్లమైన సంగతి. వారి వారి రచనలే ఇందుకు సాక్ష్యం. ఇందుకు ఎలాంటి జోస్యాలూ అవసరం లేదు. ఇకపోతే మాకు ఇవన్నీ కవితలే అని అనేవాళ్ళూ ఉంటారు. అనడానికి ఇబ్బందిలేని కాలంలో ఉన్నవాళ్ళం గనక. వాళ్ళు “ప్రజాస్వామ్యబధ్ధమైన వచన కవితా ప్రక్రియ” లోని సులువులని వాడుకుని అదంతా కవిత్వమనే దబాయించి బతకొచ్చు. కాదని అంటే వాళ్ల కులాలనీ వాళ్ళ వర్గాలనీ వాళ్ళ మతాలనీ ఎత్తి చూపి బెదిరించే పనికి పూనుకోనూ వచ్చు. ఇవాళ చాలా సందర్భాల్లో తరుచూ జరిగేది ఇదే!! అందువల్లనే ఇంత అసహనం కన్పిస్తూంది విమర్శ మీద.

    రామారావుగారి సర్వే చాలామటుకు నిజం కవిత్వ పుస్తకాలకి సంబంధించి.
    తెలుగున కవిత్వం అమ్ముడయ్యే సరుకు కాదు. కవులు స్వంతంగా అచ్చు వేసుకుని నలుగురికీ పంచిపెట్టుకుని తాము కవులమని చెప్పుకుందికి ఉపయోగపడే ఒక సాధనం. అయితే ఈ పరిస్థితి కవిత్వానికే కాదు కధలకీ ఉంది. నిజానికి సాహిత్యం మీద ఆసక్తితో పుస్తకాలు కొనేది చాలావరకూ పాత సాహిత్యాన్నే!! కొద్దోగొప్పో పుస్తకాలు కొనేవాళ్ళు ఎక్కువగా భారత రామాయణాలనీ ప్రబంధాలనీ కొంటుంటారు. వీటికే మార్కెట్ ఉందని ప్రచురణకర్తలూ అంటారు.

    ఆధునిక కవిత్వం లో అమ్ముడయ్యే కొద్ది పుస్తకాలు ఉండొచ్చునేమో!! కానీ ఎక్కువ పుస్తకాల పరిస్థితి ఇదే!! మరి ఇలాంటప్పుడు దీనిని గురించిన వాస్తవాల ప్రస్తావన ఎవరన్నా చేస్తే…ఆ చేసిన వాళ్ళని కాదు తప్పుపట్టాల్సింది. వాస్తవాలని గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. అబ్బే నిజాలు ఉంటే ఉండనీండి మీరు మటుకు మాట్లాడకండి అని అనేలాంటి ప్రయత్నాలు చర్చించే వాళ్ళ నోరుమూయించడం..కోసం చేసేవి.అవి ఎలా చేసినా. ఎవరెవరు చేసినా.. ఏయే కారణాలకి చేసినా..!అందువలన లాభపడే వాళ్ళూ ఎవరైనా.. నస్టం ఎప్పుడూ సాహిత్యానికే జరిగింది. జరుగుతూ ఉంది.

    రమ.